సాయిబాబా భక్తులకి ,స్వరూపానంద స్వామికి మధ్య గొడవలకు కారణమైన "ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ చట్టం 1987 ".

                                                   



                                    వినడానికి కొంత విచిత్రంగా ఉన్నా నిజం అదే ! ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోద్వారకా పీఠాధిపతి స్వామీ శ్రీ స్వరూపానంద సరస్వతి గారికి మరియు షిర్డీ సాయి భక్తుల మధ్య జరుగుతున్నా మాటల యుద్ధం తంతు చుస్తే దీనికి మూలా కారకులు ఆంధ్ర ప్రదేశ్ ఎండోమెంట్ చట్టం మరియు దానిని అమలు చేస్తున్న ఎండోమెంట్ డిపార్ట్ మెంట్ . అదే లా అంటే :

    పూర్వం తెలుగు పల్లెల్లో , పట్నాల్లో సహితం ప్రజలు గుడి కట్టాలని అనుకుంటే సాంప్రదాయిక దేవుళ్ళు అయిన రాముడు , కృష్ణుడు , వేంకటేశ్శ్వర స్వామీ, నరసింహ స్వామీ దేవాలయాలు  నిర్మించి వాటి ఆలనా పాలనా వ్యవస్థాపక కుటుంబాల వారే వంశ పారంపర్యo హక్కులతో నిర్వహించే వారు . మద్రాస్ ఎండోమెంట్ యాక్ట్ నుండి ఆంద్రప్రదేశ్ ఎండోమెంట్ చట్టం  అనేది 1966 లోనే ఉనికిలోకి వచ్చినప్పటికీ అది 1987 లో మార్పు చేసే అంతవరకు కూడా దేవాలయ వ్యవస్థాపకులు పాలనాధికారాల్లో ఎక్కువుగా జ్యోక్యం చేసుకోవక పోవటం వలన సాంప్రదాయ దేవుళ్ళ గుళ్ల నిర్మాణం కానీ , సేవలు కానీ నిరాటంకంగా సాగిపోతుండేవి . అయితే సదరు ట్రస్టీల పాలనలో ఉన్న దేవాలయాలు అక్కడక్కడా అక్రమ విధానాలకు గురి అవుతున్నాయని భావించిన ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం , దేవాలయాల స్థితిగతుల మీద విచారణ జరిపి నివేదిక ఇవ్వ వలసినదిగా జస్టిస్ చల్లా కొండయ్య గారి నేతృత్వం లోని కమిటీని కోరింది. అయన గారు ఇచ్చిన నివేదిక ఆధారంగా 1987 లో   ఆంద్రప్రదేశ్ ఎండోమెంట్ చట్టం కి ముఖ్యమైన సవరణలు చేశారు.

    1987 లో వచ్చిన చట్ట సవరణలు ప్రకారం వంశ పారంపర్య ధర్మకర్తల హక్కులు రద్దు చేయడమే కాకా వారికి ఇచ్చే అన్ని రకాల ప్రయోజనాలు నిలుపుచేశారు . మిరాశీ హక్కు లు రద్దు  చేయబడ్డాయి . చెక్ పవర్ కార్యనిర్వహణాధికారులకు ఇవ్వబడింది . వెరసి మొత్తానికి దేవాలయ పరిపాలనా పెత్తనం రాజకీయ ప్రభావితులైన అధికారుల చేతిలోకి వెళ్లి అంతిమంగా ప్రభుత్వ పెత్తనం మొదలైంది. దీని మీద హిందూ సంస్థలు కొన్ని సుప్రీం కోర్టు వరకు వెళ్లగా దానికి సంబంధించిన తీర్పు 1996 లో వచ్చింది . ఈ  లోపు  రాజకీయ నాయకుల కనుసన్నల్లో నడిచే దేవాలయ అధికారుల పాలనా తీరు ఎలా అయిదంటే "గొర్రెలను తినువాడు గోవింద కొడతాడు , బర్రెలను తినువాడు వస్తాడయ్యా " అనే బ్రహ్మం గారి కాల జ్ఞానం వాక్యం నిజం అయినట్లు తీరుగా ఉంది. పూజారులు , ట్రస్టీలు గుళ్లను మాయం చేస్తున్నారని అధికారులకు  పాలన అప్పచెపితే  వారు ఏకంగా గుళ్లో లింగాలను మాయం చేయడం మొదలు పెట్టారు . 1996 లో సుప్రీం కోర్టు వారు  , వ్యవస్తాపక ధర్మకర్తల కుటుంబ సభ్యుల హక్కులను గుర్తిస్తూ అర్హత ఉన్న వారిని  చైర్మన్ లుగా నియమించాలని ఆదేశించింది . ఆ తర్వాత 2013 లో డాక్టర్ సుబ్రమణ్య స్వామీ గారు వాదించిన  చిదంబరం దేవాలయం కేసులో ఒక లాండ్ మార్క్ తీర్పు ఇచ్చింది సుప్రీం కోర్టు .

                          దేవాలయాలు లోఅక్రమాలు జరిగితే ఆ వంక తో దేవాలయ పరిపాలనా వ్యవహారాలలో శాశ్వతంగా ప్రభుత్వ అధికారులు ఉండటానికి వీలు లేదని , ఇది భారత రాజ్యాంగం తన పౌరులకు ఆర్టికిల్ 25, 26 క్రింద  ఇచ్చిన మత స్వేచ్ఛకు భంగకరం కాబట్టి దేవాలయాలలో E.O ల పెత్తనం చెల్లదని తేల్చి చెప్పింది. ఏదైనా అవకా తవ్వకాలు జరిగితే ఒక పరిమిత కాలానికి మాత్రమే అధికారిని నియమించి , సమస్య సరి చేసి తిరిగి సంబంధిత వ్యక్తులకు దేవాలయాల నిర్వహణ అప్పచెప్పాలి తప్పా , శాశ్వతంగా తిష్ట వేసుకోవడానికి వీలు లేదని చెప్పింది. అయినా సరే ఈ తీర్పును గౌరవించి  హిందువులకు దేవాలయాలు అప్పచెప్పడానికి  దక్షిణాది రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా లేవు . ఆ కేసులోని తీర్పు కేవలం చిదంబరం దేవాలయం కె వర్తిస్తుందని కుంటి సాకులు చెప్పడం తో 2012 లో స్వర్గీయ దయానంద సరస్వతి వేసిన రిట్ కేసులో డాక్టర్ సుబ్రమణ్య స్వామీ గారు ఇంప్లిడ్ పిటిషనర్ గా చేరి వారి వాదనలు వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఆ కేసు వచ్చే నెలలో ఫైనల్ ఆర్గుమెంట్ కోసం  పోస్ట్  చేయబడింది .
అది హిందూ సంస్థలకు , రాజకీయ అధికారానికి మధ్య జరుగుతున్న న్యాయ పోరాటం చరిత్ర. మరి దీనికి స్వరూపానంద -సాయిబాబా గొడవకి సంబంధం ఏమిటి అంటారా ? దానికే వస్తున్నా !.

