Posts

Showing posts from September, 2017

గ్రంధాలు పట్టుకు తిరిగేవారు జ్ఞానులూ, ఆవు చుట్టూ తిరిగే వారు అజ్ఞానులా ?!!

Image
                                హిందూ జీవన విధానంలో భగవంతుని దర్శించి తద్వారా జీవన్ముక్తులు అయ్యే పద్ధతుల్లో ముక్యంగా 3 మార్గాలు ఉన్నాయి . (1). జ్ఞాన మార్గం (2) భక్తి మార్గం.3 కర్మమార్గం . సాంప్రదాయిక జ్ఞానమార్గంలో ఉన్నవారు ఎవరైనా ఒక గురువును ఆశ్రయించి , వేదోపనిషత్తుల ఇతర గ్రంధాలలోని   సారాంశం తెలుసుకోవడం ,ఆ గురువుగారు చెప్పిన విధానంలోనే భగవంతుణ్ణి దర్శించడం చేస్తుంటారు. వీరి దృష్టిలో దేవుడు వేరు . గురువు వేరు. దేవుడు గురించి తెలుసుకోవాలంటే గురుబోధలు ద్వారానే అది సాధ్యమవుతుoది తప్పా అన్యదా కాదు అనేది జ్ఞాన మార్గీయుల అభిప్రాయం లేక విశ్వాసం .                         ఇక భక్తి మార్గం లో భగవత్ దర్శనం చేసుకునే వారికి ఏ గ్రంధాలు లేక గురువులు తోనూ పని లేదు . వారికి అలౌకిక అనందం ఇచ్చేది ఏదైనా సరే దానిని భగవంతుణ్ణి గానే భావిస్తారు  . నిత్యం  తాము దేవుడు అని నమ్మడానికి వీరికి ఏ గ్రంద సారాంశం అక్కర్లేదు,గురు బోధలు అవసరం లేదు . తమ పెద్దలు పూజించే దేవుళ్ళు కావచ్చు, జీవితంలో ఏదో ఒక సమయం లో ఆపద ఏర్పడితే దాని నుంచి కాపాడినవాడు అని నమ్మిన  దేవుడు కావచు, చనిపోయిన మహాపురుషులు కావచ్చు,బ్రతికి

"గోపాలకుడు " ను కాదని "గొర్రె పాలకుడు "బిరుదు ధరించిన "కంచ ఐలయ్య షెప్పర్డ్ " చెప్పే ఐడియాలజీ వలన ఎవరికీ లాభం ??

Image
                                                                                                                                      భారత దేశం లో ఉన్న "కుల వ్యవస్థ " అనబడే విధానం ప్రపంచం లో ఏ దేశం లో లేకపోవచ్చు . మొదట్లో వృత్తుల ఆధారంగా నిర్ణయించబడిన కులాలు చివరకు రాను రాను జన్మతః నిర్ణయింపబడానికి కొంతమంది పండిత పుత్రులు కారణమయినప్పటికీ , అగ్రకులాలు ,నిమ్నకులాలు అని వర్గీకరించబడడానికి , పై కులాల  ఆధిపత్యం క్రింది కులాల వారి మీద  శతాబ్దాలుగా కొనసాగిస్తుండటానికి మాత్రం అన్ని కులాల వారి ప్రమేయం ఉంది. ప్రతి కులస్తుడు తనపై పెత్తనం చేయచూసే అగ్రకులస్తుడి అహకారం ని ప్రశ్నించే బదులు ,తనకంటే క్రింది కులం గా ఉన్నవారి మీదే తన ఆధిపత్య అహంకారాన్ని చెలాయించడానికే ఇష్టపడ్డారు కాబట్టే కులాహంకార దురాచారాం అన్ని వందల ఏండ్లుగా కొనసాగుతూ వస్తుంది. ఆఖరకు దళితులలో కూడా  ఈ జాడ్యం ఉన్నప్పుడు , తరతరాల నిమ్న కులాల వెనుకబాటు తనానికి  ఏ ఒక్క కులాన్నో టార్గెట్ చేసి నిందించడం ఎంతవరకు సమంజసం?        మొన్నీ మధ్య "కంచ ఐలయ్య " అనే ప్రొపెసర్ గారు ఒక పుస్తకం రాశారు. దాని పేరు "సా

క్రిస్టియన్ లు "మహా వ్పుష్కరాలకు" వెళ్ళవద్దు అన్న "కంచ ఐలయ్య " గారి మాటను అ మహా క్రిస్టియనే ఎందుకు పట్టించు కోలేదు. !!!?

