Posts

Showing posts with the label మనవుతొ సంవాదమ్

నిజమైన బ్రాహ్మణుడెవ్వరు?మనవు - కాయ సంవాదం.

Image
       నేను ఈ బ్లాగ్ ని మొదలుపెట్టగనె మొదటగ స్పందించింది కాయ గారు. వారు నన్ను కొన్ని ప్రశ్నలు వేయడం నేను జవాబులు ఇవ్వడం జరిగింది. కాయ గారు కొంత చమత్కారంగ ప్రశ్నలు సందించినప్పట్టికి అవి చాల అర్థవంతమైనవి. వాటిని మీతో బాగస్వామ్యం చేసుకుందామనిపించి ప్రత్యకంగా టపా ప్రచురిస్తున్నాను."కాయ" గారికి ప్రత్యక దన్యవాదములతొ.........  కాయ 7 సెప్టెంబర్ 2012 10:31 సా మీరే మనువు అని ఎలా నమ్మాలి? నిజమైన మనుస్మృతి సెలవిస్తే అప్పుడు ఎవరైనా ఇటు చూస్తారు. ఇదొక్కటి చెప్పండి, మీ ప్రకారం, బ్రాహ్మణుడికి పుడితేనే బ్రాహ్మణుడట కదా!. ప్రత్యుత్తరం surya savarnika 8 సెప్టెంబర్ 2012 1:36 ఉ మనుస్మ్రుతి గురించి రాను రాను తెలియచెప్పుతాను.ప్రస్తుతం మీరు అడిగిన ప్రశ్నకు మాత్రమే బధులిస్తాను.మనుస్మ్రుతి కాలం నాటికి కుల వ్యవస్థ లేదు.అప్పటి సమాజం ప్రకారం జన్మనః జాయతె శూద్రః, సంస్కారత్ ద్విజ ఉచ్చయతే, వేదపతి బావేధ్ విప్రః, బ్రహ్మ జ్నానతి బ్రాహ్మణః అంటె ఒకరు జన్మం చేత శూద్రుడిగను,సంస్కారక్రియల చేత ద్విజుడిగను,వేదజ్నానం చేత విప్రుడిగను బ్రహ్మజ్నానం చేత,బ్రాహ్మణుడిగ గుర్తించబడ్దాదు.అంతే