Posts

విశిష్ట పోస్ట్

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

Image
                                                                                             చరిత్రలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. జరుగుతున్నాయి. వాటిని అర్థం  చేసుకోవడం అన్ని సార్లు,అందరికి సాద్యపడక పోవచ్చు.ఒక భొయవాడు "రామాయణ కర్త" గా మారినా,ఒక్క పక్కా నాస్తికుడు,"భక్త కన్నప్ప" గా మారినా దాని వెనుకాల  ఏదో ఒక పరమార్థం  తో కూడిన "దైవ లీల" ఉంటుంది.మహ మహా సైంటిస్ట్ లు సైతం వ్యక్తిగతంగా  దైవం మీద నమ్మాకం కలిగి ఉన్నారంటే వారిలో స్వార్థమో, భయమో ఉందని కాదు. అదొక తెలియని ఏదో ఒక శక్తి వారి వెనుకాల ఉండడమే.దీనికి ప్రబల ఉదాహరణే మా తండ్రి గారి జీవితం.     కీ.శే. మద్దిగుంట తిరుపతయ్య     మా తండ్రి గారు కీ.శే. మద్దిగుంట తిరుపతయ్య గారిది  క్రిష్ణా జిల్లాలోని కవులూరు అనే గ్రామం. అయన ఒక వెనుక బడిన తరగతికి చెందిన వ్యక్తి.ఆయన తాతలు గుంటూరు జిల్లాలో బ్రాహ్మాణులు కు "అగ్రహారాలు దానం చేసిన చరిత్ర ఉన్నా , కాల క్రమేనా ఆస్తులు హరించుకు పోవడం చేత, మా తాత గారు కవులూరులో బందువుల దగ్గరికి వచ్చి వ్యవసాయ కూలీగా జీవనం సాగించారు.                                      

బుద్ధుడు చెప్పిన మోక్షం మానవునికి ఈ విధంగా కలుగనుందా!!??

Image
                                 49 రోజులు భోది వృక్షం క్రింద ధ్యానం చేసి గౌతమ బుద్ధులు వారు తెలిసికున్నదేమిటంటే మానవుడి దుఃఖానికి కోర్కెలు కారణం,అవి అనంతం కాబట్టి,వాటిని విడిచి పెట్టనిదే దుఃఖం నుండి మనిషి విముక్తుడు కాడు అని.సరే కోర్కెలను మన నుండి వెల్లగొట్టడం కష్టం కాబట్టి ఎలాగో కష్టపడి బౌద్ధ ధర్మాన్ని ఇండియా అంచుల వరకూ తరిమి బుద్ధుని పేరు మీద కార్యక్రమాలు జరుపుకునే అంత మేరకు కోర్కె ను నియంత్రించుకున్నాం.దేశం లో అక్కడక్కడ బుద్ధ మతం పేరుతో ఎదో చేయాలని ఆరాట పడుతున్న వారు,బుద్ధుని బోధనలు మీద మమకారం తో కాక,హిందూ ధర్మం మీద ప్రతికారంతో ఎగురుతుండడం వల్ల వారిలో కూడా కోర్కెలు ఏ మాత్రం తక్కువ కాలేదు. బుద్ధుని బోధన లో ఒకటైన బ్రహ్మచర్యం వల్ల మనిషి సంతతి తగ్గి చివరకు మానవ జాతికి భూమి నుండి మోక్షం లభిస్తుంది. ఈ రకమైన మోక్షాన్ని మనిషి సాధించటం కష్టం కాబట్టి ,మానవ ఆవిష్కృత సైన్స్ ఆ పని చేయటం మొదలు పెట్టినట్లుంది. ఆధునిక మానవుడు ఉపయోగిస్తున్న సాంకేతిక పనిముట్లు,కారకాలు వలన పర్యావరణం కలుషితమై దాని ఫలితంగా పురుషుల్లో సంతాన ఉత్పత్తి శక్తి తగ్గిపోతుంది అంట. ప్రస్తుతం 40%మందిలో ఉన్న ఈ సమస్య ,2045 నాటికి 9

