Posts

Showing posts with the label కలకత్తాలోవ్యభిచారం

కలకత్తాలో వయసున్నంత కాలం వ్యభిచారం చేయించి ,వయసుడిగాక కిడ్నీలు ,కాలేయాలు అమ్ముకుంటారట!

Image
                                    ఈ దేశంలో వామ పక్ష వాదుల ఏలుబడిలో ఎక్కువ కాలం ఉన్న నగరం కలకతా నగరం . అభివృద్దిలో ఆ  నగర ర్యాంక్ ఎంతో  కాని అమానవీయ పనులకు మాత్రం మొదటి స్తానం ఆక్రమిస్తుంది అట . ఇక్కడ అమానవీయ పనులు అంటే అమ్మాయిల అక్రమ రవాణ , వారిని బానిసల కంటే హీనంగా చూస్తూ , వారి రక్త మాంసాలతో వ్యాపారం చెయ్యడం ! కేవలం వ్యాపారం చెయ్యడమే కాదు వారి వయసు ఉడిగి పోయాక  , వారి కిడ్నీలు , కాలేయాలు అమ్ముకునే రాక్షసులు కలకత్తా నగరం లో ఉన్నారు అంటే భారత జాతి యావత్తు సిగ్గుతో తల వంచుకోవలసిందే . ఈ మాట అన్నది సాక్షాత్తు మన రాష్ట్ర ప్రదాన న్యాయమూర్తి శ్రీ జస్టిస్ కళ్యాణ్ జ్యోతి సేన్ గుప్తా గారు.నిన్న హైదరాబాద్లో జరిగిన "మనుషుల అక్రమ రవాణా " అనే అంశం పై జరిగిన చర్చ సందర్బంలో అయన ఈ  విషయం తెలియ చేసారు .    పై విషయంలో కేవలం కలకత్తా రాక్షసులదే కాదు,తమ దేశపు   ఆడపిల్లలను అక్రమ రవాణా చేస్తుంటే దానిని నిరోదిo చలేని బంగ్లాదేశ్ ప్రబుత్వానికి ఈ పాపంలో బాగం ఉంది . పశ్చిమ బెంగాల్ సరిహద్దులలోని బంగ్లాదేశ్ నుంచి పేదింటి ఆడపిల్లలను సినిమాలో చేర్పిస్తామానో , ఉపాది చూపిస్తాం అనో , ప్రేమ పేరుతోనో