Posts

Showing posts from August, 2013

యాంకర్ అడిగే దానికే సమాధానం దాటవేసే మీరు , రేపు సీమాంద్రుల ప్రశ్న లకు ఏమని సమాదానం చెపుతారు బాబూ!

                                                                                                                                                                                                 మంచో చెడో, తెలిసో తెలియకో, లేదా పార్టీలోని తెలంగాణ వాదుల ఒత్తిడి వలనో, అధీ కాకపోతే కేంద్రం ఎట్టి పరిస్తితిలోను తెలంగాణా  ఇచ్చే సాహసం చెయ్యదనో,  చంద్రబాబు గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అభ్యంతరం లేదని అంగీకార పత్రం పార్టీ తరపున ఇచ్చారు. ఇప్పుడేమో అధికార పార్టీ వారు తెలంగాణకు ఓ.కె అనే సరికి అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీ లోని సీమాంద్రా నాయకులకు గొంతులో పచ్చి వెలకాయ పడినట్లైంది. అటు కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర ఏర్పాటు ఖాయమంటుంటే, ఇటు సీమాంద్ర ప్రజలు సమైఖ్యతకు  తేడా వస్తే తెలంగాణాకు ఒ.కె అన్న పార్టిలను సీమాంద్రలో పూడ్చిపెట్టడం ఖాయం అంటున్నారు.  ఇప్పుడు సీమాంద్రకు చెందిన అటు అధికార పార్టీ నాయకులు, ఇటు ప్రతి పక్ష నాయకులు నష్ట నివారణ చర్యల్లో బాగంగా సమైక్యతకు అనుకూలంగ వాదనలు చేస్తున్నా, ప్రజలు వారి చిత్త శుద్దిని నమ్మే పరిస్తితిలో లేరు.అందుకే తమ ఉద్యమ వేదికలను రాజకీయ నాయకులు పంచుకోవడం

పిర్ర గిల్లి జోల పాడటమంటే ఇదేనా ?!

Image
                                                                   తిలా పాపం తలా పిడికెడు అని రాష్ట్ర వేర్పాటు నిర్ణయం కేవలం అధికార పార్టీ వారిదే అని ఇతర పార్టీల వారు, ముఖ్యంగ ప్రధాన  ప్రతిపక్షం అయిన తెలుగుదేశం వారు అనటం బాద్యతా రాహిత్యమే అవుతుంది. రాష్ట్ర విబజన అనేది అంద్రా ప్రాంతం లోని అయిదుకోట్ల ప్రజలకు ఇష్టం లేదని, తెలంగానాలోని మెజార్టీ ప్రజల అభిలాష అని తెలిసినపుడు,అదే విషయాన్ని అఖిల పక్ష మీటింగ్ లో చెప్పాల్శి ఉండె. తెలంగాణా ఇవ్వడం, ఇవ్వక పోవడం అనేది పూర్తిగా పాలనా పరమయిన నిర్ణయం కాబట్టి,మరియు రెండు ప్రాంతాల ప్రజల మనో బావాలకు సంబందించినది కాబట్టి,   దాని గురించి పార్టి పరంగా తాము ఏమి చెప్ప జాలమని, రాజ్యాంగ ప్రక్రియలో భాగంగ  అసెంబ్లీలో  బిల్లు పెడితే తమ పార్టీ సబ్యులుకు విప్ జారీ చెయ్యకుండా వారి వారి అభిప్రాయాలు స్వేచ్చగా చెప్పుకునే వీలు మాత్రమే తమ పార్టీ కల్పిస్తుందని, ఒక్క మాట చెప్పినట్లైతే, ఈ రోజు ఇంత అయోమయానికి గురయ్యే పరిస్తితి ప్రతి పక్షానికి ఉండెది కాదు కదా!ఇప్పుడు పార్టీ నిర్ణయమని చెప్పి, తెలంగాణ ఏర్పటుకు అంగీకార లేఖ ఇచ్చినంత మాత్రానా, రేపు అభిప్రాయా సేకరణలో అసెంబ్లిలో

విచారణ కు కలత చెంది ప్రాణ త్యాగం చేస్తామనడం" ఆస్రాం బాపు" గారికి తగని మాట!.

                                                                        ఈ దేశం లో ఆశ్రమాదిపతుల మీడ, హిందూ అద్యాత్మిక వాదుల మీద తప్పుడు కేసులు పెట్టడం రాజకీయ నాయకులకు కొత్తేమి కాదు. అసలు కేసులు పెట్టబడి,విచారణ ఖైదీలుగా జైలులో ఉన్న వారు కూడా నిజమైన నేరస్తులు కారని, తప్పుడు కేసులు పెట్టడం అనేది ఈ దేశం లో సర్వ సాదార్ణమని, ఈ విషయం లో సుప్రీం కోర్టు వారికి కూడా ఏమి తెలియదని భారత రాజకీయ పక్షాలు తేల్చేసాయి.దీని కోసం ఇటీవలి సుప్రీం కోర్టు వారి తీర్పు అదే, జైల్లో ఉన్న రాజకీయ నాయకులను చట్ట సభలకు పోటి చేయ్యడానికి అనర్హులని ఇచ్చిన తీర్పును అధిగమించాడానికి చట్ట సవరణలకు ఏక కంఠం తో అంగీకారం తెలిపారు అంటే ఈ దేశం లో పోలిసులు పెట్టే కేసులు మీద వారికెంత నమ్మకం ఉందో చెప్పకనే చెపుతుంది. మరి అటువంటీ తప్పుడు కేసులు పెట్టె సంస్క్రుతి ఉన్న దేశం లో హిందూ ఆద్యాత్మిక వాదులు అంటే ఒంటి కాలి మీద లేచే రాజకీయ నాయకులు ఉన్న దేశంలో హిందూ అద్యాత్మిక గురువులను అప్రతిష్ట  పాలు చెయ్యడానికి తప్పుడు కేసులను ఆయుదంగా ఉపయోగించరని గ్యారంటీ ఏమి లేదు. ఇదే అనుమానం ఈ మద్య పదహారేళ్ళ అమ్మాయి విషయం లో లైంగిక ఆరోపణలు ఎదురుకుంటున్న ఆద్

అనుజుడిని చంపేసిన వారు ,ఆలి ని చంపాలనుకున్న వారు మన ప్రజా ప్రతినిదులు లంటా !

