Posts

Showing posts with the label mass conversion

ఆడపిల్లల నెత్తి మీద చేతులు పెట్టి ,వారిని పడుకోబెడుతున్న, వీరి గురించి ఏ పేపర్ రాయదెందుకు?ఏ మీడియా చూపదెందుకు?

Image
                                                                                                        భారత దేశం సెక్యులర్ దేశం. అంటే రాజ్యం ద్రుష్టిలో మతాలూ అన్నీ సమానమే . కాని ఆచరణలో మాత్రం పూర్తి విరుద్దం. ఇక్కడ మెజార్తీ ప్రజలు హిందువులే అయినా , మత స్వేచ్చ లో మైనార్తీలకు ఉన్నంత స్వేచ్చ ఈ  దీనులకు లేదు. కారణం ఇండియాలోని పత్రికలూ , మీడియా తో పాటు మొన్నటి దాక కేంద్ర ప్రబుత్వం లో అధికారం చలాయించిన పార్టి మైనార్తీ మతస్తుల పక్ష పాతి  కాబట్టి. ఆంద్ర ప్రదేశ్ కు చెందిన ఒక కేసులో తీర్పును ఇస్తూ సాక్షాతూ మన దేశ అత్యున్నత న్యాయ స్తానం "ఈ దేశం లో మైనార్తీ లకు ఏ మత స్వేచ్చ ఉందో , అదే స్వేచ్చ మెజార్తీ లు అయిన హిందువులకు ఉంటుంది" అని చెప్పాల్సి వచ్చిందంటె వారి స్వేచ్చా ఎంత దీనావస్థ లో ఉందో ఇట్టె అర్దమవుతుంది.                      సాదారణంగా ఏ దేశం లో అయినా మెజార్టీ మతస్తుల ప్రభావానికి మైనార్టి మతస్తులు స్వేచ్చగా తమ మత కార్యకలాపాలు నడుపుకోలేరు కాబట్టి వారికి కొన్ని ప్రత్యేక రాయితీలు , రక్షణలు ఇవ్వడం జరుగుతుంది. కాని ఈదేశం  లో పరిస్తితి అందుకు పూర్తిగా బిన్నం. మైనార్తీ లు విదేశి డబ్బ