Posts

Showing posts from June, 2013

పదవుల కోసమే పెదవులు ఆడిస్తారా!?

                                                                     "సమైక్యాంద్ర మా వ్యక్తిగతం, అధిష్టానం నిర్ణయమే మాకు శిరోదార్యం"   "పంచాయతి ప్రెసిడెంట్ గా అనే మాటలు వేరు, కేంద్ర మంత్రిగా అనే మాటలు వేరు".   ఈ మాటలు లేటుగా అయినా లేటెస్ట్ గా కేంద్రమంత్రి పదవీ బాద్యతలు చేపట్టిన ఒకప్పటి వీరా సమైక్యాంద్రా వాది గారివి. పదవి వచ్చింది  కాబట్టి,సమైక్యాంద్ర అనలేకపొతే, అసలు ఆ పదవి తీసుకోవడం ఎందుకు? పదవుల కోసం పెదవులు ఆడించి అది వచ్చాక  కాం  అయితే మిమ్మల్ని నమ్మి ఇప్పటి దాక గొంతు చించుకుని  చదువులు పాడు చేసుకున్న  విద్యార్దుల మాట ఏమిటి?   మొత్తానికి కావూరి గారు అంటే కె.టి.ఆర్. గారికి లోపల  ఏదో కసి ఉన్నట్లు ఉంది. లేకపోతే అధిష్టానం చెప్పిన దానికి కట్టుబడి ఉంటాం అని ఆయన అనగానే పనికట్టుకుని పోయి కావూరి గారిని వీర తెలంగాణా వాది కె.టి.ఆర్. దన్యవాదాలు చెప్పడం ఏమిటి? అదేదో తెలంగాణా ఇవ్వమని చెప్పినట్లు ఆంద్రా వారిలో ఒక అభ్ప్రాయం కలిగించడం కాకపొతే! ఈ దెబ్బతో ఆంద్రావాల్ళు కావూరి గారిని ఎన్నిమాటలనాలో అన్ని అంటారని కె.టి.ఆర్. గారి ఆలోచన కావచ్చు!. ఆ విదంగా మాజీ సమైక్య వాదిమీద

చంద్రబాబు గారిని ను చూసి వాతలు పెట్టుకుంటే ఎలా!?.

                                                                  మొన్న డెహ్రడూన్ విమానాశ్రయంలో  లో గొప్ప హడావుడి చేసిన అధికార పక్షీయులు నిన్న కానరాకుండా పోయారు. రెండు వందలకు పై చిలుకు ఉన్న యాత్రీకులను చేరవెయ్యడానికి రెండు విమానాలు కావాల్సిందే. అటువంటి తరుణంలో అధికార, ప్రతిపక్ష యం.పీ.లు ఎందుకు రాదాంతం చేసారో సామాన్యులకు అర్దం కాని ప్రశ్న. సరే అయిందేదో అయింది. మరి మొన్న అంత హడావుడి చేసిన అధికార పార్టీ వారు మిగతా యాత్రీకులను తరలించడానికి నిన్న యెటువంటి రవాణా సౌకర్యం కల్పించలేదు. అదే ప్రతిపక్ష నాయకుడు తాను స్వయంగా యాత్రీకులను తీసుకుని విమానం లో హైదరాబాద్ వచ్చారు. దీనిని బట్టి అర్దమవుతుంది ఏమిటీ? కేవలం ప్రతిపక్షానికి క్రెడిట్ దక్కకూడదన్న దుగ్దతోనే మొన్న అంత హడావుడి చేసారు తప్పా ప్రబుత్వ వర్గీయులకు యాత్రీకుల బద్రత పట్ల ఏ మాత్రం చిత్తసుద్ది లేదు.   చంద్రబాబుగారు అమెరికా నుంచి వచ్చి ఏ.పి. బవన్ కి వెళ్ళాకే, అక్కడి అధికారులు పప్పుతో బాదితులకు బోజనం పెట్టారట. అప్పటి దాక నీళ్ల సాంబారే గతి అని మీడియా తెలిపింది. ప్రతిపక్షం విమానం పెత్టాకే ప్రబుత్వం తానూ విమానం ఏర్పాటు చేసింది. కాబట్టి అటు ప

సినిమాలో చూపించిన హీరోఇజం "పర్యాటక విపత్తులో" లో కానరాదే!

