Posts

Showing posts with the label అభిషేక పాలు

రోజూ విజ్ఞానులు పోసే "విషం పాలు" గురించి ఆలోచించక , మత జ్ఞానులు పోసే "అభిషేక పాలు " గురించి ప్రశ్నిస్తున్న అజ్ఞానులు!

Image
                               ఎదో హింది సినిమాలో ,ఒక లాయర్ పాత్రదారి చేత హిందూ మతం లో దేవుడికి చెసే 'పాలాభిషేకం ' గురించి ప్రశ్నింప చేస్తూ , భక్తులు "పిచ్చి పువ్వులు 'అనిపిస్తాడు దర్శక /రచయిత . దానిని విగ్రహారాదన అంటే ఈసడించుకునే అన్యమతస్తులు కొందరు  పేస్ బుక్ లో పెట్టి తమ మత విదాన  గొప్పదనాన్ని  చాటాలని ప్రయత్నించారు . దానిని చూసిన నాకు వారి అమాయకత్వం మీద జాలి వేసింది .  మనిషికి   జ్ఞానం ముఖ్యమే .కాని అది ఉపయోగించే విదానం తెలియక పొతే  ఆనందానికి దూరం చెస్తుంది .ఎక్కడ ఏది చెయ్యాలో తెలియ చెసే దానినే " ఇంగిత జ్ఞానం" అంటారు . అలాంటి ఇంగిత జ్ఞానం లేని వారు ,తమ మతాలలో ఉన్న లోపాలను కప్పి పెట్టుకుని ,ఎదుటివారి మతాల గురించి రంద్రాన్వేషణ చేస్తుంటారు . వీరు వేమన గారి పద్యంలో "గురివింద " బాపతు వాళ్ళు  . అలాగే విజ్ఞాన వాదుల0 అని చెప్పుకుంటున్న వారు సైతం  సమాజంలో విజ్ఞాన పరంగా జరుగుతున్న అనర్దాలు గురించి ఆలోచించకుండా ,కేవలం అలౌకిక అనందం ఇచ్చే హిందూ  మతాచారాలు లో శాస్త్రీయత లేదని   తెగ  సందేశాలు ఇస్తూ,    హిందువులు అంతా అజ్ఞానులు అని ప్రచారం చేస్తుంటారు