                                                              ఎన్నికల్లో డబ్బు, కులం లాంటివి ప్రబావం  చూపుతున్నంత  కాలం  మన కిటువంటి నాయకులే దాపురించక తప్పదు. వారివురూ సాక్షాత్తు యం.యల్.ఎ లు. అంటే ప్రజల తరపున శాసనాలు చేయడానికి ప్రజల ద్వారా ఎన్నిక కాబడిన వారు. ఒకరు జడ్చెర్ల యం.యల్.ఎ అయితే మరొకరు కైకలూరు యం.యల్.ఎ.   ఇందులో జడ్చెర్ల యం.యల్.ఎ గారు సర్పంచ్ ఎన్నికల్లో తన బార్యకి పోటిగా తన తమ్ముడు అతని భార్యని నిలపటం సహించలేక, పోటి నుండి తప్పుకోమని తమ్ముడిని హెచ్చరించాడట. మాట విననందుకు తమ్ముడిని కాల్చి చంపాడట!. రాజకీయాల కోసం సోదరుల మద్య వైరం కొత్తేమి కాకపోయినా ఇలా నీచంగ తోడపుట్టిన వాడిని చంపటం అదీ ఒక ప్రజా ప్రతినిది చెయ్యడం అనేది రాష్ట్రం లో దిగజారిన రాజకీయాలకు పరాకాష్ట గా బావించవచ్చు.  ఇక పోతే మరొక ఆయన కైకలూరు యం.యల్.ఎ. ఆయనకి ఆయన భార్యకి రెండేళ్ళ నుండి పొసగటం లేదట. పడకపోతే గౌరవంగా విడాకులు తీసుకోవచ్చు. యం.యల్.ఎ కాబట్టి భార్యని వదిలించుకోవాలంటే ఎక్కువ పరిహారం ఇవ్వాల్సి రావచ్చు. తనని  హింసిస్తునాడని, ఒకసారి హత్యా ప్రయత్నం కూడా చెయ్యబోయాడని భార్య పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేస్తే, ఆ ప

నలుగురు ని రేప్ చేసారు ! పాపం పండి అయిదో రేప్ కి అరెస్ట్ అయ్యారు !

Image
                                                                                                                                       మొన్న ముంబాయి శక్తి మిల్ ప్రాంతం లో మహిళా పోటో జర్నలిస్ట్ మీద లైంగిక  దాడీ జరిపిన అయిదుగురు పట్టుబడ్డారు. అందులో మొదటి నిందితుడు అయిన గాంగ్ లీడర్ మహమద్ ఖాసీమ్ హఫీజ్ షేఖ్ చెప్పిన దాని ప్రకారం అదే శక్తి మిల్ ప్రాంతం లో గత ఏడాది  కాలం లోపు వారు నలుగురు అమ్మాయిలను సామూహిక మాన భంగం చేసారట! కానీ వారెవరూ కేసులు పెట్ట లేదు. కారణాలు ఏవైన కావచ్చు. ఇందులో జనాలు తెలిసికోవల్సిన అంశం ఒకటే, ఇంతకు ముందు టపాలో చెప్పినట్లు, ఒంటి మీద బంగారం ఉన్న వారు వాటి రక్షణకు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో, అన్ని జాగ్రత్తలు ప్రతి స్త్రీ వారి కుటుంబ సబ్యులు  తీసుకోవలసిన అవసరం ఉంది. వివిద సమయాల్లో నలుగురు అమ్మాయిల్ని రేప్ చేస్తే, ఒక్కరైన కేసు పెట్టలేదు సరి కదా , కనీసం వారి తాలుకు బందువులు ఆ మదాందుల్ని ఏమి అనకుండా నోరు మూసుకున్నారు అంటే ఖచ్చితంగా వారు సమస్యలకు బయపడే మనస్తత్వం కలవారైన అయి ఉండాలి ,లేకుంటే అటువంటి  నిర్జన ప్రాంతానికి వెళ్ళడం లో వారి తప్పు కూడ ఉండి ఉండాలి. అందుకే రేపిస

గాంగ్ రేప్ కేసుల్లో "నిర్బయ " ల కంటే "నిర్బాగ్య" ఉదంతాలే ఎక్కువ!

                                                                  డిల్లీ గాంగ్ రేప్ ఉదంతం తర్వాత యావత్ దేశం స్పందించిన తీరుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి "నిర్భయ" చట్టం తెచ్చింది.  దాని దెబ్బతో దేశం లో రేప్ కేసులు తక్కువ అవుతాయని అనుకున్న వారి అభి ప్రాయం తప్పని రుజువు చేస్తూ ఆ తర్వాత అనేక వ్యక్తిగత, సామూహిక అత్యాచార ఘటనలు జరిగాయి. దానిలో ముఖ్యమైనది. మొన్నటి ముంబాయి ఉదాహరణ. అలాగే మరిది శవం తో వెలుతున్న ఒక మహీళా కానిస్టేబుల్ ని  కనికరమ్ లేకుండా కామందులు చెరిచారని ఈ రోజు పేపర్లో చూశాం. మొన్న ముంబాయిలో  సంఘటణ జరిగిన రోజే ఇక్కడ మా ఖమ్మంలో లో కూడా ఒక పదిహేడేళ్ళ అమ్మాయి మీద ఆరుగురు మ్రుగాళ్ళు అత్యాచారం చేసారట. కేసు విచారణ చేస్తున్నారు. అందులో ఇద్దరు కుర్రాళ్ళు తాము ఆ సమయం లో అక్కడ లేమని వాదిస్తునారట. ఈ  గాంగ్ రేప్ మాత్రం తెలిసిన వారు చేసిందే .  ఒక అమ్మాయి. చదువు మానేసి ఇంట్లో ఉంటుంది. ఆ రోజు కూరగాయలకని బయటకు వచ్చి, సరుకులు కొన్న తర్వాత ఇంటికి తిరిగి వెళుతుంటే ,ఆమె ఉంటున్న ప్రాంతం లోని కుర్రాళ్ళు ఆరుగురు  ఆటో లో వచ్చి, మేము ఇంటికే వెళుతున్నాం రా అని అంటే నిజమేనని నమ్మి ఆ

కాబోయే హైద్రాబాద్ గవర్నర్ శ్రీ శ్రీ శ్రీ చిరంజీవి!!!?

