Posts

Showing posts from 2013

ఇప్పట్టి దాక "నిత్యానందిని " అయిన రంజిత ఇక నుంచి "మాతా ఆనందమయి " అట!.

                                                        ఆశ్రమం  అంటే అర్దం మారిపోయిన రోజులివి. హిందూ తాత్విక దృక్పదం లో ఆశ్రమ అంటే దశ అని అర్దం. ప్రతి వ్యక్తి  జీవితం లో నాలుగు దశ లు ఉంటాయని ఆ యా దశలలో నిర్వర్తించిన బాద్యతలు గురించి "మను ధర్మ"  శాస్త్రం లో విపులంగా చెప్పబడింది. దాని ప్రకారం హిందువు అయిన ప్రతి ఒక్కరు 4  ఆశ్రమం లలో  అంటే 4జీవన దశలో ఏదో ఒక ఆశ్రమం లో ఉన్న వారే. అలాగే "సంసారి కాని వారికి సన్యాసి అయ్యే అర్హత లేదు " దీని గురించి వివరం గా తెలుసుకోవాలంటే ( కోర్కేలు లేని సంసారి, కోర్కెలు ఉన్న సన్యాసి, ఇద్దరూ "హిందుత్వ"కు దూరంగా ఉన్న వారే. http://ssmanavu.blogspot.in/2013/07/blog-post_18.html ని క్లిక్ చేసి చూడండి)          అయితే ఈ కలి కాలం లో అన్నీ మారినట్లే ఆశ్రమ విదానాలు  మారాయి .  ఆశ్రమం అంటే పెండ్లి కాని సన్యాసులు ఉండే బోగలాలస మందిరాలు అనే అర్దం వచ్చేలా కొందరి వ్యవహార శైలి ఉంది. ఆ మద్య మీడియాలలో సంచలన వార్తలు కు కేంద్ర బిందువులు అయిన బెంగలోర్ లోని నిత్యానందుని ఆశ్రమం , అందులో తమిళ నటి రంజిత భక్తీ పారవశ్యం , ఇవ్వన్నీ సాంప్రదాయా హిం

'ప్రజా పతి ' అవుతాడేమోనని ఆశపడుతుంటే , పర్మనెంట్ పతి కావడానికే జీవిత కాలం సరిపోనట్లుంది!.

                                                        స్తిర చిత్తుడు కానివాడు ఏదీ సాదించలేడు. ఒక వ్యక్తీ యొక్క వైవాహిక జీవితం అతని పర్సనల్ మేటర్ కావచ్చు. కానీ కొన్ని వేల మందికి ఆరాద్య నీయుడు గా ఉన్న వాడు కొన్నిక్రమమైన  జీవన పద్దతులు అవలంబించవలసి ఉంది . తెలుగు సినీ అభిమానులలో ఒక అత్యున్నత స్తానం సంపాదించుకున్న ఒక  సినీ హీరో నిజ జీవితం లో మాత్రం చంచల మనస్తత్వం గలవాడిగా మిగిలి పోవటం విది లిఖితం . .   బార్యా భర్తల బందం అనేది జన్మ జన్మ ల బందం అని హిందువుల నమ్మఖ్ఖం. పెండ్లి చేసుకోవడానికి పూర్వమే అన్నీ ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకుని తన వాళ్లకు  నచ్చిన , తను మెచ్చిన అమ్మాయితో సంసార గృహంలోకి అడుగు పెడతాడు మగవాడు  . అలా మొదలైన వారి సంసారం ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని నిలబడి విజయం సాదిస్తుంది అంటే జీవిత బాగస్వామి మీద ప్రేమాభిమానాలు తో పాటు స్తిరమైన మనస్సు, సర్దుకు పోయే గుణం ఉండబట్టే ఇది సాద్యపడుతుంది. భారత దేశంలో ఇంచు మించు మెజార్టీ ప్రజలు అటువంటి నిబద్దతను కలిగి ఉంటున్నారు.     ముస్లిం లలో 4 గురు బార్యలను స్వికరించడానికి వారి పర్సనల్ చట్టాలు అనుమతిస్తున్న ఎవరూ ఆ పని చెయ

మగాడు మ్రుగాడిగా మారటానికి అతనిలోని "హార్మోన్ల ప్రబావం " కారణమా!?.

Image
                                                         ఈ విషయం గురించి పరిశోదించి చెప్పవలసింది శాస్త్రజ్ణులే. నాకు ఈ  ఆలోచన రావడానికి కారణం నిన్న ఒక ఆర్టికిల్ చదివాను అందులో చింపాజీలు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో లో గల "లో లాండ్" ఫారెస్ట్ లోని చింపాంజీ  ల మీద చేసిన పరిశోదనల్లో తేలిన సారాంశం ఏమిటంటే మామూలుగా చూడటానికి చింపాజీలు , బొనోబో లు ఒకే లాగా ఉన్నప్పటికి , వాటి ప్రవర్తనల్లో చాలా వైవిధ్య ముందట.    బొనోబో లు చింపాంజీలు కంటే ఎక్కువ శాంతంగా ఉంటూ ఆడ బొనోబోలతో సఖ్యంగా కలసి మెలసి ఉండటానికి ఇష్టపడతాయి అట. అలాగే యుక్తవయస్సు వచ్చే వరకు తల్లి తోనే ఉంటాయట. కానీ అదే చింపాజీలు విషయానికి వచ్చే సరికి అవి యుక్త వయస్సు రాక ముందే తోటి మగ చింపాంజీలతో కలసి ఆడ చింపాంజీల మీద ఆదిపత్యం చెలాయించడానికి పరస్పరం సహకరించుకుంటో ఉంటాయట. అదే విదంగా ఆడ చింపాంజీల మీద ఆదిపత్యం కోసం కూడా తరచూ ఘర్షణలు పడుతూ ఉంటాయట. అంటే ఇంచు మించు మనుషులుకు ఉండె బుద్ది  మాదిరే చింపాంజీలకు ఉందన్న మాట. ఇలా ఒకే జాతిలో ఈ  వైవిద్యం ఉండటానికి కారణం కేవలం వాటిలోని హార్మో

మన తెలుగు అమ్మాయిని మాయం చేసిన ఆ పంజాబీ అమ్మాయి ఎవరు ?!

నేను  ఈ బ్లాగు మొదలు పెట్టిన తొలి నాళ్లలో రాసిన టపా  ఇది. నాకు నచ్చిన టపాలలో ఇది ఒకటి . తప్పకుండా అందరికి  నచ్చుతుంది. అందుకే మరొక సారి రీ పబ్లిష్ చెస్తున్నాను. క్రింది లింక్ మిద క్లిక్ చెయ్యండి "మాయమైపోతున్న తెలుగు అమ్మాయి ని రక్షించండి"

R.K న్యూస్ చానల్ విషయం లో కూడా "మనవు" చెప్పిందే నిజమయింది!.

