Posts

Showing posts with the label గురువులు కైనా గుడిసెలో ఉండెవాళ్ళ కైనా

ఇల్లాలు ఇంటికి రావటం లేదని ఇంటికే నిప్ప్పు పెట్టిన "వరద రాజులు"

                                                                                  సంసారం అన్నాకా కలతలు ఉంటాయి . అందులో బాగంగా అలకలూ ఉంటాయి . అలగడం ఆడవాళ్ళ జన్మ హక్కు లాంటిది . వారిని అనునయించి  అలకకు కారణం కనుగొని  కనుగొని వారి కోర్కెలు తీర్చిన వాడె భర్త! భర్త అంటె భరించువాడు అని అర్దం. శ్రీ కృష్ణుడు అంతటి వాడె సత్యబామ అలక తీర్చడం కోసం ఆమె ఎడమ కాలి  తో తన్నించుకోవలసి వచ్చింది . ఆప్ట్రాల్ మనమెంత?!              పెళ్ళాం అలిగి పోయి ఇంటికి రాలేదనే కోపంతో తనకూ కోపం వచ్చి అసలు ఉంటున్న ఇంటికే నిప్పు పెట్టుకుంటే ఎలా ఉంటుంది ? ఇదిగో అచ్చం ఖమ్మం జిల్లా అశ్వారావు పేట   వరద రాజులు చేసిన పని లాగే ఉంటుంది . వెనుకటి కేవడో ఎలుక మిద కోపంతో గుడిసెకు నిప్పు పెట్టుకున్నాడట! అలా ఉంది ఇతని పరిస్తితి! వరద రాజులు భార్య ఇవాళ కాపోతే రేపు వస్తుంది . ఆమె వచ్చిందని కాలిపోయిన ఇల్లు  ప్రత్యక్ష మవుతుO డా? లేదు కదా? మొన్న ఒకాయన పెళ్ళాం విడాకులు ఇచ్చిందని  బంగారం లాంటి తన ఇద్దరు పిల్లల్ని చంపి తను రైలు క్రింద పది ఆత్మ హత్య చేసుకున్నాడు . పైగా ఆయనొక గురువు గారు . ప్రోపెసర్  అయితే నేమి తన లోని కోపాన్ని జయించ