Posts

Showing posts from 2018

దంపతులు ఇద్దరూ సమానులే అనేది గే ,లెస్బియన్ లకు వర్తిస్తుంది. భార్యాభర్తలు ఇద్దరూ కలసి ఒక్కటి అనేదే హిందూ తాత్విక దృక్పదం!

Image
                                                                        భారత రాజ్యాంగం తన పౌరులకు సమానత్వం ని ప్రసాదించింది. దీనికి ప్రతి పౌరుడు రాజ్యాంగం పట్ల కృతజ్ఞుడి గా ఉండాల్సిందే. ఎవరి దృష్టిలో ఎలా ఉన్ననా , రాజ్యాంగం ప్రకారం చట్టం దృష్టిలో పౌరులందరూ సమానమే. అందులో ఆడ, మగ ,థర్డ్ జెండర్ అనే లింగ వివక్షత అనేది చూపించటానికి విలు లేదు. అదిగో అదే కారణం చూపిస్తూ మొన్ననే సుప్రీం కోర్టు భారతీయ శిక్షా స్మృతి లోని  497 సెక్షన్ ,అడల్త్రి నేరానికి శిక్ష పొందే విషంలో స్త్రి పురుషుల పట్ల వివక్ష చూపించడమే కాక, భార్యను భర్త యొక్క ఆస్తిగా బావించే పాత తరం వారి బూజు పట్టిన బావ జాలానికి అడ్డం పట్టేల ఉందని ప్రకటిస్తూ , అసలు అ సెక్షనే నేటి తరానికి పనికి   రాదనీ 4:1 మెజార్టి తో అత్యున్నత న్యాయస్తానం కొట్టివేయడం జరిగినది. అయితే 497  సెక్షన్ లో నేరానికి బాద్యుడిగా పురుషుని మాత్రమె చేయడం వెనుక , అడల్త్రి నేరం విషయం లో నాటి సమాజం నేరస్తురలైన స్త్రి పట్ల చూపించిన హిన దృష్టి ,పురుషుని పై చూపించడం లేదు కాబట్టి, కేవలం పురుషున్ని శిక్షిస్తే సరిపోతుందని చట్ట నిర్మాతలు బావించి ఉంటారని ఇదే బ్లాగు లో ఇంతకు ముంద

జంటగా నేరం చేసిన ఆడదాన్ని ఏమనలేక ,మగాడిని కూడా వదిలేయమన్న సుప్రీం కోర్టు అప్ ఇండియా !

Image
                                                                                          సెక్షన్ 497 కేసులో తప్పు లేక నేరం స్త్రి పురుషులు ఇరువురు చేసినప్పటికీ ,కేవలం పురుషుడికి మాత్రమె శిక్ష విదించే అవకాసం కల్పించడం ,స్త్రీని కనిసం  ప్రేరేపణ చేసిన వ్యక్తిగా నైన సహా నిందితురాలిగా చేర్చకుండా పూర్తిగా వదిలి వేయడం వెనుకాల "కేవలం స్త్రి పురుషుడి యొక్క స్వంత ఆస్తి కాబట్టి, అట్టి ఆస్తికి సంబందించిన హక్కుకు బంగం కలిగింది కాబట్టే ,ఇది కేవలం పురుషుల మద్య అనుభవ హక్కుల సమస్య గా బావించి వెనుకటి చట్ట నిర్మాతలు,పురుష ఆదిక్య బావజాల ప్రబావం తో  ఈ సెక్షన్ పెట్టారు " అని బావించటం పూర్తిగా తప్పు. అదే నిజమైతే తప్పు చేసిన మగవాడికి 5 యేండ్లు జైలు శిక్ష విడిస్తే ,అదే తప్పు చేసిన స్త్రీని ఇంకా కటినంగా శిక్షించమని చట్టం చేసి ఉండేవారు. దీనిలో స్త్రీల మిద కేసు పెట్టకపోవడానికి అ నాటి సమాజ పరిస్తితులే కారణం.                         అ రోజుల్లో వివాహేతర సంబంధం పెట్టుకుంటే ,అలా పెట్టుకున్న స్త్రీని సమాజం హీనంగా చూసేది. జరిగిన తప్పు లో బాద్యత ఎవరిదైనా ,సమాజం మాత్రం ఆమెను మాత్రమె బాద్యురాలిగా చేసి ఆమ

తిరుమల దేవస్థానం వివాదాన్ని, కమ్మ ,బ్రాహ్మణ సామాజిక వర్గాల మధ్య జరిగే వివాదంగా చూడటం ఎంతవరకు సమంజసం?

Image
                                                                                             తిరుమల తిరుపతి దేవస్థానం ! దేవ దేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామీ వారి కోవెల . ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన దేవాలయం. ఆర్థికపరంగా వత్సరానికి అన్ని వనరుల నుంచి  వేయి కోట్ల పైన ఆదాయం పొందుతున్న దేవాలయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని అన్ని దేవాలయాలు మీద అజమాయిషీ కోసం ప్రభుత్వం I.A.S  కేడర్ కలిగిన అధికారిని కమిషనర్ గా నియమిస్తే ,కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం గ్రూప్ ఆలయాల అజమాయిషీ కోసం ప్రత్యేకంగా  I.A.S  కేడర్ కలిగిన అధికారిని  "కార్య నిర్వాణాధికారిగా " నియమిస్తున్నారు అంటే ఆర్థిక పరంగా ఆ దేవాలయ ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకోవచ్చు. తిరుమల క్షేత్ర్రాలు నిర్వహణ కోసం ప్రత్యేక చట్టం ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆక్ట్ లో అంతర్భాగంగా ఉంది. తిరుమల కొండ పైన ఉన్న అన్ని విభాగాలకు చెందిన సంస్థలు పంచాయతీ ,పారెస్ట్  లాంటివి కూడా దేవస్థానం E.O అజమాయిషీ లోనే పని చేస్తుంటాయి.     ఇక పొతే తిరుమల దేవస్థానం కార్యకలాపాలు విషయం లో భక్తులకి ఏమి పాత్ర ఉండదా అంటే ఎందుకుండదు ? చట్ట ప్రకారం దేవస్థానం కి ధర్మకర్తల