Posts

Showing posts from 2017

గ్రంధాలు పట్టుకు తిరిగేవారు జ్ఞానులూ, ఆవు చుట్టూ తిరిగే వారు అజ్ఞానులా ?!!

Image
                                హిందూ జీవన విధానంలో భగవంతుని దర్శించి తద్వారా జీవన్ముక్తులు అయ్యే పద్ధతుల్లో ముక్యంగా 3 మార్గాలు ఉన్నాయి . (1). జ్ఞాన మార్గం (2) భక్తి మార్గం.3 కర్మమార్గం . సాంప్రదాయిక జ్ఞానమార్గంలో ఉన్నవారు ఎవరైనా ఒక గురువును ఆశ్రయించి , వేదోపనిషత్తుల ఇతర గ్రంధాలలోని   సారాంశం తెలుసుకోవడం ,ఆ గురువుగారు చెప్పిన విధానంలోనే భగవంతుణ్ణి దర్శించడం చేస్తుంటారు. వీరి దృష్టిలో దేవుడు వేరు . గురువు వేరు. దేవుడు గురించి తెలుసుకోవాలంటే గురుబోధలు ద్వారానే అది సాధ్యమవుతుoది తప్పా అన్యదా కాదు అనేది జ్ఞాన మార్గీయుల అభిప్రాయం లేక విశ్వాసం .                         ఇక భక్తి మార్గం లో భగవత్ దర్శనం చేసుకునే వారికి ఏ గ్రంధాలు లేక గురువులు తోనూ పని లేదు . వారికి అలౌకిక అనందం ఇచ్చేది ఏదైనా సరే దానిని భగవంతుణ్ణి గానే భావిస్తారు  . నిత్యం  తాము దేవుడు అని నమ్మడానికి వీరికి ఏ గ్రంద సారాంశం అక్కర్లేదు,గురు బోధలు అవసరం లేదు . తమ పెద్దలు పూజించే దేవుళ్ళు కావచ్చు, జీవితంలో ఏదో ఒక సమయం లో ఆపద ఏర్పడితే దాని నుంచి కాపాడినవాడు అని నమ్మిన  దేవుడు కావచు, చనిపోయిన మహాపురుషులు కావచ్చు,బ్రతికి

"గోపాలకుడు " ను కాదని "గొర్రె పాలకుడు "బిరుదు ధరించిన "కంచ ఐలయ్య షెప్పర్డ్ " చెప్పే ఐడియాలజీ వలన ఎవరికీ లాభం ??

Image
                                                                                                                                      భారత దేశం లో ఉన్న "కుల వ్యవస్థ " అనబడే విధానం ప్రపంచం లో ఏ దేశం లో లేకపోవచ్చు . మొదట్లో వృత్తుల ఆధారంగా నిర్ణయించబడిన కులాలు చివరకు రాను రాను జన్మతః నిర్ణయింపబడానికి కొంతమంది పండిత పుత్రులు కారణమయినప్పటికీ , అగ్రకులాలు ,నిమ్నకులాలు అని వర్గీకరించబడడానికి , పై కులాల  ఆధిపత్యం క్రింది కులాల వారి మీద  శతాబ్దాలుగా కొనసాగిస్తుండటానికి మాత్రం అన్ని కులాల వారి ప్రమేయం ఉంది. ప్రతి కులస్తుడు తనపై పెత్తనం చేయచూసే అగ్రకులస్తుడి అహకారం ని ప్రశ్నించే బదులు ,తనకంటే క్రింది కులం గా ఉన్నవారి మీదే తన ఆధిపత్య అహంకారాన్ని చెలాయించడానికే ఇష్టపడ్డారు కాబట్టే కులాహంకార దురాచారాం అన్ని వందల ఏండ్లుగా కొనసాగుతూ వస్తుంది. ఆఖరకు దళితులలో కూడా  ఈ జాడ్యం ఉన్నప్పుడు , తరతరాల నిమ్న కులాల వెనుకబాటు తనానికి  ఏ ఒక్క కులాన్నో టార్గెట్ చేసి నిందించడం ఎంతవరకు సమంజసం?        మొన్నీ మధ్య "కంచ ఐలయ్య " అనే ప్రొపెసర్ గారు ఒక పుస్తకం రాశారు. దాని పేరు "సా

క్రిస్టియన్ లు "మహా వ్పుష్కరాలకు" వెళ్ళవద్దు అన్న "కంచ ఐలయ్య " గారి మాటను అ మహా క్రిస్టియనే ఎందుకు పట్టించు కోలేదు. !!!?

