Posts

Showing posts with the label సమైఖ్య శంఖారావం

ఉప్పెనతో ఊళ్లు కొట్టుకుపోతుంటే,'ఉత్సవ సభకు 'రమ్మంటునాడు 'ఉత్త'రాకుమారుడు !.

                                                          ఈ   రోజు  టి.వి. చానళ్ళు చూసారా , 'ఊరిదంతా ఒక దారి అయితే ,ఉలిపికట్టెది ఇంకో దారీ' అన్నట్లు ఉంది ,ఒక చానల్ వారు చెసే ప్రసారాలు చూస్తుంటే . అన్ని చానల్లోను సింహబాగం ,గత మూడు రోజులుగా రాష్ట్రాన్ని ముంచెతుతున్న వర్షాలు, వాటి వలన ప్రజలకు కలుగుతున్న కష్ట నష్టాలు గురించి ప్రసారం చేస్తుంటే , ఒకే ఒక చానల్ మాత్రం హైదరాబాద్లో జరుగబోతున్న "సమైఖ్య శంఖారావం " సభ గురించి ప్రసారాలు చేస్తుంది.            "ఉప్పెనలా కదలి రండి"            "ఊరువాడాఏకమై రండి"            "తెలుగుతల్లి విలపిస్తుంది "            "తెలుగువాడి వేదన కంటే తెలుగు తల్లి బాదే ముఖ్యం"            "తెలుగు తల్లి పిలుస్తుంది !రా! కదలి రా! "  ఇలాంటి  స్లోగన్ లతో ఆ చానల్ ఊదర గొడుతుంటె , చూసే వారికి ఏమనాలో అర్దం కావటం లేదు. బాషలు, ప్రాంతాలు, మనుషులకే కానీ, తనకు ఆ బేదబావమేమి లేదన్నట్లు ,ప్రక్రుతి పగబట్టిన దానిలా ఆంద్రప్రదేశ్ ను వర్షాలతో అతలాకుతలం చేస్తోంది. అటు సీమాంద్రలోనే కాక ,ఇటు తెలంగాణాలోను వాగులు, వంకల