                                                                  ఆంద్ర ప్రదేశ్లో ,సీమాంద్ర  ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి.వారి లక్ష్యం సమైఖ్య ఆంద్రప్రదేశ్. హైద్రాబాద్ సెటిలర్స్, కొంతమంది రాజకీయ నాయకులు తప్పా, హైద్రాబాద్ని కేంద్ర పాలిత ప్రాంతంగ చెయ్యమని సీమాంద్ర ప్రాంతం వారు అడగటం లేదు. ఇక హైద్రాబాద్ లేని తెలంగాణా తల లేని మొండెంతో సమానం కాబట్టి తెలంగాణా వారు  అట్టి   ప్రతిపాదనను కలలో కూడా అనుకోరు. కాని నిన్నటి దాక సూర్యుడిలా మండి  పోయి, పరిస్తితుల ప్రబావానికి బిక్కచచ్చి, సోనియమ్మ దయతో టూరిజం మంత్రి అయిన చిరంజీవి గారు మాత్రం హైద్రాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే నూటికి ఎనబైమంది  శాంతిస్తారని ఎలా సోనీయమ్మకు చెప్పారో అర్దం కావడం లేదు. నిన్న నలబై అయిదు నిముషాలు ప్రత్యేకంగ సోనియా గాంది గారితో సమావేశమై బయటకు వచ్చిన చిరజీవి గారు పలికిన చిలక పలుకుల్లోని సారాంశం అదే!  తాను మేడం సోనియాకు సవినయంగా సీమాంద్ర ప్రజల ఆందోళనలు గురించి చెప్పానని, అది విన్న మేడం ఆల్రడి తెలంగాణ ఏర్పాటు నిర్ణయం అయిపోయింది కాబట్టి, అది తప్పా సీమాంద్ర వారికి కావలసినది ఏమిటో చెపితే దానిని అనుగ్రహిస్తానని అన్న

ఎయిడ్స్ రోగి అయిన భర్త నుండి విడాకులు తీసుకున్న బార్యకు దక్కేదేమీటి?

                                                                                                                         ఆంద్రా, తెలంగాణా ప్రాంత సంబందాన్ని కొంతమంది అన్నదమ్ములతో పోల్చుతుంటే, మరికొంతమంది భార్యా భర్తలతో పోల్చుతున్నారు. కొంత  మంది అయితే మరీ ఇతర ప్రాంతాల వారి మీద తమకున్న ద్వేషాన్ని,కోపాన్ని వెల్లగ్రక్కడంకోసం లేనిపోనివి, పనికిరాని ఉపమానాలు చేస్తున్నారు. నేడు ఆంద్రప్రదేశ్ లో ఉన్నది సున్నిత పరిస్తితి. ఒకరు తమ డిమాండ్లు సాదించుకోవడానికి,ఉద్యమాలు చేయవచ్చు. అలాగే ఎదుటివారికి కూడ అలాంటి హక్కే ఉంటుందని గుర్తుంచుకోవాలి. నీవు చెప్పేది నీకు సమ్మతం అయినంత మాత్రానా ఎదుటివాడికి కూడ సమ్మతం కావాలని రూలేమి లేదు. రెండు బిన్న వాదనలు ఉన్నప్పుడు సంయమనం పాటించి, ప్రబావవంతంగా, అవసరమైనప్పుడు, సరైన చోట తమ వాదనలు వినిపించి కోరుకుంది సాదించుకోవడమే కార్యదక్షులు చెయ్యాల్సిన పని.    భారత రాజ్యాంగం ప్రకారం ఏ ప్రాంత ప్రజలకి, తాము ఒక ప్రాంతం నుండి విడీపోతామని కాని, లేక కలసి ఉంటామని కాని చెప్పే హక్కు లేదు. భారత పార్లమెంట్ మాత్రమే, రాష్ట్రపతి రికమెండేషన్తో పార్లమెంటులో బిల్లు పెట్టడం ద్వారా ఒక రాష్ట

"పవిత్ర యుద్దం" అంటె పసిపిల్లల్ని రసాయనాలతో చంపడమేనా?

                                                                     అధికార కాంక్ష మనిషిని ఎంత క్రూరుడిగా మారుస్తాయో, నేడు సిరియా లో జరుగుతున్న మారణ హోమమే సాక్ష్యం.ఒక్కసారి మనిషి రక్తం రుచి చూసిన పులి ఇక ఎన్నటికి సాదు జంతువుగా ఉండజాలదు. ఇదే సూత్రం మనిషికి వర్తిస్తుంది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా మతాలు, మత ప్రబోదకులు సాద్యమైనంతవరకు మనిషిని క్రూర స్వబావానికి దూరంగ ఉండేలా చేసారు. అయిన మనిషి క్రూరత్వం నుండి విముక్తుడు కాలేక పోతున్నాడు. బుద్దుడిని ఆరాదించేవారు తుపాకులు పెట్టి కాల్చుకుని చస్తున్నారు, కరుణామయుడిని ఆరాదించే వారు బాంబర్ విమానాల ద్వార బాంబులు కురిపించి మరీ ప్రజల్ని హత మారుస్తున్నారు. పవిత్ర యుద్దం(జీహాద్)ద్వారా తనలోని రాగాద్వేషాల మీద యుద్దం చెయ్యడం మాని తమ మతం సూత్రాలని పాటించని వారి మీద యుద్దం చేసే మతస్తులు చివరకు తమ స్వంత బిడ్డల్నే ఎంత క్రూరంగా చంపుతున్నారో, సిరియా సంక్షోబం తెలియ చేస్తుంది.   సిరియా. పశ్చిమ ఆసియాలో అరబిక్ బాష మాట్లాడె ప్రజలున్న దేశం . దీని మొత్తం జనాబా రెండుకోట్ల యాబై లక్షలు లోపే. అంటే సీమాంద్రలో సగం, లేకపొతే తెలంగాణా ప్రజలు కంటే కోటిన్నర తక్కువే. కానీ అ

కడుపులో లేకపోయినా ప్రజల కోసమైన కావలించుకోవటం నేర్చుకోవాలి!

