Posts

Showing posts with the label సునందా గారి కేసు

మా మద్య విబేదాలు లేవని మీడియా ముందు చెప్పిన 24 గంటల లోపే లోపే ఆమె ఆత్మహత్య చేసుకోవలసిన అవసరం ఏమిటి?

                                                         కేంద్ర మంత్రిశశిదరూర్ గారి బార్య సునందా ఆత్మహత్య కేసు లో జరిగినట్లు ఏ సామాన్య పౌరుడు కేసులోనో జరిగితే ఈ పాటికి భర్త  స్తానం లో ఉన్న వారు  అతని బందువులు పోలిస్ వారి నరకాన్ని  చవి చూసి ఉండే వారు. ఆమె గారు చేసుకున్న ది ఆత్మహత్యే అని ఒక వేళ అనుకున్నా  దానికి కారణం బహిరంగమే . ఆత్మహత్యకు కు ముందు ఆమె గారు శశిదరూర్ గారి ప్రియురాలితో గొడవపడడం , అది కూడా బహిరంగంగా ట్విట్తర్ సాక్షిగా జరగడం, ఆ తర్వాత మంత్రి గారు ఆమె కలసి తమ మద్య ఏ పొరపొచ్చాలు లేవని నాటకీయంగా మీడియా ముందు ప్రకటించడం , అల ప్రకటించిన 24 గంటల లోపే ఆమె గారు మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకోవడం  కనపడుతుంటే ఆమె గారిని ఆత్మహత్యకు ప్రేరేపించిన వారెవరో అర్దం కావటం లేదా ?   పోస్ట్ మార్టం రెపోర్టులో కూడా ఆమె ఒంటి మీద కొన్ని  గాయాలు  ఉన్నాయని తేలిన తర్వాత ఇంకా నిందితులను అరెస్ట్ చెయ్యక పోవడం అనేది సరి అయిన దర్యాప్తు విదానం అనిపించుకోదు. ఇంప్లూయన్స్ చేయగలిగిన స్తాయిలో ఉన్నవారే  ఈ కేసులో అనుమానితులుగా ఉన్నపుడు ఈ కేసు నిస్పక్షపాతంగ దర్యాప్తు జరుపబడుతుందని సామన్య పొరుడు ఎలా నమ్మగలడు. స్