"హిజ్రా" తో కలిసి ఉండడానికి కల్యాణ.తంతు ఎందుకు?
అతడు మగవాడట. ఆమె, ఆమే గా మారిన మగవాడట. ప్రస్తుతం ఆమె "హిజ్రా" అట!. వారిద్దరి మద్య పన్నెండేళ్ళ నుంచి "ప్రేమాయణం నడుస్తుందట. సరే అది వారి వారి ఇష్టానుసారం కాబట్టి సభ్య సమాజం ఒకింత అసహనం ప్రకటించినా, అబ్బాయి తల్లితండ్రులు వ్యతిరేకించినా చట్టం ఏమి అనలేదు కాబట్టి వారి "ప్రేమ" పన్నేండెళ్ళు పూర్తి చేసుకుంది. అంత వరకు బాగానే ఉన్నా హఠాతుఉగా వారి కెందుకో పెళ్లి చేసుకోవాలనిపించిందట. అంతే ఎవరూ ఒప్పుకోలేదేమో, హిజ్రాల సంఘం ఆద్వర్యంలో, ఖమ్మం జిల్లా, కూసు మంచి మండలం లోని జీళ్ల చెరువు శ్రీ వెంకటేశ్వర స్వామి గుళ్ళో వారిద్దరికి రంగ రంగ వైబోగంగా పెండ్లి జరిగింది. ఈ నాడు డబ్బున్న వాడిదే హంగు ఆర్భాటం కాబట్టి, హిజ్రాలకు మంచి ఆదాయ వనరులు ఉండబట్టి, వీరి వివాహం గురించి పత్రికలలో, మీడియాలొ కూడ బాగానే ప్ర చారం చేసారు. ఈ ప్రహసనం అంతటికి బాదపడింది ఎవరు అంటే అబ్బాయిని కన్న తల్లి తండ్రులు. పాపం వారు లబో దిబో మంతూ వచ్చి, తమ కుమారుడిని కిడ్నాప్ చేస