Posts

Showing posts with the label పాకిస్తాన్ లో దీపావళి

ఇండియాలో మహాకూటమి గెలిస్తే , పాకిస్తాన్ నరకాసురుడు "దీపావళి " జరుపుకోవడం లో మతలబ్ ఏమిటి?

Image
                                                                                  Namo  -Lion                                              పాకిస్తాన్! భారతదేశానికి పక్కా శత్రువు. మన దేశం లో ఏ ఉగ్రవాద చర్య జరిగిన దాని మూలాలు పాకిస్తాన్ లోనే ఉంటాయి. మతమౌడ్యం తో ఉగ్రవాద తండాలకు ఆసరా ఇస్తూ నిరంతరం ఇండియా మీద కయ్యానికి కాలు దువ్వె పాకిస్తాన్ ని మిత్రదేశం అనుకోలేము. వేయి బజరంగీ బాయి  సినిమాలు తీసినా అవి పైసలు వసూలు చేసుకోవడానికి పనికి వచ్చేవే తప్పా , పాకిస్తాన్ మనసులో ఇండియా పట్ల ఉండే ద్వేషాన్ని తగ్గించలేవు. ఐ మద్య కొందరు ఐ లవ్ పాకిస్తాన్ అంటూ ఇండియాలో వారేదో పెద్ద సౌబ్రాతుత్వం ఉన్న వారిలా సోషల్ మీడియాలో పోజులు పెట్టారు. దేశమమ్టె మట్టి కాదోయి మనుషులోయి అన్నది ఒక నాటి మాట. దేశమంటె రాజకీయాలు , మీడియాయె అన్నది నేటి మాట. ప్రజల మనసుల్లో ఏమున్నా బయటకు చెప్పలేని వారి వల్ల ప్రయోజనం ఏమి లేదు. ఈ  నాడు ఒక దేశపు  ప్రజావాణి అంటె  ఆ దేశంలోని మీడియా చెపుతున్నాడే అని అర్దం కాబట్టి. "దేశమంటె  మట్టి కాదోయి మీడియా యేనోయి " అని చెప్పుకోవలసిన అవసరం ఉంది.                      బీహార్లో మహాకుటమ