                                                               


      1987 లో చల్లా కొండయ్యగారి సూచనల మేరకు  ఆంద్రప్రదేశ్ ఎండోమెంట్ చట్టం మార్చిన తర్వాత సాంప్రదాయ దేవాలయాల నిర్మాణం మీద హిందువులకు అనాసక్తి ఏర్పడింది . చీమలు పెట్టిన పుట్టలు పాములకు ఉపయోగపడినట్లు , తాము ఎంతో భక్తి విశ్వాసాలతో దేవాలయ నిర్మాణాలు చేసుకుని వాటి అభివృద్ధికి పాటుపడుతుంటే , ఎక్కడో ఎవడో తప్పుడు పని చేసాడు అనే వంకతో ప్రభుత్వం తమ సంస్థల పెత్తనం తీసుకోవడం , రోడ్లమీద తిరిగే రాజకీయ నాయకులకు తాము కట్టిన గుళ్ళు పునరావాస కేంద్రాలుగా మారడం, గుళ్లో గంటలను సహితం అమ్ముకోవడానికి వెనుకాడని వారు అధికారులుగా వచ్చి గుడి పెత్తనం చేస్తుండడం తో భక్తులు సాంప్రదాయ దేవాలయ నిర్మాణాల జోలికి వెళ్ళడానికి ఆసక్తి చూపడం లేదు. అటువంటి వారికి ఆశాజ్యోతిలా కనపడ్డారు షిర్డీ సాయిబాబా .


                                       షిర్డీ సాయిబాబా చరిత్రానుసారం పూర్తిగా హిందువూ కాదు ,అయినా ఆరాధనా పద్ధతుల్లో హిందూ పద్ధతులు ఉండటం వలన సాంప్రదాయ హిందువులుగా ఉన్న భక్తులు చాలా మంది సాయిబాబా భక్తులుగా మారి అయన మందిర నిర్మాణాలు చేపట్టడం తో తెలుగు నేలలో సాయిబాబా ఆరాధన ఎక్కువ అవ్వడం మొదలు పెట్టింది. మొదట్లో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సాయిబాబా మందిరాలను కూడా తమ అధీనం లోకి తెచ్చుకుని పెత్తనం చెలాయిదామని చూసినా , సాయిబాబా పూర్తిగా హిందువు కాదు అనే కారణం చేత ఆంధ్ర ప్రదేశ్ హై  కోర్టు ఎండోమెంట్ అత్యుత్సాహానికి అడ్డుకట్ట వేసి సాయిబాబా గుళ్ళు ఎండోమెంట్ పరిధిలోకి రావని తేల్చి చెప్పింది . ఈ  సందర్బంగా ఒక ఆసక్తికరమైన తీర్పు గురించి చెప్పుకోవాలి . హైద్రాబాద లో ఒకే ఆవరణలో ఉన్న  ఉన్న గాయత్రి దేవి సాయిబాబా గుళ్లకు కలిపి ఒక కార్యనిర్వాణాధికారిని ఎండోమెంట్ శాఖ వారు నియమిస్తే , దానిని వ్యతిరేకించిన ఆలయ నిర్వాకులు హై కోర్టులో కేసు వేశారు . The Deputy Commissioner Of ... vs Saibaba Samsthanam on 6 December, 1990 అనే ఈ కేసులో  హై  కోర్టు వారు ఇచ్చిన తీర్పు ఏమిటంటే "సాయిబాబా హిందువు కాదు కాబట్టి ఎండోమెంట్ ఏక్ట్ పరిధిలోకి అయన మందిరం రాదు కానీ గాయత్రి దేవి హిందూ దేవత కాబట్టి ఆ గుడి మీద ఎండోమెంట్ వారి అధికారులు పెత్తనం చేయవచ్చు అని. ఇంకేముంది ? ఆ దెబ్బతో హిందూ దేవుళ్ళు ప్రభ తగ్గిపోయింది . సాయిబాబాకు ఆదరణ పెరిగిపోయింది. ప్రతి ఊళ్ళో సాయిబాబా మందిరాలు వెలిశాయి. భక్తుల స్వీయ పర్యవేక్షణ కాబట్టి అన్ని సాయి మందిరాలు ఏంటో ఇంతో అభివృద్ధి చెబుతుండటం వలన లక్షలాది సాంప్రాదాయ హిందూ భక్తులు సాయి భక్తులుగా మారి పోయారు. దానితో మహారాష్ట్రలో ఉన్న షిరిడి ఆదాయం కూడా విపరీతంగా పెరిగిపోయి దేశం లో సాయి బాబా సాయి మహారాజ్ అయిపోయాడు. 

   ఇక సాంప్రదాయ హిందూ భక్తులు సాయి భక్తులుగా మారినప్పటికీ వారికి సాంప్రదాయ  హిందూ దేవుళ్ళు మీద ఉన్న భక్తి విశ్వాసాలు పోవు కదా !ఆ ఆరాధన పూర్వక అభిమానం తోనే తాము కొత్తగా కొలవడం మొదలుపెట్టిన సాయి తో పాటు తమ పాత దేవుళ్లను కూడా కలిపి గుళ్లను నిర్మిo చడం పూజించడం చేయడం మొదలు పెట్టారు . అలా ఏర్పడిన దేవుళ్ళే గణేష్ సాయి, రామసాయి , కృష్ణసాయి మొదలగు దేవాలయాలు. ఈ  దేవాలయాలలోసాంప్రదాయక దేవుళ్ళు ఉన్నపటికీ , సాయి తో కలసి ఉండటం వలన ఎండోమెంట్ భూతం అందులోకి అడుగు పెట్టలేక పోవడం వలన భక్తులు స్వేచ్ఛగా తమ మత విధులు నిర్వహించుకుంటున్నారు.