                                                                                                                                        మన తెలుగువాడు, ఆంద్రుల అభిమాన నటుడు గారికి భారత పర్యాటక శాఖా మంత్రిగా పదవి వచ్చినందుకు అందరికీ సంతోషం వేసిఉండవచ్చు. పాపం ఆయన గారు చేదామని ఎంతో ఉబలాటపడిన"సామజిక సేవ" దాని కోసం ఆయన పెట్టిన పార్టీ, సదరు పార్టీ తాలుకు ఆర్oభ సబలో ఆయన చూపించిన బావోద్వేగాలు అన్నీ చూసి మల్లీ తెలుగువారికి, మరో నిస్వార్ద నేత దొరికాడు అని సంబరపడిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. కాని విది వక్రించి అనుకున్నన్ని సీట్లు రాక రాజకీయంగా ఆయన బేజారు అయిన తరుణంలో, అధికార పార్టీలో జరిగిన హఠాత్ పరిణామాలకు ,ఆయన స్పందించి తీసుకున్న నిర్ణయం వళ్ళ ఆయన పెట్టిన పార్టీ కనుమరుగైనా అయనకు లబించిన "పర్యాటక శాఖా మంత్రి" పదవితో ఆయన మటుకు "చిరంజీవి" కాగలిగారు.   ఆయన పదవినలంకరించిన ఈ సంవత్సరం లోనే పర్యాటక యాత్రీకులుకు కానరాని కష్టాలు వచ్చి పడ్డాయి. "దేవబూమి" గా ఉన్న ఉత్తారాకాండ్ "మరు భూమి" గా మారి పోయింది. అది దైవ ఘటన కాబట్టి ఎవరూ ఏమి చేసేది లేదని సర్ది

"బొక్కసం" నిండాలంటే "బ్రోతల్ హౌస్" లకి పర్మిట్లు ఇస్తే పోలా!

                                                                                                                             పాలకులకు, పాలితులకు మద్య ఉండాల్సిన తండ్రి బిడ్డల బావన పూర్తిగా రూపు మాసిపోయింది. వ్యాపార వాదుల ప్రజాస్వామ్యం లో ప్రజలు కష్టమర్ లు అయ్యారు, ప్రబుత్వం "బేహారి" అయింది. ప్రజల ఆరోగ్యం తో తనకు సంబందం లేదు. ఎవడేలా పొతే తన కేంటి? ఖజాణా ఎలా నింపుకోవలన్నదే నేటి ప్రబుత్వాల ఉద్దేస్యం గా కనపడుతుంది. అందుకోసంఏ కాబోలు  మందు బాబుల మీద అంతులేని ఔదార్యం కన పరుస్తుంది.   పాపం, మందు కొనుకున్న వారు తాగడానికి చోటులేక రోడ్ల మీదే తాగుతున్నారట! వారికి ఇండ్లు లేవా? ఇండ్లలో వారు ఊరుకోరా? అలా ఇండ్లలోని వారికి ఇష్టం లేని పని చెయ్యడానికి ప్రబుత్వమ్ వారు ఎలా సహకరిస్తారు? నిజంగా అది ఒక బలహీనత గా మారితే ఇంట్లో వారిని కూడా ఒప్పించి, ఒక నియమిత పద్దతిలో ఇంట్లోనే తీసుకునేలా చెయ్యాలి. దాని వల్ల తాగేవాళ్ళ ఒళ్ళు, ఇల్లు చెడకుండా జాగర్త పడవచ్చు. అంతే కాని రోడు మీద తాగుతున్నారని నీవే రూం ఏర్పాటు చేస్తావా?ఇంకే మరి తాగడం లాంటి ఒక్క బలహీనతే కాదు ఇంకా అవలక్షనాలు ఉన్న ప్రజలు ఉన్నారు. వారు క

ఆడపిల్ల జ్ణాన వారసత్వం పుట్టింటిది, నామ వారసత్వం మాత్రమే అత్తింటిది.

                                                            ఒక ఆడపిల్ల విద్యావతి అయి, తద్వారా ఉన్నత హోదాలు అనుబవిస్తుంటే ఖచ్చితంగా ఆ ఖ్యాతి పుట్టింటి వారిదే అవుతుంది. అత్తింటివారు ఆమె చదువులకు, ఇతరత్రా సహాయపడినా ఆమేలోని మేదో విజ్ణానం పెరగడానికి కారణమయిన జీన్స్ అన్ని ఆమే పుట్టింటి అంటే ఆమె తల్లితంద్రులనుండి మాత్రమే సంక్రమించి ఉంటాయి కాబట్టి,ఆ గొప్పతనం తప్పకుండా ఆమె పుట్టింటికే చెందుతుంది. అయితే ఆమెలోని ఆ మేదో జ్ణానాన్ని వెలికి తేవడానికి అత్తింటి వారి క్రుషి ఉంటే అప్పుడు వారు కూడా ఆమె ఖ్యాతికి కారకులవుతారు. ఒక విజ్ణానువంతురాలైన ఆడపిల్లను కోడలిగా తెచ్చుకునే వారి కుటుంబం సర్వతో ముఖంగా అభివ్రుద్ది చెందుతుంది.   జీన్స్ పరంగ కూడా కొన్ని జీన్స్ తల్లి ద్వరానే సంక్రమిస్తాయి అని   ఇంగ్లాండ్ యువరాజు విలియమ్స్ తాజా ఉదంతం రుజువు చేసింది. ఆయనలో ఉన్నది మన భారతీయ మహిళ జీన్ అని శాస్త్రవేతలు ప్రకటించారు. అది అరుదైన జీన్ అని కూడా ప్రకటించటం జరిగింది. కాబట్టి ఆడపిల్ల మన వారస్త్వం మోయదు అనుకోవడం మూర్కత్వం అని తేటతెల్లమయింది. ఆడపిల్ల అయినా, మగపిల్లవాడు అయినా వారి జ్ణాన వారసత్వం  పుట్టింటిదే. దన వారసత్

ప్రజల్ని కాపాడలేని "లౌకిక" ముఖ్యమంత్రులు కన్నా, కాపాడే "మోడీ" లాంటివారే లక్షరెట్లు మిన్నా!

