Posts

Showing posts from April, 2014

ఇకనుండి, ఉద్యోగాల కోసం బయటకు వెళ్ళాలంటే అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకు పక్కన తోడు ఉండాల్సిందే !

                                                                                "మా కేమండి ! ఉన్నది మగ పిల్లలు ! అప్పో సప్పో చేసి ఏదో రకంగా పైసలు ఇస్తే చాలు , వారి పనులు వారే చూసుకుంటారు . మగ పిల్లాళ్లు కాబట్టి బయట ఎంత సేపు తిరిగినా బయ పడాల్సిన అవసరం లేదు . అలాగే వారు ఉద్యోగాల వేటలో తిరుగుతున్నాప్పుడు కూడా , వారి వెంట తోడూ వెళ్ళాల్సిన అవసరం లేదు . అదే ఆడపిల్లలు అయితే ఎక్కడికి వెళ్ళినా కుటుంబంలో ఎవరో ఒకరు వెంట ఉండి తీరాల్సిందే . వారికి పెండ్లి చేసి ఒక అయ్య చేతిలో పెట్టిందాకా అమ్మాయి రక్షణ కోసం ఎప్పుడూ అంటి పెట్టుకుని ఉండాల్సిందే " . ఇది సగటు తల్లి తండ్రుల ఆలోచన . అది వాస్తవం కూడా . అబ్బాయిలను ఎంత దూరమైనా , ఉద్యోగాల అన్వేషణలో ఉన్నప్పుడు పంపిస్తుటామ్ . ఏవో కొన్ని సందర్బాలలో అవసరం అనుకుంటే తప్పా మగ పిల్ల వెంట అతని సంబందికులు ఎవరూ వెళ్ళాల్సిన అవసరం ఉండదు . కాని ఆడపిల్లల విషయం లో మాత్రం సదరు ఉద్యోగం గురించి ఏమి తెలియకపోయినా , అమ్మాయి కి రక్షణగా ఎవరో ఒకరు బాడి గార్డు డ్యూటి చేయాల్సిన సమాజం మనది . దీనికి కారణం, సింపుల్ .ప్రక్రుతి  స్త్రీని, సెక్స్ పరంగా   దోచుకో తగిన  విదంగా మల

ఎర్నాకులం వెళ్ళాల్సిన ట్రైన్ , డ్రైవర్ కు తెలియకుండానే గుల్బర్గా వెళ్లి గుండె గుభేలు మనిపించిoదట!

                                                                      మొన్న మంగళ వారం జరిగిన ఈ  రైలు ప్రయాణం ఉదంతం వింటే కొంచం నవ్వుతో పాటు బోల్డంత అశ్చ్యర్యం కూడా కలుగుతుంది . ఆసియాలోనే అతి పెద్దదైన ఇండియన్ రైల్వేస్ అధ్వర్యంలో నడచే రైలు ఒకటి వెళ్ళాల్సిన గమ్యం వెళ్ళకుండా సుమారు 300 కిలోమీటర్లు తప్పుడు దారిలో వెళ్లి , తెల్లారే తాము చేరుకున్న స్టేషన్ చూసి సదరు ట్రైన్ డ్రైవర్ తెల్లముఖం వేసాడు అంటే , ఘనత వహించిన ఇండియన్ రైల్వేస్ లో ఎంత నిర్లక్ష్యం కొనసాగుతుందో ఇట్టే అర్దమయి పోతుంది . వివరాలు లోకి వెళితే              మొన్న సోమవారం , గుజరాత్ లోని ఒఖా స్టేషన్ నుండి ఒఖా-ఎర్నాకులం ఎక్స్ప్రెస్ ఎర్నాకులం బయలు దేరింది . అది మంగళ వారం రాత్రి 10-30 గంటలకు ఎర్నాకులం చేరుకోవాల్సి ఉండగా , రాంగ్ సిగ్నల్స్ పుణ్యమాని దారి తప్పి , చివరకు 28 గంటలు పైగా లేటుతో ఎర్నాకులం చేరిoది అట. దారి మద్యలో పన్వెల్  స్టేషన్ దగ్గర వారికి తెలిసిందేమిటంటే  పైన రత్నగిరి అనే స్టేషన్ వద్ద ట్రైన్ ఏక్సిడెంట్ ఒకటి జరగడం వలన , పూణే నుండి ట్రైన్ ను ఇతర మార్గం ద్వారా మళ్ళించి , గోవా సమీపంలో అసలు రూటు కి కలుపుతారని . కాని జర

భగవంతుని ముందు "బజార్ వేషాలు" వెయ్యడం బిగ్ బజార్ వారికి తగునా?

