Posts

Showing posts with the label దింపుడు కళ్ళాలు

శాస్త్రీయ వైద్యులు, చనిపోయాడు అని ప్రకటించిన వ్యక్తిలో "చలనం " ప్రసాదించి బ్రతికించిన ":భగవంతుడు "!!!

Image
                                                                                                                              మన సంప్రాదాయంలో , చనిపోయిన వ్యక్తుల పట్ల ఆచరించే క్రియలలో ముఖ్యమైనది "దింపుడు కళ్ళాలు " కార్యక్రమం . శవయాత్ర జరుగుతున్నప్పుడు , ఆ బాటలో 2 లేక మూడు సార్లు అక్కడక్కడ  శవాన్ని దించి , శవం చెవిలో బిగ్గరగా అతని పేరును ఉచ్చరిస్తారు . దీని ముఖ్య ఉద్దేస్యం ఏమిటంటే  చని పోయిన వ్యక్తిలో ఇంకా ఎక్కడైనా కోన ఊపిరి కొట్టుకుంటూ ఉంటె , తన సమీప బందువుల పిలుపుతో అది ఉత్తేజితమై , ఆ వ్యక్తీ తిరిగి బ్రతుకుతాడు అనే ఆశ . దానినే దింపుడు కళ్ళాలు ఆశ అంటారు . ఈ ఆశావహ సాంప్రాదాయం ఎంత సశాస్త్రీయ మైనదో తెలిపే ఉదంతం ఈ  మద్య వరంగల్ జిల్లా , మరిపెడ మండలం వీరారం గ్రామం లో జరిగింది . అదేమిటో చూడండి .   వీరారం గ్రామం కి చెందిన బానోత్ ధర్మా అనే వ్యక్తీ ప్రమాద వశాత్తు బావిలో పడి ప్రాణాపాయ స్తితిలో ఉండగా , అతనిని కుటుంభ సభ్యులు , ఖమ్మం లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు అట . అక్కడి ఘనమైన శాస్త్రీయ వైద్యులు, వారి దగ్గర 40,000 పీజు గుంజి వైద్యం చేసాక , "అతను ఏమి చేసినా బ్రతక