                                                                   నేను మొన్న 21 వ తారీఖున ఇదే బ్లాగులో R.K  న్యూస్ చానల్ వారి ఊదరగొట్టే ప్రసారాలను గూర్చి ఒక విషయం చెప్పడం జరిగింది. అదే నిజమని రుజువు చేసేలా నిన్న A.B.N  చానల్ వారు సదరు R.K  న్యూస్ చానల్  వారీ బ్లాక్మెయిలింగ్ ప్రసారాల తీరును విమర్శిస్తూ "చ.. చ.. చానల్  అనే పేరుతో ప్రసారం చేసిన కార్యక్రమం ద్వారా బహిర్గతమైంది.   నేను R.K  న్యూస్ చానల్ గురించి "న్యూస్ చానల్  వారు గత 3 రోజులుగా , ప్రముఖ ఆయుర్వేద వైద్యులు ఏల్చూరి గారి గురించి ఒక కదనం ప్రసారం చేస్తున్నారు. ఒక వేళా వైద్యానికి వచ్చే స్త్రీలతో , వైద్యశాలలో అయన అసబ్యంగా ప్రవర్తిస్తుంటే తగిన సాక్ష్యాదారాలతో చానల్ వారు సంబండిత వైద్య విభాగ అధికారులకు తెలియ చేసి అతని గుర్తింపు సర్టిపికేట్ ను రద్దు చేయించవచ్చు. అంతే కానీ వరుసగా చెప్పిందే చెప్పి ఊదరగొట్టడం లో అసలు ఉద్దేస్యం చానల్ రేటింగ్ కోసమైనా కావాలి, లేదా అది ఆపడానికి తగిన ప్రతిపలం కోసం ఆశిస్తూ అయినా ఉండాలి." అని చెప్పడం జరిగింది. పూర్తీ టపా కోసం ఈ  లింక్ ను క్లిక్ చేసి చూడవచ్చు (ఆ ఆయుర్వేద వైద్యుడి చేతిలో

దేనికైనా రెడీ యే అన్న ఈ 'భంబోళ జంభళ' కి బ్రాహ్మణుల శాపం తగిలినట్లుంది!.

                                                            గత సంవత్సరం విడుదలైన "దేనికైనా రెడీ" అనే సినిమా మంచు మోహన్ బాబు గారికి అచ్చి వచ్చినట్లు లేదు. ఆ సినిమా వలన లాభం  ఎంత వచ్చిందో కానీ , యావత్ ఆంద్రప్రదేశ్ లోని బ్రాహ్మణుల ఆగ్రహానికి మంచు వారి కుటుంభం గురి అయింది. ఆ సినిమాలో బ్రహ్మణులను కించపరచే సన్నివేశాలు ఉన్నాయని నిరసనలు తెలపడానికి వెళ్ళిన కొంతమంది బ్రాహ్మణ యువకులను మోహన్ బాబు తనయుడు తన అనుచరుల చేత తన్నిస్తే దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెలువెత్తాయి. అప్పుడే కొంతంది బ్రాహ్మణులు మోహన్ బాబు కుటుంబానికి శాపనార్దాలు పెట్టారు. మంత్రాలకు చింతకాయలు రాలకపోవచ్చు కానీ బ్రాహ్మణుల శాపాలకు లేదా వారి తరపున తీసుకున్న చట్టపరమైన చర్యలకు మోహన్ బాబు కు జాతీయ స్తాయిలో తీరని అవమానం జరిగింది.  జాతీయ అవార్డు అయిన పద్మశ్రీ  అనేది ఒక గౌరవ పుర్తస్కారమే తప్పా , టైటిల్  కాదని , కాబట్టి ఇన్విటేషన్  కార్డుల్లో కానీ, పోస్టర్స్ లో కానీ , బుక్స్ లో కానీ, ఇతర చొట్ల ఎక్కడైన కానీ పద్మశ్రీ అవార్డు గ్రహీతలు , తమ పేర్ల ముందు పద్మశ్రీ లను తగిలించి అదొక టైటిల్ లాగా వేయడం అనేది కేంద్ర ప్రభుత్

వందమంది దేవయాని లను వివస్త్ర లను చేసినా , అమెరికా అమెరికాయే, కాంట్రాక్ట్ కాంట్రాక్టే !

                                                         దేవయాని ! మన పురాణ గాధలలోని  రాక్షస గురువులు అయిన శుక్రాచార్యుల వారీ కుమార్తె పేరు అది. ఆ పేరును ముంబాయికి చేందిన I.A.S  ఆపిసర్ గారైన ఉత్తమ్  కోబ్రగాదె  గారు తన కుమార్తెకు పెట్టుకున్నారు. ఆ అమ్మాయే ఇప్పుడు బారత, అమెరికా మద్య చెలరేగిన దౌత్య సంబందాల వివాదాలకు కేంద్ర బిందువు.        దేవయాని కోబ్రగాదె  U.S  లోని న్యూ యార్క్ లో   భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో డిప్యూటి కాన్స్యుల్ జనరల్ గా పని చేస్తుంది. దేవయానీ పుట్టి , పెరిగిందీ ముంబై లోనే .  మరాఠీ తో పాటూ ఆమె ఇంగ్లీష్, హిందీ , జర్మనీ బాషలలో అసామాన్యమైన పట్తుందని అంటారు . సివిల్స్ రాసి ఐఎఎఫ్ అధికారిగా ఆమె భాద్యతలు చేపట్టింది 1999 లో . పాకిస్తాన్ , ఇటలీ , జర్మనీ దేశాల్లోని భారత రాయబార కేంద్రాల్లో పనిచేసారు .  . ఐఎఫ్ఎస్ అధికారిణి అయిన దేవయాని అమెరికాలోని భారత కాన్సులేట్ లో సహాయ అధికారి.  ఆమెకు వచ్చే జీతం భారతీయ కరెన్సీలో సుమారు 4 లక్షల రూపాయలు. తన ఇంట్లో పనులు చూసుకోడానికి ఆయాగా నియమించుకున్న మహిళకు ఆమె ఇవ్వాల్సిన జీతం అమెరికన్ నిబంధనల ప్రకారం అయితే అక్షరాలా 2.8

ఈడొచ్చినా యువరం లేనోళ్ళు , పదవి వచ్చినా లౌక్యం తెలియనోళ్ళు ,అచ్చంగా ఈయన లా ఉంటారు!.

                                                          డిల్లీ ప్రజలను చూసి దేశం లో చాలా మంది జాలి పడాల్సిన పరిస్తితి ఏర్పడింది. పాపం అదికారం లో కాంగ్రెస్ అవినీతి పాలనను , అసమర్ద పాలనను భరించలేక మెజార్టీ డిల్లి వాసులు B.J.P,కి AAP  (ఆం ఆద్మీ పార్టీ) కి వోట్లు వేసారు. దురదృష్ట వశ్శాత్తు కేవలం 4 సీట్ల తేడాతో B.J.P  వారు డిల్లి పీటాన్ని అదిష్టించే అవకాశాన్ని కోల్పోయారు.అలాగే AAP  వారు పాలనా  పాగాలు అందుకోవాలంటే కనీసం 8 సీట్లు కావాల్సి ఉంది. తమకు తగినన్ని సీట్లు రాలేదు కాబట్టి తాము పరిపాలనా బాద్యత స్వీకరించం అని ఎంతో అనుభవం ఉన్న నాయకులు కలిగిన B.J.P  పార్టీ స్పష్టంగా ప్రకటించింది. కాంగ్రెస్ వారు అధికారానికి అందనంత దూరం లో ఉన్నారు కాబట్టి , వారు దైర్యం చేసే అవకాశమే లేదు. ఇక పోతే మిగిల్ంది 28 సీట్లతో రెండవ పెద్ద పార్టీగా అవతరించిన AAP  వారు.   AAP  ఒక రాజకీయ పార్టీ కాదు కేవలం ఉద్యమ సంస్త అని ఆ పార్టి అద్యక్షుడు కేజ్రీవాల్ అనేక సందర్బాలలో చెప్పారు. మరి అటువంటప్పుడు ఎన్నికలలో నిలబడడం కూడదు అని 'అన్నా హజారే" గారు ఎంత చెప్పినా వినకుండా తగుదునమ్మా అంటూ పార్టీ ఏర్పాటు చేసి ఎన్ని

తెలంగాణా బిల్లు తో బట్టబయలు కానున్న కాంగ్రెస్ హై డ్రామా భండారం!