                                                                             బిగ్ బజార్ పేరుతొ అన్నింటిని అమ్ముకునే వారికి అందమైన భారత దేశమంటే వారి దృష్టిలో అందమైన అమ్మాయిలూ వారి   బజార్ లో కొన్న జీన్స్ వేసుకుని , ఊగుకుంటూ , ఊగుకుంటూ దేవాలయానికి వెళ్లి అక్కడి దేవతా మూర్తులకి "హాయ్ భగవాన్ జి" అంటూ విష్ చేసి , పూజారితో సి యా  అని చెప్పేసి ఎగురుకుంటూ , ఎగురు కుంటూ బయటకి వెళ్లి పోవడం, ఆ తర్వాత ఆ పూజారి కూడా సియా రామ్ ,సియా రామ్ అంటూ అసలు దేవుడి నామం నే మరచి అమ్మాయి మాటలను వల్లే వెయ్యడం ఏమిటిదంతా ? . నిజంగా ఇదే యాడ్ ఇతర మతాలకు సంబందించిన దేవత ల పట్ల ప్రవర్తించినట్లు చూపిస్తే , ఈ  పాటికి ఎన్ని బిగ్ బజార్లు బద్దలు అయ్యేయో ? ఎవరిచ్చారు వీరికి హిందూ సామ్ప్రాదాయలను అవమానించే హక్కు? నీ  బట్టలు అమ్ముడు పోవడం కోసం  భగవత్ ఆరాధనా విదానాలునే ఇంతగా అవమానిస్తారా? భగవంతుడు అంటే బాయి ప్రేండా ? హాయి చెప్పటానికి? దీనిని ఒక హిందువుగా తీవ్రంగా ఖండిస్తున్నాను .           

సుప్రీం కోర్టు "హిజ్రా " హక్కులుని గుర్తించింది సరే ! మరి హిజ్రాలు రైల్వే ప్రయాణీకుల హక్కుల్నిగుర్తించేదేప్పుడు?

Sir, With the passage of time, India has progressed by leaps and bounds and has registered impressive growth in almost every sector. But one area which has not seen much improvement is the unwillingness of the authorities concerned and the general lack of concern of the public to address these issues. With alarming rise in unemployment, certain sections in our society have taken resort to dacoity, extortion, kidnapping etcetera to earn easy money. In this context, I would like to point out the atrocities committed by the hijras (eunuchs) on the passengers travelling in the ordinary trains. What the hijras resort to is nothing other than extortion and abuse of the train passengers in case their demands are not met. Who is responsible for this scenario? Is it the public who are more often than not forced to meet their demands out of fear as not meeting the demands of the hijras lead to ugly verbal duels in which the choicest of expletives are hurled at the passengers.  Is the gover

ఏ వంకా దొరకని వారు , "పెళ్ళాం" వంక చూపిస్తున్నారు !

                                                                              శ్రీ మాన్ నరేంద్ర మోడీ ! భారతీయ జనతా పార్టి యొక్క ప్రదాని అబ్యర్ది . ప్రస్తుత గుజరాత్ ముఖ్య మంత్రి అయిన అయన గుజరాత్లో తను చేపట్టిన పాలానా సంస్కరణల వలన , గొప్ప అభివృద్దిని సాదించి అటు ప్రజలలోనే కాక , ఇటు ప్రతిపక్షాలలో సైతం "మోడీ మార్క్ " పాలన అనే నమూనా తో ప్రశంసలు  పొందారు . అయితే అయన నేతృత్వం వహించే పార్టి భారతీయ జనతా పార్టి కాబట్టి , అ పార్టికి ఉన్న వర్గ శత్రువులు అటో మాటిక్ గా మోడి గారికి శత్రువులు అయిపోవడంలో పెద్ద ఆశ్చర్యం ఏమి లేదు . రాజకీయ నాయకులు అంటే 'ఇంట్లో పైసాకు పనికిరాకపోయినా , వీదిలో పెద్ద పోజు కొట్టే అవకాశ మున్నవారు కాబట్టి వారు ఎవరినైనా , ఏ  విదంగా నైనా విమర్శిస్తారు . నిజంగా మోడీ గారితో సిద్దాంత పరమైనా లేదా పార్టి పరమైన అంశాలతో విబెదిమ్చే వారు ', అ అంశాల మిద ఆయనని విమర్శిస్తే హుందాగా ఉంటుంది . అంతే కాని ఎ వంకా దొరకనట్లు , అయన గారి భార్యా విషయం ని ప్రదాన అంశం చేసి , ఇప్పటివరకు  ఏంతో గౌరవంగా బ్రతుకున్న ఒక భారతీయ స్త్రీ గౌరవ మర్యాదలుని నిచ రాజకీయాలకు వాడుకోవడం అత్యంత గర్హనియ

