Posts

Showing posts with the label శవాల మీద మరమరాలు

శవాల మీద మరమరాలు ఏరుకుని తినడం అంటె ఇదే కాబోలు !!!!

                                                                      ఉత్తరప్రదేశ్ లోని బరేలీ వద్ద బైపాస్ రోడ్డుపై బీరు కేసులను తీసుకెళుతున్న లారీ బోల్తా పడింది. ఈ విషయం అంతటా పాకడంతో సమీప గ్రామస్తులంతా సంఘటన స్థలానికి తరలివెళ్ళారు. ఎవరికి దొరికిన కేసులను వారు ఇంటికిమోసుకెళ్ళారు. బిందెలు, బక్కెట్లు, చెంబులు, చివరికి ప్లాస్లిక్ సంచులు కూడా తీసుకెళ్ళారట… పగిలిన సీసాల్లోని బీరు కోసం. చివరికి ఎవరో సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. గురువారం బాగా పొద్దుపోయిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు కొంత మంది  లారీ డ్రైవర్ ను, అతని సోదరుడిని బయటికి తీస్తుంటె … మిగతావారు  బోల్తా కొట్టిన లారీ వద్దే బీర్లు తాగడం మొదలుపెట్టగా, దారిన పోయే ప్రయాణికులు సైతం వారికి జత కలిశారట. శవాల మీద మరమరాలు ఏరుకుని తినడం అంటె ఇదే  కాబోలు !!!!