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

Image
                                  రివర్స్..రివర్స్..రివర్స్.కాలం రివర్స్ అయింది.ఎండాకాలం లో వానలు పడుతున్నాయి.వానాకాలం లో ఎండలు కాస్తున్నాయి. రివర్స్ లో నీరు లేక రివర్స్ ని రివర్స్ చేసి నడిపించే రివర్స్ ఆలోచనలు మానవులకు వచ్చింది.అందుకే ఎత్తిపోతల పథకాలు ద్వారా నదుల్లో నీరు వెనుకకు నడుస్తున్నాయి.సహజ పద్దతిలో పంటలు పండించడం మానేసి ,రసాయనిక ఎరువులు వాడడం ద్వారా అటు భూమాత ఆరోగ్యం ఇటు మనుషుల ఆరోగ్యం పాడయి, చివరకు ప్రకృతి వ్యవసాయం వైపే సైన్స్ రివర్స్ అయింది.అటువంటి అనారోగ్య ఆహారం తినడం వలన ఏమో,మనుషుల ఆలోచనల్లోనూ రివర్స్ లక్షణాలు కనపడుతున్నాయి.పురుషులను స్త్రీలు.స్త్రీ లను పురుషులు పెండ్లాడి సంసారం చేసే సహజ పద్ధతికి కొంతమంది విముఖత చూపిస్తున్నారు.దాని బదులు రివర్స్ గేర్ లో స్త్రీలను స్త్రీలు,పురుషులు ను పురుషులు పెండ్లి చేసుకుంటున్నారు.పైగా వాటిని చట్టబద్ధం చేయమని పోరాడి కొన్ని దేశాలలో విజయం సాధించారు కూడా. భార్యలు లేకుండా పురుషులు.భర్తలు లేకుండా స్త్రీలు పిల్లల్ని పొందే సౌకర్యం రావడం తో డ్యూయల్ పేరెంట్షిప్ రివర్స్ అయి సింగల్ పేరెంట్ లు తయారు అయ్యారు. ఇలా పుట్టిన  వారంతా రేపు సేమ్ సెక్

దంపతులు ఇద్దరూ సమానులే అనేది గే ,లెస్బియన్ లకు వర్తిస్తుంది. భార్యాభర్తలు ఇద్దరూ కలసి ఒక్కటి అనేదే హిందూ తాత్విక దృక్పదం!

Image
                                                                        భారత రాజ్యాంగం తన పౌరులకు సమానత్వం ని ప్రసాదించింది. దీనికి ప్రతి పౌరుడు రాజ్యాంగం పట్ల కృతజ్ఞుడి గా ఉండాల్సిందే. ఎవరి దృష్టిలో ఎలా ఉన్ననా , రాజ్యాంగం ప్రకారం చట్టం దృష్టిలో పౌరులందరూ సమానమే. అందులో ఆడ, మగ ,థర్డ్ జెండర్ అనే లింగ వివక్షత అనేది చూపించటానికి విలు లేదు. అదిగో అదే కారణం చూపిస్తూ మొన్ననే సుప్రీం కోర్టు భారతీయ శిక్షా స్మృతి లోని  497 సెక్షన్ ,అడల్త్రి నేరానికి శిక్ష పొందే విషంలో స్త్రి పురుషుల పట్ల వివక్ష చూపించడమే కాక, భార్యను భర్త యొక్క ఆస్తిగా బావించే పాత తరం వారి బూజు పట్టిన బావ జాలానికి అడ్డం పట్టేల ఉందని ప్రకటిస్తూ , అసలు అ సెక్షనే నేటి తరానికి పనికి   రాదనీ 4:1 మెజార్టి తో అత్యున్నత న్యాయస్తానం కొట్టివేయడం జరిగినది. అయితే 497  సెక్షన్ లో నేరానికి బాద్యుడిగా పురుషుని మాత్రమె చేయడం వెనుక , అడల్త్రి నేరం విషయం లో నాటి సమాజం నేరస్తురలైన స్త్రి పట్ల చూపించిన హిన దృష్టి ,పురుషుని పై చూపించడం లేదు కాబట్టి, కేవలం పురుషున్ని శిక్షిస్తే సరిపోతుందని చట్ట నిర్మాతలు బావించి ఉంటారని ఇదే బ్లాగు లో ఇంతకు ముంద

జంటగా నేరం చేసిన ఆడదాన్ని ఏమనలేక ,మగాడిని కూడా వదిలేయమన్న సుప్రీం కోర్టు అప్ ఇండియా !