                                                                                                                         బ్రతకని బిడ్డ బారెడు అన్నట్లు , 2014 ఎన్నికల లోపు ఏదో విదంగా తెలంగాణా బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టి , ఆ తర్వాత ఏమి జరిగినా దాని బాద్యత అంతా ప్రతిపక్షం మీద నెట్టి ,తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం  కంకణం కట్టుకున్నప్పటికి, ప్రతి పక్షాల కుట్ర వల్లే అది సాధ్య పడలేదు అని చాటాలనుకుంటుంది,అదికార కాంగ్రెస్ పార్టీ . అసలు ముసాయిదా బిల్లును అసెంబ్లీకి పంపడం లో కేంద్ర హోం శాఖ ప్రదర్శించిన అతిఉత్సాహం చూస్తుంటే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ఎన్నికల లోపు సాద్యం కాదని కేంద్రం కూడా  ఒక ద్రుడాభిప్రాయానికి వచ్చే,నష్ట నివారణ కోసం డ్రామాలకు తేర తీసింది అని అనిపిస్తుంది. ఈ  విషయం మీద ఒక అవగాహనకు రాబట్టే B.J.P  పార్టీ సైతం తమ ప్రభుత్వం ఏర్పడ్డాకా , అటు సీమాంద్ర ,ఇటు తెలంగాణా ప్రజలకు సమన్యాయం కలిగేలా రాష్ట్ర విభజన చెయ్యటం జరుగుతుంది అని ప్రకటించింది.       G.O.M  కు A.G  ఇచ్చిన న్యాయ సలహా మేరకు 371 D  సవరణ లేకుండా తెలంగాణాకు 371 D  వర్తింప చెయ్యడం అసాద్యం. దాని కోసం 2/

దిగ్విజయి సింగ్ గారు తన "తోలి రేయి" కోసం కూడా ఇంత తొందర చేసి ఉండరు!

                                                            పాపం ఆ పెద్దమనిషికి తెలుగు వారు అంటే ఎంత ప్రేమ! ఎంత అపేక్ష! అందుకే తెలుగు వారిని రెండు రాష్ట్రాల ప్రజలుగా చూడాలని, ఈ  మద్య ప్రదేశ్  వీరుడు కంకణం కట్టుకుని , ఆ పనిలో యమ బిజీగా ఉన్నట్లు కనిపిస్తుంది .   ఈ  రోజునే ఆంద్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యయి. నిన్ననే రాష్ట్రపతి గారు తెలంగాణా విబజన ముసాయిదా  బిల్లును సంతకం చేసి రాష్ట్ర అసెంబ్లీకి పంపారు.దానిమీద అభిప్రాయాలూ పంపడానికి 40 రోజులు గడువు ఇచ్చారు. ఈ  లోపులో అసెంబ్లి అభిప్రాయాన్ని పంపవలసి ఉంటుంది . ఒక వేలా సీమాంద్ర నాయకులు ఏదైనా మతలబ్ చేసి కిరి కిరి పెడదామనుకున్నా, 40 రోజుల తర్వాత ముసాయిదా బిల్లు అసెంబ్లీ నుండి పంపినా ,  పంపకున్నా పార్లమెంట్ బిల్లును ఆమోదించవచ్చు. మరి ఇంత అధికారం కలిగిఉండి కూడా దిగ్విజయ్ సింగ్ గారు ఎందుకు నానా హంగామా చేస్తున్నాడో అర్దం కావటం లేదు.  ఈ  రోజు ప్రత్యేక విమానం లో బిల్లు ప్రతులను స్వయంగా హోంశాఖ కార్యదర్శి తీసుకు రావడం, దిగ్విజయ్ సింగ్ గారు ఈ  రోజే హైదరాబాద్ వచ్చి , ఈ  రోజే హైదరాబాద్ కు చేరిన బిల్లు గడువు 40 రోజులు ఉన్నపటికి, వెంటనే ఆమ

స్వలింగ సంపర్కులను సాచి కొట్టిన సుప్రీం !

                                                       గారాబం ఎక్కువైతే వెన్న కాల్చుకుని తింటాను అన్నాడట వెనుకటికి పిల్లోడు ఒకడు ! అలా ఉంది మన దేశం లోని కొంతమంది హక్కుల పోరాటాలు. మనం ఏది చేయ్యాలో ఏది చెయ్యకూడదో సాద్యమైనంత వరకు ప్రక్రుతి గురువులా అన్నీ చెపుతూనే ఉంటుంది. కాబట్టి ప్రకృతిని మించిన గురువు లేదు నేర్చుకునే శక్తి ఉంటే. ఇదే దత్తాత్రేయుల  వారి సిద్దాంతం.      మనుషులమైన మనం శక్తి కొరకు ఆహారం బుజించాలంటే నోటితోనే తినాలి. ఆ సౌలబ్యం కరువైన రోగులకు  సూదుల ద్వారా శక్తిని ద్రవ రూపంలో శరీరానికి అందిస్తారు. కానీ అన్నీ సక్రమంగా ఉన్న వారు నేను నోటి తో తినను , ఇంకా దేనితో అయినా తింటాను అంటే , నీ ఇంట్లో నువ్వు తిను , నీ చావు నీవు చావు అంటారు. అంతే కానీ నీవు చేసే పనిని కూడా  సమాజం ఆమోదించాలి, నిన్ను ఎవరూ తప్పు పట్టకూడదు అంటే ఎలా? అసహజమైన పని చెయ్యడాన్ని ఖండించే అధికారం సమాజం కి ఉంటుంది. నీవు చేసే పిచ్చి పనిని మరొకరు చేయకుండా ఉంటానికి అవసరమైతే , ఆ పనిని నేరం గా కూడా  ప్రకటించవచ్చు. అదే పని మన సమాజం స్వలింగ సంపర్కుల విషయం లో చేసింది. దీనికి కూడా  కొంత మంది మానసిక దుర్బలులు, విదేశి సంస్క్రు

పాతిక మందిలో లేని సమైక్యతా ,5 కోట్ల మందిలో ఉందనడం ఆత్మ వంచన కాదా ?