గడ్డాలు గిసుకునే బ్లేడ్లకు, అసబ్యపు అమ్మాయిలు ప్రచార కర్తలా !?

                                                                  ఈ  మాటన్నది ఎవరో కాదు , సాక్షాతూ ఈ దేశ అత్యున్నత న్యాయస్తానం లో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సుదాంశు జ్యోతి ముఖోపాధ్యాయ !. నిన్న సికింద్రాబాద్ లో ఆంధ్రప్రదేశ్ జుడిషియల్ అకాడెమి ఆద్వర్యంలో"మహిళకు హింస నుంచి రక్షణ , చట్ట పరమైన పరిష్కారాలు ,న్యాయవ్యవస్త స్పందన" అనే అంశం పై జరిగిన సెమినార్ లో అయన పై విదంగా స్పందించారు . ప్రస్తుత సమాజంలో మహిళల పట్ల చాలా చులకన బావంతో వ్యవహరిస్తున్నారని , అదే ప్రాచిన కాలంలో స్త్రీలకు విశిష్ట స్తానం , గౌరవం ఉండేవని , కాని రాను రాను సమాజంలో ఆ  బావనలు మారిపోయి స్త్రీలను చులకన చేసే దోరణి అధిక మయిoదని , చివరకు పురుషులు వాడే షేవింగ్ బ్లేడ్ల అడ్వర్టైస్మెంట్లకు సైతం స్త్రీలను అసబ్యపు దుస్తులలో చూపించడం దారుణం అని అన్నారు . కొన్ని చోట్ల సాoప్రాదాయపు ముసుగులో వారిని అణచివేయాలని చూస్తుంటే , మరి కొంత మంది ఆదునిక బావాజాలా లు పేరుతొ వారిని వ్యాపార వస్తువులుగా మార్చి వేస్తున్నారు ఆని అన్నారు . భారతీయ న్యాయ వ్యవస్త సహించదు అనే రీతిలో కేసులలో తీర్పులు వేలువరిoచాల్సిన అవసరం ఉంది అని అన్నారు .  

నా గూగుల్ + ప్రొఫైల్, పొటోలు ,వగైరా యొక్క మొత్తం వీక్షణ విలువ 12 లక్షల పై చిలుకే నట !

Image
                                                      Narasimha Rao Maddigunta Works at   Legal Aid Society Attended   Jyothi Bala Mandir Lives in   Mana Family Counseling center, KHAMMAM 13 circles 749   followers | 1,202,604   views               మొన్న ఒక మిత్రుడి గూగుల్ +ప్రొఫైల్ ని చూస్తున్న నాకు , అయన గారి ప్రొఫైల్ పోటో క్రింద 3 లక్షల 20,000 విక్షనములు అని ఉండటం చూసి , అబ్బా , ఈయన గారి ప్రొఫైల్ ని ఇంత మంది చూసారా అని ఆశ్చర్య పొయాను. దాని మిద మౌస్ మార్కర్ ఉంచితే , అది కేవలం ప్రోపైల్ కు మాత్రమె కాకుండా , ప్రొఫైల్ సంబందిత కంటెంట్ అంటే పొటోలు , ఇతరత్రా వాటిని కూడా పరిగణన లోకి తీసుకుని వాటన్నిటి విక్షణములు మొత్తం అని తెలిసింది . అంటే ఒక గూగుల్ +యూసర్ ప్రొఫైల్ మరియు దాని సంబందిత కంటెంట్ కి అది మొదలు పెట్టిన నాటి నుండి వీక్షకులు   చూసిన వీక్షణలు మొత్తం  అని.  . అయితే ఇదిగూగుల్ + ప్రోఫైల్స్ కు(Google+profiles), పేజిలకు గత వారమే లింక్ కలిపారు కాబట్టి , వారం నుండే అవి మనకు కనపడుతున్నాయి .   సాదారణంగా పేస్ బుక్ వాడకం దారులకు

సిమాంద్ర ప్రజలు నిజంగా సమైక్యత కోరుకుoటున్నారా? అయితే ఇలా చేయగలరా?