Image
                                                                                                                                                    ఈ రోజు నందమూరి వంశీయుడు, కరడుకట్టిన సమైఖ్యతా వాది, గౌరవనీయులు కీ,శే. నందమూరి తారక రామరావు గారి తనయుడు, బాలక్రిష్ణ గారి రెండవ కుమార్తె వివాహం జరిగింది. ఆ వివాహానికి రాజకీయ, సినిమా, వ్యాపార ప్రముఖులు అందరూ వచ్చారు.కాని ఈ మద్య, తెలంగాణా, ఆంద్రా ప్రజలు అన్నదమ్ములు అని, వారు కలసి ఉండడమే తన తండ్రి గారి ఆత్మకు శాంతి అని, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వారు హట్టాతుగా (అన్ని పార్టిల అంగీకారంతో చేసినా సరే), విబజన నిర్ణయం తీసుకోవడం వలన, తన తండ్రి ఆత్మ ఘోషిస్తుందని, కాబట్టి తన ఆత్మ కూడా తండ్రి అడుగుజాడల్లో నడవమని  ప్రబోదిస్తుంది కాబట్టి, ఆ మేరకే నడచ్కుంటాను అని కన్నీరు కర్చిన హరిక్రిష్ణ గారు కాని, వారి తనయుడు కాని, ఈ రోజు జరిగిన వివాహానికి హాజరు కాలేదట!   రాష్ట్ర ప్రజలు ని అన్నా దమ్ములు లా కలసి ఉండాలని చెప్పే ఆ పెద్దమనిషి ద్రుష్టిలో అన్నదమ్ముల అనుబందం అంటే, ఒకరింట్లో జరిగే శుభకార్యానికి, మరొకరు వెళ్ళలేనంతగా ఉండేదా? అని తెలంగాణా వాదులు ఆశ్చర్యపోతున్నారట!అ

తండ్రి గా పరిగణించ బడడానికి " జన్మ దాతే " కానవసరం లేదు !.

Image
                                                             సినీ తారల జిలుగు వెలుగులు వెనకాల ఎంత కంపుకొట్టే కుటుంబ సంస్క్రుతి ఉందో అర్దమవుతుంది. నాకు తెలిసి ఏ మాత్రం మాన మర్యాదలు  ఉన్న వారు తమ ఆడపిల్లల్ని సినిమా రంగం వైపు కన్నెత్తి చూడనివ్వరు. పెద్ద పెద్ద హీరోలు సైతం తమ మగ పిల్లల్ని, సినిమాల్లో నటించేందుకు అంగీకరిస్తున్నారు కాని,సాద్యమైనంత వరకు కూతుళ్ళని సినిమా రంగంలో పరిచయం చెయ్యడానికి ఇష్టపడరు. సినిమా రంగం లో స్త్రీలకు లబించే గౌరవం ఎటువంటిదో వారి గురించి తీసిన సినిమాలే గొప్ప ఉదాహరణ. సినిమాలలో నూటికి పది లేక పదిహేను శాతం సినిమాలే సక్సెస్ అవ్య్తుంటాయి. అల సక్సెస్ అయిన సినిమాలలో నటించే నటీమణులు క్లిక్ అయ్యాక ,వారికి కొంత ఇమేజ్ వచ్చాక "క్రుత్రిమ గౌరవాలు" ఏర్పడి ఒక స్తాయి లో నిలదొక్కుకోగలుగుతారు. అంటే నూటికి తొంబై తొమ్మిది మంది చెడిపోతే గాని ఒక్క స్త్రీకి గౌరవం దక్కదు. స్త్రీలను ఆటబొమ్మలు చేసే అత్యంత నీచ నిక్రుష్ట రంగం సినిమా రంగం.కాని మన దౌర్బాగ్యం కొద్దీ స్త్రీ పురుష సంబందాలు ఎలా ఉండాలో ఈ నటీ మణులే అప్పుడప్పుడు సెలవిస్తూ సంచలనాలు రేపుతుంటారు.ఆ క్లిక్ అయిన ఒక్కరిద్దరిన

తాగి ఆటలాడుతున్న మితిమీరిన స్త్రీ స్వేచ్చ!?

                                                              తప్పు ఎవరు చేసినా తప్పే. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు.మన సమాజంలో ఈ మద్య స్త్రీలు పురుషులు తో పాటు సమానత్వం సాధించారని స్త్రీ వాదులు మురిసిపోయే సంఘటణ ఈ రోజు సీమాంద్రా, తెలంగాణా ప్రజలు దేనికోసమైతే పోరాడుతున్నారో ఆ రాజదాని నగరం లోని శంషాబాద్ విమానాశ్రయంలో జరిగింది!  ఒక ఆదునిక స్త్రీ, తప్ప తాగి, శంషాబాద్ ఎయిర్ పోర్టులోని గేమింగ్ క్లబ్ కి వెల్ళి అక్కడ సిబ్బందితో గొడవపడి,వారిలో ఒకరిని నాలుగు పీకులు పీకిందట. దానితో సదరు సిబ్బంది, అమ్మాయి మీద కేసు పెడితే పోలిసులు కేసు నమోదు చేసి అమ్మాయిని అదుపులోకి తీసుకుని విచారిస్తునారట! ఆ అమ్మాయిని మీడియా వారు కవర్ చేస్తుంటే ముఖానికి చేతులు అడ్డు పెట్టుకుని ఆ అమ్మాయి కారు వద్దకు పరిగెత్తుతున్న తీరు చూస్తుంటే, అరెరె! అర్దరాత్రి స్వేచ్చగా తిరిగే స్వాతంత్ర్యం రాక పోయినా, పట్ట పగలు తప్ప తాగి, వీదులలో పరుగులెత్తే స్వాతంత్ర్యం వచ్చినందుకు ఈ దేశ వాసులు ముఖ్యంగా స్తి వాదులు మురిసిపోవచ్చు అనిపించింది. హైద్రాబాద్లో ఇటువంటి సంగటనలు ఈ  మద్య  మామూలై పోయాయి అని అంటునారు .    జ్ఞానం లేని క

