Posts

Showing posts from March, 2015

మా నియోజక వర్గం లో "తీన్ మార్ మల్లన్న " కన్నా , "తిక్కల చెల్లవన్న" కే ఓట్లు ఎక్కువ వచ్చాయి !!!?

Image
                                                                               అమ్మయ్యా ! చచ్చి చెడి నల్గొండ ,ఖమ్మం ,వరంగల్ పట్టభద్రుల నియోజక వర్గ ఓట్లు లెక్కింపు పూర్తి చేసారు అధికారులు. పాపం ! మొన్న ఉదయం,నల్గొండ నాగార్జున కాలేజిలో  మొదలుపెట్టిన ఓట్ల లెక్కింపు ,నిన్న రాత్రి తో పూర్తీ అయి ,తెరాసా అభ్యర్ధి శ్రీ పల్లా రాజేశ్వర రెడ్డి గారిని విజేత గా ప్రకటించడం తో సమాప్తం అయింది .దీనికి గాను ఓట్ల లెక్కింపులో ఎంతో ఓపికతో పాల్గొన్న అధికారులు , ఏజెంట్లను అభినందించి తీరవలసిందే ! అలాగే విజేత అయిన శ్రీ పల్లా రాజేశ్వర రెడ్డి గారికి శుభాభినందనలు . మామూలు ఓట్ల కు ,పట్టభద్రుల ఓట్లకు చిన్న తేడా ఉంది. మామూలు ఓట్లను మనకు నచ్చిన గుర్తు మీద ఒక ముద్ర వేస్తే సరి పోతుంది .కాని పట్టభద్రులు వేసే ఓట్లు తమకు నచ్చిన వారికి ,ప్రాదాన్యత క్రమంలో ఓట్లు వేయాలి . పట్టభద్రులు అంటే సామాన్య నిరక్షరాస్యులు కాదు  కాబట్టి ,ప్రాదాన్యత క్రమంలో ఎలా ఓటు వేయాలో సులువుగానే గ్రహించవచ్చు .పట్ట భద్రులు అంటె మామూలుగా ఏమి తెలియని  వారు అని ఎలా అనుకుంటాం . 10+2+3 విదానంలో,కనీసం  పదిహేనేళ్ళు కష్టపడి చదివి విజ్ఞానం సంపాదిస

పెళ్ళైన పంతులమ్మసజీవ దహనానికి ,సహద్యోగి శివప్రసాద్ రెడ్ హాండెడ్ గా పట్టు బడటానికి ఉన్న లింక్ ఏమిటి ?

Image
                                                                          ఆమె గారు ఉపాద్యాయురాలిగా పని చేసే 31 సంవత్సరాల మహిళ .పెండ్లి అయి ఇద్దరు పిల్లలు ఉన్నారు .ఆ రోజు ఎందుకో ఆమె గారు తన సహోద్యోగి అయిన శివ ప్రసాద్ అనే వ్యక్తీ తో కలసి తన ఇంటికి వచ్చింది .వచ్చిన వాళ్ళు డైరెక్టుగా సింహ ద్వారం నుండి కాక ,ఇంటి ముందు తాళం వేసి ,ఇంటి వెనుక నుండి లోపలకు వెళ్ళారు అట .ఆ తర్వాత కొంత సేపటికి యింట్లో నుండి పొగలు వస్తుంటే చూసిన చుట్టు ప్రక్కల జనం ,ఇంటి తలుపులు బద్దలు కొట్టి ,ఇంట్లోకి వెళ్లి చూస్తే తగలబడి పోతున్న పంతులమ్మా, మూలన నక్కి చూస్తున్న పంతులయ్య కనపడే సరికి ,కోపమాపుకోలేక జనం పంతులయ్యకి నాలుగు తగిలించి పోలీసులకు అప్ప చెపితే , వారు పంతులయ్యను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.                                                                                                                                              మన సమాజంలో మోరల్ పోలిసింగ్ అంటె గిట్టదు కాబట్టి, వారు ఇంటి ముందు నుంచి వెళ్ళినా ,ఇంటి వెనుక నుంచి వెళ్ళినా చుట్టూ పక్కల వారికి అనవసరం . కాని  సమాజానికి

అటు ఆంద్రా ప్రభుత్వానికి గిట్టని ,ఇటు తెలంగాణా ప్రభుత్వానికి పట్టని ,తెలంగాణా విద్యార్దులు!

