Posts

Showing posts from 2014

మనవు బ్లాగు మిత్రులకు ,శ్రేయోభిలాషులకు ,వీక్షకులకు ,అగ్రిగ్రేటర్లకు 2015 నూతన సంవత్సర శుభాకంక్షలతో ...... మనవు

మనవు  బ్లాగు మిత్రులకు ,శ్రేయోభిలాషులకు ,వీక్షకులకు ,అగ్రిగ్రేటర్లకు 2015 నూతన సంవత్సర శుభాకంక్షలతో ......    మనవు                                                                                    

ఇంట్లో పనిమనిషి సేవలు విలువ కంటె ఇంటి ఇల్లాలు చేసే సేవలు విలువ తక్కువంట !

Image
                                                                               ఈ రోజు టైమ్స్ అప్ ఇండియా వారు ఒక ఆర్టికిల్ ప్రచురించారు . అది తమిళ నాడులోని విరుదనగర్ జిల్లా ఏసిడెంట్ క్లైమ్స్ ట్రిబ్యునల్ వారు ఇచ్చిన తీర్పుకు సంబందించినది . దాని వివరాలు ఏమిటంటే , సెల్వి అనే ఒక మహిళ బట్టలు అమ్ముతూ నెలకు 5000/ రూపాయలు సంపాదిస్తూ ఉండేది . అయితే ఆమెగారు ఒక వాహన ప్రమాదం లోమ్రుతి చెందటం వలన ఆమె కుటుంబ సబ్యులు ట్రిబ్యునల్ లో నష్ట పరిహారం కోసం క్లైమ్ పెటిషన్ వేసారు . అయితే సెల్వి బట్టల వ్యాపారం చేస్తున్నట్లు డాక్యుమెంట్ ఆదారాలు ఏవి లేనందు వలన ఆవిడను సాదారణ గ్రుహిణిగా పరిగణించి ,ఆమె సంవత్సర ఆదాయం కేవలం 15,000 గాతిర్మాణించి ,తదనుగుణంగా 1,62,000 క్లైమ్ ను ఆమె కుటుంబ సబ్యులు పొంద వచ్చని తీర్పు చెప్పింది .  ఈ  రొజుల్లో ఇంట్లో పనిచేసే పని మనిషి రోజుకు కనీసం 100 రూపాయలు ఇవ్వనిదే పని చేయని పరిస్తితి . జాతీయ ఉపాది హమి పధకం  క్రింద 4 గంటలు పని చేసే వారికి కూడా సుమారు 125 నుంచి 150 రూపాయలు దినసరి వేతనం చెల్లిస్తున్న ఈ రోజుల్లొ ఇంటి కోసం నిరంతరం అలుపు ఎరుగక పని చెసే ఇల్లాలికి కేవలం రోజుకు 42 రూపా

రోజా గారు "ద్రౌపది " అయితే పాండవులు ఎవరు, ప్రతిపక్ష నాయకా!!!

Image
                                                                                                                                                                                                                                   నిన్న సోమవారం ఆంద్ర ప్రదేశ్ అసెంబ్లీలో ఒక ఆసక్తి కరమైన సంబాషణ చోటు చేసుకుంది . తెలుగు దేశం పార్టి వారి మిద ప్రతిపక్ష పార్టికి చెందిన M.L.A  మరయు ప్రముఖ చలన చిత్ర నటి రోజా  గారు చేస్తున్న విమర్శలకు , అదికార పార్టి  తరపున  శ్రీ బుచ్చయ్య చౌదరి గారు చేసిన వ్యాక్యలకు దీటుగా సమాదానం ఇచ్చె క్రమంలో ,రోజా గారిని ప్రతి పక్ష నాయకులు వారు "భారతంలో ద్రౌపది" గా వర్ణించారు . దీనితో అధికార పక్షం వారే కాకుండా , ప్రతిపక్షం వారు కూడా ఈ పోలిక అంత సమంజసంగా లేదు అని అనుకున్నారట. రాజకీయ వ్యాఖ్యానాలలో  విషయ విశ్లేషణ కంటె తమ తమ పార్టీల ఆసక్తులు కాపాడుకోవడమే ప్రదానాంశం గా ఉంతుంది . అందుకని రాజకీయ నాయకులు చేసే ప్రకటనలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వవలసిన పని లేదు . కాని నేటి రాజకీయ  నాయకులను  పురాణ పురుషుల , లేక సాద్విమ తల్లులతో పోల్చేతప్పుడు , వెనుకా ముందు ఆలోచించి పోలిస్తే

అన్న "బంగారు కొండ " అయినంత మాత్రానా , వదిన "వజ్రాల గని " కావాలని రూలేమైనా ఉందా ?, ?