                                                            ఇన్నాళ్ళు సీమాంద్రా కాంగ్రెస్ వారందరూ సమైఖ్య వాదులని యావత్  భారత దేశ ప్రజలను  తమ మోసపు మాటలతో మబ్య పెడుతూ వస్తున్న , సీమాంద్రా కాంగ్రెస్ నాయకుల భండారం , నిన్నట్టి అవిశ్వాస తీర్మాన నోటిసుతో బట్ట బయలు అయింది. భారత పార్లమెంటులో సిమాంద్రా ప్రాంతం నుంఛి 25 పార్లమెంటు సీట్లు ఉంటే, తెలంగాణా నుంచి 17 సీట్లు ఉన్నాయి. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అనేది కేవలం రాజకీయ పరమైనది. దానికి ప్రజల మనోబావాలు తో పని లేదు . ఒకవేళా మెజార్టీ లేదా నిర్దిష్ట ప్రమాణాలు  తో కూడిన   ప్రజల మనోబావాలు పరిగణనలోకి తీసుకోవాలి అని రాజ్యాంగం లో పొందుపరచబడి ఉన్నట్లైతే , ఈ  రోజు తెలుగు ప్రజలు కు ఇన్నీ డ్రామాలు చూడాల్సిన అగత్యం ఉండేది కాదు. కానీ ఇటువంటి రోజు వస్తుందని ఆ నాటి రాజ్యాంగ నిర్మాతలు ఆలోచించి ఉండరు. ఈ  నాటి రాజ్యాంగ నిర్మాతలకు అంత ఆలోచనా చేసే బుద్దితో పాటు తీరిక కూడా లేదు. అందుకే సినిమాల్లో ఐటం  సాంగ్ లాగ తెలంగాణా అంశం కేంద్ర మంత్రి వర్గ తీర్మానాల్లో "టేబుల్ ఐటం " అయింది. దీనితో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కేవలం సోనియా గాందీగారి "బర్ట్ డే గిప

ఆమ్ ఆద్మీకి ఒక చొట అంటితే , కేజ్రీవాల్ లాంటి వారికి మూడు చోట్ల అంటుద్దట !

                                                            పదిమందిలోకి వచ్చాక పట్టు విడుపుల దోరణితో వ్యవహరించాలి. అలా పట్టు విడుపులు లేకుండా మంకు పట్టు కు పోయే వాడు ఏమి సాదించలేడు .అందుకే మన పెద్దలు ఒక మాట అంటూ ఉంటుంటారు. తెలివిలేనోడికి ఒక చోట అంటితే అతి తెలివి గలవాడికి మూడు  చోట్ల అంటుద్ది అని. ఈ  సూత్రం కేజ్రివాల్ కి వర్తిస్తుందా అని అనిపిస్తుంది అతని వ్యవహార శైలి చూస్తుంటే!   డిల్లీ రాష్ట్ర ఎన్నికలలో ప్రజలు ఎవరికీ స్పష్టమైన మెజారిటీ ఇవ్వక పోవడం ఒక గందరగోళ పరిస్తితిని సృష్టిస్తుంది . తాము కేజ్రీవాల్ కి మద్దతు ఇవ్వమని కాంగ్రెస్ అంటుంటుటే , తాము అటు కాంగ్రెస్ , ఇటు B.J.P  లకు సమాన దూరం లో ఉంటామని ఆంఆద్మీ పార్టీ అదినేత కేజ్రీవాల్ అంటున్నారు. ఈ దోరణీ గమనించి తాము ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దంగా లేమని అతి పెద్ద పార్టిగా ఆవిర్భవించిన B.J.P  అంటుంది. అంటే గవర్నర్ పాలన లో డిల్లీ ఉండబోతుందబ్న్న మాట! మరి డిల్లీ ప్రజలు తీర్పు దిక్కుమాలినదవుతుందా?   కేజ్రీవాల్ గారి ఆదర్శం అవినీతి నిర్మూలన . అటు కాంగ్రెస్ కానీ, ఇటు B.J.P  కానీ రెండో ఒక తాను లో ముక్కలే అని అయన గారి అభిప్రాయం. అందుకే ఆ ఇద్ద

కుహానా లౌకిక వాదాన్ని కూల్చివేస్తున్న భారతీయ యువత !

                                                    ఈ రోజు వెలువడుతున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికల పలితాలు సరళీ గమనిస్తుంటే ఒక విషయం  సష్టమవుతుంది. అబద్దాలతో అందరిని ఎల్లకాలం మోసం చెయ్యలేరు. అలాగే ఇన్నాళ్లు మత వాద పార్టీ అని ముద్ర వేసి B.J.P  ని కుహానా లౌకిక వాద కాంగ్రెస్ పార్టీ ప్రజలను మబ్య పెట్టి తన పబ్బం గడుపుకుంటూ  వచ్చింది. కానీ అసలు లౌకిక వాదం అంటే నీ,నా అనే బేద భావం లేకుండా అన్ని వర్గాల ప్రజలను దోపిడి చెయ్యడమే అనే ఒక కొత్త అర్దాన్ని అధికార కాంగ్రెస్ చెప్పింది. ఇన్నాళ్ళు ఈ   పార్టీ  ఆడింది ఆటగా , పాడింది పాటగా సాగటానికి కారణం కాంగ్రెస్కి సాంప్రాదాయంగా ఉన్న ఓటు బాంక్ . స్వాంతత్ర్యోద్యమం లో ఆ పార్టీ చేసిన కృషి తాలూకు పలితాన్ని నెహ్రూ కుటుంబం ఇన్నాళ్ళు అనుభవిస్తూ వస్తుంది. వృద్ద తరం లో ఆ పార్టీ పట్ల ఉన్నఅభిమానం  , నెహ్రూ కుటుంబం పట్ల ఆరాధనా బావం గా గా మారి ఆ కుటుంభ వారసులనే డిల్లీ గద్దె పైన కోర్చొబెడుతో వస్తున్నారు.    కాంగ్రెస్ పార్టీ ఒక్క చరిత్రను తర తరాలు కీర్తీంచేలా ఉండాలంటే స్వాతంత్ర్యం రాగానే ఆ పార్టీని రద్దు చెస్తే మంచిదని గాందీజి అభిప్రాయపడ్డారు. కానీ నెహ్రూ గారికి ఈ 

కోట్ల మంది ప్రజల కోరికను కాదని , అసద్దుద్దిన్ గారి కోరికను తీర్చు తుందా పిరోజ్ గాందీ గారి కోడలు!?

                                                             ఎంకి పెండ్లి సుబ్బి చావు కొచ్చిందట. అలా ఉంది ఈ  పిరోజ్ గాందీ గారో కోడలు వ్యవహరం. ఆవిడ గారీ పుట్టిన రోజు బహుమతిగా తెలంగాణా ఇచ్చేద్దామనే తలంపుతోనే హడావుడిగా అంత పెద్ద వ్యవహారాన్ని కూడా  ఒక "టేబుల్ ఐటం " గా మార్చివేసి కూరలు పంపకం లాగా పంచి వెస్తుంది.   అసలు రాయల తెలంగాణా ఎవరు అడిగారు? మొదట్నుంచి ఈ  ప్రతిపాదన చేస్తూ వచ్చింది హైద్రాబాద్లో తప్పా మరెక్కడా లేని MIM  పార్టీ అద్యక్షులు అసదుద్దీన్ ఒవైసీ . ఆ తర్వాత ఈ  ప్రతిపాదన  తమ ప్రాంతానికి లాభిస్తుందని సీమ లోని కర్నూల్, అనంతపురం నాయకులు 2 వ ఆప్షన్ గా డిమాండ్ చెయ్యడం ప్రారం బించారు. ఇక కేంద్రం లోని కోంతమంది పెద్దలు అయితే , ఎవరు రాష్ట్ర విబజన గురించి ప్రస్తావించినా "రాయల తెలంగాణా" గురించే అభిప్రాయాలు అడగటం మొదలు పెట్టారు. అటు సీమాంద్రా వారు కానీ, ఇటు తెలంగాణా వారు కానీ రాయల తెలంగాణా గురించి కలలోనైనా ఊహించని పరిణామం 4 నెలల క్రితం వరకు. మరి సుమారు 9 కోట్ల మంది ప్రజలు కోరుకొని దానిని , ఒక్క M.P  కోరుకున్న దానిని, ప్రజల మీద బలవంతంగా రుద్దడం వెనుకాల ఉన్న మతలబ్ ఏమి

N.T.R గారి జీవిత చరిత్ర రచన కు బయపడే K.C.R. గారి జీవిత చరిత్ర అయన కుమార్తె రాయాలనుకుంటుందా!?

