Posts

Showing posts with the label దోమల మోత

కరెంట్ కోత,దోమల మోత,ఇదీ మన తల రాత.

Image
                                                                                       మన తెలుగు ప్రజల  దౌర్బాగ్యం ఏమిటోగాని, బొత్తిగా ప్రజాసంక్షేమం పట్టించూకోని ప్రజానాయకుల ఏలుబడిలో ఉన్నాం.గత 15ఏండ్లుగా ఎన్నడూ పీల్చనంతగా, పీల్చి పిప్పిచేస్తున్నాయి. ఎవరనుకున్నారు! దోమలండి,దోమలు!అవి కుడుతుంటే ప్రజలు చేసే ఆక్రందనలు ఈ పాలకులకు వినిపించటంలేదు.ఇదివరకు అప్రకటిత కోత ఉంటే చాలు తక్షణం స్పందించే రాజకీయ పార్టీలు సైతం ఈ విషయం లో కిమ్మనకుండా ఉన్నాయ్. పాపం వాళ్లకి మన ముఖ్య మంత్రి గారిని చూస్తే జాలేస్తుంది కాబోలు. ఏందుకంటే, అయన ఏ అవినీతి కుంభకోణంలో బాగస్వామి కాకపోయిన అవినీతి మంత్రులను కాపాడడానికే అయన తెగ కష్టపడాల్సి వస్తుంది.                ఆదెమి విచిత్రమో  కాని,మాది దేవుని పాలన అని చెప్పుకుఉన్న వాళ్ల పాలనలో కురిసిన వర్షాలు ఈ ఏడాది కురవలేదు. ప్రజలు కూడ డేవుదు పాలన పోయిందే అని బాద పడే పరిస్తితి వచ్చింది.వర్షాలు లేవు కాబట్టి, డాములలో నీళ్లు లేవు,  నీళ్లు లేవు కాబట్టి, కరెంట్ ఉత్పత్తి లేదు. ఆందుకే ఈ బాదంతా. కనీసం పొరుగు రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి అయినా ప్రజలకు కరెంట్ ఇద్దామన్న అలోచన సర్కారుకు