కలపడానికైనా,విడగొట్టడానికైనా బలమైన శక్తి ఒకటి అనివార్యం

Image
                                                                        మన రాష్ట్రం విబజించుతున్న తరుణంలో తెలుగు జాతి గురించి , జాతి మూలాలు గురించి కావల్సినంత సమాచారం వివిధ వెబ్సైట్లలో ప్రత్యక్ష మవుతుంది . అటు విభజన వాదులు కానీ ,సమైఖ్య వాదులు కానీ ఎవరికీ అనుకూలమైన వాదనలు వారు చేస్తున్నారు . వేర్పాటు వాదులు 'మీసంస్క్రుతి వేరు ,మా సంస్క్రుతి వేరు ' అని 400 యేండ్ల చరిత్రను ఉదాహరణగా చూపుతుంటే , "లేదు ,లేదు మీరూ మేము అన్నదమ్ములమే ,గతిమాలిన రాజకీయాలు వల్ల విడిపోయాం " అని వేల యేండ్ల చరిత్రను ఉదాహరిస్తునారు ,సమైఖ్య వాదులు . అయితే వారైనా , వీరైనా గుర్తుంచుకోవలసింది ఏమిటంటే ,"ఆస్తులు కోసం కీచులాడుకుని విడిపోవటం అనేది కూడా మన  అన్నదమ్ముల సంస్కృతిలో బాగమే " అన్న విషయం .    అసలు తెలుగు నాడు హిందూ రాజుల తర్వాత నవాబుల.పాలన లోకి వచ్చిన ప్రాంతం . అందులో కొంత బాగం ఇంగ్లీష్ వారికి ఇచ్చి, అందుకు ప్రతిపలంగా పైకం తీసుకున్న ఘన చరిత్ర నైజామ్ నవాబులది. అలా అమ్ముడుపోయిన అన్నలు ఆంద్రావారైతే, నవాబుల ఏలుబడిలో ఉన్నవారు తమ్ముళ్లైన తెలంగాణా వారు. అలా అమ్మబడిన ఆంద్రా అన్నలు వారి ఇంగ్

పక్కింటాయన అసమర్దుడు అయితే మన ఇంటికి కూడా తప్పవు తిప్పలు!

                                                                    మనం ప్రశాంతం గా జీవించాలంటే కేవలం మన ఇంట్లో వారు క్రమశిక్షణ తో వ్యవహరిస్తే చాలదు. పొరుగింట్లో వారు కూడా క్రమశిక్షణ గల వారై ఉండాలి. ఉదాహరణకి మనం మన పిల్లల్ని చక్కని క్రమశిక్షణలో పెంచుతూ,ఇరుగు పొరుగు వారితో గొడవలు పడకుండా సర్దుకు పోయే తత్వాన్ని అలవర్చి, ప్రశాంతంగా జీవించుదామని అనుకోవచ్చు. కాని పక్కింట్లో పరిస్తితి వేరు అనుకోండి.మొగుడు చెప్పిన పెళ్ళాం వినదు. పెళ్ళాం చెప్పిన మాట మొగుడికి రుచించదు. వీరిద్దరు చెప్పే దాని వినే పరిస్తితిని పిల్లలు ఎప్పుడో దాటి పోయారు. పిల్లలు పెంకిగా మారి పోయారు. "తల్లికి వంగని వాడు దాతికి(వద్య శిల) కూడ వంగడు" అని సామెత. కాబట్టి పెద్దోళ్ళ కంట్రోల్ లేని పొరుగింటి  పెంకి పిల్లలు,చీటికి మాటికి మన పిల్లల్తో తగాదా పడుతున్నపుడు, వారి మీద వారి తల్లి తండ్రులకు పిర్యాదు చేసినా పలితం ఏమిటి? ఆ తల్లి తండ్రులు తాము చెపితే తమ పిల్లలు వినరని తెలుసు   అయినా పక్కింటి వారి ముందు తమ అసమర్దతను కప్పి పెట్టుకోవటానికి,మన పిల్లల ప్రవర్తనను తప్పు పడుతూ, వారి పిల్లలను వెనకేసుకు వచ్చే ప్రయత్నం చేస్తారు

మాలో ప్రవహిస్తుంది తల్లుల్ని పూజించిన ప్రదమాంద్ర పాలకుల రక్తమే తప్పా,ప్రియురాళ్ళ కోసం పట్టణాలు కట్టించిన నిజాం ప్రభువులుది కాదు.