                                                               ఎవరైనా  పేరు ప్రఖ్యాతులున్న పెద్దమనిషి గురించి జీవిత చరిత్ర రాస్తాను అనుమతించండి అని ఎవరైనా స్త్రీలు అంటే అనుమానంగా చూడాల్సిన పరిస్తితి  ఉందంటే ఆశ్చర్యం లేదు . అంతే కాదు టక్కున N.T.R  గారు  గుర్తుకు వస్తారు. కారణం  అయన జీవిత చరిత్ర రాస్తాను అని వచ్చిన ఒక మహిళ అయన జీవిత చరిత్రనే మార్చి వేసింది.ఆయనకే ఏకంగా బార్య అయింది. హిందూ జీవన విదాననికి కంకణ బద్దుడైన అయన , విది  లేని పరిస్తితుల్లో మూడవ దశ అయిన వాన ప్రస్తం నుండి రెండవ దశ అయిన "గ్రుహస్తం" లోకి రావాల్సి వచ్చింది. దాని తాలూకు ఎఫెక్టు అయన చనిపోయినా , అయన కుటుంబాన్ని వెంటాడుతూనే ఉంది. అటు కుటుంబపరం గానే కాక ఇటు రాజకీయ పరంగా కూడా , N.T.R  గారి రెండవ పెండ్లి తాలూకు  నీడలు ఆయన  కుటుంభ  సబ్యులను వెంటాడుతూనే ఉన్నాయి. కాబట్టి తెలుగు నాట రాజకీయ నేతల జీవిత చరిత్రను రాస్తామని ఎవరైనా స్త్రీలు అంటే సదరు రాజకీయ నాయకుల కుటుంభ సబ్యుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తడం ఖాయం.     అందుకే కాబోలు అటువంటి పరిస్తితి తమకు రాకూడదనే ముందు జాగర్తగా K.C.R  గారి కుటుంబం జాగర్త పడుతున్నట్లుంద

సచ్చినోడికి ..... చావు తెలివి ఎక్కువే!

                                                       అతనొక క్రైం రిపోర్టర్. క్రైం వార్తలు సేకరించి, సేకరించి ఈ  సమాజం లో క్రిమినల్స్ నేరాలు చేసి కూడా  చట్టానికి దొరకకుండా ఘరానా పెద్దమనుషులుగా ఎలా బ్రతకవచ్చో అవగతం చేసుకున్నాడు. అంతే ! చేస్తున్న రిపోర్టర్ పని మాని వేసి రెయల్టర్ అవతార మెట్టాడు. ప్రజల్ని వంచించి కోట్లు కూడబెట్టాడు . ప్రజలు అతని గురించి తెలుసుకోని కేసులు పెట్టేసరికి , ఆటను ఒక నీటి ప్రమాదంలో కొట్టుకుని పోయాడు . ఆ తర్వాత రెండేళ్ళకు మొన్న దివి నుంచి ఊడి పడినట్లు, విజయవాడలో ప్రత్యక్షమయ్యే సరికి , అతనిని గమనించిన బాదితులు పట్టుకుని పోలీసులకు అప్ప చెప్పారు. ఇప్పుడు అతన్ని విజయావాడ కోర్టు పోలిస్ కస్టడికి ఇచ్చింది. రేపట్నుంచి అయ్యగారి నుంచి,  పోలిసులు అసలు ఏమి జరిగిందో తెలుసుకోబోతున్నారు. కళ్ళు బైర్లు కమ్మే ఈ  క్రిమినల్ ఏ ప్లాన్ తో అటు ప్రజలను ఇటు పోలీసులను బురిడీ కొట్టించాడో చూడండి     అతని పేరు నార్ల వంశి క్రిష్ణ. పూర్వాశ్రమంలో అతనొక క్రైమ్ రిపోర్టర్. ఆతను క్రైమ్ రిపోర్టర్ గా కంటే క్రిమినల్ మైండ్ తోనే ఎక్కువుగా గడించవచ్చు అనిపించాక ,రియల్టర్గా అవతారమెత్తి , విజయవాడ పరిస

"మద్యం తాగుదాం , తాగి అన్నీ చేద్దాం పద" అన్నాడట! ఏమిచేయలెదని క్షమాపణ చెపితే వదిలేశారట!

Image
                                                        మన దేశం లో "నిర్భయ"  నిభందనలు వచ్చాక కూడా , రాకముందు చట్టం  ఎలా ఉందో , ఇప్పుడు అలాగే ఉందనుకుంటున్నారు కాబోలు కొంతమంది అధికారులు. అందుకే మొన్న పనాజీలో జరిగిన భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం లో ఒక డిప్యూటి డైరెక్టర్ గారు తానూ చేసిన సిగ్గుమాలిన పనికి క్షమాపణ లాంటిది  చెపితే ,O.K  అని కేసు క్లోజ్ అన్నారట! వివరాల్లోకి వెళితే :-    మొన్నీ మద్య గోవా లోని పనాజీలో జరిగిన అంతర్జాతీయ చలన చితోత్సవం లో ప్రోగ్రామర్  గా  పనిచెయ్యటానికి డిల్లీ J.N.T.U  కు చెందిన విద్యార్దిని  నియమితురాలైంది. ఆ అమ్మాయి ని ఒక డిప్యూటి డైరెక్టర్ గారు పని ఉంది రమ్మని తన కాబిన్ కి పిలిచాడట. ఏదో పని ఉందేమో కదా అని ఆ అమ్మాయి అక్కడికి వెళితే , " రా, రా, మద్యం తాగుదాం , అని  ఆఫర్ చేసాడట! దానికి ఆ అమ్మాయి ఇబ్బందిగా పిల్ అవుతుంటే , "తాగుదాం, తాగిన తర్వాత అన్నీ చేదాం " అని వెచ్చగా తన మనసులోని మాట చెప్పాడట. దానికి ఆ అమ్మాయి అభ్యంతరం చెపుతున్నా పదే పదే అదే కోరికను వెలిబుచ్చాడట. దానితో ఆ అమ్మాయి అక్కడి ఫెస్టివల్ ఆఫిసర్కి   The Sexual Harassm

"భారత రత్న" ఇచ్చి మరీ ఇడియట్స్ అయిపోయారు.

                                                           శ్రీ చింతామని నాగేశ రామచంద్ర రావు గారు. భారతీయ శాస్త్రవేత్త .బారత ప్రధాని శాస్త్ర విజ్ణాన  సలహాదారు సంఘం కి అదిపతి. ఆయనగారు రసాయన శాస్త్రం లో చేసిన కృషికి మెచ్చి, భారత ప్రభుత్వం ఆయనకి మొన్న "క్రికెట్ దిగ్గజం" సచిన్ టెండుల్కర్ గారితో పాటు అత్యంత ప్రతిష్టాత్మకమైన "భారత రత్న" బిరుదు ప్రదానం చేసి గౌరవించింది. దీనికి జాతి యావత్తు హర్ష్ంచింది. కానీ తనకు ఎవరైతే" భారత రత్న"  ఇచ్చి గౌరవించారో , అట్టి రాజకీయ నాయకుల ను అయన గారు తెల్లారే "ఇడియట్స్" అనే మకుటం తో గౌరవించి , వారి పట్ల తనకున్న కసినంతా తీర్చుకున్నారు. ఇది నిజంగా విచారించవలసిన విషయం.    ప్రభుత్వం అంటే రాజకీయ నాయకులు అధిపతులుగా వారి పర్యవేక్షణ లో నడిచేది. రావుగారు సాక్షాత్తు ప్రధాన మంత్రి గారి శాస్త్ర విజ్ణాన సలహాదారు సంఘం కి హెడ్ . ఆయనగారికి ప్రధాన మంత్రి గారితో ఎంతో సన్నిహిత సంబందాలు ఉంటాయి. ఒక వేళ సైన్స్ అభివృద్దికి తక్కువ నిధులు కేటాయిస్తుంటే, అయన గారు ఆ  విషయం ప్రధాన మంత్రి గారితో  చెప్పవచ్చు. నిధులు ఎక్కువ కేటాయించేలా చేయవచ్

జాతికి ద్రోహం చేసిన వాడికి జాతీయ స్తాయిలో "ఉత్తముడు " అవార్డా!?