                                                               


                      ఇక సాంప్రదాయ దేవాలయాలు విషయానికి వస్తే అధికారం పైన చెప్పినట్లు రాజకీయ అధికారులదే . వరుణ యాగం వారే చేస్తారు . సామూహిక సరస్వతి పూజలు వారే చేస్తారు, పుష్కరాలు వారే నిర్వహిస్తారు. ఇలా అన్నింటిలో వారే అయ్యే సరికి మఠాధిపతులు పీఠాధిపతులు వారిని ఏమనలేక వారు నిర్వహించే పూజలకు హాజరు అయి అశీ ర్వదించడానికి   వారి పాత్రను పరిమితం చేసుకున్నారు. ఎమన్నా గట్టిగ అంటే తమిళనాడులో జయలలిత ప్రభుత్వం మాదిరి తమమీద ఎక్కడ మర్డర్ కేసులు బనాయిస్తారో అని భయం కూడా ఉండవచ్చు. ఆలా ప్రభుత్వాలు , అధికారులు మీద మనసులో ఎంత కోపం ఉన్నా హిందూ స్వాములు చేసేదేమి లేక సుప్రీం కోర్టు ఎప్పటికైనా తమ హక్కులు కాపాడక పోతుందా అనే ఆశతో ఉన్నారు. ఇలా వారి మనసులో ఉన్న కోపం రోజు రోజుకి పెరిగిపోయి చివరకు ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్లు సాయిబాబా మీద పడింది .

    సాంప్రదాయ దేవుళ్ళు సంబంధించిన దేవాలయాలు సుమారు 30 వేలకు పైగా దూపదీపాలు లేక కునారిల్లుతుంటే , నిన్న గాక మొన్నవచ్చిన సాయి బాబా మందిరాలు రోజుకు 3 సార్లు హారతితి, రాత్రిళ్ళు ఫోకస్ లైట్లతో ధగధగా మెరసిపోవడం ఏమిటి? ఎండోమెంట్ వారి దెబ్బకు  భక్తులు సంప్రదాయ దేవుళ్ళకు దూరమై, హిందూ కానీ సాయిబాబాకు దగ్గర కావడం ద్వారకా పీఠాధి పతి లాంటి వారికి చాలా బాధ కలిగించి ఉంటుంది . పైపెచ్చు తమ దేవుళ్లను సాయిబాబాతో కలిపి ఉచ్చరించడం పూజించడం తో భవిష్యత్ లో సాంప్రదాయ దేవుళ్ళు ఉనికిని కోల్పోతారేమో అనే భయం కూడా కలిగి ఉండవచ్చు . అందుకే సాయిబాబా ను దేవుడు కాదని, ఒకదెయ్యం అని , అయన మందిరం సమాధి అని ఆయనకు చేసే పూజ దెయ్యం పూజలు అని అనడం మొదలు పెట్టారు . దీనితో సహజంగానే సాయి భక్తులకు స్వరూపానంద గారి మీద ఆగ్రహం వచ్చింది . దానితో వారు స్వామీ వారి మీద ఎదురుదాడికి దిగారు . ఇలా చివరకు హిందూ దేశం లో స్వదేశీ దేవుళ్ళ భక్తుల మధ్య మాటలు యుద్దాలు మొదలుఅయితే దానిని క్యాష్ చేసుకొని తమ రేటింగ్ పెంచుకోవాలను కుంటున్నాయి కొన్ని మీడియా చాన్నళ్లు .


  ఈ విషయం లో నాదొక్కటే విన్నపం . చేతులు కాలాక ఆకులూ పట్టుకోవడం వలన ప్రయోజనం ఏముంది. దేవాలయ నిర్వహణలో ప్రభుత్వ పెత్తనం మొదలైన రోజుల్లోనే హిందూ మఠాధిపతులు , స్వాములు , సంస్థలు అందరూ ఏకమై తమ నిరసన తెలియచేసి ఉంటె ప్రభుత్వాలు మన సంస్థల జోలికి వచ్చేవా? సాంప్రదదాయ గుళ్లకు ఈ దురవస్థ పట్టేదా ? మంచో చెడో లక్షలాది ప్రజలు సాయి భక్తులుగా మారిపోయారు. అది ఒక రకంగా మంచిదే కదా ? ఒక వేళా వీరంతా సాయి వైపు కాకుండా ఏ విదేశీ దేవుడి వైపో వెళ్లి ఉంటే ఏమి చేసే వారు? సాయి హిందువు అయినా కాకపోయినా స్వదేశీ బాబా . అయనను ఆరాధించడం హిందూ జీవన విధానం లో భాగమే కానీ అన్యదా కాదు . ఆయన మందిరాల అభివృద్ధి వెనుకాల విదేశీ సంస్థల హస్తాలు ఏమి లేవు. ఈ  దేశం లో హిందూ సంస్కృతిని దెబ్బతీయాలనే దురుద్దేశం తో ఎంతో మంది స్వదేశీయులకి డబ్బు ఆస చూపి తమ మతం లోకి మారుస్తున్న విదేశీ మతస్తులు గురించి హిందువులు ఆలోచించాలి కానీ ,ఈ దేశం లో పుట్టి , ఈ  దేశం గురించి ఆలోచించిన   స్వదేశీ సాయి బాబాకు భక్తులు చేసే పూజలు గురించి కాదు. వందల ఏండ్లుగా మనం పరాయి పాలనలో పీడనకు గురి అయ్యాం అంటే అందుకు ముఖ్య కారణం మనలో నరనరాన జీర్ణించుకు పోయిన అనైక్యత . అదే మన పాలిట మహమ్మారి. కాబట్టి ఇకనైనా చరిత్రలో చేసిన తప్పులు తిరిగి చేయకుండా జాగ్రత్త పడదాం.

   భారత రాజ్యాంగం ప్రకారం ఎవరినైనా , ఏ విదంగా నైనా ఆరాధించుకునే హక్కు ప్రజలకు ఉంది అని ఒప్పుకున్నాం కాబట్టి సాయిబాబా భక్తుల మనోభావాలు గాయపరచి మాటలకు స్వస్తి చెప్పడం మంచిది. ఒక్క మాటతో లక్షలాది ప్రజలను దూరం చేసుకోవడం కంటే  "సనాతన -సాయి ,భాయి భాయి " అనే నినాదం తో అందరూ ఏకమై హిందువులకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణకై ప్రభుత్వాలను నిలదీయడం మొదలు పెట్టాలి . దేశ వ్యాప్తంగా ఉన్న హిందూ మత సంస్థల విముక్తికై అందరు చేయి చేయి కలిపి పని చేయాలి . సాయిసంస్థలకు ఏ స్వేచ్ఛ ఉందొ , మిగతా సాంప్రదాయ మత సంస్థలకు ఆ స్వేచ్ఛ కల్పించబడే వరకు పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది . ఇటువంటి తరుణం లో పనికి రాని మాటలతో  సోదరులు గొడవలు పెట్టుకోవడం విజ్ఞత కాదు అని నా అభిప్రాయం.