Image
                                                                                                                            అయన గారి పేరు కంచ ఐలయ్య . ఇది హిందూ జీవన విదానం పాటించే తెలుగు వారి పేరు.కంపెనీకి ఒక బ్రాండ్ ఇమేజ్ లాగ  ఈ పేరు కి  తెలుగువారిలో ఒక ఇమేజ్ ఉంది. ఈయన గారు ఒక పుస్తకం రాసారు . దాని పేరు "నేనెట్ల హిందువు నైత"? . దానికి ఆయనకు జాతీయ స్తాయిలో పేరు వచ్చింది అంటే బహూశా హిందూ జీవన విదానం లో జీవిస్తూ , నేనెట్ల హిందువు నైత అని అనే వ్యక్తీ చెప్పినదేమిటొ చూద్దామనే కుతూహలంతో మేదావులు , సామాన్యులు అయన పుస్తకాన్ని చదవగా వచ్చిన పేరు అది. హిందూ అనేదే   లేకపోతే  "కంచ ఐలయ్య " గారికి అంత ఇమేజ్ ఉండెది కాదు. అంటే ఆయనకు పేరు రావడానికి  పరోక్షంగా హిందూ మతమే ఉపయోగపడింది అన్న మాట. హిందూ అనేది అన్ని మతాలూ వలనే ఒక మతం కాదని , అది ఒక ప్రత్యేక జీవన విదానం అని సుప్రీం కోర్టువారే చెప్పినప్పటికీ ,జ్ఞానం ఉండి సత్యం తెలుసుకోవడానికి  ఇష్టపడని  కంచ ఐలయ్య లాంటి లారు ఉద్దేశ్య పూర్వకంగానే హిందూ అంటె ఒక మతం అని చెప్పడం కోర్టు దిక్కారం క్రిందకే వస్తుంది.   ' [In our childhood]

వయసు కోరికలు తీరకుండా "మాత "లు గా మారితే , ఇలాంటి 'రోత' పనులే చేస్తారు. !!!

Image
                                                                                                                                                                                                         నేను ఇదే బ్లాగులో కొన్ని టపాలలో ఒక విషయం గురించి ప్రస్తావించడం జరిగింది. హిందూ అనేది ఒక మతం కాదని, అది ఒక జీవన విదానం అని , ఒక క్రమ పద్దతిలో , ప్రక్రుతి నిర్దేసించిన విదానం లో ఉంటుందని చెప్పడం జరిగింది. దానినే మన వాళ్ళు సింపుల్ గా "ఏ వయసులో ఆ ముచ్చట " అని చెప్పారు. దానిని మను ధర్మం చతుర్  ఆశ్రమ జీవన విదానం అంది. అవి (1). బ్రహ్మచర్యం (2). గృహస్తం (3) వానప్రస్తం (4). సన్యాసం . నిజానికి భారత దేశం లో ఐ క్రమబద్దమైన జీవన విదానం అనుసరిస్తే మనకు గురువులూ అవసరం లేదు, మాత లూ అవసరం లేదు. వానప్రస్తం లో ఉన్న మన పెద్దలే మనకు గురువులు మాతలు అవుతారు. సన్యాస ఆశ్రమం లో ఉన్న వారే మనకు పరమ పూజ్యులు అవుతారు.                                                                కాని మన పెద్దలు మనకు చెప్పిన జీవన విదానం వేరు. మనం అనుసరిస్తుంది వేరు. 60 యేండ్ల వాడు న చెప్పాల్సిన

దేవుడికి దగ్గరవుతారని చెప్పి,400 మంది శిష్యుల వ్రుషణాలను కోయించి వేసిన "వృషభ గురువు"!!!

