Posts

Showing posts with the label జగన్ సెక్యులరిజం

ఇంటిమీద మత చిహ్నం, చేతిలో మతగ్రందం పట్టుకుని తిరిగే వారు కూడా "మోడీ" గారిది మత చాందసం అంటే ఎలా?

                                                                  నిన్న వై.యస్.ఆర్. పార్టీ అద్యక్షులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు మీడియా ప్రకటణ ఒకటి ఏర్పాటు చేసి అందులో తన బవిషత్ కార్యా చరణ గురించి చెప్పారు. ఆయన చెప్పిన దానిలో అన్నీ రోటిన్ గా ఉన్నవే అయినా గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ నరెంద్ర మోడి గారి గురించి చేసిన వ్యాఖ్యలు కొంచం ఆశ్చర్యాన్ని కలిగించాయి.  ఆయన ద్రుష్టిలో మోడి గారు గొప్ప అడ్మినిస్త్రేటర్ అట! కానీ అయన గరి మత చాందసమే ఆయనలోని నచ్చని గుణం అట!ఈ మాటలు అన్న జగన్ గారికి అసలు మోడి గారి గురించి తెలుసా లేదా అనే అనుమానం కలుగుతుంది. ఏ మత చాందస వాది అయిన అన్ని వర్గాల ప్రజలతో శబాస్ అని పించుకోవడం కష్టం. కానీ మోడి గారు గుజరాత్ లోని అన్ని వర్గాల ప్రజ ఆదరాభిమానాలు చూరగొన్నారు. ఆయన పక్కా హిందూ వాది. ఆయనలోని ఆ హిందూ తత్వమే ఆయన్ని నిజమైన "సెకులరిస్ట్" గా ఉండేలా చేస్తుంది అనడం లో అతిశయోక్తి ఏమి లేదు.  హిందూ అనే జీవన విదానం సర్వ ఆరాదనా పద్దతులను సమానంగా ఆదరిస్తుంది. ఇందులో వైష్ణవం, శైవం, గాణపత్యం, శాక్తేయం, సాయిబాబీయం,అయ్యప్పేయం,బుద్దిజం, జైనిజం, సిక్కిజమ్ లాంటి శాఖలు ఉన్నాయి