Posts

Showing posts with the label జాస్మిన్ ఆత్మహత్య

షేక్ జాస్మిన్ ఆత్మహత్య , శ్రీ సాయి చావు కొచ్చ్చిందంట !!

Image
                                                                                                        పుణ్యానికి పొతే పాపం ఎదురైందంటారు చూసారా !. అదిగో అచ్చం అలాగే జరిగింది వేముల శ్రీ సాయి మరియు అతని స్నేహితుని విషయం లో . గుంటూరు జిల్లా , నిజాంపట్నం మండలం , మహమ్మదీయపాలెంలో జరిగిన ఈ యదార్థ  సంఘటన , అపోహ మనుషుల్ని ఎంత విచక్షణ హీనులుగా చేస్తుందో కళ్ళకు కట్టినట్లు చేస్తోంది. ఇక వివరాలలోకి వెళితే ,  మహమ్మదీయ పేటకు చెందిన షేక్ జాస్మిన్ కి 19 ఏండ్లు . కాలేజీలో చదువుకుంటుంది కాబోలు ఆమెకు ఎదో కలుగరాని కష్టం కలిగి , బ్రతికే దారి కానరాక ఉరేసుకుని చనిపోదామని నిర్ణయించుకుంది. అదే విషయం తన స్నేహితురాళ్లకు ఫోన్ చేసి కూడా చేప్పిందంట . ఆ తర్వాత ఉరివేసుకుంటుంటే దానిని గమనించిన 2 యువకులు వేముల శ్రీ సాయి మరియు అతని స్నేహితుడు జొన్నా పవన్ కుమార్ లు పెద్దగా కేకలు వేసి చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చ్హారు.     ఇక దానితో అక్కడకు చేరుకున్న మహమ్మదీయ పేటవాళ్ళు , అమ్మాయి ఉరి వేసుకుని ఉండడం, ఆ సమయం లో అక్కడే ఇద్దరు కుర్రాళ్ళు ఉండడం తో ఒక నిర్ణయానికి వచ్చేసారు . వారే అఘాయిత్యమో అమ్మాయి మీద చేస్తే , దాన