                                                                                                               మాతృదేవో భవ! పితృదేవో భవ! ఆచార్య దేవో భవ!  అన్నారు పెద్దలు. అంటే ప్రతివారికి కనిపించే దేవతలు వరుసగా తల్లి,తండ్రి, గురువు. ఈ  విదంగా కనిపెంచిన తల్లి తండ్రులుతో పాటు విద్యాబుద్దులు నేర్పి మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన గురువును దేవుడుగా బావించటం మన సాంప్రదాయక విదానం. అటువంటి గురువులలో ఉత్తములైన వారిని జిల్లా , రాష్ట్ర ,జాతీయా స్తాయిలో గుర్తించి వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు "ఉత్తమ ఉపాద్యాయుడు " బిరుదులను ప్రదానం చేస్తుంటాయి. జాతీయ స్తాయిలో ఈ  అవార్డు రావాలంటే అట్టి ఉపాద్యాయుల సర్వీస్ రికార్డులు క్లీన్ గా ఉండాలి. కానీ మద్యాహ్న బోజన పధకం లో పిల్లల బోజనాలకు కేటాయించిన సొమ్మును బోంచేసిన ఉపాద్యాయుడుకు ఏకంగా  జాతీయ స్తాయిలో ఉత్తమ ఉపాద్యాయుడు అవార్డు ఇచ్చారంటే "జాతీయ అవార్డుల " ప్రక్రియ  ఎంత లోపభూఇష్టంగా ఉందో అర్దమవుతుంది.   అయన ఒక ఉపాద్యాయు డు. పేరు శ్రీనివాస రావు. ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం మిట్టగోడెం గ్రామం లో 1989 లో S.G.T  గా ఉపాద్యాయ వ్రుత్

పాపి కొండలు యాత్రను "రంకు టూరిజం" గా మార్చిన రాజమండ్రి బోట్ ఆపరేటర్లను నిరోదించలేని సీమాంద్రులకు "భద్రాచలం " కోరే నైతిక అర్హత ఉందా?

Image
                                                                                                                           భద్రాచలం పరమ పుణ్య గోదావరీ తీర దామం. అక్కడికి భక్తులు రోజూ  వేల మంది వస్తుంటారు. అక్కడికి వచ్చే వారందరికి ఒకటే బావం . అలౌకిక ఆద్యాత్మిక బావం. దండకారణ్య పచ్చని ప్రకృతి ఒడిలో విలసిల్లిన భద్రాచల  క్షేత్రం  భక్తులకు ఆద్యాత్మికతో కూడిన ఆహ్లాద బావనలు కల్గించడంతో పునీతమవుతుంది. ఇక్కడికి దగ్గరలోనే ఉన్న "పర్ణ శాల" గోదావరీ ఒడ్డున ఉండటమే కాక, అకడి సహజ ప్రక్రుతి అందాలతో భక్త గణానికి ఆద్యాత్మిక ఆనందంతో పాటు మానసిక ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటుంది. రామాయణ కాలంలో రాములు వారు సీతా లక్ష్మణ సమేతంగా అరణ్యవాసం గడిపిన ప్రాంతంగా ఈ  ప్రాంతం యావత్ ప్రపంచం లోనే ఒక విశిష్ట ఆద్యాత్మిక క్షేత్రంగా బాసిల్లుతుంది.     భద్రాచలం ఆంద్ర ప్రదేశ్   లోని ఖమ్మం జిల్లా లో ఉంది. ఈ  ప్రాంతం ఏజెన్సి ప్రాంతం. ఇక్కడి గిరిజన సంస్క్రుతి నేపద్యం కూడా ఈ  క్షేత్రానికి  ఒక ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తుంది. ఇక్కడ నుండి కూనవరం వరకు రోడ్డు  మార్గం , అక్కడి నుండి   గోదావరి నది లో బోట్ ప్రయాణం ద్వారా ఖమ్మ

అత్యాచారాన్నీ ఆపలేకపోతే ఆనందించేయి ! అవినీతిని ఆపలేకపొతే అందలం ఎక్కించేయి !

                                                    రాజనీతి శాస్త్రం లో ఒక వాదం ఉంది . దాని పేరే ఉపయోగితా వాదం లేదా "అత్యంత ఆనంద మయ " వాదం . దీనిని ఆంగ్ల రాజనీతిజ్ణుడు అయిన "బెందాం " అనే అయన ప్రతి పాదించాడు. అయన ద్రుష్టిలో సహజ న్యాయాలు , సహజ హక్కులు అనేవి పనికి రానివి. ఏ విషయాన్ని అయినా అది కలిగించే ఆనందం , బాదల స్తాయి ద్వారానే అంచనా వేసి నిర్దారించాలంటాడు. దాని ప్రకారమే చట్ట సవరణలు కావాలన్నాడు. దీనికి ఒక ఉదాహరణ చూదాం .                    ఒక వ్యక్తీ వేరే వ్యక్తీ అంగీకారం లేకుండా బలవంతంగా  అతని నోట్లో స్వీట్ పెట్టాడనుకోండి . దాని వలన ఆ స్విట్ తిన్న వ్యక్తికి  షుగర్ వ్యాది లేనపుడు ఏమి నష్టం? ఒక మధుర పదార్దం ఆస్వాదించడం అనేదేగా జరిగింది! మరి దీనికి ఆ స్విట్ పెట్టిన వ్యక్తిని కఠినంగా శిక్షించటం సబబా? ఇదీ అయన సిద్దాంత సారాంశం. ఎక్కువు ఆనందం, తక్కువ బాద కలిగించేవి 'మంచి పనులు ', తక్కువ ఆనందం , ఎక్కువ బాద  కలిగించేవే "దుష్ట కార్యాలు" అంటాడు. కాబట్టి ఈ  సిద్దాంతం ప్రకారం పై ఉదాహరణలో చెప్పింది మంచి పనే తప్పా , చెడు పని కాదు అన్నమాట. సహజ హక్కులు, సహ

పనుల కోసం "లాడ్జ్ రూం " లకు వెళ్ళే స్త్రీల పట్ల సుప్రీం కోర్ట్ జడ్జి లకైన "అదే బావం" ఉంటుందని తెలియ చేస్తున్న "స్టెల్లా జేమ్స్ " గారి స్వీయ అనుభవం