Image
                                                                            "మానవ సంబoదాలు  అన్నీ ఆర్దిక సంబందాలే " అని అన్నారు మార్క్స్ మహాశయుడు . అందరి విషయం లో ఇది నిజమైనా కాకపోయినా , దివంగత సంగీత దర్శకులు " చక్రి " గారి కుటుంభ సభ్యుల విషయం లో ఇది నిజమే అనిపిస్తుంది .   సాదారణంగా ఇంట్లో పెద్ద మరణిస్తే , వారి తాలూకు ఆస్తి పంపకాలు విషయంలో , కుటుంబ సభ్యుల మద్య గొడవలు ఉంటె వాటి గురించి మాట్లాడడానికి కనీసం 11 రోజులు అంటె చని పోయిన వారి ఖర్మ కాండ , దశదిన ఖర్మ యావత్తు అయిన దాక వేచి చూస్తారు . ఎవరైనా తొందరపడిన  కుటుంబ పెద్దలు, కుల పెద్దలు, స్నేహితులు అటువంటి వారిని మందలించి , దశ దిన ఖర్మ అయ్యే దాక ఆగాలని , అలాగే చనిపోయిన వారి ఆత్మ శాంతీ కోసం కుటుంబ సభ్యులు అందరూ కలసి కార్యక్రమాలు పూర్తీ చేయాలని సలహా ఇస్తారు.   మరి అటువంటి సలహా  ఇచ్చే పెద్ద మనుషులు ఎవరూ , సుప్రసిద్ద సిని సంగీత దర్శకులు " చక్రి " గారి కుటుంబ సభ్యులకు లేనట్లుంది . అందుకే అయన గారి బార్య అవివేకంగా తన భర్త తరపు  కుటుంబ సబ్యుల పై  మానవ హక్కుల కమీషన్ లో పిర్యాదు చేస్తున్నా , అలాగే చక్రి గార

కోడి గుడ్ల కోసం కోరి గర్భం తెచ్చుకున్నామన్న "దేవుని బిడ్డలు"!!!

Image
                                                                  వారు గోదావరి ఖనికి చెందిన 5 గురు మహిళలు .విశ్వాసులు  అందరికీ ఉన్నట్లే వారికీ ఒక దేవుడు ఉన్నాడు . వారు ఆ దేవుడి గురించి యమ ప్రార్ధనలు చేస్తే , వారి ప్రార్దనా దీక్షకు మెచ్చి వారి దేవుడు ప్రత్యక్షమయ్యాడు . ప్రత్యక్షమై " ఏమి కావలయును అడుగండి " అని అనగా " మాకు కడుపులు కావలయును  దేవా " అని తమ మనసులోని కోరికను తెలియ చేసారట . అయితే ఇందులో తిరకాసు ఏమిటంటె  ఆ 5 గురు మహిళల్లో ఒకరికి ఆరోగ్యా కారణాల చేత గతం లో గర్భ సంచి తీసివేస్తే , మరొకరికి కుటుంభ నియంత్రణా పదకంలో బాగంగా ఆపరేషన్ చేసారట . అందుకే వారి దేవుడికి కొంత అనుమానం వచ్చి " ఇప్పుడు గర్భం లు ఎందుకు " అని ప్రశ్నించగా , తమ కాలనీలో గర్భవతులకు మాత్రమే , ప్రభుత్వం వారు రోజూ గుడ్లు , పౌష్టిక ఆహారం ఇస్తున్నారు కాబట్టి , అవి కావాలంటే " కడుపులు కంపల్సరి " అనే సరికి తెల్ల బోయిన వారి దేవుడు " అటులనే కానిమ్ము " అని వెళ్ళిపోయాడు అట.                  ఇక ఆ దేవుడి వరం తో ఉబ్బి తబ్బిబ్బయిన ఆ దేవుని బిడ్డలు , ఆశా వర్కర్స్ దగ్గరకు వెళ

రాజీవ్ గాందీ గారి పేరు తీసివేసి "రాస లీలల పార్క్ " అని పెడితే , అక్కడా "మీడియా పాయింట్ " పెట్టుకునే వారుగా !!!?

