Posts

Showing posts with the label చుంబన సమరం

కేరళ కు చెందిన దేవుని బిడ్డలు "చుంబన సమరం" ద్వారా తిరిగి "అదాం ,అవ్వ" ల స్వేచ్చ కావాలి అంటున్నారు !

Image
                                                                          క్రైస్తవుల  పవిత్ర గ్రందం అయిన బైబిల్ లో ఒక కధ ఉంది . సృష్టిలోని అది మానవులు అయిన ఆదాం , అవ్వలు దేవుని అజ్ఞ మేరకు "ఎదేన్స్" వనం లో స్వేచ్చ గా , దిగంబరంగా ఏ అరమరికలు లేకుండా సంచరిO చేవారు . అయితే వారిని ఎలా అయినా దేవుని శాపానికి గురి చేయించి , తన అధినంలో ఉంచుకోవాలని బావించిన సైతాన్ "సర్ప" రూపo లో వారి వద్దకు వచ్చి వారిని ప్రలోభపరచి , దేవుడు తినవద్దని సూచించిన "జ్ఞాన ఫలం" తినేలా చేస్తాడు . దానితో వారికి జ్ఞాన నేత్రం లు తెరచుకుని ,తాము దిగంబరంగా ఉన్న విషయాన్ని తెలుసుకుని , సిగ్గుపడి తమ శరీరాలను ఆకులుతో కప్పుకుంటారు . ఆ తర్వాత దేవుని శాపానికి గురి అయి అనేక కష్ట నష్టాలకు గురి అవుతారు . అది వేరే కధ.  అయితే ఇక్కడ విషయం ఏమిటంటే జ్ఞానం లేనంతకాలం మనిషి ఇతర జంతువుల మాదిరే ప్రక్రుతి ప్రేరపణానుసారమ్ నడిచాడు . కాని జ్ఞానం అబ్బాక  మాత్రం  కొన్ని సామాజిక నియమాలు ఏర్పరచుకుని  వాటి  ప్రకారమే జీవిస్తున్నాడు . ఈ నియమాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. కాకపోతే ఒక ప్రాంతంలో ఆచారంగా ఉన్నది మరొక ప్రాంతంలో