వైవాహిక రేప్ ల నిరోదానికి "వాత్సాయన సూత్రం " పనికి వస్తుందా?


                                                                           

ఈ  మద్య ఎందుకో కాని కొంత మంది  పురుషులకు స్త్రీల మీద కంటె , సజాతీయులైన పురుషుల మీదే ఎక్కువ లైంగిక ఆకర్షణ కలుగుతుండడం వలన , వారు తట్టుకోలేక తమకున్న ఓటు బలంతో ఆయా ప్రభుత్వాల మెడలు వంచి , తమకు అనుకూలంగా చట్టాలు తెచ్చుకుని , హాయిగా తమ వికృత కోరికలు (ప్రక్రుతి విరుద్దమైన) అమలు చేసుకుంటున్నారు . వారి మద్య పెండ్ల్లిల్లు ను కొన్ని దేశాలు చట్టాలు ద్వారా అంగీకరించాయి కాబట్టి , పెండ్లికి ఆయా దేశాల్లో నూతన నిర్వచనం ఇవ్వబడింది .ఈ  సృష్టికి కారకుడైన బ్రహ్మ దేవుడుకు "మగాళ్ళలో ఇలా పిదప బుద్దులు ఎందుకు పుడుతున్నాయో ఎంత ఆలోచించినా అంతుబట్టడం లేదంట .   దానితో భూలోకం లో ప్రక్రుతి విరుద్దమైన పనులకు కారణం ఏమిటో కనుక్కు  రమ్మని తన దగ్గర ఉన్న "వాత్సాయన " మహా మునిని భూలోకం కి పంపాడు అట.  ఆ ముని గారు భూలొకం అంతా మారువేషాల్లో తిరిగి , చివరకు కారణం కనుగొని దానిని బ్రహ్మ దేవుడికి వివరించాడు అట . అది విన్న బ్రహ్మ దేవుడు నివ్వెర పోయాడు అట.

  ఇంతకూ వాత్సయాన ముని గారు "సజాతి లైంగికాకర్షణ" కు మూల కారణం ఆ యా దేశాల్లో అమలవుతున్న "వైవాహిక రేప్ " ల చట్టాలే అని తేల్చేసారు . ఎందుకంటె ఆలుమగల మద్య ఏమున్నా , లేక పోయినా అవగాహన తో కూడిన సర్దు బాటు తత్వం ఉండాలి . అది లేక పోతే సంసారం సాగటం కష్టం. అందుకే భారతదేశం లాంటి దేశాల్లో "ఈడు జోడు " బాగుంటేనే వివాహం చేయాలి అనే సాంప్రదాయ విదానం ఉంది . ఇక్కడ ఈడు జోడు అంటె ఎత్తు , లావు అని కాదు . వరుడు హుషారు గలవాడైతే , అలాంటి వదువునే కట్టబెడితే వారి సంసారం జోడు గుర్రాల సవారి లాగా ఉంటుంది లేక పోతే గాడిద ,గుర్రాన్ని కలిపికట్టిన సవారి లాగా ఏది ఎటుపోతుందో తెలియని పరిస్తితి . ఈసురోమని మని ఈడిగలబడే   అబ్బాయికి ,నీరస పుల్లమ్మలను ఇచ్చి కట్టబెడితే అదీ దున్నపోతుల బండి లాగ అయినా  సంసారం సాగుతుంది కాని, చాకు లాంటి అమ్మాయిని ఇచ్చి చేస్తే ఏదో ఒక నాడు కాపురం కూలిపోక  తప్పదు. 

