Posts

Showing posts with the label జడత్వం

నిలువెల్లా దోస్తున్నా, ఏమనలేని జడత్వం మనది!

Image
                                                                                                    ఏందుకో, ఏమో గాని మన పెద్దలకు ఉన్న రాజకీయ  చైతన్యం మనలో లేదనిపిస్తుంది. ఇదివరలో ఏ గ్రామంలోనైనా రాజకీయ నాయకులు కాని, అధికారులు కాని అవినీతికి పాల్పడాలంటే అటు ప్రతిపక్షాలకు ఇటు ప్రజలకు బయపడే వారు. కాని ఈ రోజుల్లో రాజకీయంలో ఓనమాలు నేర్చిన ప్రతివాడు ప్రజాదనాన్ని కొల్లగొట్టడానికి, ఎదుటి పార్టీల వారితో సర్థు బాటు చేసుకుంటున్నాడు. కాబట్టి సామాన్య ప్రజలను చైతన్య పరచి పోరాటాలు చేసే వారు తక్కువైయారు.    1950 రోజుల్లో అవినీతికి పాల్పడి జైల్ కెళ్లడాన్ని సంబదిత  కుటుంబీకులు సైతం ఎంతో అవమానంగా బావించే వారట. కాని విచిత్రంగా అలా అవినీతిని  నేరంగా బావించడమే అవమాన కరంగా బావించారో ఏమో మన నాయకులు అవినీతి అనే దానిని "నీతిబద్దం" చేసేశారు. ఇక చట్టబద్దం చెయ్యడమే మిగిలి ఉంది.అయిన పాపం ప్రజలు మాత్రం ఏమి చేస్తారు? నూటికి ఐదుగురో, పడిమందో అవినీతి పరులు ఉంటే, వారిని పట్టుకుని, దారిలో పెట్టెవారు. ఎక్కువ శాతం మంది దానికే దాసోహం అన్నాక ఇక దాని గురించి మాట్లాడడం వేస్టు అనుకున్నట్లుంది,ఏమి జరిగినా మన కె