Posts

Showing posts with the label ఎండోమెంట్ డిపార్ట్ మెంట్

సాక్షాత్తు లక్ష్మీ నరసింహా స్వామీ సన్నిధి లోనే అక్రమాలకు పాల్పడిన ఎండోమెంట్ అధికారులు !!!

Image
                                                                                        హిందూ మతాధికారులు లేక పీఠాధిపతుల పాలనలో హిందూ దేవాలయ నిర్వహణ,అవినీతి మయంగా లోపభూయిష్టంగా ఉందనే వంకతో , జస్టిస్ చల్లా కొండయ్య గారి కమిషన్ సెలవిచ్చింది అని చెప్పి , 1987 లో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ చట్టానికి సవరణలు చేసి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దంగా సెక్యులర్ అధికారుల చేతిలో దేవాలయ నిర్వహణ బాధ్యతలు పెట్టింది అప్పటి N.T.R గారి ప్రభుత్వం . చివరకు సెక్యులర్ అధికారుల పరిపాలన ఎలా ఉందని రుజువు అయిందంటే, "గొర్రెలను తినువాడు గోవింద కొడతాడు , బర్రెలను తినువాడు వస్తాడయ్యా " అన్న బ్రహ్మం గారి మాటను నిజం చేసినట్లు అయింది. సాక్షాతూ N.T.R గారి పాలనలోనే దేవాలయాలు లోని సెక్యులర్ ఆదికారులు తమ స్వార్థం కోసం  ఎంతకు తెగించారో , నిబంధనలను ఎలా తుంగలో తొక్కారో ఈ  రోజు  ఈ  నాడు దినపత్రికలో వచ్చిన ఈ  క్రింది ఐటెం ఉదాహరణ.                                                                                                                                                                        

అన్న మాటకు కట్టు బడి K.C.R గారి ప్రభుత్వం 'ఎండోమెంట్ ఏక్ట్ " ను రద్దు చేస్తుందా?

                                                                              తెలంగాణా ప్రజల చిరకాల స్వప్నం "తెలంగాణా రాష్ట్రం " ఏర్పాటు కాబోతుంది . తెలంగాణా లోని ప్రజలు జూన్ 2 వ తేది న సంబురాలు చేసుకోవడానికి రడీ  అవుతున్నారు . అదే రోజు తెలంగాణా ఉద్యమ రధ సారధి , శ్రీ కలువ కుంట్ల  చంద్ర శేఖర్ గారు తెలంగాణా రాష్ట్ర తొలి  ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి చరిత్రలో తన స్తానం ను సుస్తిరం చేసుకో పోతున్నారు . తెలుగు వారిలో ఎవ్వరికి దక్కని ఒక ప్రత్యెక హోదా -- తెలంగాణా తోలి ముఖ్య మంత్రి -- ఆయనకు దక్కడం అయన పూర్వ జన్మ సుకృతం . దీనికి ప్రధాన కారణం  అయన చేసిన యజ్ఞాలు , పూజలే అని నా విశ్వాసం . నిత్యం అయన పాల బాగానా మెరిసే ఎర్రటి పొడుగాటి కుంకుమ బొట్టే ఆయనకు శ్రీ రామ రక్షా కవచంగా పనిచేసి అయన సంకల్పాన్ని నేర వేర్చoది. ఇదిదేవుడిని నమ్మే అందరికి అనందం కలిగించే విషయం        శ్రీ చంద్ర శేఖర్ రావు గారు ఎన్నికల వేల అనేక ముఖ్యమైన వాగ్దానాలు చేసారు . అందులో హిందూ సమాజానికి అయన ఇచ్చిన వాగ్దానం తమ ప్రభుత్వం అధికారం లోకి వస్తే , హిందూ సంస్తలకు  ప్రభుత్వ పెత్తన పీడ  నుండి విముక్తి కలిగిస్తా