Image
                                                                                          సెక్షన్ 497 కేసులో తప్పు లేక నేరం స్త్రి పురుషులు ఇరువురు చేసినప్పటికీ ,కేవలం పురుషుడికి మాత్రమె శిక్ష విదించే అవకాసం కల్పించడం ,స్త్రీని కనిసం  ప్రేరేపణ చేసిన వ్యక్తిగా నైన సహా నిందితురాలిగా చేర్చకుండా పూర్తిగా వదిలి వేయడం వెనుకాల "కేవలం స్త్రి పురుషుడి యొక్క స్వంత ఆస్తి కాబట్టి, అట్టి ఆస్తికి సంబందించిన హక్కుకు బంగం కలిగింది కాబట్టే ,ఇది కేవలం పురుషుల మద్య అనుభవ హక్కుల సమస్య గా బావించి వెనుకటి చట్ట నిర్మాతలు,పురుష ఆదిక్య బావజాల ప్రబావం తో  ఈ సెక్షన్ పెట్టారు " అని బావించటం పూర్తిగా తప్పు. అదే నిజమైతే తప్పు చేసిన మగవాడికి 5 యేండ్లు జైలు శిక్ష విడిస్తే ,అదే తప్పు చేసిన స్త్రీని ఇంకా కటినంగా శిక్షించమని చట్టం చేసి ఉండేవారు. దీనిలో స్త్రీల మిద కేసు పెట్టకపోవడానికి అ నాటి సమాజ పరిస్తితులే కారణం.                         అ రోజుల్లో వివాహేతర సంబంధం పెట్టుకుంటే ,అలా పెట్టుకున్న స్త్రీని సమాజం హీనంగా చూసేది. జరిగిన తప్పు లో బాద్యత ఎవరిదైనా ,సమాజం మాత్రం ఆమెను మాత్రమె బాద్యురాలిగా చేసి ఆమ

తిరుమల దేవస్థానం వివాదాన్ని, కమ్మ ,బ్రాహ్మణ సామాజిక వర్గాల మధ్య జరిగే వివాదంగా చూడటం ఎంతవరకు సమంజసం?

Image
                                                                                             తిరుమల తిరుపతి దేవస్థానం ! దేవ దేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామీ వారి కోవెల . ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన దేవాలయం. ఆర్థికపరంగా వత్సరానికి అన్ని వనరుల నుంచి  వేయి కోట్ల పైన ఆదాయం పొందుతున్న దేవాలయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని అన్ని దేవాలయాలు మీద అజమాయిషీ కోసం ప్రభుత్వం I.A.S  కేడర్ కలిగిన అధికారిని కమిషనర్ గా నియమిస్తే ,కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం గ్రూప్ ఆలయాల అజమాయిషీ కోసం ప్రత్యేకంగా  I.A.S  కేడర్ కలిగిన అధికారిని  "కార్య నిర్వాణాధికారిగా " నియమిస్తున్నారు అంటే ఆర్థిక పరంగా ఆ దేవాలయ ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకోవచ్చు. తిరుమల క్షేత్ర్రాలు నిర్వహణ కోసం ప్రత్యేక చట్టం ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆక్ట్ లో అంతర్భాగంగా ఉంది. తిరుమల కొండ పైన ఉన్న అన్ని విభాగాలకు చెందిన సంస్థలు పంచాయతీ ,పారెస్ట్  లాంటివి కూడా దేవస్థానం E.O అజమాయిషీ లోనే పని చేస్తుంటాయి.     ఇక పొతే తిరుమల దేవస్థానం కార్యకలాపాలు విషయం లో భక్తులకి ఏమి పాత్ర ఉండదా అంటే ఎందుకుండదు ? చట్ట ప్రకారం దేవస్థానం కి ధర్మకర్తల

గ్రంధాలు పట్టుకు తిరిగేవారు జ్ఞానులూ, ఆవు చుట్టూ తిరిగే వారు అజ్ఞానులా ?!!

