Posts

Showing posts with the label రాయల తెలంగాణా

కోట్ల మంది ప్రజల కోరికను కాదని , అసద్దుద్దిన్ గారి కోరికను తీర్చు తుందా పిరోజ్ గాందీ గారి కోడలు!?

                                                             ఎంకి పెండ్లి సుబ్బి చావు కొచ్చిందట. అలా ఉంది ఈ  పిరోజ్ గాందీ గారో కోడలు వ్యవహరం. ఆవిడ గారీ పుట్టిన రోజు బహుమతిగా తెలంగాణా ఇచ్చేద్దామనే తలంపుతోనే హడావుడిగా అంత పెద్ద వ్యవహారాన్ని కూడా  ఒక "టేబుల్ ఐటం " గా మార్చివేసి కూరలు పంపకం లాగా పంచి వెస్తుంది.   అసలు రాయల తెలంగాణా ఎవరు అడిగారు? మొదట్నుంచి ఈ  ప్రతిపాదన చేస్తూ వచ్చింది హైద్రాబాద్లో తప్పా మరెక్కడా లేని MIM  పార్టీ అద్యక్షులు అసదుద్దీన్ ఒవైసీ . ఆ తర్వాత ఈ  ప్రతిపాదన  తమ ప్రాంతానికి లాభిస్తుందని సీమ లోని కర్నూల్, అనంతపురం నాయకులు 2 వ ఆప్షన్ గా డిమాండ్ చెయ్యడం ప్రారం బించారు. ఇక కేంద్రం లోని కోంతమంది పెద్దలు అయితే , ఎవరు రాష్ట్ర విబజన గురించి ప్రస్తావించినా "రాయల తెలంగాణా" గురించే అభిప్రాయాలు అడగటం మొదలు పెట్టారు. అటు సీమాంద్రా వారు కానీ, ఇటు తెలంగాణా వారు కానీ రాయల తెలంగాణా గురించి కలలోనైనా ఊహించని పరిణామం 4 నెలల క్రితం వరకు. మరి సుమారు 9 కోట్ల మంది ప్రజలు కోరుకొని దానిని , ఒక్క M.P  కోరుకున్న దానిని, ప్రజల మీద బలవంతంగా రుద్దడం వెనుకాల ఉన్న మతలబ్ ఏమి