Posts

Showing posts with the label పేరంటాల పల్లి టూరిజం

"అందాల "పేరంటాల పల్లి " ని అదృశ్యం చేస్తున్న వారు రాక్షసులేనా ?

Image
                                                          పేరంటాల పల్లి ! ఖమ్మం జిల్లాకు ఉన్న ఏకైక అందమైన నదీ పరివాహక టూరిజం స్పాట్ . ఇక్కడకు నిత్యం అనేక వందల మంది రాష్ట్రం లోని వివిధ జిల్ల్లాల నుండి మాత్రమె కాక, పొరుగు రాష్ట్రాలనుండి కూడా  వచ్చి ఇక్కడి రమణీయ ప్రక్రుతి కి పరవశించి పోతుంటారు . అలా ఈ ప్రాంతం బోట్ టూరిజం కి ప్రసిద్ది గాంచింది . మరి అలాంటి ప్రాంతం ఇంకా కొద్ది రోజులలో అధికారికంగా సిమాంద్ర రాష్ట్ర ప్రాంతంలో కలిపివేయ్యడమే కాకుండా పూర్తిగా గోదావరి లో ముంచి వెయ్యడానికి "సోనియా సర్కార్" సిద్ద మయింది .      భద్రా చలం పరమ పుణ్య దామం . తెలంగాణ ప్రజలు రాముల వారిని తమ రాష్ట్రంలోనే ఉంచాలని , రాముల వారికి హైదరాబాద్ సంస్తానానికి ఉన్న చారిత్రిక నేపద్యం,రామాలయ సంప్రాదాయాల రిత్యా అది అనివార్యం కాబట్టి , కేవలం రామ క్షేత్ర్రాలు ను మాత్రమె తెలంగాణా లోని ఖమ్మం జిల్లాలో ఉంచి , మిగాతా ప్రాంతం అంతటిని "పోలవరం ముంపు ప్రాంతాలు" పేరుతొ సిమాంద్రా లో కలిపి వేస్తున్నారు . దిని కోసం ఆర్డినెన్స్ జారి చెయ్యటానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది . ప్రస్తుతం ఉన్న పరిస్తితిలో