Image
                                                                                                                                      మతమో, గితమో ప్రబుత్వాలకు   అనవసరం. తమని నమ్మిన వారికి సహయం చెయ్యడమే ప్రభుత్వ  దర్మం. తమను నాయకులు గా బావించి, వోట్లేసి ఎన్నుకున్న ఆ ప్రజలు, దేవున్ని చూద్దామని "దేవబూమి" అని చార్ దాం యాత్రకు వెళితే,అక్క్డ ప్రక్రుతి ప్రకోపించి, రుద్ర దామాలు అన్నీ "రుద్ర భూమి" గా మారిపోతే, చేష్టలుడిగి పోయింది కాంగ్రెస్ పార్టీకి చెందిన "విజయ బహుగుణ" ప్రబుత్వం. నిస్సిగ్గుగా, మానవత్వం మరచి, అక్కడ వరద విపత్తులో చిక్కుకున్న భక్తులను దొంగలు దోచుకుంటుంటే, ఆపడం చేతకాని సర్కార్కి "చార్ దాం" ప్రాంతాన్ని ఏలే  నైతిక హక్కు ఉందా?. అది అసలు "చార్ దామా"? లేక చోరోంకి దామా? ప్రజల్ని గుర్రాల మీద వచ్చి యద్దేచ్చగా దోపిడి చేస్తున్నారని మన ఆంద్రా యాత్రీకులు చెపుతున్నారు. వరదలనుంచి కాపాడలేరు సరికదా దొంగలనుంచి, వందరూపాయల వస్తువును వేయి రూపాయలకు అమ్మే వ్యాపార చోరులనుంచి కూడా కాపాడలేని దిక్కు మాలిన ప్రబుత్వాలు ఉంటే ఏమి? ఊడితే ఏమి?   కాని అం

నది ఒడ్డున ఉన్న తరువులుకి, పరాయి ఇంట్లో ఉన్న తరుణులుకి తప్పదు ముప్పు!

                                                                                                                                        ఈ కొటేషన్ చెప్పింది ఎవరో తెలుసా అర్దశాస్త్ర రచయిత కౌటిల్యుడు లేక చాణక్యుడు.మొన్న వచ్చిన "కేదార్ నాద్" వరద విపత్తు చూస్తుంటే ఆయన ఏ నాడో చెప్పిన సూక్తులు అక్షర సత్యాలు అనిపిస్తున్నాయి. పై దానిలో రెండవ వ్యాక్య సంగతి ఎలా ఉన్నా మొదటిది మాత్రం నిజం ! నిజం!   నది ఒడ్డున ఎంత గొప్ప చెట్లు ఉన్నా అవి ఏదో ఒకనాడు కొట్టుక పోక తప్పదు. ఈ సూత్రం కేవళం చెట్లకే కాక అన్ని రకాల కట్టడాలకు వర్తిస్తుంది. అందుకే మొన్న ఉత్తారాఖాండ్ వరదలకు నది ప్రకన ఉన్న పెద్ద పెద్ద బవంతులు పేకమేడల్లా కూలిపోయాయి.అంతే కాదు అపార ప్రాణ నష్టం సంబవించింది.  టూరిజం డెవలప్మెంట్ పేరుతో ఆద్యాత్మిక క్షేత్రాలను వ్యాపార క్షేత్రాలుగా మారుస్తూ, అడ్డగోలుగా నదీ పరివాహక ప్రాంతాలో కట్టడాలకు అనుమతులిస్తున్న రాష్ట్ర సర్కారులు, ఉత్తరాకాండ్  వరద్ ప్రళయ ఉదంతంతోనన్నా కళ్ళుతెరిస్తే మంచిది. ఈ సర్కారులో ఉండేవాల్లకి కౌటిల్యుడి నీతి గురించి ఎలాగూ చదువుకోలెదు సరే, కనీసం పర్యావరణ శాస్త్రవేత్తలు చెప్పేది అయిన

కట్టుకున్నోడు పోయినట్లు లేదు! కానివాడు పోయినట్లుంది!

