Posts

Showing posts with the label మద్దిగుంట తిరుపతయ్య

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

Image
                                                                                             చరిత్రలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. జరుగుతున్నాయి. వాటిని అర్థం  చేసుకోవడం అన్ని సార్లు,అందరికి సాద్యపడక పోవచ్చు.ఒక భొయవాడు "రామాయణ కర్త" గా మారినా,ఒక్క పక్కా నాస్తికుడు,"భక్త కన్నప్ప" గా మారినా దాని వెనుకాల  ఏదో ఒక పరమార్థం  తో కూడిన "దైవ లీల" ఉంటుంది.మహ మహా సైంటిస్ట్ లు సైతం వ్యక్తిగతంగా  దైవం మీద నమ్మాకం కలిగి ఉన్నారంటే వారిలో స్వార్థమో, భయమో ఉందని కాదు. అదొక తెలియని ఏదో ఒక శక్తి వారి వెనుకాల ఉండడమే.దీనికి ప్రబల ఉదాహరణే మా తండ్రి గారి జీవితం.     కీ.శే. మద్దిగుంట తిరుపతయ్య     మా తండ్రి గారు కీ.శే. మద్దిగుంట తిరుపతయ్య గారిది  క్రిష్ణా జిల్లాలోని కవులూరు అనే గ్రామం. అయన ఒక వెనుక బడిన తరగతికి చెందిన వ్యక్తి.ఆయన తాతలు గుంటూరు జిల్లాలో బ్రాహ్మాణులు కు "అగ్రహారాలు దానం చేసిన చరిత్ర ఉన్నా , కాల క్రమేనా ఆస్తులు హరించుకు పోవడం చేత, మా తాత గారు కవులూరులో బందువుల దగ్గరికి వచ్చి వ్యవసాయ కూలీగా జీవనం సాగించారు.