                                                       గొప్ప వారు అని పిలువ బడుతున్న వారు, గొప్ప,గొప్ప చదువులు చదివిన వారు, రాజనీతి శాస్త్ర విశారదులు అని కొని యాడబడుతున్న వారే, తుచ్చమయిన పదవుల కోసం,ఎంతో ఘనమైన చరిత్ర గలిగిన తెలుగు వారి ప్రాచీనతను మరుగున పెట్టి, కేవళం మూడు నాలుగు వందల యేండ్ల చరిత్రకు మాత్రమే తాము వారసులమని,తమని బానిసలా పరిపాలించిన హైద్రాబద్ ప్రభువులే తమ పూర్వ వారసులని, వారు నిర్మించిన హైద్రాబాదే నగర సంస్క్రుతే తమ సంస్క్రుతి అని ఫిలవుతూ,నవాబులు తిన్న బిర్యానే తమ ఆహార సంస్క్రుతి గా,  తప్పుడు వాదనలు చేస్తుంటే నిజంగా ఇంత దిగజారాల్సిన అవసరం ఉందా అనిపిస్తుంది.    మన చరిత్ర అంటే ఏమిటి? ఏ సమజానికి అయినా ఉన్నత దశ, అదమ దశ ఉంటాయి. తెలుగువారిలో అత్యదిక శాతం హిందూ సాంప్రదాయం పాటించే వారు. మన పూర్వికులు శైవం,వైష్ణవం తో పాటు బౌద్ద మత్తాన్ని కూడ ఆరాదించారు, పాటించారు. మన తొలి ఆంద్ర పాలకులు అయిన శాతవాహనుల కాలంలో బౌద్దం, హైందవం సమానంగా గౌరవించబడినవి. కాల క్రమేణా బౌద్దం అంతర్దానమైనా, హైందవం కాల పరీక్షకు నిలబడి విరాజిల్లింది. ఎందుకంటే అది పురాతన మైనదే కాక అన్నిo టిని  తనలో ఇముడ్చు

గాందీ తాత చెప్పింది వద్దు, గురజాడ తాత చెప్పిందే ముద్దు, అని చాటిన తెలంగానాంద్రులు!

                                                                                                                            బాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియలో బాగంగా భారత దేశంలో  మొట్టమొడటగ ఆవిర్భవించిన రాష్ట్రం ఆంద్రప్రదేశ్. తెల్లవాడి పాలన నుండి ,మద్రాస్ రాష్ట్రంలో అంతర్బాగంగా ఉన్న తెలుగువారిని, నిజాం నవాబు పాలనలో మగ్గుతున్న తెలంగాణా లోని తెలుగు వారిని కలిపి, ఒకే బాష మాట్లాడే ప్రజలు ఒకే జాతి గా కలిసి మెలిసి ఉండగలరన్న బావనతో విశాలాంద్ర ఏర్పాటు చేసారు అప్పటి పెద్దలు.  కానీ ఇప్పటి వారికి కొంతమందికి ఆంద్రా ప్రాంతం తెలుగు వారు తమ వారు కాదని, వారి బాష వేరు తమ బాష వేరని, అలాగే తమ ఆహారపు అలవాట్లుకు వారి ఆహారపు  అలవాట్లకు తేడాలున్నాయని, కొత్త వాదాలతో తెలంగానా వేర్పాటు ఆవశ్యకత నొక్కి చెపుతూ, దాని సాదనకు ఉద్యమించారు. ఉద్యమంలో కూడ కొత్త పోకడలు కనిపెట్టి ఆంద్రావారికి కూడ ఆదర్శ ప్రాయులయ్యారు. సాదార్ణంగా నిరసన తెలిపే విదానం గాందీ గారు చూపిన "నిరాహార దీక్ష".అంటే ప్రజలు ఆహారం తీసుకోకుండా శాంతీయుతంగా నిరసన తెల్పటం. దీనికి ప్రభుత్వం వారు చలించి వారి కోర్కెలు తీర్చడానికి ముందుకు

ఇవ్వకుంటే బార్యతో తంటా!ఇస్తే ప్రభుత్వం తో తంటా!

                                                                      ప్రభుత్వాలను అంచనా వెయ్యడానికి వారు వసూలు చేస్తున్న పన్నుల విదానం, ప్రజల నుండి వివిద రూపాలలో పొందే అన్ని రకాల ప్రభుత్వ ఆదాయ వనరుల  విశ్లేషన ఉపయోగపడుతుంది. ముస్లిం రాజుల కాలంలో హిందువుల మీద "జుట్టు" పన్ను, తీర్ద యాత్ర పన్ను అనేవి కూడా వసూలు చేసే వారట, అంటే హిందువులు దైవదర్శనానికి తీర్ద యాత్రలు చేసినా, జుట్టు పెంచుకున్న పన్ను కట్టాల్సి వచ్చేదట! ఇప్పుడైతే లౌకిక రాజ్యాలు కాబట్టి అటువంటివి ఏమిలేవు. పైపెచ్చు మక్కా యాత్రకి ప్రబుత్వ సహాయం కూడా లభిస్తుంది.   కాని ఎందుకో ఆంద్ర ప్రదేశ్ ప్రబుత్వం వారికి బార్య,భర్తలు సంబందాలు అన్నా,ఇతరకుటుంబ సబ్యుల మద్య సంబందాలు అన్నా కొంచంకోపంగానే ఉన్నట్లుంది. అందుకే వారి మద్య ఉచితంగా ఇచ్చిపుచ్చుకోవడాలను నియంత్రించాలని చూస్తుంది. ఒక వ్యక్తి స్వార్జితమయినా, పిత్రార్జితమయినా అతని కుటుంభ సబ్యులు అందరూ అనుబవిస్తుంటారు. వారిలో వారికి తగాదా వచ్చినప్పుడు మాత్రమే ఆస్తుల స్వబావ రీత్యా వాటాల పంపక నిర్ణయం జరుగుతుంది. వారిలో వారు ఇష్ట పూర్వకంగా చేసుకునే ఆస్తుల పంపిణీ విదానానికి ప్రబుత్వం

ముఖ్యమంత్రి గారి దెబ్బతో నోళ్లు తెరిచిన నాయకులు!