Image
                                                                                                                            అయన గారి పేరు కంచ ఐలయ్య . ఇది హిందూ జీవన విదానం పాటించే తెలుగు వారి పేరు.కంపెనీకి ఒక బ్రాండ్ ఇమేజ్ లాగ  ఈ పేరు కి  తెలుగువారిలో ఒక ఇమేజ్ ఉంది. ఈయన గారు ఒక పుస్తకం రాసారు . దాని పేరు "నేనెట్ల హిందువు నైత"? . దానికి ఆయనకు జాతీయ స్తాయిలో పేరు వచ్చింది అంటే బహూశా హిందూ జీవన విదానం లో జీవిస్తూ , నేనెట్ల హిందువు నైత అని అనే వ్యక్తీ చెప్పినదేమిటొ చూద్దామనే కుతూహలంతో మేదావులు , సామాన్యులు అయన పుస్తకాన్ని చదవగా వచ్చిన పేరు అది. హిందూ అనేదే   లేకపోతే  "కంచ ఐలయ్య " గారికి అంత ఇమేజ్ ఉండెది కాదు. అంటే ఆయనకు పేరు రావడానికి  పరోక్షంగా హిందూ మతమే ఉపయోగపడింది అన్న మాట. హిందూ అనేది అన్ని మతాలూ వలనే ఒక మతం కాదని , అది ఒక ప్రత్యేక జీవన విదానం అని సుప్రీం కోర్టువారే చెప్పినప్పటికీ ,జ్ఞానం ఉండి సత్యం తెలుసుకోవడానికి  ఇష్టపడని  కంచ ఐలయ్య లాంటి లారు ఉద్దేశ్య పూర్వకంగానే హిందూ అంటె ఒక మతం అని చెప్పడం కోర్టు దిక్కారం క్రిందకే వస్తుంది.   ' [In our childhood]

వయసు కోరికలు తీరకుండా "మాత "లు గా మారితే , ఇలాంటి 'రోత' పనులే చేస్తారు. !!!

Image
                                                                                                                                                                                                         నేను ఇదే బ్లాగులో కొన్ని టపాలలో ఒక విషయం గురించి ప్రస్తావించడం జరిగింది. హిందూ అనేది ఒక మతం కాదని, అది ఒక జీవన విదానం అని , ఒక క్రమ పద్దతిలో , ప్రక్రుతి నిర్దేసించిన విదానం లో ఉంటుందని చెప్పడం జరిగింది. దానినే మన వాళ్ళు సింపుల్ గా "ఏ వయసులో ఆ ముచ్చట " అని చెప్పారు. దానిని మను ధర్మం చతుర్  ఆశ్రమ జీవన విదానం అంది. అవి (1). బ్రహ్మచర్యం (2). గృహస్తం (3) వానప్రస్తం (4). సన్యాసం . నిజానికి భారత దేశం లో ఐ క్రమబద్దమైన జీవన విదానం అనుసరిస్తే మనకు గురువులూ అవసరం లేదు, మాత లూ అవసరం లేదు. వానప్రస్తం లో ఉన్న మన పెద్దలే మనకు గురువులు మాతలు అవుతారు. సన్యాస ఆశ్రమం లో ఉన్న వారే మనకు పరమ పూజ్యులు అవుతారు.                                                                కాని మన పెద్దలు మనకు చెప్పిన జీవన విదానం వేరు. మనం అనుసరిస్తుంది వేరు. 60 యేండ్ల వాడు న చెప్పాల్సిన