                                                                                                                            నేను ఈ మద్య తెలిసినతను మర్డర్ చేయబడ్డాడు అని తెలిసి, వాళావిడని, పిల్లలను పరామర్సిదామని వెళ్లాను. అక్కడ ఆవిడని పలకరించడానికి చాలా మంది బందువులు, చనిపోయిన వ్యక్తి స్నేహితులు వచ్చి పరామర్సించి వెలుతున్నారు.   మర్డర్ కావించబడిన వ్యక్తి కారుకు యజమాని. అతనికి స్నేహితులు ఎక్కువే. అలా స్నేహితులతో కలసి కారులో వెళ్ళిన వ్యక్తి, తన కారులోనే శవం గా వెనుక సీటులో పడుకోబెట్టబడి ఉంటే మొదట ఎవరూ గమనించలేదట. ఆ కారు కూడా వేరే ఊరిలో రోడ్ వారాగా ఆపుచెయ్యబడి ఉందట. ఒక రోజు అలాగే ఉన్న కారులోనుంచి దుర్వాసన వస్తుంటే గమనించిన పాదచారులు విషయం పోలిసులకు చెప్పారట. పోలిస్ వారు వచ్చి, కారులో ఉన్న శవం చొక్కా జేబులో ఉన్న చరవాణి అదారంగా, అతని బార్యకు కబురు చేస్తే, ఆమె తన బందువులతో కలిసి వెల్లి బర్తని గుర్తించి, అతనికి పోస్ట్ మార్టం చేసిన తర్వాత తీసుకువచ్చి, ఆ రాత్రే దహనం చేసారట! తెల్లారి ఈ విషయం పేపర్లో  సంచలన వార్త గా ప్రచురించ బడ్డాకా, మా లాంటి వారందరికి తెలిసి పరామర్సించడానికి వస్తున్నారు.

మహిషాసురిడిని మట్టు పెట్టిన ఖమ్మం జిల్లా పోలిసులు!

                                                                                                                                మనకు పురాణా గాధ ఒకటి ఉంది. మహిషాసురుడనే రాక్షసుడు ఒకడు ప్రజలను, మునులను  విపరీతంగా బాదిస్తుంటే,ఆతడి బాద తట్టుకోలేని వారు ఆ శక్తిని ప్రార్దిస్తే, మాత మహిషాసుర మర్దనం గావించి అందరికి మేలు చేకూర్చిందని.   ఇక్కడ మాత అయితే రాలేదు కాని పాల్వంచ పోలిసులు వచ్చారు, మహిషాసురిడిని మర్దించారు! వివరాల్లోకి వెలితె,   రంగారావు గారు ఒక రైతు. ఖమ్మం జిల్లా, పాల్వంచ మండలం నాగారం గ్రామం లో అతనికి పొలం ఉంది. ఆ పొలంలో ని పైరును ఒక దున్నపోతు మేయటం చూశాడు అతడు . దానిని అదిలించాడు. అదే అతను చేసిన తప్పు. ఇక్కడ సదరు దున్నపోతు గురించి పరిచయం ఏమిటంటే, అక్కడ ప్రజలు కొందరు దేవుని పేరు మీద మొక్కుబడిగా  "దున్నపొతులను" వదలడం రివాజు. ఆ దున్నపోతులు స్వేచ్చగా తమకు ఇష్టం వచ్చిన చోట మేయటం, పడుకోవటం చేస్తుంటాయి. వాటిని రైతులు "దేవుని దున్నపోతులు" కాబట్టి ఏమి అనరు!. కాని రంగారావు గారు మాత్రం దానిని అదలించారట!. దానితో కోపం వచ్చిన దున్నపోతు రంగారావు వెంటపడితే ఆయన భయంతో పరిగ

"మోస్ట్ పాపులర్ ఫాదర్" మరో మగపిల్లవాడు కోసం "లింగ నిర్దారణ పరిక్ష" చేయించాడట!

                                                                   మొన్ననే ఆయన గారిని పదకొండు వేల మంది మహిళలు మోస్ట్ పాపులర్ ఫాదర్ గా ఎన్నుకున్నారు. ఈ రోజు ఆయన గారి గురించి ఒక విశేషం ప్రకటించారు.     ఆయనకి ఇద్దరు సంతానం.అందులో ఒకరు మగ, రెండవవారు ఆడ. వారంటే ఆయనకి ఎనలేని ప్రేమట. పిల్లలు పెద్దవారైతే వారిని స్నేహితులు లాగా చూడాలని విజ్ణులు చెప్పినట్లే ఆయన అభిప్రాయం కూడా అట. మొన్న ఫాదర్స్ డే సందర్బంగా ఒక మారేజ్ సంస్త వారు ఒక అభిప్రాయ సేకరణ చేసి బారత దేశంలో ఆయనని అత్యంత ప్రజాదరణ పొందిన తండ్రిగా తేల్చిపారేశారు.ఇలా తేల్చడానికి వారికి ఉపయోగపడింది ఎవరో తెలుసా? అచ్చంగా మహిళలు.మరి అటువంటి మహిళ లను కించ పరచేలా మరో  "మగబిడ్డ" కోసం ముందస్తు నిర్దారణలు చేయించిన  ఫాదర్ "మోస్ట్ పాఔలర్ ఫాదర్" అవుతాడా?    హిందీ సినిమా ఇండస్ట్రీ బాద్షా గ్రేట్ షారుక్ గారు ఇద్దరు పిల్లల తండ్రి కాని వారితో ఆయనకి సంత్రుప్తి కలగలేదు. ఎలాగైనా మరో  మగపిల్ల వాడిని పొందాలనుకున్నాడు.వయో రీత్యా కావచ్చు, లేదా ఇంకే కారణమయినా కావచ్చు, అతను సహజ పద్దతుల్లో కాకుండా, క్రుత్రిమ "సర్రో గసి" పద్దతిలో మరో మ

చివరికి పాపులర్ ఫాదర్లు కూడా సినిమా యాక్టర్లేనా!

