Posts

Showing posts with the label చక్రి గారి కుటుంభ సభ్యుల విషయం

అన్న చని పోయినంత మాత్రానా,వదిన స్టుడియోల చుట్టూ తిరగాల్సిందేనా !!!?

Image
                                                                            అది సెలబ్రిటిల ప్రపంచం . ఒక రంగుల మాయా లోకం . మన పురాణాలలో వర్ణించిన దేవలోకం అది . ఆ  లోకం లోని వారు ఏమి చేసినా పిచ్చ పబ్లిసిటి . వారు బ్రతికి ఉన్నా పబ్లిసిటియె ,చనిపోయినా పబ్లిసిటియె . ఆ  పబ్లిసిటి యే వారిని చిరంజీవులుగా ఉంచుతుంది అనుకుంటా . దేవతలు అమృతం త్రాగి చిరంజీవులుగా ఉంటే ,వీరు పబ్లిసిటి తో సదా వర్దిల్లుతున్నారు . మరి అటువంటి రంగుల లోకమైన సినిమా జగత్తులో ఒక సంగిత దర్శకులు దురదృష్ట వశాత్తు మరణిస్తే , అతని కుటుంబ సబ్యుల మద్య ఏర్పడిన స్వల్ప బేదాభిప్రాయాలను సరి చెసే పెద్దలే లేరా? లేకుంటే వారి తగాదాకు  కూడా పెద్ద పబ్లిసిటి వచ్చెలా చేసి ,ఆ తర్వాత సినిమా కద గా మార్చి పాయిదా పొందుదాం అనుకుంటున్నారా ?  సంగీత దర్శకులు స్వర్గీయ చక్రి గారు గుండె పోటుతో మరణించి నెల రోజులైనా కాకముందే ,అయన భార్యా, అతని తల్లి ఇతర కుటుంబ సబ్యుల మిద 498A కేసు పెట్టడమే కాక ,న్యాయం కోసం చానల్ స్టూడియోలు చుట్టూ తిరుగుతూ ఉండడం ,చక్రి గారి అభిమానుల్ని కలచి వేసే విషయం . అత్త తనకు తల్లి లాంటిదని ,మరిది తనకు బిడ్డ లాంటి వాడని వారి