Image
                                                                                  జంతువులు ఉన్న స్వేఛ్చ మాకు లేదా ? అని ఈ మద్య కొందరు జంతు ప్రేమికులు- అంటె జంతువులను ప్రేమించే వారు కాదండోయి , జంతువుల్లా ప్రేమించుకునే వారు అని -"కిస్ అఫ్ లవ్ " అనే కార్యక్రమం చేపట్టి పబ్లిక్ గా ఎడా పెడా ముద్దులు పెట్టేసుకున్నారు . పాపం అక్కడా వారిని పోలిసులు వదలలేదు . అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకువెళ్ళి వదిలేశారట . అదే ప్రేమికులు విజయవాడ లోని రాజీవ్ గాందీ పార్కులోకి వెళ్లి అక్కడి నిర్వాహకులకు అంతో ఇంతో ముట్టచెపితే , కావాల్సినంత సేపు చేసుకోవచ్చు అట ,రోమాన్స్ ! కాకపోతే ఇక్కడ ఇలా జరుగుతుండడం మీడియా వారికి అస్సలు నచ్చడం లేదట . బయట రాజీవ్ గాందీ గారి పేరు పెట్టి లోపల ఈ రాసలీలలు ఏమిటి ? అని తెగ పీలై పోయి , అదే పార్కుకు వచ్చే వారిని కొంతమంది అభిప్రాయం అడిగితే , మీడియా వారే కరెక్టు అంటున్నారట .    అందుకే ఈ మీడియా వారి కోరికను మన్నించి , ప్రబుత్వం వారు విజయవాడ లోని రాజీవ్ గాందీ పార్కుకు ఉన్న రాజీవ్ గాందీ గారి పేరు తొలగించి , " రాసలీలల పార్కు " అని పెడితే బేషుగ్గా ఉంటుంది . ఎలాగూ పేరు

మనసు పారేసుకునే అమ్మాయిలను "రేప్ " చెయ్యడం ఎందుకురా రేపిస్ట్ వెదవ !

Image
                                                                                 వీడు ఒక కాబ్ డ్రైవర్ . ఉండేది డిల్లీలో . పేరు శివ కుమార్ యాదవ్ . U.P లో ఒక పల్లెటూరిలో ఉండె ఇతగాడికి తన అందం మీద నమ్మక్కం తో కూడిన మక్కువ అట. అతని నమ్మక్కం ఏమిటంటె ఎలాంటి అమ్మాయి  అయినా తన అందం చూసి మనసు పారేసుకుని , ఠక్కున తన ఒళ్లో వాలతారని . మరి అటువంటి బావాలు ఉన్న ఇతగాడు తన ఊరిలో 2003 లో ఒక రేప్ తో తన క్రిమినల్ కార్యకలాపాలు మొదలు పెట్టాడు . వీడిని చూసి మనసు పారేసుకునే వారు ఆ ఊరిలో ఉన్నారో , లేదో తెలియదు కాని ఊరంతా ఏకమై వీరబాదుడు బాదితే డిల్లీలో వచ్చి పడ్డాడు . అక్కడ్నుంచి వీది బ్రతుకంతా రేప్ ల మయమే.            జీవనాదారమ్ కోసం కాబ్ డ్రైవర్ అవతారమెత్తి న ఇతడు , ఒంటరిగా మహిళా పాసెంజెర్ లు ఎక్కితే చాలు వారిని నిర్మానుష ప్రదేశానికి తీసుకు వెళ్లి , వారిపై అత్యాచారం చేసే వాడు. అలా ఆతను చేసిన రేప్ లు పదుల సంఖ్య లో  ఉన్నాయని తెలుస్తుంది . ప్రాణం కంటే మానం కే ఎక్కువ విలువ ఇచ్చే భారతీయ స్త్రీలు , పాపం తమ మీద జరిగిన అత్యాచారాన్ని ఎవరికీ చెప్పుకోలేక తమలో తామే కుమిలిపోయారు. దీనితో ఈ వేదవ ఆగడాలు మరి మితి మీరి

"రోడ్ సేఫ్టీ " కి , షాపింగ్ మాల్ లో వేసిన ఈ "లత్కోరి డాన్స్ " కి ఏమైనా సంబందం ఉందా!!?