                                                                  సమైఖ్యాంద్ర కోసం సీమాంద్రా వారు ఉద్యమం మొదలుపెట్టి మొన్నట్టికి తొమ్మిది రోజులు అయింది. సరే ఆ ఉద్యమాన్ని తెలంగాణా నాయకులు పెట్టుబడి దారుల కల్పిత ఉద్యమంగా అభివర్ణించినా, కల్పిత ఉద్యమాలు అంత సీరియస్ గా ఉంటాయనుకోవటం సత్య దూరమే అవుతుంది . ఇక ఎక్కడ తెలంగాణా లో తమ పార్టీ ఇమేజ్ దెబ్బ తింటుందో అని గత్యంతరం లేని  అంగీకారాలు తెలిపిన అన్ని రాజకీయ పార్టీల హెడ్ లు పైకి మౌనంగా ఉన్నా, తమ సీమాంద్ర కాడర్ రంగంలోకి దిగి కేంద్ర ప్రబుత్వ ప్రకటనను ఖండిచటమే కాక,తాము సమైఖ్యాంద్రనే కోరుకుంటున్నామని చెపుతుంటే మౌన అంగీకారం తెల్పారు, తప్పా బయటకు వచ్చి ఒక స్పష్టమైన విదానం,తమ మనసులో ఉన్నది వెల్ల గ్రక్కలేకపోతున్నారు. మనసులో సమైక్యత పట్ల మక్కువ ఉన్నా, మాట తప్పమని,మడమ తిప్పమని,బింకాలు పోతూ యమ ఇబ్బందిగా పీలవుతున్నారు. వీరందరి మొహమాటాల ముఖం మీద చెళ్ళు మని కొట్టినట్లయింది, మొన్న ముఖ్యమంత్రి శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రెస్ మీట్.   నల్లారి గారు ముఖ్యమంత్రిగా పదవీ బాద్యతలు స్వీకరించిన తొలినాళ్లల్లో ఆయన గారు సోనియా గాందీ గారి పట్ల చూపే అత్య

అంద్రా వారికి కావలసింది నిజంగా ఐఖ్యతా, హైద్రబాదులో వాటానా?

                                                              అన్న దమ్ములు ఆస్తుల కోసం,హక్కుల కోసం విబేదించడంలో తప్పు లేదు. అసలు నన్నడిగితే,కుటుంబంలో అయినా,వ్యాపారంలో అయినా అరమరికలు లేకుండా ఎప్పటి కప్పుడు పద్దతి ప్రకారం లెఖ్కలు చూసుకుంటూ,నిర్మొహమాటంగ తప్పులు ఎత్తి చూపుతూ, వాటిని సరిచేసుకునే అన్న దమ్ములు కలకాలం కలిసి ఉండగలుగుతారు. ఇందులో వారి నిర్మొహమాటం,నిక్కచ్చితనం వల్ల ఎప్పటి కప్పుడు వారి మద్య అభి ప్ర్రయ బేదాలు తొలగిపోయి,ప్రశాంతంగా జీవించటానికి తోడ్పడుతుంది. అలా కాక అన్న మీద గౌరవం పేరుతో తప్పు జరుగుతున్నా తమ్ముళ్ళు ఏమి మాట్లాడక పోవడం, తాను చేసే దానికి తమ్ముళ్ళు ఏమి అనటం లేదు కాబట్టి వారి అనుమతి ఉన్నట్టు గా బావించి,అన్న తీసుకునే నిర్ణయాలు కుటుంభానికి నష్టం కలిగించి నప్పుడు,అప్పట్టి దాక బెల్లం కొట్టిన రాయిలా ఉన్న వారు, ఒక్కసారిగా అదేదో సినిమాలో హీరో అన్నట్లు "అంతా నువ్వే చేశావు" అని పెత్తనం చేసే వారిమీద విరుచుకు పడుతుంటారు. అదిగో అలాంటప్పుడే అప్పటి దాక ఎంతో ఆదర్శంగా పైకి కనిపించిన ఆ అన్న దమ్ములు ఒక్క దెబ్బతో విడి పోతారు. ఇక్కడ  కుటుంభ సబ్యుల అయిక్యతకు బంగం కలిగించే నిర్

అటు చైనా కి గాని ,ఇటు పాకిస్తాన్ కి గాని మన దేశం దేని తో సమానమో తెలుసా ?

                                                                            గడ్డి పోచతో ! ఎందుకంటే వారి ద్రుష్టిలో మనది  ఆఫ్ట్రాల్ అసమర్దుల కంట్రీ అని బావం కాబోలు. మన  పొరుగు దేశాలలో ఒకటైన చైనా మన కంటే జనాబా పరంగా యే కాక ఇతరత్రా కూడా  ముందున్న దేశం కావచ్చు . కాని అంతర్జాతీయ సూత్రాలను ఉల్లంగించి అప్పుడప్పుడు భారత  భూబాగంలోకి చొరబడటం ,అదేమిటని అడిగితే ఆ.... అదంతా ,అలవాటులో పొరపాటు అంటూ వెనక్కి పోవటం లాంటి తమాషాలు చేస్తుంది . ఇంకొక  పొరుగు దేశం పాకిస్తాన్ ,ఒక బుడత దేశం . భారతీయులు అందరూ గట్టిగా ఖాండ్రించి ఉమ్మితే ,  ఉమ్ముకే కొట్టుకు పోయే దేశం . అయినా సరే దానికి మన దేశం అన్నా , మన సైన్యం అన్నా లెక్క లేదు . కార్గిల్ యుద్దం జ్ఞాపకాలు మరవక ముందే మొన్న ఐదుగురు భారతీయ జవాన్లు మీద కాల్పులు జరిపి పొట్టన పెట్టుకున్నారు . అలా కాల్పులు జరిపింది పాకిస్తాన్ ఆర్మీ వారేనని మన సైన్యం రిపోర్ట్ ఇచ్చింది కూడా .   కానీ ఆశ్చర్యంగా ఘనత వహించిన మన రక్షణ మంత్రి గారు అలా కాల్పులు జరిపింది , పాకిస్తాన్ ఆర్మీ డ్రెస్ లో ఉన్న ఉగ్రవాదులు అని ప్రకటించి , పాకిస్తాన్ వారికి డిఫెన్స్  "లా" పాఇంట్ అందించ

భగవంతుడు ఇచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని చేజార్చుకుంటున్న "బడా స్టార్".

