Posts

Showing posts with the label ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ చట్టం 1987

సాయిబాబా భక్తులకి ,స్వరూపానంద స్వామికి మధ్య గొడవలకు కారణమైన "ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ చట్టం 1987 ".

Image
                                                                                        వినడానికి కొంత విచిత్రంగా ఉన్నా నిజం అదే ! ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోద్వారకా పీఠాధిపతి స్వామీ శ్రీ స్వరూపానంద సరస్వతి గారికి మరియు షిర్డీ సాయి భక్తుల మధ్య జరుగుతున్నా మాటల యుద్ధం తంతు చుస్తే దీనికి మూలా కారకులు ఆంధ్ర ప్రదేశ్ ఎండోమెంట్ చట్టం మరియు దానిని అమలు చేస్తున్న ఎండోమెంట్ డిపార్ట్ మెంట్ . అదే లా అంటే :     పూర్వం తెలుగు పల్లెల్లో , పట్నాల్లో సహితం ప్రజలు గుడి కట్టాలని అనుకుంటే సాంప్రదాయిక దేవుళ్ళు అయిన రాముడు , కృష్ణుడు , వేంకటేశ్శ్వర స్వామీ, నరసింహ స్వామీ దేవాలయాలు  నిర్మించి వాటి ఆలనా పాలనా వ్యవస్థాపక కుటుంబాల వారే వంశ పారంపర్యo హక్కులతో నిర్వహించే వారు . మద్రాస్ ఎండోమెంట్ యాక్ట్ నుండి ఆంద్రప్రదేశ్ ఎండోమెంట్ చట్టం  అనేది 1966 లోనే ఉనికిలోకి వచ్చినప్పటికీ అది 1987 లో మార్పు చేసే అంతవరకు కూడా దేవాలయ వ్యవస్థాపకులు పాలనాధికారాల్లో ఎక్కువుగా జ్యోక్యం చేసుకోవక పోవటం వలన సాంప్రదాయ దేవుళ్ళ గుళ్ల నిర్మాణం కానీ , సేవలు కానీ నిరాటంకంగా సాగిపోతుండేవి . అయితే సదరు ట్రస్టీల పాలనలో ఉన్న దేవాలయా