రజనీష్ బాబా రాసలీలలుకు సహకరిస్తున్నది ఎవరు?


                                                                 


                                              వండుకుంటే  ఒకటే కూర, అడుకుంటే అరవైఆరు కూరలు రుచి చూడవచ్చు అన్న సిదాంతాన్ని బాగా వంటబట్టించుకున్న ప్రబుద్ధులు కొందరు "బాబా"ల అవతారం ఎత్తి , సదరు సిద్దాంతాన్ని సెక్సువల్ లైఫ్ ఎంజాయిమెంట్ కి అప్లై చేస్తున్నట్లు ఉంది. పెండ్లి చేసుకుంటే ఒక్క దానితోనే జీవితం అంతా సంసారం చేయాలి. అదే పెండ్లి , పెటాకులు లేకుండా బాబాలు అవతారం ఎత్తి "సంసార బాధలకు " తరుణోపాయం చెప్పే క్రమంలో , తనకు  నచ్చిన , తనను మెచ్చిన తరుణీమణులతో కూడి తన జీవితం సుఖమయం చేసుకుంటుoటే , ధర్మం తప్పినా "కామార్ధ మోక్షములు " మాత్రం కంపల్సరీ దక్కుతాయి అని వీరి ఆలోచన కాబోలు . "సంసారి కానీ వాడు సన్యాసి కావడానికి వీలు లేదు " అని హిందూ జీవన విధానం నొక్కి చెపుతున్న  దానిని తుంగలో తొక్కి డైరెక్టుగా బాబాలుగా మారుతున్న ఈ ఆధునిక సన్యాసులకు కావలసింది ఏకకాలంలో "కామార్ధ  మోక్షములు " కాబట్టి వారు కోరుకున్నది ఈ విధంగా  సాధించుకుంటున్నారు.

        ఇక ఈ కామ బాబాలను ఆశ్రయించే వారిని పరిశీలిస్తే , వారిలో  ఆధ్యాత్మిక ఆనందం  కోసం వచ్చే  వారు కొందరైతే , బాబా ప్రాపకం తో బాగుపడిపోదామని భావించే వారు కొందరు.  కొంత మంది స్త్రీలైతే బాబా గారికి సర్వం సమర్పించుకోవడానికి కూడా వెనుకాడని వారు ఉంటారు. వారే తమకు ఇష్టం అయినంత కాలం  బాబా గారికి మెహబూబాలు గా ఉండి , ఎక్కడైనా కొంచం లెక్క తప్పినప్పుడు మాత్రం బాబా మహా పాపాత్ముడు అంటూ మీడియాలకెక్కడం , ఆ తర్వాత పోలీస్ కేసులు వగైరా , వగైరా . అదిగో అలాంటి కోవలోకే వస్తుంది మొన్న ఢిల్లీలో 22 ఏండ్ల యువతి ఇచ్చిన కంప్లయింట్ తో బయటపడిన రజనీష్ గ్రోవర్ అనే బాబా ఉదంతం. 

     రజనీష్ బాబా గా పేరుపడ్డ అశోక్ కుమార్ అనే వ్యక్తి ఢిల్లీలో "సత్సంగ్ " ల పేరుతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ స్థానిక భక్తుల కు ఆధ్యాత్మిక ఆనందం కలిగిస్తున్నాడు అంట . మరి అటువంటి బాబా గారి "సత్సంగ్ " లో పాల్గొన్న జైపూర్ కు చెందిన 22 ఏండ్ల యువతి , తమ షాప్ ఓపెనింగ్ కి బాబా గారిని జైపూర్ కి ఆహ్వానించింది .బాబా గారు  వెళ్లడం , షాప్ ఓపెనింగ్ తో పాటు స్థానిక భక్తులతో సత్సంగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక జైపూర్ లో బాబా గారికి ఆశ్రమం ఇది లేదు కాబోలు, తనను ఆహ్వానించినా పడతి ఇంట్లోనే తిష్ట వేశారు. ఇంట్లో అన్ని మర్యాదలు పొందిన బాబా గారు , ఆ యువతి మరియు ఆమె తల్లికి మత్తు మందు కలిపిన పదార్థాన్ని ప్రసాదం పేరుతో ఇస్తే , వారు ఇద్దరు దానిని పుచ్చుకుని మత్తుగా పడిపోయారు ఆట.

