Posts

Showing posts with the label హైద్రాబాద్ గవర్నర్ చిరంజీవి

కాబోయే హైద్రాబాద్ గవర్నర్ శ్రీ శ్రీ శ్రీ చిరంజీవి!!!?

                                                                  ఆంద్ర ప్రదేశ్లో ,సీమాంద్ర  ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి.వారి లక్ష్యం సమైఖ్య ఆంద్రప్రదేశ్. హైద్రాబాద్ సెటిలర్స్, కొంతమంది రాజకీయ నాయకులు తప్పా, హైద్రాబాద్ని కేంద్ర పాలిత ప్రాంతంగ చెయ్యమని సీమాంద్ర ప్రాంతం వారు అడగటం లేదు. ఇక హైద్రాబాద్ లేని తెలంగాణా తల లేని మొండెంతో సమానం కాబట్టి తెలంగాణా వారు  అట్టి   ప్రతిపాదనను కలలో కూడా అనుకోరు. కాని నిన్నటి దాక సూర్యుడిలా మండి  పోయి, పరిస్తితుల ప్రబావానికి బిక్కచచ్చి, సోనియమ్మ దయతో టూరిజం మంత్రి అయిన చిరంజీవి గారు మాత్రం హైద్రాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే నూటికి ఎనబైమంది  శాంతిస్తారని ఎలా సోనీయమ్మకు చెప్పారో అర్దం కావడం లేదు. నిన్న నలబై అయిదు నిముషాలు ప్రత్యేకంగ సోనియా గాంది గారితో సమావేశమై బయటకు వచ్చిన చిరజీవి గారు పలికిన చిలక పలుకుల్లోని సారాంశం అదే!  తాను మేడం సోనియాకు సవినయంగా సీమాంద్ర ప్రజల ఆందోళనలు గురించి చెప్పానని, అది విన్న మేడం ఆల్రడి తెలంగాణ ఏర్పాటు నిర్ణయం అయిపోయింది కాబట్టి, అది తప్పా సీమాంద్ర వారికి కావలసినది ఏమిటో చెపితే దానిని అనుగ్రహిస్తానని అన్న