Posts

Showing posts with the label దున్నపోతు రాక్షసుడు

ఆడది నన్నేమి చేస్తుందిలే అని అహంకరించిన "దున్నపోతు రాక్షసుడు" ని చంపిన "దుర్గాదేవిని " అంత మాట అంటారా ఈ "దున్నపోతు బావజాలికులు ".

Image
                                                                          చదవక ముందు "అమ్మా " "అమ్మా " అన్నోడు , చదువు ఎక్కువ అయి "నీ అమ్మా , నీ అమ్మా , అనటం మొదలు పెట్టాడంట !. అలా ఉంది మన విశ్వ విద్యాలయాల్లో కొంతమంది మేదావి విద్యార్దులుం అని విర్రవీగే వారి తీరు. పూర్వకాలం లో రాక్షసులు ఎంత విద్యావంతులు, బలవంతులు  అయినా , మూర్కత్వం తో కూడిన అహంకారం ఉండటం వలననే లోక కంటకులు అయి దేవతల చేతిలో దిక్కు లేని చావు చచ్చ్చ్హారు . మేము ఆ  రాక్షస  రాజులుకు  వారసులం అని , మాది రాక్షస బావజాలం అని చెప్పుకుంటున్న వారు నిజంగా ఆ రాక్షస సంతతి యొక్క వారసులే అని అనిపిస్తుంది , వారు చెప్పే కదలు , చెసే చేష్టలు చూస్తుంటె. కాకపోతే బాదా కరమైన విషయం ఏమిటంటె , ఈ  దేశం  లో ఉన్న 80% అణగారిన వర్గాలకు చెందిన ప్రజలను సదరు రాక్షస సంతతికి చెందిన వారిగా తీర్మాణించి , వారందరికి వీరు ప్రతినిధులు అన్నట్లు స్టేట్ మెంట్ లు ఇవ్వడమ్. నిజంగా ఈ రాక్షస బావజాలికులు చెప్పే కట్టుకదలు వింటె వారు ఎవరికీ ప్రతినిదులం అని చెప్పుకుంటున్నారో , వారే బడితే పూజ చెయ్యడం ఖాయం.     దుర్గా దేవి హిందువుల ఆరాద్య ద