Image
                                హిందూ జీవన విధానంలో భగవంతుని దర్శించి తద్వారా జీవన్ముక్తులు అయ్యే పద్ధతుల్లో ముక్యంగా 3 మార్గాలు ఉన్నాయి . (1). జ్ఞాన మార్గం (2) భక్తి మార్గం.3 కర్మమార్గం . సాంప్రదాయిక జ్ఞానమార్గంలో ఉన్నవారు ఎవరైనా ఒక గురువును ఆశ్రయించి , వేదోపనిషత్తుల ఇతర గ్రంధాలలోని   సారాంశం తెలుసుకోవడం ,ఆ గురువుగారు చెప్పిన విధానంలోనే భగవంతుణ్ణి దర్శించడం చేస్తుంటారు. వీరి దృష్టిలో దేవుడు వేరు . గురువు వేరు. దేవుడు గురించి తెలుసుకోవాలంటే గురుబోధలు ద్వారానే అది సాధ్యమవుతుoది తప్పా అన్యదా కాదు అనేది జ్ఞాన మార్గీయుల అభిప్రాయం లేక విశ్వాసం .                         ఇక భక్తి మార్గం లో భగవత్ దర్శనం చేసుకునే వారికి ఏ గ్రంధాలు లేక గురువులు తోనూ పని లేదు . వారికి అలౌకిక అనందం ఇచ్చేది ఏదైనా సరే దానిని భగవంతుణ్ణి గానే భావిస్తారు  . నిత్యం  తాము దేవుడు అని నమ్మడానికి వీరికి ఏ గ్రంద సారాంశం అక్కర్లేదు,గురు బోధలు అవసరం లేదు . తమ పెద్దలు పూజించే దేవుళ్ళు కావచ్చు, జీవితంలో ఏదో ఒక సమయం లో ఆపద ఏర్పడితే దాని నుంచి కాపాడినవాడు అని నమ్మిన  దేవుడు కావచు, చనిపోయిన మహాపురుషులు కావచ్చు,బ్రతికి

"గోపాలకుడు " ను కాదని "గొర్రె పాలకుడు "బిరుదు ధరించిన "కంచ ఐలయ్య షెప్పర్డ్ " చెప్పే ఐడియాలజీ వలన ఎవరికీ లాభం ??

Image
                                                                                                                                      భారత దేశం లో ఉన్న "కుల వ్యవస్థ " అనబడే విధానం ప్రపంచం లో ఏ దేశం లో లేకపోవచ్చు . మొదట్లో వృత్తుల ఆధారంగా నిర్ణయించబడిన కులాలు చివరకు రాను రాను జన్మతః నిర్ణయింపబడానికి కొంతమంది పండిత పుత్రులు కారణమయినప్పటికీ , అగ్రకులాలు ,నిమ్నకులాలు అని వర్గీకరించబడడానికి , పై కులాల  ఆధిపత్యం క్రింది కులాల వారి మీద  శతాబ్దాలుగా కొనసాగిస్తుండటానికి మాత్రం అన్ని కులాల వారి ప్రమేయం ఉంది. ప్రతి కులస్తుడు తనపై పెత్తనం చేయచూసే అగ్రకులస్తుడి అహకారం ని ప్రశ్నించే బదులు ,తనకంటే క్రింది కులం గా ఉన్నవారి మీదే తన ఆధిపత్య అహంకారాన్ని చెలాయించడానికే ఇష్టపడ్డారు కాబట్టే కులాహంకార దురాచారాం అన్ని వందల ఏండ్లుగా కొనసాగుతూ వస్తుంది. ఆఖరకు దళితులలో కూడా  ఈ జాడ్యం ఉన్నప్పుడు , తరతరాల నిమ్న కులాల వెనుకబాటు తనానికి  ఏ ఒక్క కులాన్నో టార్గెట్ చేసి నిందించడం ఎంతవరకు సమంజసం?        మొన్నీ మధ్య "కంచ ఐలయ్య " అనే ప్రొపెసర్ గారు ఒక పుస్తకం రాశారు. దాని పేరు "సా