Image
                                                                            యువత లో పబ్లిసిటీ మానియా బాగా పెరిగిపోతుంది .భారత దేశంలో సోషియాలజీ మేదావులు కలలు కన్న " సోషలిజం " రాలేదు కాని ,  టెక్  మేదావులు సృష్టించిన  "సోషల్ మీడియా" మాత్రం బాగా వ్యాప్తిలోకి వచ్చింది . దాని పుణ్యమాని , సెల్ చేతిలో ఉంటె చాలు దేనినైనా ఒక దానిని క్లిక్ మనిపించడమ్ , దానిని పేస్ బుక్  లో పెట్టి , లైక్ ల కోసం ఎదురు చూడడం ! దీని కోసం అపర దాన కర్ణులు గా, కరుణామయులుగా అవతారమెత్తి , సోషల్ మీడియాను రంజింప చేస్తున్నారు .    ఇక చదువు " కొంటున్న " పిల్లలు  కొంతమందికి ఒక గొప్ప ఆలోచన వచ్చినట్లుంది . "విదేశి వీది నాట్యం" అయిన "ఫ్లాష్ మాబ్ " పద్దతిలో తమ లోని ప్రావీన్యతను బయటకు చాటాలి అనుకుంటున్నారు . ఇదివరకు ప్రజా కళలు పేరుతో "వీది ప్రదర్శనలు " ఇచ్చి ప్రజలను చైతన్యం చేసే వారు చదువుకునే పిల్లలు మరియు కళాకారులు  . అవి లో క్లాస్ ప్రదర్శనలు లాగా1 అనిపించాయేమో , ఈ పోష్ కల్చర్ పాపలు , బాబులు కలసి తమలోని పైత్యపు కళలను ప్రదర్శించడానికి విదేశి పద్దతిని ఎన్నుకుని ద

ఉడతలు పట్టె వారు ఉపాద్యాయులు అయితే, " విద్యార్దిని చెర -అబార్షన్ సదా " అనేదే గురూపదేశం !

Image
                                                                                          మానవ జన్మ ఎత్తాకా , గురువు స్తానం పొందాకా కొంచమైనా ఆ స్తానానికి గౌరవం కలిగించే పనులు చేయాలి . అది మరచి పోయి , తమకున్న వయసు స్తాయిని  ని కూడా   పట్టించుకోకుండా  తమ దగ్గరకు వచ్చిన కూతురి  వయసున్న విద్యార్దినిని  చెరచడమే కాకుండా , మూడు సార్లు అబార్షన్ చేయించి ఆమె మృతికి కారకులయ్యే వారిని ఏమని సంభోదించాలి ? వీది రౌడీల కంటే హీనంగా ప్రవర్తించిన ఈ "ఉపాద్యాయుల ఉదంతం" కనండి .                              చిత్రంలో కనిపించే వారిని చూడండి . వారి ఇద్దరి పేర్లు ప్రసాద్ లే ! ఇరువురూ ఉపాద్యాయ వృత్తిలో ఉన్నవారే ! ఇరువురూ తండ్రి వయసు ఉన్న వారే ! మరి అటువంటి వారు చేయదగిన పనేనా ఇది? క్రిష్ణా జిల్లా , చల్లపల్లి లోని వక్కలగడ్డ హైస్కూల్లో పని చేసిన రిటైర్డ్ హెడ్మాస్టర్ ఒక మైనర్ విద్యార్దిని ని చెరబట్టి తన కామవాంచలకు బలిచేస్తుంటె , అది చూసిన మరో ఉపాద్యాయుడు , ఆ బాలికను రక్షించడానికి బదులు , బ్లాక్మెయిల్ చేసి తనూ పశువులా ఆ అమ్మాయి పై అత్యాచారం చేసే వాడట. దాని వలన ఆ మైనర్ విద్యార్దినికి గర్భం వస్తే ఒక స

రోజా సిస్టర్ నోటికి , రోహతక్ సిస్టర్స్ ధాటికి , "మగాళ్ళు " ఎలా డంగై పోయారో చూడండి !

