Posts

Showing posts with the label "జై జగన్ "

'గోవిందా' అని అనాల్సిన చోట "జై జగన్ " అన్నందుకే ఇన్ని అనర్దాలా !?

                                                                                మనిషి అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ప్రపంచంలో  భగవంతున్ని విశ్వసించే వారు ఉండక పోవచ్చు . ఎన్నో సందర్బాలలో  చేతికందినట్టే అంది ,చివరి క్షణాలలో అవకాశాలు చేజారి పోతూ ఉంటాయి . దానినే మన పెద్దలు "చేతి కందిన ముద్ద  నోటి కందేదాక  గ్యారంటి లేదు " అని అంటుంటారు . అదిగో అటువంటి పరిస్తితులు ఎదురైనప్పుడే నాస్తికులు సైతం భగవంతున్ని నమ్మినట్లు చరిత్రలో ఉదాహరణలు కో కొల్లలు .        గత 5 ఏండ్లుగా మన రాష్ట్రంలో జరుగుతున్నా కొన్ని పరిణామాలు చూస్తుంటే దివంగత ముఖ్య మంత్రి శ్రీ రాజ శేఖర్ రెడ్డి గారి కుటుంబానికి ఏదో దైవ శాపం తగిలినట్లే అనిపిస్తుంది . నాకు బాగా గుర్తున్న సంఘటన ఏమిటంటే , అసెంబ్లీలో ముఖ్య మంత్రిగా రాజ శేఖర్ రెడ్డి గారు , ప్రతి పక్ష నాయకుడిగా చంద్ర బాబుగారు , తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామీ దేవాలయంలో జరుగుతున్నా అవక తవకలు గూర్చి సీరియస్ గా చర్చిస్తున్న సందర్బంలో , రాజశేఖర్ రెడ్డి గారు కొంత హేళన గా ప్రవర్తించడం చూసి , అగ్రహోదగ్రులు అయిన చంద్ర బాబు గారు "వెంకటేశ్వర స్వామి విషయంలో  హేళన చేసిన వ