Image
                       అతడొక గురువు. కాని అందరికి మల్లె అట్టాంటి ఇట్టాంటి మామూలు గురువు కాదు .ప్రపంచ వ్యాప్తంగా 50 మిలియన్ ల మంది అనుచరులు  ఉన్న "చార్మిషింగ్ గురు". అతడే "డేరా సచ్చా సౌదా "అనే మత సంస్త వ్యవస్తాపకుడు " గుర్మీత్ రాం రహీం సింగ్ ". ఇతడు  సిక్కు మతానికి వ్యతిరేకంగా అందరూ ఒకటే అనే కాన్సెప్ట్ తో మూడు మతాలకు సంబందించిన  పేరుతో ఉద్బవించిన ఒక సంచలన గురువు . పాలోయ ర్స్ సంఖ్యను  ను  బట్టి , గురువుల గొప్ప తన్నాన్ని నిర్ణయించాల్సి ఉంటే మాత్రం ఇతడు గొప్ప గురువే .కాని గురు భోదలు అనుసారం "గురు " పరిక్ష జరిపితే మాత్రం ఇతడు ఒక తిక్కల గురువు లేదా మానసిక సమస్యతో బాదపడుతున్న గురువు అని అనక తప్పదు .దానికి కారణం 2000 వ సంవత్సరం లో  అతడు చేసిన  ఒక "మహా పాప కార్యం ". అదేమిటో చూదాం .                                                                                 గుర్మిత్ రామ్ రహీం సింగ్ చేసే బోదలలో ప్రదానమైనది "దేవుడికి దగ్గర కావటం ఎలా "? .దీని కోసం అతడు సూచించిన మార్గం పురుషులు తమ వ్రుషణాలను ఆపరేషన్ ద్వారా తొలగించుకోవాలి

గణపతి పూజ నుండి ఘనపతి పూజ వరకు

Image
ఓ బొజ్జ గణపయ్య! నీ బంటు నేనయ్యా!           మా చిన్నతనంలో వినాయక చవితి వస్తుందంటే పిల్లల్లం మేము చాలా సంబరపడే వాళ్లం.నేను మా చెల్లెలు ఇద్దరంకలిసి పొద్దున్నే మా ఇంటి ఎదురుగా కొద్ది దూరంలో  ఉన్న ఎర్ర చెరువు కి వెళ్లి, అందులోనుంచి,చెరువు మట్టి ని తీసుకు వచ్చే వాళ్ల్లం. ఆ తర్వాత మా అమ్మ గారి సూచనలతో ఇద్దరం కలిసి గణపతి బొమ్మను తయారు చేసేవాళ్లం.అలాగే మా ఇంటి చుట్టు (మా ఇల్లు వూరికి దూరంగ మా చేలో ఉంది)ఉన్న రక రకాల పత్రి సేకరించే వాళ్లం.వాటిలో జిల్లేడు,దెవదారు,తంగేడు,సీతాపలం,వెలగ,రేగు,గన్నేరు ,ఉమ్మేత్త,మారేడు ,దానిమ్మ,మొదలైనవి ఉండేవి. ఆ తర్వాత మా అమ్మ గారు రక రకాల పిండి వంటలు ముక్యంగా వినాయకుడికి (మాకు కూడ)  ఇష్టమైన కుడుములు చేసి పూజకి అంతా సిద్దంచేసి ఉంచేవారు. మా నాన్న గారు పూజమంధిరంలో పటాలకు పూజ చేసి, మేము చేసిన గణపతిని ప్రతిష్తించి పూజ చేసేవారు.మేము పిల్లలం మా పుస్తకాల పైన  "శ్రీ " అని పసుపుతో రాసి పూజ దగ్గర పెట్టేవళ్లం. అలాగే మా నాన్న గారు మా వ్యాపార సంబందమైన పుస్తకాలను పెట్టె వారు. మా వ్యవసాయ పనిముట్లు అన్నిటి పైన కొంత పత్రిని ఉంచి పసుపు కుంకమతో బొట్లు పెట్టేవాళ్లమ్.      