Image
                                                                                     ఆడపిల్లలు కు మగాళ్ళకు ఉన్నంత స్వాతంత్ర్యం ఉంటె వాళ్ళూ మగాళ్ళకి ఏ మాత్రం తీసిపోరు. అది మాటల్లో అయినా సరే ! చేతల్లో అయినా సరే!                ఉదాహరణకు T.V 9 లో ఒక చర్చ సందర్బంగా తెలుగుదేశం నాయకుడు అయిన శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారిని ,  సినీ నటి రోజా గారు ఎంత మాట అందో క్రింది విడియోలో చూడండి . పాపం మానవుడు దెబ్బకు డంగై పోయాడు. ,                          అలాగే ఈ మద్య డేరింగ్ సిస్టర్స్ అని పిలువబడిన " రోహతక్ " సిస్టర్స్ అనే ఇద్దరు అక్కా చెల్లెళ్ళు , బస్సులో తమను  ముగ్గురు మగాళ్ళు వేదించారని చెప్పి , అందులో ఒకడిని బెల్ట్ పెట్టి ఉతికితే , వాళ్ళు దెబ్బకు దడుసుకుని బస్సు దిగిపోయారు .ఇదంతా సోషల్ మీడియలో హల చల్ చేసే సరికి  ఆ దెబ్బతో ఆ సిస్టర్స్ కి  గొప్ప పేరు ప్రశంసలు దేశ వ్యాప్తంగా వచ్చాయి . హర్యానా ప్రభుత్వం అయితే ఏకంగా వారి పేర్లను రాష్ట్రపతి  అవార్డులకు సిఫార్స్ చేసింది . అప్కోర్స్ నేను కూడా వారి దైర్య సాహసాలు మెచ్చుకుంటూ ఒక టపాను పెట్టాను  అనుకోండి .     అయితే గమ్మత్తుగా ఆ దెబ్బలు

ఆలూ మగలు ఎలా ఉన్నా , పడక గది లో "అది" లేక పొతే , 'అంతా హ్యాపీస్ ' యే నంటా !

Image
                                                                          పండంటి కాపురానికి పది సూత్రాలు అని సినిమా ఒకటి ఉన్నట్లుంది . అందులో రచయిత ఏమి చెప్పాడో కాని , కాపురం పది కాలాలు పాటు స్వీట్ గా , హాట్ గా ఉండాలంటే , చైనా సాంప్రాదాయక పద్దతి అయిన "పెంగ్ షుయి అష్ట  సూత్రాలు" పాటిస్తే  ఏ కష్టాలు లేకుండా కోన సాగుతుంది అట. అవేమిటో తెలుసుకుందాం.    పెంగ్ షుయి 8 సూత్రాలు ముక్యంగా దంపతుల పడక గదిని ఉద్దేశించి చెప్పినవే! దంపతుల మద్య ప్రేమతో తో పాటు కూసింత ఆకర్షణ , వ్యామోహం లు ఉంటే ఆ కిక్కే వేరు కదా! ఆ కిక్కు లు ఇంట్లో లేకనే కదా చాలా మంది మగాళ్ళు వీదుల్లో పడేది . అలా అంటె స్త్రీల సంగతి ఏమిటి అని మాత్రం అడక్కండి . ప్రతి దాంట్లో సమానత్వం అనేది ఒప్పుడు పనులకే తప్పా , తప్పుడు పనులకు వర్తించదు . అంతే ! ఇక పడక గదికి వర్తింపచేసే    పెంగ్ షుయిఅష్ట సూత్రాలు(చిట్కాలు ) ఇవి!      1).  "చిందర వందర ఇల్లు , చింతలకు పుట్టిల్లు "                  మన పెద్దలు ఎకానమీ ని ద్రుష్టిలో పెట్టుకుని కాబోలు  "ఇల్లు  ఇరకటం , అలీ మర్కటం లాగా ఉండాలి" అన్నారు . అప్కోర్స్ చాలీ చాల

అలాంటి ఖతర్నాక్ చట్టాలు భారత్ లో లేవని బాదపడుతుంది కాబోలు ఈ టెన్నిస్ స్టార్ !