                     జై హిందూ                                                                                    జై జై హిందూ


Comments

  1. Excellent analysis, thanks for the same. Another way to save a temple from the endowment vultures is to annex it to any Sankar Peetha's, like Sringeri, Kanchi etc. But one has to do the prep work Well on advance before the vultures pounce on the temple. Any newly built temple will take a while to gain popularity and get decent amount of Hindi collections. The endowment folks get interested in the temple only when the temple starts getting good amount of collections. Therefore obe has to prepare the paperwork for the annexation during these initial stages. My father has saved one temple this way.

    ReplyDelete
  2. @ Nageswara Rao

    Please go through my comments

    Tamilnadu Hindu Temple loot

    http://ssmanavu.blogspot.in/2015/08/blog-post_26.html

    ReplyDelete
  3. బాగా చెప్పారు కానీ సాయి తో పాటు సాంప్రదాయక దేవుళ్ళను ఉంచడం వలన, పాత తరం , ఈ తరం సంతృప్తి చెందవచ్చు కానీ భవిష్యత్ తరం పూర్తిగా సాయే దేవుడు మిగతా మూర్తులు వేష్ట్ అనుకునే ప్రమాదం ఉంది. ఒక ఉదాహరణని మనం గుర్తుంచు కోవాలి. విదేశీ మతాల్లోకి హిందువులను ఆకర్షించే వాళ్ళు కూడా ఆతరానికి మాత్రం చాలా వెసులుబాట్లు ఇస్తారు , అంటే హిందూ పేరు, అగరబత్తులు, అర్చనలు, పూజాదికాలు వగైరా, కానీ తరవాతి తరాన్ని మాత్రం మూర్ఖంగా చేస్తారు. సాయి వీర భక్తుల తత్వం అదే అవుతుంది అనడంలో సందేహం లేదు.

    మరోవాదన కూడా ఉంది. సంప్రదాయక దేవుళ్ళని పక్కన పెడితే సాయిని దేవుడిని చేయడం వలన ఒకప్పటి హిందూ దేవుళ్ళందరూ కూడా నిజానికి దేవుళ్ళుకారని, సాయి ని దేవుడిని చేసినట్టే వాళ్ళనీ చేశారనే వాదం మొదలవ్వచ్చు. ఇది హిందువిల్లో ఒక రకమైన కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేయవచ్చు. సత్యసాయి విషయంలో ఏంజరిగిందో మనందరికీ తెలుసు.

    అదేసమయంలో అసలు సాయి ఎవరు అనే విషయంలో సాయి భక్తులకు ఒక స్పృ ష్టత అవసరం. చర్చ మొదట్లో దేవుడంటారు, విషయం లేదని తలిసిన తరువాత గురువంటారు. ఎవరు పడితే వాళ్ళు గురువులవ్వరు అని వాళ్ళకి తెలియదు. ఒకరు సద్గురువు అని చెప్పాల్సింది ఒక గొప్ప శిష్యుడు మాత్రమే. అదికూడా ఆ కాలానికి చెందిన వాఆళ్ళు. మనలాంటివాళ్ళు కాదు. సాయిబాబా సమకాలీనుల్లో ఎంతోమంది గురువులున్నారు, వారందరికన్నా సాయి ఎందువలన , ఎలా గొప్ప గురువయ్యారో (గురువు మాత్రమే) వారు సెలవివ్వాలి.

    ReplyDelete
    Replies
    1. మీ వాదన కు అనుకూలం అనిపించే ఆర్టికిల్ ఒకటి ఆంధ్ర భూమిలో ప్రచురించారు
      నా అభిప్రాయం తర్వాత చెపుదాం అనుకుంటున్నాను.కాబట్టి రిలేటెడ్ మ్యాటర్ కాబట్టి ఆంధ్రభూమి ఆర్టికిల్ ను పేస్ట్ చేసాను చూడ0డి.

      హిందూ వ్యతిరేక ప్రణాళిక!