                                                                        దేవుడు ప్రతి మనిషికి జీవితంలో ఒకటో,రెండో అవకాశాలు ఇస్తాడట, తమ జీవితం సార్దకం చేసుకోవడానికి. అది గ్రహించి ఆ అవకాశాన్ని వినియోగించుకున్న వాడు చరిత్ర పురుషుడు అవుతాడు. వినియోగించుకోని వాడు సామాన్యుడిగానే మిగిలి పోతాడు. కాని ఆ అవకాశాన్ని దుర్వినియోగ  పరచిన వాడు మాత్రం తప్పకుండ చరిత్ర హీనుడవుతాడు.   మన తెలుగువారిలో నాకు తెలిసినంత వరకు అట్టి అవకాశాన్ని వినియోగించుకుని సఫలీక్రుతులైన వారు గౌరవనీయులు నందమూరి తారక రామరావు గారు . ఆంద్రుల అత్మ గౌరవ నినాదం తో, తెలుగు పతాకాన్ని జాతీయ స్తాయిలో రెపరెప లాడేలా చెయ్య గలిగిన వాడు తారక రామరావు. అప్పట్టిదాక సౌత్ ఇండియా అంటే డిల్లీ వారి ద్రుష్టిలో కేవళం "మద్రాసీ" మాత్రమే అనుకునే స్తాయి నుండి ఆంద్రా అనేది ఉన్నదని ఉత్తర బారతం వారికి తెలిసేలా చేసారు. గౌరవనియులు పి.వి. నరసింహా రావుగారు, ప్రదాన మంత్రిగా, గౌరవనీయులు రాజశెఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసినా , వారు డీల్లీ పాలకుల అనుమతానుసారమే చేసారు కాబట్టి , ప్రదమ తాంబూలం రామారావు గారికే దక్కుతుంది. ఇక చంద్ర బాబు నాయుడు గారు

రెండు కళ్ళ బాగు కోసం, ఉన్న గొంతు పోగొట్టుకున్న ఉత్తమయ్య!

                                                                                                                        ఈ రోజెందుకో ఒక కద చెపుదామనిపించింది. నాకు తోచిన కద చెపుతా,బాగున్నా లేకున్నా ఆసాంతం చదువుతారని ఆశిస్తున్నాను.   అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో  మోతుబరుల కుటుంబాలు ఉన్నాయి. అందులో ఉత్తమయ్య కుటుంబం కూడ ఒకటి.ఆయనకి ఇద్దరు కొడుకులు. ఆ ఇద్దరి కొడుకులుకి చెరో అయిదుగురు సంతానం వలన ,పిల్లా పీచు అంతా కలిసి ముప్పై మందితో ఉమ్మడి కుటుంబం అలరారుతూ ఉండేది. ఆ ఇంటిలో ఉత్తమయ్య మాటే వేదవాక్కు. ఆయన మాటను కాదనే దమ్ము ఎవరికీ లేదు. దానికి కారణం ఆయన వాయిస్ పవరే కాక సమయానుసారంగా ఆయన తీసుకునే నిర్ణయాలు సత్పలితాలు ఇస్తూ కుటుంబ అభివ్రుద్దికి తోడ్పడడమే.    ఆ ఊరీ కి ప్రెసిడెంట్ గా తొమ్మిదేళ్ళు పని చేసిన అనుభవం ఉంది ఉత్తమయ్యకు.ఆ ఊరిలో ఉన్న అందరితో మంచిగా ఉండే వారు ఉత్తమయ్య కుటుంబ సబ్యులు. ఇలా ఉండగా పంచాయితీ ఎన్నికలు వచ్చాయి. చిన్న కొడుకు కొడుకు ఒకడు వార్డు మెంబర్కి పోటి చేస్తానంటే ఒప్పుకోలేదు ఉత్తమయ్య. తర్వాత చేద్దువులే అన్నాడు. అంతే , వాడికి కోపం వచ్చింది. ఇంటి నుంచి వేరుగా వెళ్లి  పోయి తన పెళ్ళ

భారత దేశంలో ప్రియురాళ్ళకున్న పవర్ ఇల్లాలుకు ఉండదనుకుంటా!

                                                                                                                                 ఎందుకో ఈ రోజు నాకు మన రాజధాని మదిలో మెదిలింది. అటు తెలంగాణా వారికి ఇటు ఆంద్రావారికి ఈ నగరం మీద ఇంత ఎపెక్షన్ ఏమిటి అని ఆలోచిస్తే నాకు ఆ నగర పుట్టుక  కూడా ఒక కారణమా అనిపించించింది.నిజంగా తెలంగాణా వారిది హైద్రాబాద్. అది ఎవరూ కాదనలేరు. కాకపోతే గత అరవై సంవత్సరాలుగా ఆంద్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాల వారు అక్కడికి వచ్చి స్తిరపడ్డారు కాబట్టి, భారతీయులుగా వారికి హక్కు ఉంది కాబట్టి,హైద్రాబాద్ అందరిది అవుతుంది. ఇది పైకి కనిపించే కారణం. అసలు హైద్రాబాద్ కోసమ్ పేచి లేక పోతే ఈ ప్రత్యేక రాష్త్ర ఏర్పాటు సులువై ఉండేది.   హైద్రాబాద్ పుట్టిన విదానం పరిశిలిస్తే, అది ముస్లింల ప్రకారం "హైదర్" (సింహం) నివసించే ప్రాంతం అని అర్దమట. కాని కొందరి వాదన ప్రకారం అది భాగ్య నగరం అట. పోని ఆ పేరు ఏమన్నా బాగ్యం (సిరులు,సంపదలు) ఉన్న ప్రాంతం కాబట్టి ,అలా వచ్చిందా, అంటే అహ.. అలా కాదంట కులీ కుతుబ్ షాహ్ ప్రియురాలైన "భాగ్యమతి" అనే నాట్యకత్తె పేరు మీద ఈ నగర నిర్మాణం చేశారట