Image
                                                                                ఆమె గారు ఒక గొప్ప క్రీడాకారిణి . ఆమె పుట్టింది భారత్ లో మెట్టింది పాకిస్తాన్లో. ఆమె గారిమీద, భారత జాతీయ జెండాను అవమానించిందన్న ఆరోపణలు ఉన్నా , భారత్ దేశం ఆమెను ఏమి అనలేదు. పై పెచ్చు ఆమెకు మన రాష్ట్రం "తెలంగాణా బ్రాండ్ అంబాసిడర్ " గా ప్రకటించి కోటి రూపాయలు నజరానా ప్రకటించింది . తెలంగాణా కోసం పోరాటం చేసిన "విమలక్క " లాంటి అక్కలు ను కాదని ఇలాంటి "క్రీడా చుక్క" లకు బ్రాండ్ అంబాసిడర్ పదవి ఇచ్చినప్పుడు కూడా  బారత్ సంతసించిందే తప్పా వేరు మాట అనలేదు. అలాంటి ఆవిడ గారు ఐక్యరాజ్య సమితిలో ఏదో గౌరవం దక్కిందని చెప్పి , పుట్టింటి భారత్ గురించి అంత మాట అంటుందా? ఆమె ఏమి అందో చోడండి.                                                                           నిజంగా భారత్ లో మహిళా స్వేచ్క కు ఆటంకం కలిగించే చట్టాలు ఉన్నాయా? ఎన్నో చట్టాలు మహిళలకు అండగా ఉండి , కొన్ని సార్లు కుటుంబ  హక్కులను కాల రాస్తున్నా , ఆ చట్టాలను కొనసాగిస్తున్నామే తప్పా రద్దు చేయమని ఎవరూ కోరుకోవటం లేదు. సమాజంలో జరి

"రంజింప"చేయటానికి మగతనం చాలినా , పరిపూర్ణ నిత్యానందుడు కావాలంటే "మొగుడు తనం" కావాలి!

                                                                  మగతనం వేరు! మొగుడు తనం వేరు! ప్రతి మొగుడిలో మగతనం ఉంటుంది . కాని ప్రతి మగాడిలో మొగుడి తనం ఉంటుందన్న గ్యారంటి లేదు. మగాడు స్త్రీ కి తాత్కాలిక సుఖం మరియు తాత్కాలిక రక్షణ  మాత్రమే ఇవ్వగలడు  . కాని మొగుడు శాశ్వత సుఖం తో పాటు, శాశ్వత రక్షణ తన స్త్రీకి మాత్రమే కాక , మొత్తం కుటుంబానికి ఇవ్వగల దమ్మున్న వాడు . ఒకవిధంగా మగాడు ఆప్ట్రాల్ మాన్ అయితే మొగుడు "ప్యామిలీ మాన్". వందమంది స్త్రీలను రంజింపచేసే మగతనం కన్నా , కుటుంబ రక్షణకు ఉపయోగపడే మొగుడుతనమే అన్నింటికి అన్నా మిన్న. అందుకే హిందూ జీవన విదానంలో " గృహస్తునికి " అంత ప్రాదాన్యం ఇచ్చింది . మొగుడు కానిదే  మగాడు కి పరిపూర్ణత రాదు.    మొన్న వివాదా స్పద స్వామీ నిత్యానందులు వారిని డాక్టర్ లు " మగాడు " గా డిక్లేర్ చేసారట!అయితే ఎవరికీ లాభం ?రేప్ లు గట్రా జరిగితే నష్టాలు తప్పా , కేవల మగతనం తో సమాజానికి ఒరిగిందేమి లేదు.  ఆశ్రమ జీవన విదానం లో కావలసింది కేవల "మగతనం"కాదు.   సన్యాసి కావాలంటే ముందు సంసారి కావాలి . సంసార జీవితo లో పరిపూర్ణత పొంది

అత్తింటి ఆరళ్ళు పడలేక పుట్టింటికి చేరిన తమిళ నటి "కుష్బూ "