       ఇక బాబా గారు అలా అచేతనులైన ఆ ఆడవాళ్ల  మీద  లయింగిక దాడి చేయడమే కాక సదరు దాడి దృశ్యాలను తన సెల్ లో బంధించాడు ఆట. అలా వాటి ద్వారా ఆ అమ్మాకూతుళ్ళను బ్లాక్ మెయిల్ చేస్తూ ఈ విషయం పోలీసులకు చెపితే వీటిని నెట్ లో పెడతాను అని బెదిరించాడు ఆట. దానితో కిమ్మనకుండా ఉండిపోయిన ఆ యువతి ఎలాగో బాబా గారి సెల్ ను తీసుకుని పరిశీలిస్తే అందులో ఎంతో మంది స్త్రీలతో బాబాకు ఉన్న సన్నిహిత సంబంధాలు బహిర్గతమయ్యాయి ఆట. దానితో మైండ్ బ్లాంక్ అయినా ఆమె డైరెక్టుగా ఆ సెల్ తో సహా పోలీస్ స్టేషన్ కి కంప్లయింట్ చేస్తే , పోలీసులు బాబా గారి మీద విచారణ ప్రారంబించారు ఆట. బాబా గారూ  మహిళా భక్తులతో ఎంజాయి చేస్తున్న దృశ్యాలలో మచ్చుకి కొన్ని ఇవి.

                                                                     







                     పై దృశ్యాలలో ఉన్న  మహిళలను  చూస్తుంటే వారు  బాబా గారు బెదిరించి లొంగ దీసుకున్న  మహిళలు లాగా లేరు. ఎంతో ఆనందంగా బాబా తో ఎంజాయి చేస్తున్న ఆధునిక మహిళలు లాగా ఉన్నారు . మరి అలా బాబా గారి రాసలీలల కు కో ఆపరేట్ చేస్తుంటే బాబా గారికి వారి గురించి ఎలాంటి అభిప్రాయం ఉంటుంది. కామం తో కూడిన ఆనందం కోసమే తన వద్దకు వస్తున్నారు అనుకుని తన రాసలీలలు బిసినెస్ డెవలప్ చేసుకుంటున్నట్లు ఉంది . మరి ఈయనకి, ఈయన స్పాన్సర్ లకి ఏదో ఆర్థిక లావాదేవీలలో తేడా వచ్చి ఉంటుంది. జైపూర్ అమ్మాయిని రంగం లోకి దింపి కేసులో ఇరికించి ఉంటారు. లేకపోతే ఇంట్లో అమ్మాకూతుళ్ళు మాత్రమే ఉండడం , బాబా ఇచ్చిన దానిని తీసుకుని వారు మత్తులోకి వెళ్లడం , అతను ఇద్దరిని రేప్ చేసి సెల్ లో చిత్రీకరించడం , ఆ పై తన సెల్ ను అమాయకంగా ఆమెకు అందేలా చెయ్యడం చూస్తుంటే , ఇదేదో కహాని లాగే ఉంది. ఏదేమైతేనేమి "దొంగ బాబా " మరియు ఆయన మెహబూబాల రాస లీలలు ఆయన సెల్ ద్వారా బయటి ప్రపంచానికి , జైపూర్ యువతి ద్వారా తెలిసాయి అనేది సత్యం.

    ఇక మీడియా లలో, సోషల్ మీడియాలలో భక్తురాండ్ర పై లయింగిక దాడి చేసిన బాబా గురించి ప్రసారాలు అవుతాయి తప్పా , అతనికి సహకరిస్తున్న  స్త్రీలను గూర్చి పల్లెత్తు మాటకూడా అన్నావు. పైగా వారేదో బాధితులు అన్నట్లు వారి ముఖాలు మూసేసి , బాబా ముఖం తోనే ఫొటోలు ప్రచురించడం. ఇలాంటి వారి ప్రవర్తన చూస్తే ఏమనిపిస్తుంది అంటే   "ఇష్టమైనంత సేపు "బాబా -మెహబూబా " లుగా ఉన్నవారే , కష్టమైతే చాలు "తోబా ,తోబా అంటుoటారు అని. ధర్మం తప్పి కామార్ధాల కోసం ఎగబడే వారు ఉన్నంత కాలం రజనీష్ బాబాలు లాంటి దొంగ బాబాలు పుట్టుకొస్తూనే ఉంటారు.

     SOURCE :-       http://indiatoday.intoday.in/story/godman-rajneesh-grover-sexually-assaults-women/1/707128.html

Comments

  1. very interesting , good job and thanks for sharing such a valuable topic.
    Get Complete Call Center Solutions & boost your call center's performance.
    We offer Call Center Solutions based on your needs.

    ReplyDelete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన