Posts

Showing posts with the label బౌద్ద సన్యాసినులు

మహాభారతం బుద్దుడి తర్వాత రాయబడితే, గోపికలు అందరూ వేశ్యలైన బౌద్ద సన్యాసినులేనా!

Image
                                                        హిందూ మతాన్ని ఏదో విదంగా ఇతర మతాల వారి ద్రుష్టిలో పలచన చేసే ఉద్దేశ్యంతోనే పన్కట్టుకుని ఎప్పుడో ఎవరో బౌద్ద మతాభిమాని చెప్పిన దానిని,తెలుగులోకి అనువదించి బ్లాగులో ప్రచురిస్తున్నారు.వారి ప్రకారం: - (1). బుద్ధ,ప్రతిబుద్ధ అనే మాటలు ఇతిహాసంలో తరచుదొర్లాయి. సంస్కృతంలో స్ధూప అనే అర్థం గల పదం ఎక్కువసార్లు కనిపించింది. దేశమంతా స్థూపాలతో నిండినట్లు గమనిస్తే బౌద్ధం తరువాతనే మహాభారత రచన సాగినట్లు తెలుస్తుంది. (2). కృష్ణుడుఒక పథకం ప్రకారం ద్వారకా నగరాన్ని రూపొందించాడని పురాణాలు చెపుతున్నాయి. హరివంశం ప్రకారంద్వారకలో వేలాది మంది స్త్రీలను వ్యభిచారంలో ఉన్నవారిని స్థిరపరిచారు. హరివంశం ప్రకారం ఆ స్త్రీలకు తగ్గట్లే పురుషుల్నీ, వసతి గృహాల్నీ తెరిపించాడు. ఆనాడు కృష్ణుడి సోదరుడు బలరాముడే పెద్ద తాగుబోతు. కల్లుముంత లేకుండా అతడు కనిపించేవాడు కాదు. అందుకే హరిప్రియ అని కల్లుకు మారుపేరు వచ్చింది. అక్కడ అన్ని రకాలైన మాంసభక్ష్యాలూ లభించేవి. కృష్ణుడు కూడా వాటిననుభవించే వాడు. మజుందార్ ద్వారకను గురించి రాస్తూ హరివంశం ప్రకారం యాదవులు ఈ