Image
                                                                        ఆమె గారు ఒక మహా నటి ! పెండ్లికి ముందు సెక్స్ తప్పుకాదన్న తెగువ ఆమె గారి సొంతం . అంతటి దీరవనిత నిన్ననే పార్టి మారింది. ఈ మద్య చాలా మంది   ప్రతిపక్ష పార్తీల్లో పనిచేయాలంటే తెగ ఇబ్బంది పడిపోతున్నారు . 5 ఏండ్లు ఏ పదవీ లేకపోతే ప్రజలకు సేవచేసే దేలా ? అని యమ మదనపడి పోయి , నిద్ర పట్టక , చక్కగా నిద్ర పోతున్న  తన అనుచర గణాన్ని, లేపి మరీ సమావేశాలు నిర్వహిస్తే , పాపం వారు ఏమి అంటారు!? తమ నాయకుడి అదికార కాంక్షకు జై అంటారు కదా! అదిగో అలా అనిపించుకుని "ప్రజల కోరిక మేరకు అధికార పక్షంలో చేరుతున్నానహో" అని డంకా బజాయించి మరీ అధికార పక్షంలో చేరి పోతున్నారు . మరి అటువంటి సమయంలో ఈ నటీమణి గారు కోరి కోరి ప్రతిపక్ష కాంగ్రెస్ లో చేరడం వింతే మరి !   దానికి కారణం ఏమిటమ్మా , అని విలేకరులు అడిగిన ప్రశ్నకు " కాంగ్రెస్ నాకు సొంత ఇల్లు లాంటిది " అన్నదట ! వారెవ్వా క్యా బాత్ హై. ! అంటే , కాంగ్రెస్ సొంత ఇల్లయితే , ఇన్నాళ్ళు పని చేసిన D.M.K  అత్తారిల్లా? అత్తారింట్లో ఆరళ్ళు తట్టుకోలేకే ఈ నటీమణి పుట్టింటికి వచ్చిందా ? గతంలో స

ఇల్లాలు ఇంటికి రావటం లేదని ఇంటికే నిప్ప్పు పెట్టిన "వరద రాజులు"

                                                                                  సంసారం అన్నాకా కలతలు ఉంటాయి . అందులో బాగంగా అలకలూ ఉంటాయి . అలగడం ఆడవాళ్ళ జన్మ హక్కు లాంటిది . వారిని అనునయించి  అలకకు కారణం కనుగొని  కనుగొని వారి కోర్కెలు తీర్చిన వాడె భర్త! భర్త అంటె భరించువాడు అని అర్దం. శ్రీ కృష్ణుడు అంతటి వాడె సత్యబామ అలక తీర్చడం కోసం ఆమె ఎడమ కాలి  తో తన్నించుకోవలసి వచ్చింది . ఆప్ట్రాల్ మనమెంత?!              పెళ్ళాం అలిగి పోయి ఇంటికి రాలేదనే కోపంతో తనకూ కోపం వచ్చి అసలు ఉంటున్న ఇంటికే నిప్పు పెట్టుకుంటే ఎలా ఉంటుంది ? ఇదిగో అచ్చం ఖమ్మం జిల్లా అశ్వారావు పేట   వరద రాజులు చేసిన పని లాగే ఉంటుంది . వెనుకటి కేవడో ఎలుక మిద కోపంతో గుడిసెకు నిప్పు పెట్టుకున్నాడట! అలా ఉంది ఇతని పరిస్తితి! వరద రాజులు భార్య ఇవాళ కాపోతే రేపు వస్తుంది . ఆమె వచ్చిందని కాలిపోయిన ఇల్లు  ప్రత్యక్ష మవుతుO డా? లేదు కదా? మొన్న ఒకాయన పెళ్ళాం విడాకులు ఇచ్చిందని  బంగారం లాంటి తన ఇద్దరు పిల్లల్ని చంపి తను రైలు క్రింద పది ఆత్మ హత్య చేసుకున్నాడు . పైగా ఆయనొక గురువు గారు . ప్రోపెసర్  అయితే నేమి తన లోని కోపాన్ని జయించ

ఒక్క రోజులో 6000 పైగా పేస్బుక్ క్లిక్ లు , 1600 పైగా బ్లాగ్ వీక్షకుల లుక్ లు సాదించిన "మనవు" బ్లాగ్ పోస్ట్ !

