Posts

Showing posts with the label అమ్మ తల్లులు

స్త్రీ జాతిని హతమారుస్తున్న, ఆ వ్యాపారులెవ్వరో తెలుసా?

Image
                                                                                                ఇంకెవరు! సాక్షాతు మన "అమ్మ"లలో దాగి ఉన్న ’వ్యాపార ద్రుక్పదం" అనే బూతం. స్త్రీకి స్త్రీయే శత్రువు అనే నానుడి ఎలా వచ్చిందో తెలియదు కాని, ఈ దేశంలో చాల మంది తల్లులు ఆడ పిల్లలు పట్ల "అమ్మ తల్లులు" అవుతున్నారని చెప్పడానికి సిగ్గుపడాల్శిన అవసరం ఉంది.ఈ మద్య వరంగల్ కి చెందిన ఒక ప్రజా నాయకుడు తాను స్వయంగా చూసిన సంఘటనలు  గురించి చెపుతూ, కన్న తల్లులు తాము కన్నది "ఆడపిల్ల" అని తెలియగానే వారిని "వడ్ల గింజ" తో హతమారుస్తున్నారు అని చెప్పారు. నిజానికి ఇవన్నీ అధికార లెక్కలోకి రానటు వంటివే అయినా దాని పలితం మాత్రం మనకు తెలిసిపోతూనే ఉంది. అదే ఈ మద్య విపరీతగా పడిపోతున్న  స్త్రీ పురుషుల సగటు నిష్పత్తి. ఒకప్పుడు ప్రతి వేయి జనాబాకి976  మంది స్త్రీలు ఉంటే, ఇప్పుడు అది 942  కు పడి పోయింది. దీనికి ప్రదాన కారణం పైన తెల్పిన "అమ్మ తల్లులు", పట్టణాలోని "స్కానింగ్ సెంటర్" లు.    మగ పిల్లవాడు పుడితే "ప్లస్", ఆడపిల్ల అయితే "లాస్"