Image
                                                                                                                                                                          కాకి పిల్ల కాకికి ముద్దు అంటారు .కాకపోతే ఈ తెలంగాణా  పిల్లలు ఏ 'కాకి' కి చెందిన వారో తెలియక ఏకాకులయ్యారు .ఇదీ ప్రస్తుతం ఆంద్ర ప్రదేశ్ లో ని విద్యాసంస్థల్లో చదువుతున్న తెలంగాణా విద్యార్దుల పరిస్తితి. పై చిత్రం లోని సమాచారం చూస్తే వారి పరిస్తితి కళ్ళకు కట్టినట్లు ఉంది .                 రాష్ట్ర విభజన జరిగి ,తెలంగాణా ప్రభుత్వం ఏర్పడినాక,ఆర్టికల్ 371 D ప్రకారం కాకుండా ,1956 కు ముందు తెలంగాణాలో నివసించిన కుటుంభాల వారి పిల్లలకు మాత్రమె బోధనా రుసుములు ,స్కాలర్ షిప్ లు ఇవ్వడం జరుగుతుందని K.C.R గారు చెప్పినప్పుడు , అది అన్యాయం ,తెలంగాణాలో చదివే వారందరికి బోధనా రుసుములు ఇవ్వవలసిందే అని , కొంత మంది ఆంద్రా రాజకీయ నాయకులు హై కోర్టులో పెటిషన్ లు వేశారు .ఆ సందర్భంగా హై కోర్టు వారు కోన్ని కీలక వ్యాఖ్యలు చేసారు . "మనది భారత దేశం, భారత దేశం లో నివసిస్తున్న మనం అందరం భారతీయ పౌరులం .ప్రతి భారతీయ పౌరుడికి తనకు

బాగవతం లో "పూతన " ను కళ్ళారా ఈ వీడియోలో చూడండి !

Image
                                                                          సంపాదన యావలో పడి ,కుటుంబ పోషణ పేరుతో అవసరము లేకున్నా ఉద్యోగాలు చేస్తున్న తల్లి తండ్రులు ,తమ పిల్లల బాద్యతను కేర్ టేకర్ లకు అప్పగించి ,ఇళ్ళలో వదిలి వెళుతున్న తల్లి తండ్రులు, తప్పక చూడాల్సిన వీడియో ఇది .    భాగవతం లో బాల కృష్ణుడిని సంహరించడానికి "పూతన " అనే రాక్షసి స్త్రీ రూపం లో వచ్చి ,కృష్ణుడికి పాలు పడతాను అని చెప్పి విషం పట్టబోవడం,దానిని కనిపెట్టిన చిన్న కన్నయ్య ,పాలతో పాటు ఆమె రక్తం పీల్చి చంపడం ,కద  చదువుతుంటే ఇలాంటి రాక్షస స్త్రీలు ఉంటారా అని అనిపిస్తుంది .అయిన దానికి ,కాని దానికి హిందూ దేవతలు మీద ,విరుచుకు పడే "రాక్షస వాదులు" , కృష్ణుడు స్త్రీ అయిన పూతనను చంపడం అమానవీయమ్ అని, పూతన పర  జాతి స్త్రీ కాబట్టి ,ఆమెను చంపాడు అని , ఏ స్త్రీలు భారత రామాయాణాల్లో వర్ణించిన గుణ గణాలతో ఉండరని వాదించే వారికి, ఆ నాడె కాదు,  నేటి మోడ్రన్ యుగంలో కూడా అలాంటి పూ తనలు ఉన్నారని క్రింది విడియో చూసాక  అర్దమవుతుంది . ఎంత కర్కోటకులకైనా కళ్ళు చెమ్మగిల్లేలా చేసే ఈ వాస్తవ CC పుటేజ్ విడియో చూడండి .

ఆసియా ఖండం లో "రేపిస్ట్ " లు ఎక్కువమంది "చెంఘీజ్ ఖాన్ " వారసులేనా ?

                                                                                  చెంఘిజ్ ఖాన్ ! ప్రపంచంలోనే అతి క్రూర మైన నియంతగా పేరు గాంచిన ఇతడు మంగోల్ సామ్రాజ్య పరిపాలకుడు . ఇతని అసలు పేరు తెముజిన్ అయితే తనకు తానుగా "చెంఘీజ్ ఖాన్ "అని ప్రకటించుకుని ,తన అమానుష ,క్రూర దండయాత్రలతో ప్రపంచంలోని ఇతర రాజ్యాలను జయించి తన ఆదిపత్యంలోకి తెచ్చుకున్నాడు .ఇతడు మన దేశం మీదకు దండెత్తి వచ్చి మొఘల్ సామ్రాజ్యాన్ని స్తాపించిన "బాబర్ చక్రవర్తి"కి తల్లి తరపు వంశ పూర్వికుడు  . అందుకె బాబర్ సైన్యం లో కూడా  ఎక్కువ మంది చెంఘీజ్ ఖాన్ వారసులు ఉండే అవకాశాలు ఉంటాయి .  చెంఘీజ్ ఖాన్ సామ్రాజ్య వ్యాప్తి టెక్నిక్,దూర దృష్టితో మరియు  విస్తృత ప్రయోజనార్దములతొ కూడుకున్నది . అతను జయించిన రాజ్యాలలో ఎక్కడా తన ప్రతినిడులను పెట్టేవాడు కాదట. దానికి బదులు అక్కడి రాజ్య వంశాలను నాశనమ్ చేసి ,రాణులను చెర పట్టడమే కాక ,అక్కడి సైన్యం లోని మగవారిని చంపి ,వారి స్త్రీలను చేరచమని తన సైన్యానికి చెప్పే వాడట .దీని వలన అక్కడి స్త్రీలకు కలిగే సంతానం తన వారసత్వానికే చెందినదే అవుతుందని ,కాబట్టి తన సంతాన అదినంలోక

ఇండియన్ రేపిస్ట్ ల గురించి తెగ బయపడిపోతున్న ఈ" గురువింద" కి తన దేశంలో జరిగిన 65 లక్షల రేప్ లు, వాటి వలన చనిపోయిన 2,40,000 స్త్రీలు కనిపించలేదా?