Image
                                                                              కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు! మనిషి కుక్కను కరిస్తే వార్త! అనేది పత్రికా ప్రపంచంలో తలలు పండిన వారి ఉవాచ ! నిజమే మరి! పనికొచ్చే వార్తలు , వాటి మీద విశ్లేషణల పేరుతో రోజూ ఏదో ఒకటి బ్లాగుల్లో ప్రచురిస్తున్నా వీక్షకులు మాత్రం కొంచం వెరైటి గా ఉన్న దానిని ఎక్కువుగా ఇష్టపడుతుంటారని నాకు బ్లాగర్ గా అనుభవమే . బ్లాగులు ఎంత వీక్షకాదరణ పొందినప్పటికి రొటీన్ మాటర్ ని పెద్దగా పట్టించుకోరు అనేది కూడా వాస్తవం!ఒక్కొక్క సారి మనం ఎంతో మంచి విషయం పది మందికి పనికొచ్చే దానిని ప్రచురిస్తున్నాం అని హుషార్ గా పోస్ట్ దానికి వచ్చే స్పందన చూసినప్పుడు బోల్డంత నీరసం వస్తుంది . ఎందుకంటే "రోటీన్ మాటర్ " అనే ద్రుష్టి తో అది పది మందిని ఆకర్షించ లేక పోవడమే . అలా అని ఆకర్షించే మాటర్ పేరుతో ఏది పడితే అది పోస్ట్ చెయ్యాల్సిన అవసరం చాలా మంది బ్లాగర్ లకు లేదు. బ్లాగ్ లను ఏ ఉద్దేశ్యంతో నిర్వహిస్తున్నామో , దానికి కట్టుబడి ఉన్న దానినే కొంత ఆకర్షనీయంగా మార్చి , పోస్ట్ చేయగలిగితే చాలు అనుకుంటున్నాను. అన్నింటికి వేల వీక్షణాలు రావలసిన అవస

ఈ "దెయ్యం " డైరెక్టర్ కి దేవుళ్ళు గురించి ఏందుకు?

Image
                                                                అతనొక సినిమా డైరెక్టర్ .దెయ్యాల మీద , రౌడీలు మీద సినిమా లు తీసి బాగానే సంపాయించుకున్నట్లుంది .  దేవుడు అంటే బొత్తిగా నమ్మక్కం లేదని  చెపుతుంటాడు . సరే మంచిది. బారతావనిలోబోల్డంత  మంది నాస్తికులు ఉన్నారు , అందులో ఇతనూ ఒకడనుకుందాం . కాని దేవుళ్ళు అంటే నమ్మకం లేని వాడు నమ్మకం లేనట్లు ఉండాలి కాని దేవుళ్ళను నమ్మే భక్తులను ఉద్దేశించి పిచ్చి ప్రేలాపనలు చెయ్యడం , "సైతాన్ "  సలహాలు ఇవ్వడం ఎందుకంటా ?           బెజవాడలో చదువుకునే రోజుల్లో బాగా రౌడీ గాంగ్ లతో తిరిగాడంట! వారి చరిత్రలనే సినిమా కెక్కించి జనాల డబ్బు దండుకున్నాడు. అది అతని సినిమా హక్కుల్లో బాగం కాబట్టి O.K . కాని దేవుల్లందరిని సమానం గా పూజించే తెలంగాణా భక్తులను కించ పరచే మాటలు మాట్లాడతాడా? దేవుళ్ళ మద్య ప్రాంతీయ బేదాలు ఉండాలని చెపుతాడా? భక్తులకు సప్తగిరి అయినా యాదగిరి అయినా ఒకటే అయినప్పుడు , తెలంగాణా వారు యాదగిరికి , ఆంద్రా వారు సప్తగిరికి పరిమితమవ్వాలని బోడి సలహా ఇస్తాడా? అవునులే! దెయ్యాలు సినిమాలు తీసి తీసి ఈయన మైండ్ దొబ్బినట్లుంది . లేక పోతే ప్రచారం లేక