Image
                                                             ఫావరేట్ ఫాదర్  కీ.శే. మద్దిగుంట తిరుపతయ్య గారు.   అమ్మయ్యా! గాందీ గారు చనిపోయి బ్రతికి పోయారు. లేకుంటే ప్రెసెంట్  పాపులర్ ఫాదర్ని చూసి, ఖచ్చితంగా " హరీ రామ్" అనేవారు.   ఏ పిల్లలకయినా తమ తల్లితండ్రులే గ్రేట్. తమకోసం కష్టపడి, నిరంతరం తమ కెరీర్ కోసం తపిస్తున్న  తమ తండ్రిని ఏ బుద్దున్న బిడ్డా మరచిపోడు. తమ తండ్రి తమ కోసం ఎంత కష్ట పడుతున్నారో, అందరి తండ్రుల్ అలాగే తమ తమ పిల్లల కోసం , వారి ఉన్నతి కోసం ఆరాటపడుతున్నారు. ఎక్కడో ఒకరిద్దరు మినహాయింపు ఉంటే ఉండవచ్చు. కాని జనరల్ ప్రతి బిడ్డకి తమ తండ్రిని మించిన అభిమాన హీరో మరొకరు ఉండరు. అందుకే కాబోలు అందరికి ఉన్నట్లే తండ్రులను గుర్తుంచుకోవడం కోసం ఒక రోజు వారికి కేటాయించి ఉండవచ్చు.   మొన్న షాది .కాం  అనే వారు పదకొండువేల మందిని అందులో మహిళలను అడిగారట, మోస్ట్ పాపులర్ ఫాదర్ ఎవరూ అని. ఇంకేముంది వారిలో ఎక్కువమంది "షారుక్ ఖాన్" అంటే, రెండవ వాడిగా అమితాబ్ని ఎన్నుకున్నారట!. దీనిని బట్టి అర్దం అవుతుంది వారికి షారుక్ ఖాన్, అమితాబ్ గురించి తెలిసినంతగా, వారి వారి తం

మొత్తానికి బ్రిటిష్ వాళ్లు మన కోహినూర్ వజ్రాన్నే కాదు," కెనార్క్" D.N.A కూడా దొంగిలించుకు వెళ్ళారన్న మాట!

                                                            నిన్న ఒక వార్త చూశాను. ఆ వార్త చూసి మనవాళ్లు కొంతమంది సంతోషిస్తున్నట్లు ఉంది. ఇంతకి వార్త ఏమిటంటే, ప్రస్తుత బ్రిటిష్ యువరాజు "చార్లెస్ డయానా",ల కుమారుడు విలియమ్స్ లో మన బారతీయ స్త్రీ మూలాలు అంటే D.N.A  ఉందట! కాబట్టి ఆయన మన వాడేనట. అదీ సంబడం!   ఇంతకి బ్రితిష్ యువరాజులో మన వాళ్ళ  D.N.A    చేరిన విదంబు ఎట్టిదనిన, సదరు యువరాజు గారి అమ్మ,అమ్మ,అమ్మ,అమ్మ,అమ్మ అయిన "ఎలిజా కెనార్క్" గారు సూరత్ లో ఒక ఇంగ్లీష్ జాతీయుడు అయిన వ్యాపారి వద్ద పని మనిషిగా ఉండేదట! వారిద్దరి మద్య ఉన్న ఒప్పందానుసారం కాబోలు ఆవిడ గారు ఆయన గారికి "కేదరిన్" అనే కూతురిని కని ఇస్తే, ఆయన ఇంగ్లాండ్ తిరిగి వేళ్ళేటప్పుడు పనిమనిషిని వదిలేసి తన మనిషి(కేదరిన్) ని తీసుకు వేళ్ళాడట. అదిగో ఆ కేదరిన్ తాలుకు వారసురాలే  విలియమ్స్ తల్లి "డయానా". ఆమే ద్వారా బారతీయ "జీన్"   విలియమ్స్ కి వచ్చిందట!. ఇప్పుడు ఆయన గారి ఇంగ్లాండ్ సింహాసనం అదిష్టించబోయే  చార్లెస్ కుమారుడు మరియు తర్వాతి వరుసలో ఉన్నవాడు కాబట్టి, మన బారతీయ  D.N.A      ఇ

"దొరలా" దొంగ బ్రతుకు బ్రతికే కన్నా, "దొంగలా" దొర బ్రతుకే మిన్నా!