      మన దేవతలందరూ నిజానికి- మనుషుల్లో, జంతువుల్లో, వృక్షాల్లో,క్రిమికీటకాదుల్లో, రాళ్లల్లో, కొండల్లో నివసించే ఉన్నారు. ఇది హిందువుల నమ్మకం. అందుకనే కాళిదాస కవి ‘అస్తి ఉత్తరస్యాం దిశి దేవతాత్మా, హిమాలయో నామ నగాధిరాజా’ అంటూ హిమాలయాన్ని ‘దేవతాత్మ’గా ప్రస్తుతించాడు. కానీ, మోక్షం ఇవ్వటానికి ఈ మనుషులూ, ఇతర జీవులూ అర్హులా? కోర్కెలు తీరుస్తారేమో గానీ మోక్షం ఇవ్వలేరు. ఉదాహరణకు రావిచెట్టుకు ప్రదక్షిణలు చెయ్యటం. ఉత్తర భారతదేశంలోని ఒక దేవాలయంలో భక్తులు వందలాది ఎలుకలకి పాలుపోస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని ‘పూళ్ల’ గ్రామం వద్ద బియ్యం మిల్లులో వదిలిబెట్టిన గింజలను తినటానికి వందలాది చిలుకలు ఎగిరి వస్తుంటాయి. కాశ్మీర్‌లోని అనంతనాగ్ దగ్గరున్న మార్తాండ్ సూర్య దేవాలయం కోనేరులో కొన్ని వందల పెద్ద చేపలున్నాయి. అవ్వి ఋషులట! వాటికి వెయ్యటం కోసం పేలాలు అమ్ముతారు. శృంగేరీలో కూడా ఈ చేపలను చూస్తాము. శ్రీకూర్మంలో ఆలయం ప్రహరీ లోపలున్న కూర్మాలు తలెత్తి చూస్తాయి- మనం ఏమన్నా పెడతామేమోనని.
      ఈ జీవులు మనకి మోక్షాన్నివ్వవు. పుణ్యాన్ని మాత్రం ఇస్తాయి. ఇలాగే సాధువులు, సంతులు, సిద్ధపురుషులు కూడా తాము దేవుళ్లము కాము అన్న విషయాన్ని భక్తులకు తెలియపరిచే విధంగా- ‘మేము మోక్షం ఇవ్వలేం, పుణ్యం ఎలా పొందాలో చెప్పగలం’ అంటారు. ఇట్లాంటి సిద్ధపురుషులు పూర్వమూ, ఇప్పుడూ ఉన్నారు. ఎప్పుడూ ఉంటారు. ప్రపంచం అంతటా ఉంటారు. అతి ఎక్కువగా మన దేశంలోనే ఉంటారు- మోక్షాన్నిచ్చే దేవతలు ఇక్కడే ఉన్నారు గనుక. మెహర్‌బాబా తాను దేవుణ్ణని ఎక్కడా చెప్పుకోలేదు, జిల్లెళ్లమూడి అమ్మ భక్తులూ, నంబూరు బాబా భక్తులు కూడా ఆ ఇద్దరూ దేవుళ్లని చెప్పట్లేదు. కుసుమ హరనాథ్ బాబా భక్తులు కూడా అంతే.
      బాబాలు, సిద్ధులు, గురువులు- భక్తుల కొద్దిపాటి కోర్కెల్ని తీర్చగలరేమో కాని, మోక్షాన్ని మాత్రం ఇవ్వలేరు. ఒక్క ఉదాహరణ చూద్దాం. కంచి పరమాచార్య, బ్రహ్మీభూత శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి కర్నూలు దగ్గరున్న ఒక కుగ్రామంలో తెల్లవారు జామున శివాలయంలో పూజకు కూర్చున్నారు. ఊరి పెద్దలు ఎవ్వరూ బిల్వాలు (మారేడుదళాలు) తెచ్చి ఇవ్వలేకపోయారు. మేకల్ని కాచుకుంటూ వచ్చిన ఒక కుర్రాడు, పరిస్థితి చూసి పరుగెత్తి వెళ్లిపోయాడు. కాస్సేపట్లో ఒక తట్టనిండా బిల్వాలు తెచ్చి స్వామి దగ్గర పెట్టాడు. పూజ అంతా అయిపోయాక స్వామి మెట్లు దిగుతూంటే ఆ కుర్రాడు వారికి అడ్డంగా పడుకుండిపోయాడు. స్వామి, ‘ఏం కావాల్రా నీకు?’ అన్నారు. వాడు ‘మోక్షం’ అన్నాడు. స్వామి కళ్లుమూసుకుని ఆలోచించి, ‘సర్లే.. అమ్మను అడుగుతానే్ల’ అని వెళ్లిపోయారు. ఆరునెల్ల తర్వాత స్వామి తన కంచి ఆశ్రమంలో కోనేరు పక్కన కూర్చుని ఉండగా మేనేజరు వచ్చి, ‘స్వామీ టెలిగ్రాం వచ్చింది. ఆ కుర్రాడి ప్రాణం పోయేట్టుగా ఉందట!’ అన్నాడు. స్వామి వారు- ‘వాడికి ఆరు జన్మలకిగాని మోక్షం రాదు. అమ్మ వాడికి మూడు జన్మలకే ఇస్తానంటోంది. ఈ మరణం వాడికి లాభమే.’ అన్నారట! ఆ స్వామిని ‘నడిచే దేవుడు’ అన్నారు గాని, ‘దేవుడు’ అనలేదు.
      రామకృష్ణ పరమహంస తన అనుయాయులతో- ‘మీతో ఎట్లా మాట్లాడుతున్నానో, అమ్మతోనూ అట్లాగే మాట్లాడుతున్నాన’ని అనేవారట. తాను దేవుణ్ణని ఆయన అన్నాడా? ఏడాది క్రితం మనల్ని వదిలివెళ్లిపోయిన సద్గురు శివానందమూర్తిగారు లెక్కలేనంత మందికి మంత్రాలిచ్చారు. శాంతిని ప్రసాదించారు. తాను దేవుణ్ణని ఆయన అనుకొన్నారా? ఆయన భక్తులు అలా అన్నారా? తులసీదాసు అందరికీ తన ‘రామచరిత మానస్’ ద్వారా రాముణ్ణి ఇచ్చాడు, మోక్షాన్నివ్వలేదు. ఇది హిందూ జీవన విధానం. ప్రపంచానికే తలమానికం. దీన్ని వంట పట్టించుకోటానికే పాశ్చాత్య విద్వాంసులు తపించిపోతున్నారు. ‘ఇందుకోసమే.. ఎక్కణ్ణించో వాళ్లు వచ్చేది’’ అన్నారు బ్రహ్మీభూత కంచిస్వామి.
      * * *
      cont...

      Delete
    2. cont....
      ఈమధ్య ఒక ఆసామీ- ‘షిర్డీబాబాలోంచే శివుడూ, గణపతీ, విష్ణువూ, అంబా- అందరూ పుట్టారు. అసలు దేవుడు షిర్డీబాబాయే. ఆ బాబా నాలో ఉన్నాడు. నేను ఆ బాబాలో ఉన్నాను. నేనే బాబాని!’ అని అన్నాడు. ‘షిర్డీబాబా అందరికీ దేవుడే’ అన్న ప్రచారం ఇపుడు బాగా జరుగుతోంది. ఈ విషయంలో నాకో అనుభవం ఉంది.. ఏలూరు దగ్గరున్న పెదవేగిలోని శివాలయంలో ముప్ఫయ్యేళ్ల టీచర్ యువతి వచ్చి నాతో-‘బాబా గుడికి కూడా రండి. అందరికీ ఆయనే దేవుడు. బౌద్ధ చైత్యం పక్కనుంది’ అంది. నేను- ‘అందరికీ అంటున్నావు, వాళ్లు వస్తున్నారా మరి?’ అన్నాను. ఆమె- ‘రావట్లేదనుకోండి, ముందుముందు వస్తారు’ అంది. ‘ఎలా వస్తారు, వాళ్ల దేవుళ్లమీద నమ్మకం లేనివాళ్లు అగ్నిగుండాల్లో పడి మలమల కాలిపోతారని వాళ్లు అంటారు కదా. మనం అలా కాలిపోయే వాళ్లం కదా. కాలకుండా ఉండాలంటే మనం వాళ్ల దేవుళ్లని కూడా నమ్మాలి గాని, వాళ్లని రమ్మంటే మనతో వస్తారా! మన దీపారాధనలూ, కర్పూర హారతులూ, సూర్యార్చనలూ, కుంకంబొట్టూ, విభూతులూ- ఇవన్నీ వాళ్లకి నచ్చుతాయా?’ అని నేను అనడంతో ఆమె ఆలోచనలో పడింది. ఆమె అంది- ‘అందుకనేగదా, మనం చెప్పేది.. బాబాయే అందరికీ దేవుడు’-అని.
      ‘‘రేపు వాళ్లురావటం మొదలుపెట్టి నిన్ను మతం మారమంటే..’’ అన్నా. చురుగ్గా ఆమె అంది. ‘మారిపోతాం! ఏ మతమైతే ఏంటి సార్, అన్ని మతాలూ ఒకటే గదా!’ అని. అన్ని మతాలూ ఒకటేనా? అన్నింట్లోనూ జన్మ-కర్మ ఉందా?
      నాకర్థమయ్యింది.. బాబాని అందరికీ దేవుడుగా ఎందుకు చేస్తున్నారంటే హిందువులు క్రమంగా అల్లానీ, క్రీస్తునీ మాత్రమే తమ దేవుళ్లుగా స్వీకరించాలనే ప్రణాళిక ఒకటి చాపకింద నీరులాగా ప్రవహిస్తోంది కనక! అందుకనే గదా ‘షిర్డీబాబా హిందూ దేవుడు కాదు’ అని సుప్రీంకోర్టు నుంచి తీర్పు తెప్పించబడింది!.. ‘కోట్లమంది బాబాను దేవుడంటున్నారు గదా’ అని ఒకవాదం. మరి, కోట్లమంది అమెరికన్ ‘కోకాకోలా’ అమోఘం అంటున్నారు. ఇంగ్లీషును ఇండియా భాష అంటున్నారు. ఆమోదిద్దామా? అసలు ఈ ప్రణాళికా వ్యూహం ఎవరిది? రాజకీయ నాయకులదా? మతం మార్పిడులు ప్రోత్సహిస్తూన్న వారిదా?
      దేశంలో తీవ్రవాదులు ఎక్కువైపోయారు. ‘జీహాదీ’లు హిందూ ఆడపిల్లల్ని మాయం చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కాశ్మీర్‌ను ఎట్లాగయినా పాకిస్తాన్‌లో కలపాలనే కుట్రతో నేషనల్ కాన్ఫరెన్స్ వగైరా పార్టీలూ, మతోన్మాదులు పెరిగిపోతున్నారు. ఈ స్థితిలో మన సనాతన హిందూ సంప్రదాయాల్ని వదులుకొని, వేదాల్లోగాని, ఉపనిషత్తుల్లోగాని, పురాణాల్లోగాని ఎక్కడా లేని బాబాని- ‘దేవుడు’ అని ప్రచారం చేసుకోవటం ఎంత తీవ్రమైన విషయమో అందరూ ఆలోచించాలి!