                                                       ఈ  ఉదంతం లో  నిజమెంతో , అబద్దమెంతో మనకు తెలియదు. ఆరోపణలు చేసింది ఇటీవలే న్యాయవాద పట్టా  తీసుకుని సుప్రీం కోర్టులో ప్రాక్టిస్ మొదలెట్టిన మహిళా న్యాయవాది స్టెల్లా జేమ్స్ అనే ఆవిడ. ఆరోపణలు చేయబడిన వ్యక్తీ సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి . అందుకే దీనికి పెద్ద పబ్లిసిటి వచ్చింది. ఇక వివరాలు లోకి వెళితే:-   స్టెల్లా జేమ్స్ గారు గత ఏడాది న్యాయ విద్య ఆఖరు సంత్సరం చదువుతూ , కోర్సులో బాగంగా ఒక సుప్రీం కోర్టు జుడ్జ్ గారి దగ్గర 6 నెలలు శిక్షణ తీసుకున్నదట. పోయిన డిసెంబర్ 24 వ తారీకున డిల్లీ లో నిర్భయ ఆందోళనలు జరుగుతున్న వేళ, ఆవిడగారు అయన గారు బస చేసిన హోటల్ రూం  కి వెల్లిందట . రూం  కి వెళ్ళటానికి ఆమె చెపుతున్న కారణం, నిర్భయ కేసులో సదరు జడ్జ్ గారి సహాయం కోసమట. అదే కొంచం అనుమానం అనిపిస్తుంది. ఎందుకంటే సంఘటన జరిగిన 11 నెలల తర్వాత ఆమె విషయ బహిర్గతం చేసింది మరి. సరే ఆమె కారణమేదైనా ఆమె వెళ్ళింది జడ్జ్ గారి ఇంటికో ఆఫిసుకో కాదు . ఆయన ఉన్న హోటల్ రూం  కి. అక్కడ అయన ఆమె కోరిన సహయం చేయటం సంగతి అటుంచి ఆమె పట్ల అసబ్యంగా ప్రవర్తించాడట. ఆ దెబ్బతో ఖిన్

నా తెలంగాణా , భద్రాచలం ,మునగాల గాయాల వీణా !

                                                    నా తెలంగాణా కోటి రత్నాల వీణ ! అన్నారు దాశరదీ . ఆ మకుటం మీద ఎంతో మంది కవితలు అల్లారు. పద్యాలు పాడారు. చివరకు మన బ్లాగర్లు కూడా ఆ పేరుతొ  బ్లాగులు ఓపెన్ చేసి తమ పద్య పాటవాన్ని ప్రదర్సిస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ ఈ  మద్య  ఆంటొణి కమిటీ సోనియమ్మకు సమర్పించిన నివేదిక కానీ , సీమాంద్ర కేంద్ర మంత్రుల కోరికల చిట్టా కానీ , చివరకు సమైఖ్య వాది  ముఖ్యమంత్రి గారు పంపిన రాష్ట్ర నివేదిక కానీ తెలియ చేసేది ఏమిటంటే ,ఖమ్మం జిల్లాలోని భద్రాచలం , నూగుర్ మండలాలు, నల్గొండ జిల్లాలోని మునగాల మండలం గ్రామాలు కేవలం పరిపాలనా సౌలబ్యం కొరకు 1956 తర్వాత తెలంగాణా ప్రాంతాలలో కలిపారు కాబట్టి , గతం లో తెలంగాణా వారు కోరుకుంది కూడా  1956 ముందు తెలంగానే కాబట్టి , రూలు ప్రకారం ఆ ప్రాంతాలను సీమంద్ర లో కలపాల్సి ఉంటుంది అని .    ఇదే జరిగితే తెలంగాణా తల్లికి కి రెండు పెద్ద గాయాలు అవటం ఖాయం. ఒకటి ఖమ్మం జిల్లా లో భద్రాచలం వద్ద అయితే , రెండోది నల్గొండ జిల్లాలో మునగాల వద్ద . ఎవరైనా డాక్టర్, రోగి అవసరాన్ని బట్టి ఆపరేషన్ చేస్తాడు . కవల పిల్లలకు ఆపరేషన్ చేసి జాగర్తగా పిల్లల

టి.వి. రాములమ్మ, తీన్మార్ మల్లన్న ప్రోగ్రామ్ లు తప్పా , తెలంగాణా వారికి మిగిలేది ఏమి లేనట్లుంది!

                                                           ఈ  మద్య తెలంగాణా కాంగ్రెస్ వారు తెలంగాణా వచ్చేసిందని సోనీయమ్మను కీర్తిస్తూ ఉరూరా సంబురాలు చేసుకుంటునారు. వారి ప్రదాన ఉద్దేశ్యం తెలంగాణా వచ్చిందని చాటడం కాదు, తెలంగాణ ఇచ్చింది తమ నాయకురాలు సోనియా గాందీ యే తప్పా అందులో T.R.S  వారి ఘనత ఏమి లేదని చెప్పడమే. సరే బాగానే ఉంది. తెలంగాణా ఇచ్చింది ఎవరు , తెచ్చింది ఎవరు అనే విషయాన్ని తెలంగాణ ప్రజలు 2014 లో తేలుస్తారు కానీ, అసలు పదేళ్ళు పైనా పోరాడి సాదించమంటున్న "తెలంగాణా రాష్ట్రం " వలన తెలంగాణా ప్రజలకు ఎక్కువ లాభిస్తుందా? సీమాంద్రా ప్రజలకు ఎక్కువ లాభిస్తుందా ఒక సారీ చూదాం .      నిన్న మన ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక మాటన్నారు      " తెలంగాణ రాష్ట్రం " ఏర్పాటు వలన సీమాంద్రుల కంటే తెలంగాణ వారే ఎక్కువ నష్టపోతారు". అలాగే డిల్లీలో దిగ్విజయ్ సింగ్ గారు కూడా  ఒక విలువైన మాట చెప్పారు . " తెలంగాణా కోరుకున్నందుకు తెలంగాణా ప్రజలు పదేళ్ళ తర్వాత పశ్చాతాపపడతారు . నాకు వ్యక్తిగతంగా ఇష్టం లేక పోయినా పార్టి నిర్ణయానికి తల వంచక తప్పటం లేదు."    ప

నాగు పాము మహిమలను స్వయంగా వీక్షించిన మా తల్ల్లి తండ్రులు

Image
                                                                                                                    నాగు పాములకు ఎటువంటి విశిశ్టతలు ఉండవు, అది ఒక విష జీవి అంటారు. ఒక వేళ నేను ఎప్పుడూ అబద్దం ఆడటం ఎరుగని మా తల్లితండ్రుల ద్వారా వారి స్వానుభవాలు విని ఉండక పోతే నేను అలాగే అనుకుని ఉండేవాడినేమో! ఏది ఏమైనా నాగు పాములు కి మన తెలుగు జాతికి ఒక అవినాబావ సంబందం ఉంది. మనం   నాగజాతికి చెందిన వారం అని చెపుతారు. అలాగే మన దేవదేవుల్లైన విష్ణువు, శివుడు ఇద్దరికీ నాగ దేవత, ఆదిశేషుడు ఎప్పుడూ  అంటిపెట్టుకుని ఉంటూ ఆరాద్య దైవలలో ఒక రయ్యారు. అందుకే తెలిసిన వారెవరూ నాగు పాములను హీంసించటానికి కానీ, చంపటానికి కానీ ఇష్ట పడరు. పైగా దీపావళీ వెళ్ళిన నాలుగవ రోజును "నాగుల చవితి" గా నిర్ణయించి ఆ రోజు తెలుగింటి ఆడపడచులు ఆ నాగేంద్రుని బక్తిశ్రద్దలతో కొలచి , నాగ జాతి  పట్ల తెలుగు జాతికి ఉన్న భక్తీ పరంపర ను చాటుకుంటారు .     ఈ  రోజు  నాగ చతుర్దీ. మనవు  తెలుగు బ్లాగు మిత్రులకు, వీక్షకులకు , అగ్గ్రిగ్రేటర్లకు నాగుల చవితి పండగ శుభాకాంక్షలు తెలియ చేస్తూ, నాగేంద్రుని మహిమలు గురించి గతం లో పోస్ట్

బాయ్ ఫ్రెండ్ తో కలసి ఎగిరే "తారాజువ్వలు" చూద్దామని ఏకాంతానికి వెళితే , అక్కడున్న కీచకులు "చుక్కలు" చూపించబోయారట!