Image
                                                                 అరవై నాలుగు కళల్లో "చోర కళ" కూడా ఒకటి. అనుకుంటాం కాని దొంగతనం అంత ఈజీ కాదన్ సెలవిస్తుంటారు అనువభవజ్ణులు.సరే వారు అనుబవంతో అన్నారో, ఊహతో అన్నారో తెలియదు కాని అవకాశం దొరికితే ఇండియాలో దొంగతనం చెయ్యడం చాలా సుళువు.   ఒక పెద్దమనిషి ఎన్నికల సమయంలో పంచాయతి ప్రెసిడెంట్ గా నిలబడ్డాడట. పాపం డబ్బున్న ప్రత్యర్ది, గెలుపు కోసం తన అక్రమ సంపాదన(బ్లాక్ మని) విరజిమ్ముతుంటే, ఏమి చేయాలో పాలుపోక,రాత్రుళ్ళు దొంగతనాలకు వెళ్ళి, పగలు ప్రచారంలో ఆ డబ్బును పంచాడట!అలా ప్రెసిడెంట్ గా గెలిచి పదవి అనుబవిస్తుంటే, కొంతకాలానికి సదరు దొంగతనాలు బయట పడి కటకటాలా పాలు అయాడు ప్రెసిడెంట్ గారు.ఇది నిజంగా జరిగిన విషయం.    పై ఉదంతంలో ప్రెసిడెంట్ పదవి మీద మోజు అతనిని దొంగ తనానికి పురిగొల్పింది. పదవి మీద మోజు అనేది కూడా స్వార్దమే కాబట్టి, అతను చేసిన దొంగతనాన్ని పరమాదం గా బావించలేము. కాని ఇల దొంగ తనం చేసిన సొమ్ము ఎన్నికళ్ళో పంచడమనేది,అతను ఒక్కడే చేసాడా, అంటే కాదు అనే సమాదానం వస్తుంది. అసలు దొంగతనం అంటే ఏమిటి? పరుల సొమ్మును వారికి తెలియకుండా తీసుకోవడమే. ఒ

అనుమానముంటే డి.యెన్.యె.టెస్టులు చేయించుకోండి.అంతే కాని అభం శుభం తెలియని పిల్లల్ని హింసించకండి.

                                                                                                                                           మొన్నీ మద్య మా ప్రాంతంలో ఒక విషాదకర సంఘటన జరిగింది. ఎంతో ప్రేమగా చూసుకునే తండ్రి హట్టాతుగా రాక్షసుడుగా మారి తన బిడ్డను అమానుషంగా హింసించాడట!ఈ ఉదంతం మీద తల్లి మౌన ముద్ర దాల్చింది. కారణాలు  ఇంకా పూర్తీగా తెలియ రాలేదు కాబట్టి తెలియని దానిని విశ్లేషించడం పద్దతి కాదు అని బావిస్తున్నాను.   అయితే   సామాన్యంగా   సంసారాలలో పెద్దలు చేసే కొన్ని కొన్ని తప్పులు పిల్లలకి నరకమ్ చూపిస్తుంటాయి. సంసారానికి పునాది నమ్మక్కం. ఆ నమ్మఖ్ఖమే లేకపోతే ఆలుమగలుగా కలసి జీవించడం అనవసరం. ఈ నమ్మక్కం అనేది కూడా ఇంతకాలం మనం అనుసరిస్తూ వస్తున్న ప్రేమానురాగాలతో కూడిన సాంప్రదాయక సంసార జీవన విదానంలోనుండి వచ్చింది. కాబట్టి అట్టి నమ్మక్కం లేకపోవడమంటే పునాది లేని భవంతి లాంటిది ఆ కాపురం. ఎప్పుడైన కూలిపోవచ్చు.    ప్రతి వ్యక్తి తన వారసత్వాన్ని అభిరుద్ది పరచుకోవడం అతని సహజ హక్కు. దానిని కాదనే అధికారం ఎవరికి లేదు. అటువంటి వారసత్వ అభిరుద్ది హక్కును కాలరాసేది తప్పుడు మార్గాలలో చరించే జ

సూపర్ మాన్,స్పైడర్ మాన్ లు కాదు, మనకు కావలసిందీ ఈ "ఫ్యామిలి మాన్" లు మాత్రమే!