      Delete
    3. నరసింహారావు గారు,
      తప్పండీ "సుప్రీంకోర్టు నుంచి తీర్పు తెప్పించబడింది!" అని అనటం న్యాయవ్యవస్థను చులకన చేయటం అవుతుంది. ఎవరైనా దృష్టికి తెస్తే అది కోర్టును ధిక్కరించిన నేరం‌కూడా అవుతుంది. కాబట్టి సంయమనం‌ పాటించ వలసింది. న్యాయమూర్తులు చట్టాలకు లోబడి తీర్పులు చెప్పకతప్పదు. ఒక్కొకసారి వారికీ అ తీర్పులు వ్యక్తిగతంగా అసంతృప్తిని కలిగించవచ్చును కాని వారి విధినిర్వహణలో అది తప్పనిసరి పరిస్థితి. అందుచేత న్యాయమూర్తుల ఉద్దెశాలపైనా వారి వ్యక్తిత్వాలపైన అనుమానం వ్యక్తం చేసే ప్రయత్నాలు మంచివి కావు కాబట్టి వద్దు. ధన్యవాదాలు.

      Delete
    4. స్వతంత్ర్యం రాకముందునుండి మనదేశం మీద ఒకరకమైన అధ్యాత్మికసంబంధ కుట్ర జరుగుతుందనే వాదం ఉంది. దాని ఆరంభం భారతదేశం మీద ఆంగ్లేయులు/ఫ్రెంచి/డచ్చి/వాళ్ళబొంద లాంటి వాళ్ళ దాడిని క్రిస్టియన్ల దాడిగాకానట్టు విజయవంతంగా expose చేయగలిగారు (మొఘలాయిలు, తుఱకలు దాడిని పక్కనపెడితే). అదే భ్రాంతిని continue చేయడానికి వాళ్ళకి గాంధీ లాంటి వ్యక్తి అద్వర్యంలో దేశనాయకత్వం ఉండాలి. నిజానికి దేశంలో 2% కూడా లేనిజనాభా నుండి హిందూ పేర్లతో అంతకంటే ఎక్కువ ప్రాతినిధ్యం ఉందా అనిపిస్తుంది, ఒక మిత్రుని మాటల ద్వారా ఈ సంఖ్య 18-20% పైనే ఉంటుందట (!). స్వాతంత్ర్యానంతరం వీళ్ళందరూ ఉన్నత పదవుల్లో తిష్టవేసి మన సంస్క్రుతిని నాశణం చేయడానికి కంకణం కట్టుకున్నారు.

      నాకు ఆశ్చర్యం వేస్తుంది, బ్లాగులోకంలో కొద్దిమంది హిందూ వాదులు కూడా సాయిని ఏరకంగా గురుపరంపరలో కలిపేస్తున్నారో అని, అసలు వీరు దీని పర్యవసానాలను ఆలోచించారా లేక మూర్ఖమతాలవాళ్ళలాగ ఎవరో చెప్పారు కాబట్టీ నేను ఆమోదిస్తున్నాను అనుకుంటున్నారా? సాయిభక్తులు నిజంగా సాయిమార్గాన్ని అవలంబించాలంటె సాయి గుడిలో కేవలం సాయి విగ్రహంమాత్రమే ఉండాలి, ముస్లీంల ప్రకారంగా అందులో నమాజు కూడా చేయాలి, కావాలంటే ఒక అల్లా విగ్రహాన్ని పెట్టాలి,.... ఇంకా చాలా ఉన్నాయి, చెయ్యగలరా? ఇ

      చివరగా, అసలు షిర్డీ సాయిని పాపులర్ చెయ్యడంలో సత్యసాయి పాత్రతక్కువేమీ కాదు.

      Delete
    5. శ్యామలరావు గారు,మీరు ఉటంకించిన సుప్రీం కోర్టు నుండి తీర్పు తెప్పించబడింది అనే వ్యాఖ్య నాది కాదు.ఒక న్యాయవాదిగా గా ఉన్న నేను అలాంటి పొరపాటు వ్యాఖ్యలు రాయను.అది ఆంధ్రభూమి లో వచ్చిన ఆర్టికిల్ అని పైనే స్పష్టంగా చెప్పాను.గమనించగలరు.స్పందనకు ధన్యవాదాలు.

      Delete
    6. మల్లిబాబు గారు, "గురువు" కు మీరిచ్చే నిర్వచనం ఏమిటి?

      Delete
    7. గురువు గురించిన నిర్వచనాలు చాలా ఉన్నాయి. మీకంటే లేదా మన పెద్దల కంటే గొప్పగా లేదా కొత్తగా నేను చెప్పే నిర్వచనం అంటూ ఏమీ లేదు. దానికన్నా ముందు కొన్ని ఆలోచించాల్సిన ప్రశ్నలు.

