Posts

Showing posts with the label కెజ్రివాల్ ఏమన్నా "నరసింహవతారమా

పుట్టగానే అవినీతి పొట్ట చీల్చడానికి ఆం ఆద్మీ కెజ్రివాల్ ఏమన్నా "నరసింహవతారమా !?

Image
                                                          ఈ  దేశంలో  జ్ఞాన వంతులకు కొదువ లేదు కాని , ఇంగిత జ్ఞానం ఉన్న వారు కూస్తంత తక్కువే ఉన్నారు అనిపిస్తుంది . లేకపోతె మరేమిటి చెప్పండి , పట్టుమని పది రోజులు కాలేదు డిల్లి పీట్టాన్ని అం ఆద్మీ  పార్టి వారు అధిరోహించి , అప్పుడే   ఆ  పార్టి పాలన మిద విమర్శలు మొదలయ్యాయి. బయట ప్రజలు  కంటే విపక్షాలు, స్వంత పార్టి లోని పదవులు దొరకని అసమ్మతి  వాదులు   అప్పుడే వారి రాజకీయ బుద్దిని బయట పెట్టుకోవడం మొదలెట్టారు.    దీనంతటికి ముఖ్య కారణం వాస్తవాలను పక్కన పెట్టి అతిగా ఆంఆద్మీ గురించి  ఎక్కువ గా ఊహించడం, తెల్లారే సరికి ఏదో దేశంలో విప్లవం వచ్చిందని మీడియా అంతా పని గట్టుకుని ఆం ఆద్మీ మీదే పోకస్ చేసి ప్రచారాలు చెయ్యడం, దానితో కేజ్రీ వాల్ ఏదో అతీత శక్తులు కలిన వాడుగా ఒక్క రోజులొనే డిల్లీ ని ప్రక్షాళణ చేస్తాడని బావించడం ఇవ్వన్నీ ఇంగిత జ్ణానం లేని వారి ఆలోచనలు.   ఇంకొక ప్రక్క ఆం ఆద్మీ పార్టీ కంటే ఎక్కువ సీట్లు గెలుచుకున్నB.J.P   పార్టీ  ప్రధాన ప్రతి పక్షం గ ఉన్నంత కాలం, ఆం ఆద్మీ వారి పాలన తుమితే ఊడి పోయే ముక్కు లాంటిదే . అసలు ఆం ఆద్మీ పార్టీ అధిన