Image
                  నిజంగా ఇది ఒక అద్బుతమైన వార్త! మానవ సంబందాలు నాగరికత మాటున మ్రుగ్యమవుతున్న వేళ, కుటుంబ బందాలు, ఆర్థిక సంబందాలుగా చూడబడుతున్న వేళ, ఒక నిజమయిన బారతీయుడు అంటే నాగరికతకు దూరంగా బ్రతుకుతున్న కేరళ గిరిజనుడతడు. పేరు అయ్యప్పన్. ఇతను తన బార్య సుదతో కలసి "కోన" అడవుల్లో తేనే సేకరణ ద్వారా జీవిస్తున్నాడు. బార్యకు ఏడు నెలల గర్బం. హట్టాతుగా నెప్పులు వచ్చే సరికి దగ్గరలో వైద్య సదుపాయం లేక విలవిల లాడి పోయాడు. ఒక ప్రక్కన జోరున వాన. ఇంకొక వంక వాహన సదుపాయం లేని ప్రాంతం. క్షణం ఆలోచించిన బార్యా, లోపలి బిడ్డ దక్కడం కష్టమని బావించిన అయ్యప్ప ఆలస్యం చెయ్యకుండా, బార్యను బుజాన వేసుకుని, నడక మొదలెట్టాడు పట్నం వైపు. ఒకటి కాదు రెండు కాడు ఏకంగా నలబై కిలోమీటర్లు, అదీ అడవిలో ఏక బిగిన నడచి హాస్పిటల్కు బార్యను చేర్చాడట! పాపం బిడ్డను రక్షించలేకపోయినా, బార్యను మాత్రం కాపాడ గలిగారు డాక్టర్లు.    ఇక్కడ మనం చూడాల్సింది అయ్యప్ప యొక్క నడక శామర్ద్యం గురించి కాదు. బార్య బిడ్డ మీద తనకున్న అంతులేని ప్రేమాను రాగాలు. నిజానికి జోరున కురిసే వానలో నలబై కిలోమీటర్లు ఒక గర్బవతిని ఎత్తుకొని రావడం ఆమె అరోగ

కోటి రూపాయలు ఖర్చు చేసినా, విజ్ణానం, కొవ్వుని తగ్గించవచ్చు గాక !అహంకారాన్ని మాత్రం కాదు!

Image
                                                                                                                                     మనిషి ఆనందంగా ఉండటానికి  బౌతిక విజ్ణానం కాదు, ఆత్మ జ్ణానం లేక ఆద్యాత్మిక విజ్ఞానం కావాలి. అది పొందనంత కాలం మనిషి ఆనందం కోసం వెంపర్లాడుతూనే ఉంటాడు.ఆద్యాత్మిక జ్ణానం మనిషిలో ఉన్న అహంకారాన్ని మాయం చేసి,పంచ బూతములు తనయందును, తనను పంచ బూతముల యందును చూసుకునేలా చేస్తుంది. ఎప్పుడైతే మనిషి తానే స్రుష్టికి ప్రతిరూపమని బావిస్తాడో,అప్పుడు అతనిని బాద పెట్టే అంశాలేమి ఉండవు. నిర్మాలానందంని పొందుతుంటాడు. డబ్బు, దస్కం హోదా , కిర్తీ, ప్రతిష్టలు ఇవ్వన్నీ బౌతిక  ఆనాందాలు ఇచ్చేవి అయినా,అట్టి బౌతిక అనందాలు మనిషిని సంత్రుప్తి పరచక, మరిన్ని సుఖాల కోసం ఆరాటపడేలా చేస్తాయి. కాబట్టి అది అసంత్రుప్త ద్రావణం లాంటిది.      మనిషి సాదించిన విజ్ణానం  అతనికి బౌతిక  ఆనందాలను ఇస్తుండవచ్చు. కాని మనిషి కాని, సమాజం కాని ప్రశాంతం గా ఒక నియమబద్దమైనా రీతిలొ కొనసాగాలంటే,ఆద్యాత్మిక జ్ణానం అవసరం. దీనిని ఒక ఉదాహరణ ద్వారా వివరించదానికి ప్రయత్నిస్తాను.        బాగా తినడం అలవాటు ఉన్న వ్యక్తికి, కొవ

బౌతిక వాదుల ఆగడాలను అరికట్టిన హైకోర్టు!

 శాస్త్ర  పరంగా ఆలొచించి అడుగు ముందుకు వెయ్యాలంటే  సామాన్యులకే కాదు, మాన్యులకు అది సాద్యపడక పోవచ్చు. ఇదే సూత్రం ఉబ్బస వ్యాదిగ్ర్స్తుల విషయంలోను వర్తిస్తుంది.  బత్తిన సోదరులు ఇస్తున్న చేప ప్రసాదానికి దేశ నలుమూలల నుంది వస్తున్న ఆ ప్రజలను చూస్తే మనసున్న వారెవ్వరికైనా అయ్యో పాపం అనిపించక మానదు. ఆస్మాకు మందు లేదని చెప్పి చేతులు దులుపుకోవటం విజ్ణాన వంతుల లక్షణం కాదు. ఇంతవరకు ఆ జబ్బు ఎందుకు వస్తుందో ,ఎలా వస్తుందో పరిశోదించి దానికి తగిన నివారణొపాయాలు కనుగొంటే ప్రజలు ఇలా తొక్కిసలాడి చెప ప్రసాదానికి దేబిరించాల్సిన అవసరం ఉండేది కాదు. ఆ ఉబ్బస సమయంలొ వారు పడే నరక యాతనే వారిని అన్ని మైళ్లు శ్రమకోర్చి వచ్చేలా చేస్తుండవచ్చు. పోనీ అది ఒక సైకాలాజికల్ సమస్యా కదా అనేది కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. ఉబ్బసానికి మందు లేదు మీ చావు మీరు చావండి అని చెప్పే నిజ వాదులుకన్నా, మీరు ఇ మందుతొ సంవత్సరం అంతా హాయిగా ఉంటారు అని చెప్పి హాని లేని ది  మింగించ నమ్మక్కం కలిగించే వాడే నిజమైన   మానసిక వైద్యుడు.     నిన్న సాయంత్రం హైద్రాబాదులొ ద్రగ్  కంట్రోల్ అదికారులు అనేక మందుల దుఖాణాలు మీద దాడి చేసి,అనుమతి లేని మందుల

చేప ప్రసాదంలో "మందు విలువలు"మాత్రమే లేవు కాని , విజ్ణానులు దగ్గర అసలు ఆస్మాకి మందే లేదు!