                                                                      ది గ్రేట్ కాంగ్రెస్ పార్టి అప్ ఇండియా వారు , తెలంగాణా రాష్ట్రాన్ని విభజించడం ఖాయం అని ప్రకటించినప్పుడు , సుమారు 70 రోజుల పాటు సిమాంద్ర ఉద్యోగులు  రెచ్చిపోయి ఉద్యమాలు చేస్తే , అక్కడి ప్రజలు కూడా వారికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ రోడ్లమిదకు వచ్చి పోరాటాలు చేసారు . అది చూసిన సిమాంద్ర రాజకీయ నాయకులు ప్రపంచంలో ఇంతకూ ముందు ఎప్పుడ్డూ ఇలాంటి ప్రజా ఉద్యమం రాలేదు అని కితాబులిస్తూ , ప్రజా మనోబావనలను జాతి మొత్తానికి తెలిసేలా ఎవరి ప్రయత్నాలు వారు చేసారు . అప్కోర్స్ తెలంగాణా రాజకీయ నాయకులు మాత్రం సదరు ఉద్యమాలు  అన్ని స్పాన్సర్డ్ ఉద్యమాలు అని చప్పరించి పారేశారు . కాని రాష్ట్ర విభజన జరిగాక , ఎవరూ దాని గురించి మాట్లాడకుండా, ప్రజలు  ఎవరి పని వారు చేసుకుంటూ , ఉద్యోగులు వారి వారి ద్యూటిలు చేసుకుంటూ , రాజకీయ నాయకులు వారి వారి పార్టి ల గురించి గొప్పలు చెప్పుకుంటూ ఎవరి పనిలో వారు యమ బిజీ అయిపోయారు . ఇదంతా చూస్తుంటే ఆంధ్రులు ఆరంభ శూరులు అనే దానికి కట్టుబడి పని చేస్తున్నట్లు తెలుస్తుంది .   కాని సిమాంద్ర నాయకులలో ఒకే ఒక్కడు ఇంకా సమైక్య

కోటి ఆరోపణలు చేసినా ,ఒక్క కామెంట్ తో ఖతం !.

                                                                          నిన్న ఒక విషయం మిద రాష్ట్రంలోని ఒక్క చానల్ తప్పా , మిగతా  చానళ్ళు అన్నిస్క్రోలింగ్ లుతో సహా   ప్రసారాలు చేసాయి . ఆ విషయం అవినీతి పరులైనా కాంగ్రెస్ పెద్దలలో ఒకాయనకు సంబందించింది .ఆయనగారు గతంలో తన మిత్రుడు ముక్యమంత్రిగా అధికారంలో ఉండగా , అ   పదవిని అడ్డం పెట్టుకుని , అయన మరియు సదరు ముఖ్య మంత్రి గారికి దగ్గరి బండువుతో కలసి విదేశి కంపెనీలకు ఆంద్ర ప్రదేశ్ తిర ప్రాంతంలోని ఇసుక లిజ్ లు ఇప్పించే పూచి మిద సుమారు 110 కోట్ల పైన ముడుపులు డిమాండ్ చేయడం జరిగిందని , అమెరికా కోర్టులో కొంతమంది మిద అభియోగం మోపారట . అ దేశం లో ఆ కేసును సీరియస్ గా తీసుకుని నిందితుల ఆస్తుల జప్తులకు కూడా సిపార్సు చేసారట! అదిగో అటువంటి అభియోగాల చిట్టాలో మన రాష్ట్రానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి గారి స్నేహితుడు గారిది కూడా ఉందట .   అయినా రాష్ట్రాల సరిహద్దులు సైతం చెరిపేసి , కొండలు తవ్విపోసి , ఖనిజ సంపదను కొల్లగొట్టిన వారినే "అప్త్రాల్ అది కూడా పెద్ద అవినితేనా " అని చప్పరించే అంత గొప్ప మనసున్న ప్రజలు ఉన్న రాష్ట్రంలో బోడి ఒక 100 కోట్ల రూపాయల

పెండ్లి పత్రాలు ఏమి ఖర్మ,ఏకంగా పెండ్లాన్నే మార్చేసాడట!

