ఇకనుండి, ఉద్యోగాల కోసం బయటకు వెళ్ళాలంటే అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకు పక్కన తోడు ఉండాల్సిందే !

                                                                               


"మా కేమండి ! ఉన్నది మగ పిల్లలు ! అప్పో సప్పో చేసి ఏదో రకంగా పైసలు ఇస్తే చాలు , వారి పనులు వారే చూసుకుంటారు . మగ పిల్లాళ్లు కాబట్టి బయట ఎంత సేపు తిరిగినా బయ పడాల్సిన అవసరం లేదు . అలాగే వారు ఉద్యోగాల వేటలో తిరుగుతున్నాప్పుడు కూడా , వారి వెంట తోడూ వెళ్ళాల్సిన అవసరం లేదు . అదే ఆడపిల్లలు అయితే ఎక్కడికి వెళ్ళినా కుటుంబంలో ఎవరో ఒకరు వెంట ఉండి తీరాల్సిందే . వారికి పెండ్లి చేసి ఒక అయ్య చేతిలో పెట్టిందాకా అమ్మాయి రక్షణ కోసం ఎప్పుడూ అంటి పెట్టుకుని ఉండాల్సిందే " . ఇది సగటు తల్లి తండ్రుల ఆలోచన . అది వాస్తవం కూడా . అబ్బాయిలను ఎంత దూరమైనా , ఉద్యోగాల అన్వేషణలో ఉన్నప్పుడు పంపిస్తుటామ్ . ఏవో కొన్ని సందర్బాలలో అవసరం అనుకుంటే తప్పా మగ పిల్ల వెంట అతని సంబందికులు ఎవరూ వెళ్ళాల్సిన అవసరం ఉండదు . కాని ఆడపిల్లల విషయం లో మాత్రం సదరు ఉద్యోగం గురించి ఏమి తెలియకపోయినా , అమ్మాయి కి రక్షణగా ఎవరో ఒకరు బాడి గార్డు డ్యూటి చేయాల్సిన సమాజం మనది . దీనికి కారణం, సింపుల్ .ప్రక్రుతి  స్త్రీని, సెక్స్ పరంగా   దోచుకో తగిన  విదంగా మలిస్తే   . పురుషుడు మాత్రం ఎ మాత్రం దోపిడీకి   గురి అయ్యే అవకాశాలు లేని విదంగా సృష్టించింది . ఇది ప్రక్రుతి యొక్క పక్ష పాత దోరణి అనవచ్చు .

                  అయితే  ప్రక్రుతి గీతను మనిషి చేరిపెసాడు . స్త్రీలను దుర్మార్గులైన పురుషుల నుండి కాపాడే కిటుకు తెలుసుకోలేక పోయినా , పురుషులను కూడా ఎలా దోచుకోవచ్చో తెలుసుకుని అమలు చేసి , చివరకు పురుష రక్షణ కూడా సమస్యగా మర్చాదు. దానికి అతని యొక్క శాస్త్రీయ విజ్ఞానం తోడ్పడుతుంది . ఇక నుంచి మగ పిల్లల ఉద్యోగ అన్వేషణలో కూడా బందువులు ఎవరైనా బాడి గార్దులుగా  వెళ్ళాల్సిందే నట ! లేకుంటే అబాయిని ఏమి అనరు కాని , జస్ట్  ఒక చిన్న మత్తు ఇంజక్షన్ ఇచ్చి "కిడ్ని" మాయం చేసేస్తారట . మొన్ని మద్య వెలుగు చూసిన "కిడ్ని రాకెట్ " ఘోర ఉదంతం వింటుంటే భయంతో ఒళ్ళు గగుర్పాటుకు గురి కాక తప్పదు . వివరాలు లోకి వెళితే :-

   మొన్ని మద్య, ఖమ్మం జిల్లా , కొత్తగూడెం కి చెందిన దినేష్ అనే అబ్బాయి శ్రీలంక లోని కోలoభాలో అనుమానాస్పద స్తితిలో మరణించాడు .  ఉద్యోగం కోసం ఎవరితోనో కలిసి కోలోo బో వెళ్ళిన తమ కొడుకు హట్టాతుగా మరణించడం పట్ల అనుమానం వచ్చిన అతని సోదరుడు ఇచ్చిన కంప్లైంట్ మేరకు దర్యాప్తు చేయగా దిమ్మ తిరిగే నిజాలు వెలుగు చూసాయి . దినేష్ కి ఆపరేషన్ చేసి అతని కిడ్ని ఒకటి తొలగించగా దాని ఇన్పెక్షన్ వలన ఆతను చనిపోయినట్లు తేలింది . దానితో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేయగా ఆంధ్రప్రదేశ్లో గత రెండు సంవత్సరాలుగా 15 ముఠాలు ఈ కిడ్నీ రాకెట్ లో పాలుపంచుకుo టున్నట్లు, అ యా ముఠా సబ్యులు నిరుద్యోగ యువకులను ఉద్యోగాల పేరుతొ కొలొంబో తీసుకు వెళ్లి అక్కడ మెడికల్ చెకప్ పేరుతొ మత్తు ఇచ్చి , వారు ఆ మత్తులో ఉండగా ఆపరేషన్ చేసి వారి కిడ్నీలు తొలగించి అవసరమున్న వారికి అమ్ముకున్తునట్లు తెలుస్తుంది . తెల్లారి బాదితులు తమకు జరిగిన ఆపరేషన్ గురించి అడిగితె ,ఏవో కట్టు కదలు చెప్పి వారిని నమ్మిస్తున్నట్లు తెలుస్తుంది . ఈ  కేసు దర్యాప్తులో ఉంది కనుక ఇంకా ఎన్నో నమ్మ లేని నిజాలు వెలుగు చూసే అవకాశ ముంది .
    కాబట్టి ఇన్నాళ్ళు తోడూ లేకుండా ఉద్యోగ అన్వేషణలో బయటకు వెళితే ఆడపిల్లలకు మాత్రమె రిస్క్ ఉంది అని అనుకునే వారు , ఇప్పుడు మగ పిల్లలకు కూడా రిస్క్ ఉందని బావిస్తే వారి వెంట కూడా ఎవరో ఒకరు వెళ్ళాల్సిందే . ఇదంతా మనకు అందిన శాస్త్రీయ విజ్ఞానపు పలితం . సామాజిక స్పృహ లేని బేహారులకు విజ్ఞ్న్నాన పలాలు అందించడం ఎంత అజ్ఞానమో ఇప్పటికైనా మానవుడు గ్రహిస్తే మంచిది . మనుషుల తత్త్వం తెలియకుండా అందరికి విద్య , విజ్న్నానం ఇవ్వకూడదన్న పూర్వీకుల మాటలు కరక్తేనేమో అని ఇటువంటి ఉదంతాలు విన్నప్పుడు అనిపిస్తుంది . ఏది ఏమైనా తమ దేశంలో జరిగి ఈ  ఘోర కలి  మిద  శ్రీ లంక ప్రభుత్వం తగిన విదంగా చర్యలు తీసుకోవడమే కాకుండా , బాద్యత వహించవలసి ఉంది . కిడ్ని ఆపరేషన్ తో చని పోయిన దినేష్ సమాచారాన్ని , నేచురల్ డేత్ గా శ్రీ లంక అధికారులు దినేష్ కుటుంబానికి తెలియచేయ్యడం బట్టి చూస్తుంటే ఈ  రాకెట్ వెనుకాల ఎవరో శ్రీ లంక ప్రభుత్వాన్ని ప్రభావ పరచగల పెద్దలు ఉండి ఉంటారు అనిపిస్తుంది .
           
                     

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన