Posts

Showing posts with the label హిందూ మతం

రోజూ విజ్ఞానులు పోసే "విషం పాలు" గురించి ఆలోచించక , మత జ్ఞానులు పోసే "అభిషేక పాలు " గురించి ప్రశ్నిస్తున్న అజ్ఞానులు!

Image
                               ఎదో హింది సినిమాలో ,ఒక లాయర్ పాత్రదారి చేత హిందూ మతం లో దేవుడికి చెసే 'పాలాభిషేకం ' గురించి ప్రశ్నింప చేస్తూ , భక్తులు "పిచ్చి పువ్వులు 'అనిపిస్తాడు దర్శక /రచయిత . దానిని విగ్రహారాదన అంటే ఈసడించుకునే అన్యమతస్తులు కొందరు  పేస్ బుక్ లో పెట్టి తమ మత విదాన  గొప్పదనాన్ని  చాటాలని ప్రయత్నించారు . దానిని చూసిన నాకు వారి అమాయకత్వం మీద జాలి వేసింది .  మనిషికి   జ్ఞానం ముఖ్యమే .కాని అది ఉపయోగించే విదానం తెలియక పొతే  ఆనందానికి దూరం చెస్తుంది .ఎక్కడ ఏది చెయ్యాలో తెలియ చెసే దానినే " ఇంగిత జ్ఞానం" అంటారు . అలాంటి ఇంగిత జ్ఞానం లేని వారు ,తమ మతాలలో ఉన్న లోపాలను కప్పి పెట్టుకుని ,ఎదుటివారి మతాల గురించి రంద్రాన్వేషణ చేస్తుంటారు . వీరు వేమన గారి పద్యంలో "గురివింద " బాపతు వాళ్ళు  . అలాగే విజ్ఞాన వాదుల0 అని చెప్పుకుంటున్న వారు సైతం  సమాజంలో విజ్ఞాన పరంగా జరుగుతున్న అనర్దాలు గురించి ఆలోచించకుండా ,కేవలం అలౌకిక అనందం ఇచ్చే హిందూ  మతాచారాలు లో శాస్త్రీయత లేదని   తెగ  సందేశాలు ఇస్తూ,    హిందువులు అంతా అజ్ఞానులు అని ప్రచారం చేస్తుంటారు

మన దేశంలో 'హిందూ మతం "ని బలహీన పరచడానికి విదేశి మత సంస్థ నుండి పెద్ద మొత్తంలో డబ్బు స్వీకరించిన ఆ స్వదేశి "చరిత్ర కారిణి " ఎవరు?!!!

Image
                                                                   నిన్న ఆంద్ర జ్యోతిలో ప్రచురితమైన రిటైర్డ్ DGP గారు అయిన శ్రీ K అరవింద రావు గారి వ్యాసం  మన దేశం లో కొంతమంది కుహనా మేధావులు ,ఈ దేశ మత, సంస్కృతులు మీద పని కట్టుకుని దాడి చెయ్యడం వెనుకాల ఎలాంటి విదేశి కుట్రలు సాగుతున్నాయో,చాలా చక్కగా వివరించింది .    నేను ఇంతకు ముందు నా  బ్లాగులో అనేక సార్లు ఇదే విషయం చెప్పడం జరిగింది . మన దేశంలో జనించి ,కొనసాగుతున్న ఏ మత విదానO వలన మనకు ఎలాంటి ఇబ్బంది లేదు .ఉండబోదు కూదా. విదేశి మతస్తుల వలన ప్రవేశ పెట్టబడినప్పటికి , విదేశి ఆర్దిక ప్రయోజనాలకు ప్రబావితం కాకుండా కేవలం తను నమ్మిన విదానం ని ఆచరించే వారి వల్ల కూడా ఈ  దేశానికి  ఎటువంటి ప్రమాదం లేదు .కాని విదేశి పండ్లతో తమ పబ్బం గడుపుకుంటు స్వదేశి జీవన విదానం మీద విషం గ్రక్కుతున్న వారి గురించి,ఈ దేశాన్ని ప్రేమించేవారు ఆలోచించాల్సిన అవసరం ఉంది . వ్యక్తిగతం గా తాము నాస్తికులమని చెప్పుకుంటూ ,తమకు ఎ మతం మిద విశ్వాసం లేదని బుకాయిస్తూ , సమయం వచ్చేసరికి విదేశి మత వర్తనుల వైపు వకాల్తా పుచ్చుకుని అడ్డగోలు వాదం చేస్తున్న కుహనా మేదావుల తీరును ఎం