Posts

Showing posts with the label : డన్ లప్ టైర్ అమ్మాయి హెయిర్

గడ్డాలు గిసుకునే బ్లేడ్లకు, అసబ్యపు అమ్మాయిలు ప్రచార కర్తలా !?

                                                                  ఈ  మాటన్నది ఎవరో కాదు , సాక్షాతూ ఈ దేశ అత్యున్నత న్యాయస్తానం లో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సుదాంశు జ్యోతి ముఖోపాధ్యాయ !. నిన్న సికింద్రాబాద్ లో ఆంధ్రప్రదేశ్ జుడిషియల్ అకాడెమి ఆద్వర్యంలో"మహిళకు హింస నుంచి రక్షణ , చట్ట పరమైన పరిష్కారాలు ,న్యాయవ్యవస్త స్పందన" అనే అంశం పై జరిగిన సెమినార్ లో అయన పై విదంగా స్పందించారు . ప్రస్తుత సమాజంలో మహిళల పట్ల చాలా చులకన బావంతో వ్యవహరిస్తున్నారని , అదే ప్రాచిన కాలంలో స్త్రీలకు విశిష్ట స్తానం , గౌరవం ఉండేవని , కాని రాను రాను సమాజంలో ఆ  బావనలు మారిపోయి స్త్రీలను చులకన చేసే దోరణి అధిక మయిoదని , చివరకు పురుషులు వాడే షేవింగ్ బ్లేడ్ల అడ్వర్టైస్మెంట్లకు సైతం స్త్రీలను అసబ్యపు దుస్తులలో చూపించడం దారుణం అని అన్నారు . కొన్ని చోట్ల సాoప్రాదాయపు ముసుగులో వారిని అణచివేయాలని చూస్తుంటే , మరి కొంత మంది ఆదునిక బావాజాలా లు పేరుతొ వారిని వ్యాపార వస్తువులుగా మార్చి వేస్తున్నారు ఆని అన్నారు . భారతీయ న్యాయ వ్యవస్త సహించదు అనే రీతిలో కేసులలో తీర్పులు వేలువరిoచాల్సిన అవసరం ఉంది అని అన్నారు .