Posts

Showing posts with the label నరేంద్ర మోడీ గారి "పె నో ర " మంత్రం

అల్లాఉద్దీన్ అద్భుత దీపం కంటే పవర్ఫుల్ , నరేంద్ర మోడీ గారి "పె నో ర " మంత్రం !.

Image
                                                                                మనం చిన్నప్పుడు చదువుకున్న పాఠాలులో "అల్లాఉద్దీన్ అద్భుత దీపం " ఒకటి . కడు  పేద వాడైన అల్లాఉద్దీన్ అనే యువకుడు తనకు దొరికిన ఒక అద్భుత దీపం లోని భూతం సహాయంతో గొప్ప ధనవంతుడిగా మారడమే కాక , ఆ దేశ యువరాణిని కూడా పెండ్లిచేసుకునే స్థాయికి ఎదుగుతాడు . అయితే ఆ అద్భుత దీపం వలన కేవలం అల్లాఉద్దీన్ మాత్రమే ధనవంతుడు కాగలిగాడు . కానీ మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు మొన్న 8 వ తారీకు రాత్రి పూట పఠించిన మంత్రం మాత్రం దేశం లోని అనేక  మంది పేదవారిని అమాంతం తెల్లారే సరికి లక్షాధికారులని చేసింది . అదెలా జరిగింది అంటే :     8 వ తారీకు రాత్రి మోడీ గారు మీడియా ద్వారా అర్ధరాత్రి 12 గంటలు నుండి ఇండియన్ కరెన్సీ నోట్లలో పెద్దవి అయినా 500 మరియు 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు . డిసెంబర్ 30 లోపు ప్రజలు తమ వద్ద నున్న పాత నోట్లను బ్యాంకు లలో మార్చుకుని కొత్త నోట్లు తీసుకోవాలని చెప్పడమే కాక అందుకు సంబంధించిన నియమ నిబంధనలు కూడా చెప్పారు. అందులో ప్రధానమైనది , 2,50, 000 రూపాయలు మించి బ్యాంకు లో