డేటింగ్ లు చేసి మొగుళ్ళని ఎంపిక చేసుకుందాం అనే ఇండియన్ గర్ల్స్ కి చీటింగ్ కేసులే గతి!!?

Image
                                                                                                                                               ఒక పక్క ఆడ పిల్లల్లు, అమాయకంగా ఇండియా లో ప్రాశ్చ్చాత్య సంస్క్రుతి వచ్చిందని భ్రమపడి, మగవాళ్ళను నమ్మి  భయటకు వెళ్ళి దారుణంగా భంగ పడుతున్నారు. ఆ క్రమంలో మానం సంగతి సరే సరి కాని ప్రాణాలు కూడ దక్కేట్లు లేవు. పోని వీరి డేటింగ్ కార్య కలపాలకి ప్రబుత్వాలని రక్షణ అడుగుదామా అంటే, డేటింగ్ ని చట్ట బద్దం చేయరాయే! ఇప్పటికే "ఎయిడ్స్" ని ఎలా అరికట్టాల్రా నాయనా అని ప్రభుత్వాలు నిరోదులు పట్టుకుని తిరుగుతూ ప్రజల్ని బతిమాలుతున్నాయి. ఎందుకంటే మనది ప్రజాస్వామ్యం కదా! జ్ణానం కంటే ముందు వయసు వచ్చింది. దానికంటే ముందు కోరికలు గుర్రాలయినవి. ఆ గుర్రాలకు సాంప్రదయవాదులు పగ్గాలు వెయ్యాలని చూస్తుంటే "స్త్రీ వాదులు" పగ్గాలు వెయ్యడం దారుణం స్వేచ్చగా జూలు పట్టుకుని స్వారి చెయ్య మంటున్నారు. గుర్రాల్ని అదుపు ఎలా చెయ్యాలో తెలియని యువత స్వారి చేస్తే ఎమవుతుంది. ఇప్పుడు జరుగుతుందదే. ఈ సమాజం లోని నైతిక విలువలు నాశనం కావడం  విదేశి వ్యాపార వర్గాలకు అత్యవసరం. వా

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

Image
                                                                      Courtesy :From  Bapu Cartoons  మన పూర్వికులు చెప్పిన నీతి శాస్త్రాను సారం ఉత్తములైన భార్యా భర్తల  లక్షణాలు  క్రింది విదంగా ఉంటాయి . (1) శ్లో॥    కార్యేషు యోగీ, కరణేషు దక్షః          రూపేచ కృష్ణః క్షమయా తు రామః          భోజ్యేషు తృప్తః  సుఖదుఃఖ మిత్రం          షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః (ఉత్తమ భర్త  లక్షణాలు ) కార్యేషు యోగీ : పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి.   కరణేషు దక్షః  కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో  నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి.  రూపేచ కృష్ణః రూపంలో కృష్ణుని వలె ఉండాలి.  క్షమయా తు రామః ఓర్పులో రామునిలాగా ఉండాలి.   భోజ్యేషు తృప్తః భార్య వండినదాన్ని సంతృప్తిగా  భుజించాలి.   సుఖదుఃఖ మిత్రం  సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి. ఈ  ఈ ఆరు పనులు సక్రమంగా చేసే  పురుషుడు ఉత్తమ భర్త  కొనియాడబడతాడు. (2). శ్లో॥    కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ,          రూపేచ లక్ష్మీ, క్షమయా ధరిత్రీ,    

తప్పుడు కేసులు పెట్టమని భార్యలకు సలహా ఇచ్చే వారిని , చెప్పు తీసుకు కొట్టిన సుప్రీం కోర్టు అప్ ఇండియా !!!.