      1. అసలు గురువు కి దేవుడికి తేడా ఏమిటి?
      2. గురువుకి శిష్యులు ఉంటారా లేక భక్తులు ఉంటారా?
      3. అసలు సద్గురువు అనే మాట ఉందా? గురువుల్లో 'సద్గురువు'లు ఉంటే (పురుషులందు పుణ్యపురుషుల్లాగ!) మిగతా సామాన్య వాచకం 'గురువు' చెడ్డగురువుని సూచిస్తుందా?
      4. దేవుడిని మనం గురువుగా చేసుకోవచ్చా లేక గురువుని దేవుడిగా చేసుకోవచ్చా? ఏది సమంజసం.
      5. మనం తరచుగా వాడే గురుః బ్రహ్మ.... లేక తల్లిదండ్రులు దేవుడితో సమానం అనే మాటకర్ధం వాళ్ళు దేవుళ్ళనేనా, వాళ్ళకి statues పెట్టి పూజించేయాలనేనా?

      పైన అడిగిన 5వ ప్రశ్నకి సమాధానం అంతా "భగవంతుడు ఏరూపంలో నైనా మనకు దర్శనం ఇచ్చే అవకాశం ఉంది" అనే హిందూ నమ్మకానికి ముడిపడిఉంది. మనం ఎప్పుడైనా మనం నమ్మకస్తులు అనుకున్న వాళ్ళనే నమ్ముతాం. ఒకప్పుడు ఒకానొక కాలంలో వ్యక్తికి సంభంధించినంతవరకూ అత్యంత ఆప్తులు నమ్మకస్తులు అయిన తల్లిదండ్రులు, గురువూ రూపంలో భగతవంతుడు వచ్చేఅవకాశం ఎక్కువకాబట్టి ఆ ఆలోచనచేసిఉండవచ్చు.
      పైనున్న కొన్ని ప్రశ్నలకూ సమాధానం చెప్పగ్aలిగితే మనం ఏంచేస్తున్నాము, ఏంచేయాలి అనేది అవగతమవ్వవచ్చు. ధన్యవాదాలు.

      Delete
  4. @ Narasimha Rao

    Hinduism: Religion or Way of Life?

    https://www.youtube.com/watch?v=VH3lhfJ-BC0

    ReplyDelete
  5. మరిక్క మాట "......మంచో చెడో లక్షలాది ప్రజలు సాయి భక్తులుగా మారిపోయారు. అది ఒక రకంగా మంచిదే కదా ? ఒక వేళా వీరంతా సాయి వైపు కాకుండా ఏ విదేశీ దేవుడి వైపో వెళ్లి ఉంటే ఏమి చేసే వారు? సాయి హిందువు అయినా కాకపోయినా స్వదేశీ బాబా ....".
    అదేకదా సమస్య. హిందువులలో కొద్ది జనాభాలో కొద్దిమందిని ఏదొక ఆశ చూపి డైరక్ట్ గా మతంమార్చవచ్చు. కొద్దిమంది ఆరకంగా లొంగరు. వాళ్ళని మొదట న్యూట్రల్ ఒపీనియన్ లోకి తీసుకెళ్ళి తర్వాత నెమ్మదిగా వాడికొంప కొల్లేరు చేయడం తేలిక. మీరుగమనిస్తే సాయిభక్తుల్లో ముస్లీంలు, క్రిస్టియన్ లు ఉండరు లేదా ఎవరైనా ఉన్నా అది మనీ సంపాదనకొరకు ఒక బిజినెస్ గా మాత్రమే.

    ReplyDelete
    Replies
    1. @ mallibabu

      మీరు వేసిన ప్రశ్నలలో మిగతావాటి గురించి నా అభి ప్రాయం తర్వాత చెపుతాను,ప్రస్తుతం 3 ప్రశ్న సంగతి చూద్దాం.

      శాస్త్రాలులో చెప్పిన దాని ప్రకారం గురువులు అనబడె వారు ఏడు వర్గాలుగ ఉంటారు. వారు :


      సూచక గురువు – చదువు చెప్పేవాడు
      వాచక గురువు – కుల, ఆశ్రమ ధర్మాలను బోధించేవాడు
      బోధక గురువు – మహామంత్రాలను ఉపదేశించేవాడు
      నిషిద్ధ గురువు – వశీకరణ, మారణ ప్రయోగాళు నేర్పేవాడు
      విహిత గురువు – విషయ భోగముల మీద విరక్తి కలిగించేవాడు
      కారణ గురువు – జీవబ్రహ్మైక్యాన్ని బోధించేవాడు
      పరమ గురువు – జీవాత్మ, పరమాత్మ ఒకటే అని ప్రత్యక్షానుభవాణ్ని కలిగించేవాడు.



      ఇందులో వ్యావహారిక జీవితం లో అందరికి అవసరమైన వారు సూచక గురువు అంటె చదువు చెప్పే వారు. ఈ సూచక గురువుల్లొ కొంత మంది నిషిద్ద గురువులు గా మారుతున్నారు . అంటె తమ వద్ద చదువు నేర్చే పిల్లలను మాయమాటలు చెప్పి వాళ్ళని లైంగికంగా కాని ఇతరత్రా కాని ఉపయొగించుకోవడం లాంటివి చేసే వారు. వీరు పాటాలు చెప్పే పంతుల్ల రూపం లోనే కాదు, ఆశ్రమాలలో బోధ గురువుల రూపాల్లోను, పార్టిల్లో సీనియర్ రాజకీయ నాయకుల రూపమ్ లోను ఉండవచ్చు. వీరి ప్రదాన లక్షణం ఏమిటంటె తమలోని జ్నానాన్ని తన శిష్యులను నష్టపెట్టడానికే ఉపయోగిస్తూ తద్వారా తాము లబ్ది పొందుతుంటారు. సాయి బాబా గారి విషయానికి వస్తే ఆయనను "సద్గురువు" అని సంబోదిస్తుంది బహూశా అయనను ఆయన భక్తులు లేక భక్తులు గా పిలువబడుతున్న ఏకలవ్య శిష్యులు,పైన చెప్పిన వారిలో "పరమ గురువు" లక్షణాలు ఆయనకు ఉన్నాయని బావించడం వలన "సద్గురు సాయినాద్ " అని పిలుస్తున్నట్లు ఉంది .



      Delete
    2. మంచివిషయం చెప్పారు, ధన్యవాదాలు. నాకు తెలిసినంతవరకూ లేక సచ్చరిత్రలోనూ కూడా సాయి ఎవరికీ "జీవాత్మ, పరమాత్మ ఒకటే అని ప్రత్యక్షానుభవాణ్ని కలిగించేవాడు" ఈ అనుభవాన్నిచ్చినట్టు గమనించలేదు. సాయి వీర భక్తిలెవరైనా ఈ విషయం మీద వ్యాఖ్యానిస్తే సంతోషం.