           పాపం కొంత మందిని చూస్తే వారికి జ్ణానం ఉండవచ్చు కాని ఇంగిత జ్ణానం మాత్రం ఏ మాత్రం లేదేమో అనిపిస్తుంది. జనవిజ్ణాన వేదిక వారు "చేప ప్రసాదం" మీద అంత లొల్లి చేసి సాదించినది ఏమిటో అర్థం కావటం లేదు. కేవలం పబ్లిసిటి తప్పా!రాజ్యాంగ నియమాలు ప్రకారం ఏ వ్యక్తి అయినా తను నమ్మిన విశ్వాసాలను ఆచరించవచ్చు, ప్రచారం చెసుకొవచ్చు . కాకపోతె ఆ విశ్వాసం మనిషి అరోగ్యానికి కాని, దేశ బద్రతకు కాని బంగం కలిగించకూడదు.        గతంలొ చెప ప్రసాదం మీద కొర్టుల్లో జనవిజ్ణాన వేదిక వారు పిటిషన్ లు వేసినప్పుడు హై కోర్టు వారు స్పష్టంగా చెప్పారు.చెప మందు లేక ప్రసాదం అని చెప్పబడుతున్న దానిలో మనిషికి హాని చెసే పదార్దములు ఏమి లేవు కాబత్టి, దానిని ప్రసాదంగా పంపిణి చెసుకోవచ్చు అని. బత్తిన సోదరులు కూదా అది తమ పూర్వికులకు ఒక సాదువు ఇచ్చిన వరప్రసాదం అని, దానిని సేవించిన వారు ఆస్మా నుండి ఉపశమనం పొందుతున్నారు అని చెపుతున్నారు . కాబట్టి వారు నిరబ్యంతరంగా ప్రసదాన్ని పంపీణి చెయవచ్చు. ఇది వారి మతపరమైన రాజ్యాంగ హక్కు.       ఇక పొతే సదరు బత్తిన సోదరుల పంపిణి కార్యక్రమానికి ప్రబుత్వం వారు సహయ సహకారాలు అందించదం గూర్చి

సరస్వతి నది పుష్కరాలు జరిగే "మాన" గ్రామం లోని విశేషాలు చూడండి!

Image
  గురుగ్రహ సంచారం ఆదారంగా, మన దేశంలోని ఆ యా పుణ్య నదుల పుష్కరాలు నిర్వహిస్తుంటారు. గురుడు ఒక రాసి నుండి మరొక రాసికి మారే సమయం ని పవిత్ర ఘడియలుగా యెంచి, ఒక్కొక్క రాసికి ఒక్కొక్క నదీ పుష్కరంగా నిర్ణయించి భక్తులు ఆ యా నదులలో పవిత్ర స్తానాలు ఆచరించడం రివాజు. అలా ఈ సంవత్సరం గురుడు మిదున రాసి లోకి ప్రవేశించే సమయం ని సరస్వతీ నదీ పుష్కరంగా పిలుస్తారు. ఈ శుబ ఘడియలు మె 31  నుండి జూన్ 11 వరకు,ఉంటాయి. కాబట్టి ఈ పన్నెండు రోజులు సరస్వతీ నదిలో పుష్కరస్తానాలు చేసి దన్యులవుతారు భక్తులు.   ఇంతవరకు బాగానే ఉంది. కాని స్వరస్వతీ నది పుష్కరాన్ని మన రాష్ట్రంలో గోదావరి ప్రవహిస్తున్న కాలేశ్వర క్షేత్రంలో నిర్వహించడం ఎంత వరకు సమంజసం? అక్కడ సరస్వతి నది అంతర్వాహిని గా ఉందన్న ఒక పుక్కిట వాదం ఆదారంగా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం ఎంత మాత్రం బావ్యం కాదు అని నా అభి ప్రాయం. అసలు సరస్వతీ నది దక్షిణ బారతానికి సంబందించ్దే కాదు అనడం లో ఎవరికీ బేదాబిప్రాయాలు లేవు. ఆ నది రుగ్వేద కాలం లో ఒక మహా నదిగా ఉండి కాల క్రమేపి అంతర్వాహినిగా మారిందని చెపుతారు.    అలా అంతర్వాహిణిగా కూడా ఆ నదీ పుష్కరాలు జరపాల్సిన చోటు కూడా ఉత్తర బారతం