  వాతావరణం లో అతి వృష్టి , అనావృష్టి ఉన్నట్లే ,పురుషుల హుషార్ లో కూడా అదే సృష్టి ఉంది . అతి వృష్టి , అనావ్రుష్టికి మూల కారణం మెదడులో సమతుల్యత లేకపోవడమే . అనా వృష్టి మగాళ్ళతో భార్యలకు బాదలు ఉన్నా అవి బయటకు చెప్పుకోలేరు . కాని అతివృష్టి గాళ్ళను తట్టుకోవడం మహా కష్టం అయి పోతుంది అట. దీని ని నిరోదించడానికి  స్త్రీ వాదులు అంతా ఏకమై తీర్మానించింది ఏమిటంటె , "భర్త అయినా సరే , అనుమతి లేకుండా ఒంటి మీద చేయి వేస్తే అది "రేప్" క్రింద లెక్కే అని. దీనితో కొన్ని దేశాల్లో చట్టాలు చేయడం వలన , హుషార్ మొగుళ్ళు అంతా కటకటాల్లోకి వెళ్ళడం జరిగింది అట. దానితో పురుష వాదులు అంతా ఏకమై తీర్మానించింది ఏమిటంటె , అసలు స్త్రీ స్వబావం లోనే జడత్వం ఉంది కాబట్టి , వారి టైమింగ్ కి పురుషుల టైమింగ్ గి బ్యాలన్స్ కుదరడం కష్టం అవుతుంది కాబట్టి , సాటి పురుషుడు బాధలను , పురుషుడు అర్దం చేసుకున్నంతగా స్త్రీలు అర్దం చేసుకోవడం లేదు కాబట్టి , ఇకనుండి తమ జాతి వారినే పెండ్లి చేసుకోవడం అన్ని విదాల ఉత్తమం అని తేల్చారట. దీని వలన జైళ్ళకు వెల్లే బాదలు ఉండవు అనుకుని, సదరు పురుషవాదులు  పురుషులనే వలచి చేరువవుతుంటె , మేమేనా తక్కువా అని స్త్రీ వాదులు కొందరు స్త్రీలతో కాపురాలు చెయ్యడం మొదలు పెట్టారట. ఇది వాత్సాయన కమిషన్ కనుగున్న సత్యం. 

అంతా విన్న బ్రహ్మ దేవుడు "దీని నివారణకు మార్గం లేదా వాత్సాయనా "అంటె , ఒక్కటే మార్గం ఉంది అన్నాడు వాత్సాయను డు. అదేమిటొ చెప్పమని అడిగిన బ్రహ్మ దేవుడుకు వాత్సాయనుడు చెప్పినడి విన్నాకా మరింత నివ్వెర పోయాడు . అదేమిటంటే భూలోకంలో సజాతి సంపర్కాలకు భంగం కలుగని విదంగా , మరియు వైవాహిక రేప్ లకు ఆస్కారం లేని విదంగా ఉండాలంటె , వివాహాo అనగా  ఇద్దరు పురుషులు  ,మరియు ఒక స్త్రీ మద్య జరిగే తంతు  లేదా ఇద్దరు స్త్రీలు ఒక పురుషుడు మద్య జరిగే తంతు అని నిర్వచనం మార్చాలి . అంటె ప్రతి వివాహం లో స్త్రీ పురుషులతో పాటు, అదనంగా ఒక పురుషుడు కాని, లేక ఒక స్త్రీ కాని ఉండి తీరాలి . దీని వలన వైవాహిక రేప్ లు ఉండవు. స్పేర్ సిస్టం వలన ఆల్టర్నేటివ్ అవకాసం ఉంటుంది. వివాహంలో స్త్రీ, పురుషులు ఉంటారు కాబట్టి, వారి ద్వారా నేచ్రల్ కుటుంబ ఏర్పాటుకు బంగం కలగదు కాబట్టి , ఇది అన్నివిదాల ఉపయోగకరం అని చెప్పాడు వాత్సాయనుడు. ఇది పనికి వచ్చే సూత్రమేనా ?  అని ఆలోచనలో పడి పోయాడు బ్రహ్మదేవుడు. అయ్యా ! అదీ వాత్సాయన సూత్రం ! 
                                                          (1/5/2015 Post Republished).

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.