Posts

Showing posts with the label K.C.R గారి పోటో

సిమాంద్ర ప్రజలు K.C.R గారి పోటో ఇంట్లో పెట్టుకుని , రోజూ మొక్కే రోజు వస్తుoదా !

                                                                              తెలంగాణా ప్రజలు కోరుకున్నట్లు గానే జూన్ 2 న తెలంగాణా రాష్ట్రం ఏర్పడుతుంది . తెలంగాణా ప్రజలు ముక్యంగా రాజకీయ , విద్యార్ధి , అడ్వకేట్ , ఉద్యోగ వర్గాలు వారు "సంబురాలు " చేసుకుంటారు . ఎలాగు మిగులు బడ్జెట్ ఉంటుంది కాబట్టి కొత్త ప్రబుత్వం అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదు . కొత్తగా పెండ్లి చేసుకున్న వారు తోలి నెల  "హనీమూన్ " పేరుతొ జామ్ జామ్ గా జాలిగా గడిపినట్లు , తెలంగాణా తోలి ప్రబుత్వం కూడా "విక్టరి ఇయర్ "ని ఎంజాయ్ చేయవచ్చు . కాని తెలంగాణా కు ఏర్పడబోయే అసలు సమస్య కరెంట్ కష్టాలు . దీనికి పరిష్కారం గురించి K.C.R  గారు ఎక్కడా ప్రస్తావించటం లేదు . దానిని అదిగమించటానికి "గుజరాత్ తరహ సోలార్ ప్రాజెక్టు లను ప్రోత్సాహించడం అనివార్యం అయినప్పటికీ అ దిశగా ఆలోచిస్తున్నట్లు  కొత్త నాయకత్వం ఎక్కడా చెప్పటం లేదు . వారు ఇంకా ఉద్యమాల మూడ్ లో నుండి బయటకు వచ్చిన దాఖలాలు కనపడటం లేదు . పై వర్గాలు  తప్పా సామాన్య ప్రజలు సంబురాలు గురించి ఆలోచించటం లేదు . కనీసం యువతకు విద్యా , ఉపాధి, ఉద్యోగ రంగాలలో