Posts

Showing posts with the label ఆసిడ్ దాడి చేసిన ఆంటీ

తన పశువాంచ తీర్చలేదని పశువుల డాక్టర్ మీద ఆసిడ్ దాడి చేసిన ఆంటీ @45 !!

Image
                                          తనను ప్రేమించటం లేదనో , లేక ప్రేమించి  మరొకరిని పెండ్లి చేసుకుని మోసం చేసిందనో కారణాలు చేత ప్రియురాళ్ళ మీద యాసిడ్ పోసి చంపిన ,గాయపరచిన ప్రియుళ్ళు సంగతి తెలుసు. అందులో పేరు గాంచినవి శ్రీ లక్ష్మీ కేసు, వరంగల్ కేసు. ఇలాంటి క్రూర చర్యలకు పాల్పడుతున్న  మ్రుగాళ్ళు వయో రీత్యా యువకులే . కాబట్టి వయసు వేడిలో ప్రియురాళ్ళ మీద తమకే పూర్తి హక్కులు ఉన్నాయి అనే "పోస్సేసివ్ నెస్" తో మృగాలుగా మారి ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడుతున్నారు. చివరకు వారికి మిగిలేది జైలు శిక్షలే. అయితే ఇలాంటి అక్కసు మారి పనులు చేయడం లో కేవలం పురుషులు మాత్రమే కాదు అవకాశం చిక్కితే  స్త్రీలు కూడా ఏ మాత్రం వెనుకంజ వేయరు అని తెలిపే ఉదంతం ఇటివలే ఘజియాబాద్  లోని వైశాలి ఏరియాలో  లో జరిగింది. ఆ కద ఏమిటో చూద్దాం .   అమిత్ వర్మకు 28 యేండ్లు.ఉండేది వైశాలి లో.  చేసే పని పశు వైద్యం . దానిలో బాగంగా కుక్కలకు వైద్యం చేసే క్లినిక్ ని ఓపెన్ చేసి దానికి అనుబందంగా ఉన్న రూముల్లో ఉంటున్నాడు. . అంతకు ముందు మీరట్ లోఉన్న కబేలా కు అనుబందంగా ఉన్న పశు వైద్య శాలలో  లో పశువుల డాక్టర్ గా పని చేసే వాడు.