                                                         మళ్లి  అలాంటి  సంఘటనే హైదరాబాద్ లో జరిగింది. కాకపొతే ఇందులో మృగాళ్ళ పాత్ర దారులు దేశాన్ని రక్షించాల్సిన సైనికులు . వాళ్లకి రోజూ  క్రమశిక్షణ తో కూడిన సైనిక వ్యాయామం తో పాటు , నిబందనలు ఉంటాయి. వాటిని ఉల్లంఘిoస్తే కఠిన శిక్షలూ ఉంటాయి. అయినా సరే కట్టు తప్పారు . బాయ్ఫ్రెండ్ తో ఏకాంతం లో ఉన్న ఆ అమ్మాయిని పట్టుకుని అత్యాచారం చేయ బోయారట. చివరకు "నిర్భయ" చట్టం క్రింద బుక్కయారు.    వివరం గా విషయO  ఏమిటంటే ఆ అమ్మాయి వయసు పదిహేడేళ్ళు. ఇంటర్ చదువుతుంది. దీపావళి రోజున అందరు ఆనందంగా పండగ చేసుకునే సమయం లో ఈమెకు బాయ్ ప్రెండ్ తో కలసి గుడి కి వెలదామనిపించిందట. సరే డిగ్రీ చదువుతున్న అతనితో కల్సి మహేంద్ర గిరి లోని సాయి బాబా గుడికి వెల్లింది. ఆ బాబాకి మొక్కి ఆశీ ర్వాదాలు పొందాక , అప్పటికే రాత్రి అయి నగరం అంతా "బాణా సంచాలు" కాలుస్తున్నట్లుంది , తారాజువ్వలు వెలుగులు జిమ్ముతూ, ఆకాశం లోకి దూసుకు వెళుతుంటే , "అబ్బా"  ఎంత కమనీయ దృశ్యం, ఈ సీన్ ఇక్కడే ఇంత బాగుంటే , పై నున్న కొండ మీద నుంచి చూస్తె ఇంకెంత బాగుంటుంది అని అను

మా బ్లాగు మిత్రులకు, వీక్షకులకు,అగ్రిగ్రేటర్లకు దీపావళి శుభాకాంక్షలు తో ........... manavu

Image
                                                                      మా బ్లాగు మిత్రులకు, వీక్షకులకు,అగ్రిగ్రేటర్లకు  దీపావళి  శుభాకాంక్షలు తో   ...........  manavu

'ఆవు' నీదేరా అబ్బాయి! పాలలో సగం వాటా మటుకు నీ సీమాంద్రా అన్న కే!

                                                                                                                               ఏదైన ఒక ఆస్తిని పొందుతున్నపుడు దానీ మీద సర్వ హక్కులతో బదిలీ అయితేనే అ ఆస్తికి యజమానీ అని చెప్పుకోవటానికి ఆస్కారం ఉంటుంది. అందుకే ఆస్తి బదలాయింపులు పత్రాలలో ఆ మేరకు రాయటం జరుగుతుంది . కానీ కొన్ని సందర్బాలలో అన్నదమ్ముల ఆస్తుల పంపకాలలో కానీ, ప్రెస్క్రిప్షన్ రైట్స్ పొరుగువారికి ఉన్న ఆస్తులలో కానీ , ఆస్తి మీద యాజమాన్య హక్కు ఒకరిదైతే , దాని మీద కోంత  అనుభవ హక్కులు వేరే వారిక ఉంటాయి. ఉదాహరణకు మనం  ఒక ఇల్లు కొనుగోలు చేస్తున్నాం. ఆ ఇల్లు కట్టిన అసామిక్ అది వాళ్ళ ఉమ్మడి కుటుంభ ఆస్తి పంపకాల ద్వారా వచ్చిందనుకోండి. ఆ ఇంటిక్ పైన ఉన్న అతని సోదరుల ఇOడ్లకి వెళ్ళటానిక్ ఇతని ఇంట్లో నుంచే వెళ్ళటం తప్ప వేరే దారి లేనపుడు తప్పకుండా అతని సోదరులకు  ఇతని ఆస్తి లోనుంచే నడచే హక్కు కల్పిస్తారు. ఇప్పుడు ఇతను ఇల్లు మనకి అమ్మినా అతని సోదరులకు ఉండే నడక హక్కును వారు కోల్పోరు. చచ్చినట్లు మనం వారిని అనుమతీమ్చాలి. కాబట్టి ఇలాంటి లింక్ లు ఉన్న ఆస్తులను అన్నదమ్ములే ఖరీదు కట్టి వాల్చేసుకు

బార్యని వేదిస్తున్నాడని కేసు పెడితే, కేసు పెట్టిన పోలిసులు ని వేదించాడట!

                                                              అయన ఒక పోలిస్ కానిస్టేబుల్ . ఖమ్మం జిల్లా ,అశ్వాపురం  పోలిస్ స్టేషన్ లో ఉద్యోగం. మగాడు అంటే మగాడే ! అతనికి  పురుష ఆదిపత్య సమాజం ద్వారా సంప్రాప్తించిన అహంకారం ఉంది. దానికి తోడు ప్రజల మీద జులుం చేసే అదికారం ఉందనుకుంటున్న పోలిస్ ఉద్యోగమూ ఉంది. అందుకే ఒఆ అతనికి పెళ్లాం అంటే కొంత చిన్న చూపు ఉందేమో ఆమెను వేదించటం మొదలు పెట్టాడు . నేరస్తులును చూసినట్లే ఆమెను చూసి ఉంటాడు, అందుకే ఆమె ఆ వేదింపులు తాళలేక భర్త మీద కేసు పెట్టింది. "ఓఆ  సో స్, ఎంత దైర్యం ! అసలే పోలీసుని ,అందులో తాళి కట్టిన మొగుణ్ణి నామీదే కేసు పెడతావా అని కారాలు మిరియాలు నూరాడట. అయిన నేను పోలిసునే కదా నన్నెవరు అరెస్ట్ చేస్తారులే అనుకున్నట్లుంది పాపం.  కానీ ఖమ్మం జిల్లా S.P  గారు అయిన ఆవుల రంగనాద్ గారు స్ట్రిక్ట్ ఆఫీసర్ అని పేరుంది. కాబట్టి క్రింది స్తాయి అధికారులు కూడా జాగర్తగనే ఉంటున్నారు. దానీ వలన సదరు పోలిస్ కానిస్టేబుల్ గారి మీద అశ్వాపురం సి. ఐ గారు కేసు నమోదు చేసారు.    ఒక సారి కేసు నమోదు చేసి , కంప్లెంట్ లో ఉన్న విషయం నిజమేనని నిరూపించే ఆదారాలు దొర