Image
                                                                              ప్రస్తుత సమాజంలో మనుషులు అడ మగ తేడా లేకుండా తమ పబ్బాలు గడుపుకోవడం కోసం ఎంతటి నీచమైన పనులకైనా ఒడిగట్టే స్తాయికి దిగజారారు . ప్రస్తుత తరం లో కొంత మంది అసలు వివాహం అన్నా వివాహా వ్యవస్తా అన్నా  బొత్తిగా గౌరవం లేకుండా పోయింది . పోనీ సాంప్రదాయాలు అంటే గౌరవం లేక పొతే  లేకపోవచ్చు కాక, కనీసం చట్ట భయమైనా ఉండాలి కదా , అది అస్సలు భయం లేదు మాకు అన్నట్లు ప్రవర్స్తిస్తున్నారు ,. విషయం ఏమిటంటే :      గత సంవత్సరం ఆగస్టు 30 న ఖమ్మం జిల్లా వెంకటగిరికి చెందిన రజితతో మహేశ్ అనే సెల్ పోన్ షాప్ లో పని చేసే కుర్రాడితో పెండ్లి అయింది . వారి వైవాహిక జీవితం పలిo చడం తో రజిత గర్భవతి అయి , కాన్పు కోసం పుట్టింటికి వెళ్లిందట . రజితతో  పెండ్లి కాక పూర్వం మహేశ్ గుంటూరులో  విజయ లక్ష్మి అనే ఒక అమ్మాయిని ప్రేమి oచాడట ! గత ఏడాది జులై నెలలో వారిద్దరి మద్య ఏదో గొడవలు రావడం , విజయ లక్ష్మి మహేశ్ మిద చీటింగ్ కేసు పెట్టడం కూడా జరిగిందట . మరి అ కేసు సంగతి ఏమైందో కాని , అ తర్వాత మహేశ్ ఖమ్మం  వచ్చి రజితను వివాహ్హ మాడినట్లు తెలుస్తుంది .  విజయలక్ష

"ఆయనోస్తున్నాడు"! ఎవరాయన ?

                                                                              ఈ మద్య అన్ని చాన్నల్లలో రాజకీయ పార్టీల ఎన్నికల అడ్వర్ టైస్ మెంట్లు ఎక్కువయ్యాయి .గతం లో  తాము చేసిన గొప్ప పనులను ఏకరువు పెడుతూ , ఈ సారి అధికారం తమకిస్తే ఇంకా గొప్పగా చేసి చూపిస్తాం అని కొంతమంది ఊదరగొడుతుంటే , తమ తాతలు, తండ్రులు చేసిన పనులను ఏకరువు పెడుతూ , వారు తాగిన నేతులు కంటే మా మూతుల వాసన బాగుంటుందని చెప్పే వారు కొందరు . ఏది ఏమైనా నూరు అబద్దాలు అడి అయినా ఒక పెండ్లి చేయాలి అన్నారు పూర్వ కాలపు పెద్దలు . కోటి అబ్బాద్దాలు అది అయినా కోరుకున్న పదవి దక్కించు కోవలసిందే అoటున్నారు నేటి రాజకీయ నాయకులు . ఏది ఏమైనా ఇది ఎలెక్షన్ కాలం కాబట్టి ఎవరి గోల వారిది . ఎవరి పార్టిని వారు సమర్దిమ్చుకోక తప్పదు , ఎదుటివారు ఎంత మంచివారైనా విమర్సించక తప్పదు .    ఈ మద్య అన్ని రాజకీయ పార్టీల అడ్వర్టైస్ మెంట్లు కంటే "ఆయనోస్తున్నాడు " అనే అడ్వర్టైస్ మెంట్ నన్ను  ఆకర్షించింది . ఏ పార్టి అధ్వర్యంలో అందరికి విద్య వైద్యం అనే పదకాలు పెట్టారో , అ పార్టీని విలన్ గా చూపుతూ , అదే పార్టికి చెందిన నాయకుడిని పొగుడుతూ వారి వారసులు స