Image
                                                                    పెద్దమనిషి అనేవాడు ఎవడైనా, ఆలు మగల మద్య సమస్యలు వస్తే వాటిని సరిచేసి ,బుద్దిగా కాపురం చేసుకోండి అని చెపుతాడు . భార్యల తప్పు ఉంటే మందలింపులతో ,భర్తల తప్పు ఉంటే,అతన్ని  చెప్పు తో కొట్టి అయినా సరే సంసారాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేసేదే సాంప్రాదాయక "పెద్ద మనిషి తనం ". ఇటువంటి పెద్దమనిషి తనం మన పెద్దల్లో ఉండబట్టే మన కుటుంభ వ్యవస్థ ఇంతవరకూ అవిచ్చిన్నంగా కొనసాగుతూ వస్తుంది .ని   కాని ఎప్పుడైతే సాంప్రాదాయక పెద్ద మనిషి  స్తానే,స్త్రీ వాద   సంఘాలు,  గల్లి రాజకీయ నాయకులు ,లాయర్లు, పోలిసులు, కుటుంభ సమస్యల విషయంలో రంగ ప్రవేశం చేసారో,అప్పటి నుండి భారతీయ కుటుంభ వ్యవస్తకు బీటలు వారడం మొదలు అయిందని చెప్పవచ్చు. దానికి ఉతం ఇచ్చింది ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్షన్ 498 A.  ఈ సెక్షన్ క్రింద దాఖలైన కేసుల్లో నూటికి 95% కేసులు తప్పుడు కేసులుగా గుర్తించబడ్డాయి అంటే ,పైన చెప్పిన వారు కుటుంభ వ్యవస్థ విచ్చిన్నతకు ఎలా  పాల్పడుతున్నారొ అర్ధం అవుతుంది. ఇదే విషయం మీద సంపూర్ణ అవగాహన కొరకు మరియు సుప్రీం కోర్టు తీర్పు కొరకు  ఇంతకు ముంద

40 ఎకరాలు తీసుకున్న కొడుకులు నడి బజార్లో వదిలేస్తే , నీరు పోయని చెట్టు నీడనిచ్చింది !.

Image
                                                                                                              మన సమాజంలో తల్లి తండ్రుల పట్ల కొంత మంది పిల్లలు చూపుతున్న నిర్లక్ష్యం, అనాదరణకు ప్రతీక  పైన చిత్రం లో కనిపిస్తున్న మల్లారెడ్డి గారు. పండు ముదుసలి అయిన ఆయన నల్గొండ జిల్లాలోని శాలి గౌరారం మండలంలోని వల్లాల గ్రామ వాసి . ఒకప్పుడు బాగా బతికిన ఆసామీ . 40 ఎకరాల కామందు . అయితే ఏం ? ముసలి తనంలో ఒక చెట్టు నీడన బ్రకాల్సిన దౌర్బాగ్యపు పరిస్తితి. ఉన్న 40 ఎకరాలు 4 కొడుకులు తీసుకుని తండ్రి సంరక్షణను గాలికొదిలేశారు . భూములు తీసుకున్న కొడుకులకే పట్టనిది తమకేంటని కాబోలు , కడుపున పుట్టిన 3 కూతుళ్ళు ముఖం చాటేసి ఉంటారు . చివరకు తను ఏ నాడు నీరు పోయాక పోయినా , ఒక చెట్టు తన నీడలో ఆయనకు రక్షణఇచ్చింది .  మల్లా రెడ్డి గారు .  బిక్షాటన చేసి తన పొట్ట పోసుకునే శక్తి లేని పరిస్తితుల్లో చివరకు అధికారులను ఆశ్రయిస్తే విషయం వెలుగులోకి వచ్చింది .   నిజానికీ తల్లితండ్ర్లు, సీనియర్ సిటిజన్ల మెయింట్నెణ్స్ మరియు రక్షణ కోసం మన కేంద్ర ప్రభుత్వం వారుMaintenance and Welfare of Senior Citizens Act, 2007 అనే చట్ట