      Delete
  6. Dear sir can you define god.Please enlighten me about the difference between God and Guru.

    ReplyDelete
    Replies
    1. నా దృష్టిలో పైన చెప్పిన 7 రకాల గురువులలో "పరమ గురువు "ని దేవుని రూపంగా భావించవచ్చు . ఎందుకంటే జీవాత్మ, పరమాత్మ ఒకటే అని ప్రత్యక్షానుభవాణ్ని కలిగించేవాడు కాబట్టి . ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవలసింది ఏమిటంటే , జీవాత్మ , పరమాత్మా ఒకటే అని ప్రత్యక్షఅనుభవాన్ని కలిగించడం వేరు , రెండూ ఒకటే అని జ్ఞానం కలిగించటం వేరు . జనం కలిగి ఉన్నంత మాత్రం చేత భగవత్ దర్శన అనుభూతి పొందలేరు. ఉదాహరణకు ఆధునిక శాస్త్ర విజ్ఞానం వలన చాలామందికి ఈ సృష్టి అంతా అణువుల మయం అని , అన్నింటిలో ఉంది ఎలక్ట్రాన్ , ప్రోట్రాన్ , న్యూట్రాన్ లే అనే జ్ఞానం ఉంది. మనిషిలో అయినా పంది లో అయినా ఉన్న పదార్థం ఒకటే అని కూడా తెలుసు . అయినా మనిషిని కౌగలించుకున్నంత తేలికగా పందిని కౌగలించుకోలేరు . అదెంత పరిశుభ్రంగా ఉన్నా సరే ! మనిషిలో పందిలో లో ఉన్న పదార్థం ఒకటే కాబట్టియు ఇరువురూ బౌతికంగా ఒకటే వేరు కాదు అనే జ్ఞానం కలిగించేవాడు సూచక గురువు అయితే మనిషిని కౌగిలించుకోవడం ద్వారా ఏ అనుభూతిని పొందుతున్నారో , అదే అనుభూతిని పందిని కౌగిలించుకోవడం ద్వారా పొందవచ్చు అని ప్రత్యక్షఅనుభవం ద్వారా తెలియచేసే వాడు పరమ గురువు. ఈ సందర్భంగా బ్రహ్మం గారి జీవిత చరిత్రలో ఒక ఘట్టం గురించి చెపుతాను .

      బ్రహ్మం గారి శిష్యులకు సిద్దయ్య మీద చాలా కోపం ఉండేది అంట . ఎందుకంటే ఎంతో ఉన్నత కులాలకు , అందులో హిందూ సామాజిక వర్గానికి చెందిన ఇంత మంది శిష్యులు ఉండగా , ఒక దూదేకుల కులానికి చెందిన అన్యమతస్తుడు బ్రహ్మం గారికి ప్రియా శిష్యుడుగా ఉండడం వారికి కంటగింపుగా ఉండేది . ఇది గమనించిన బ్రహ్మం గారు తన శిస్యులకు సిద్దయ్యలో ఉన్న గొప్పతనం తెలియ చేయాలి అనుకున్నారు . ఒక రోజు అడవి మార్గాన తన శిష్యులతో కలసి ప్రయాణిస్తున్న వేళ ఎక్కడినుండో దుర్గంధం రావడం వలన శిష్యులు అంతా ముక్కులు మూసుకుని "చి,చి అంటూ నడుస్తున్నారు. బ్రహ్మం గారు ఆగి ఆ చేదు వాసన ఎక్కడి నుండి వస్తుందా అని చుట్టూ పరికించి చూడగా అక్కడ దగ్గరలో చచ్చి పది ఉన్న కుక్క కళేబరం కనిపించింది . దాని దగ్గరికి వెళ్లి చూస్తే అది ఎప్పుడో చావటం చేత కుళ్ళి పురుగులు పడి చాలా అసహ్యకరంగా ఉండి భయంకరమైన వాసన వెదజల్లుతుంది . అదే సరి అయినా సమయం అనుకున్న బ్రహ్మం గారు తన ఇతర శిష్యులను పిలచి అది కుక్క కళేబరం ని పంచ భక్ష్య పరమాన్నం గ భావించి భుజించమని ఆదేశిస్తే , ఛీ ఛీఅంటూ ఆమడ దూరం వెళ్లారు వారు. అదే పనిని సిద్దయ్య ని చేయమన్నప్పుడు , మారు మాట్లాడకుండా ,నిస్సంకోచంగా గురు స్మరణ చేస్తూ పురుగులు పడిన ఆ కుక్కను భుజించాడు . అతని ఆ సమయం లో కుక్క కళేబరం పంచ భక్ష్యాలుగా అనుభూతిని ఇచ్చిమ్ది . శాస్త్రీయ జ్ఞానం ప్రకారం చూసినా పంచ భక్ష్య పరమాన్నం లో అయినా , చచ్చిన కుక్కలో అయినా ఉన్నవి ఎలక్ట్రాన్ , ప్రోత్రాన్ , న్యూట్రాన్ లే అయినప్పటికీ మిగతా శిష్యులు అనుభూతిని పొందలేక పోయారు కాబట్టి అసహ్యించుకున్నారు . గురువును నమ్మిన సిద్దయ్యగారికి మాత్రమే ఆ అనుభావం కలిగింది . అంటే ఇక్కడ బ్రహ్మంగారు సిద్దయ్య గారికి పరమ గురువు అయితే , మిగతా శిష్యులకు సూచక గురువు మాత్రమే . సిద్దయ్య గారికి మాత్రం దేవుడు అయ్యాడు .

      ఇక్క సాయి బాబా గారు దేవుడా కాదా అనే విషయం లో సనాతన వాదులు చెప్పే దేవుడు నిర్వచనం వేరు . సాయి బాబాను నమ్మి కొలిచే వారు చెప్పే నిర్వచనం వేరు . అసలు దేవుడు అనే దానికి సర్వకాల సర్వావస్థలకు సరిపోయే సార్వత్రిక నిర్వచనం ఏదైనా ఉందా అనే దాని మీద నా అభిప్రాయం తర్వాత చెపుతాను. ఈ లోపు సాయి బాబా భక్తులు ,తత్వజ్ఞానులు ఎవరైనా , సాయిబాబా గారిని తాము ఎందుకు భగవంతునిగా కొలుస్తున్నామో చెపితే తెలుసుకోవాలని ఉంది .

      Delete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.