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

Image
                                       ప్రపంచం లో వెల్లివిరుస్తున్న  మై చాయిస్ కల్చర్ లో భాగం అయినటువంటి "సింగిల్ పేరెంట్ " సిస్టం ఇండియాలో  కూడా వ్యాప్తి చెందుతుంది అనడానికి  ఉదాహరణ  నటుడు తుషార్ కపూర్ తండ్రి అయిన  విధానం . సింగిల్ పేరెంట్ విధానం అంటే పుట్టిన పిల్ల లేక పిల్లవాడికి  తల్లితండ్రులు ఉండరు. తల్లి లేక తండ్రి మాత్రమే ఉంటారు. ఇదెలా అంటే పెండ్లి అంటే ఇష్టం లేని వారు, అపోజిట్ సెక్స్ మీద ఇంట్రస్ట్ లేనివారు , లెస్బియన్, గే సంబంధాలు పట్ల అనురక్తి కలవారు , తమలో సహజంగా కలిగే సంతాన వాంఛా , తద్వారా వంశాభివృద్ధి చేసుకోవాలనే కోరికను నెరవేర్చుకోవడానికి , ఆధునిక వైద్య శాస్త్రం అందించే సర్రోగసి లాంటి విధానాలు ను పాటించి  తల్లి లేక తండ్రిగా తమ పిల్లలను ఈ భూమి మీదకు తీసుకువస్తున్నారు. అలా సర్రోగసి విధానం ద్వారానే తనకు కొడుకు పుట్టాడని సంతోషంగా ట్విట్టర్ లో ప్రకటించాడు నటుడు నిర్మాత అయినా తుషార్ కపూర్ అనే బాలీవుడ్ నటుడు.   థి డర్టీ పిక్చర్ నిర్మాత అయినా శ్రీ తుషార్ కపూర్ ప్రముఖ బాలీవుడ్ నటుడు జీతెంద్ర , శోభా కపూర్ ల కుమారుడు. నిర్మాత ఏక్తా కపూర్ కు స్వయానా సోదరుడు . మరి మీకు 

బుర్ర లేని అధికారులను బోరు బావి ఆపరేషన్ కు పంపితే , 40 అడుగుల్లో ఉన్న చిన్నారిని 260 అడుగులకు పంపి చంపారట !!

Image
                                                                         తెలంగాణా రాష్ట్రం లోని రైతులకు తమ పొలాల్లో వేసుకున్న బోరు బావులు వ్యవసాయానికి   కావాల్సిన నీళ్లు ఇచ్చేవి కొన్ని అయితే , రైతుల కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించేవి మరి కొన్ని. అందులో చిన్నారి రైతు బిడ్డలను తమ పొట్టన పెట్టుకున్నప్పుడు ఆ రైతు కుటుంబాలు వారు పడే బాధ వర్ణనాతీతం. అదేమీ మాయో కానీ , బోరు బావుల్లో పడి ప్రాణాలు కోల్పోతున్న చిన్నారుల్లో ఎక్కువ శాతం గిరిజన  బిడ్డలే కావడం విచారించ దగిన విషయం.            మన శ్రీ హరి కోట నుంచి మన శాస్త్రజ్ఞులు అంతరిక్షం లోకి ఏక కాలం లో అనేక ఉపగ్రహాలను , ఎన్నో వేల  కిలోమీటర్లు దూరం లో ఉన్న నిర్ణిత కక్ష్యలలో  విజయవంతంగా ప్రవేశపెడుతూ  విదేశీయులను సైతం ఆశ్చర్యపరుస్తూ ఉంటె " ఔరా మన శాస్త్రజ్ఞులు ఇంతటి ప్రతిభావంతులా " అని సంభ్రమాశ్చార్యాలు పొందుతున్న మనం , కేవలం నలభై అడుగులలో ఉన్న బోరు బావిలోని పాపను  మూడురోజులు రేయిబవళ్ళు పని చేసి చివరకు పాపను ముక్కలు ముక్కలు చేసి బయటకు తీసిన అధికారులను చూసి నివ్వెర పోవాల్సి వస్తుంది.       ఇలా బోరు బావుల్లో పిల్లలు పడి  పోవడమనేది మన