Image
                                                                          నేను ఇదే బ్లాగులో మొన్ననే ఒక టపా పెట్టాను .  అందులో నేను స్పష్టంగా ప్రపంచ వ్యాప్తంగా స్త్రీల పై జరుగుతన్న అత్యాచార నేరాల్లో ఏ యే దేశాల పొజిషన్ ఎలా ఉంది అనే దాని మీద ఆదార సహిత రుజువులు ఇవ్వడం జరిగింది . 2012 వరకు కట్టిన లెక్కల ప్రకారం అమెరికా సంయుక్త రాష్ట్రాలు లోని మగ + ఆడ కలసి రేప్ లు చెయ్యడంలో మొదటి స్తానంలో ఉంటే ,జర్మని 6 స్తానంలో ఉంది . ఇండియాకి 4 వ స్తానం ఇచ్చినా , 120 కోట్లు జనాభా పై  ఉన్న ఇండియాలో జరిగిన రేప్ ల సంఖ్యను  , 8 కోట్లు జనాభా ఉన్న జర్మనీ రేప్ ల సంఖ్యను పోల్చి చూస్తే ఇండియాలో రేప్ లు గురించి ప్రపంచంలోని ఏ దేశం కూడా పెద్దగా అందోళన చెందాల్సిన అవసరం ఉండదు.  8 కోట్ల జనాభా ఉన్న జర్మనీలో 2012 నాటికే జరిగిన జరిగిన రేప్ లు మొత్తం 65 లక్షలు పైనే అయితే ,సదరు రేప్ ల వలన చని పోయిన స్త్రీలు ,పిల్లలు కలసి 2,40,000 పై మాటే . మరి ఈ విషయం గురించి జర్మని కి చెందిన ఒక మహిళా ప్రొపెసర్ గారికి తెలియక పోవడం విడ్డూరం . అలాంటి ప్రొపెసర్ మన దేశం లో జరుగుతున్నా (ప్రచారం రీత్యా ) రేప్ లకు బయపడిపోయి,ఇండియాలో మ

ఆడా మగ సమానం అనుకుంటే ,మద్యలో తడిక అడ్డం ఎందుకు తమ్ముడూ ?

Image
                                                                    స్త్రీ పురుషులూ సమానం .ఇదీ మానవ ఆదర్శం . కాని వాస్తవం లో ఇద్దరు అసమానులుగా ఉన్నారు . అలా ఉంటే సమాజ మనుగడ దుర్లభం అవుతుంది కాబట్టి ఇద్దరినీ సమానం చేయాలి అనేది ఆదర్శంగా పెట్టుకుని ఆ దిశగా ప్రయాణం చేస్తున్నాం .ఇది కొన్ని వేల యేండ్లు నుండి చేస్తున్న ప్రయత్నం .ఈ నాటికీ పూర్తి స్తాయిలో ఆదర్శానికి చేరువ కాలేక పోయాం . అసలు దేవుడు లేక ప్రక్రుతి స్త్రీ పురుషులను సమానంగానే స్రుష్టించింది . ఇద్దరికీ అన్నిటితో పాటు సంతాన అభివృద్ధి కోసం సమానమైన బాద్యతలు అప్పచెప్పింది .ఇతర జంతువులకు మల్లె మనకు "సీజనల్ సెక్స్ " ని నిర్ణయించి ఆ ప్రత్యేక సమయంలోనే సెక్స్ ని ఎంజాయ్ చేయమంది . అలా చేస్తున్నంత కాలం ఏమి జరిగినా అది ప్రక్రుతి దర్మం కోటాలోకి వెళ్లి పోయేది . కాని ఖాళి సమయం ఎక్కువై ఏమి చేయాలో తెలియక మనిషి సెక్స్ ను కూడా నిరంతర ఎంజాయ్మెంట్ కు వాడుకోబట్టె స్త్రీ సెక్స్ ను అందించే సాదనం గా మారి పోయి 'అమ్మ' స్తాయి నుండి 'బొమ్మ ' స్తాయికి దిగ జార్చ బడింది . ఆ నాటి నుంచే స్త్రీకి కష్టాలు మొదలు అయ్యాయి . హిందూ సమా

పాపం ! రామ్ గోపాల్ వర్మకి చివరకు ఈ గతి పట్టిందా!!!?

Image
                                                                              పిచ్చి ముదిరి రోకలి తలకు చుట్టమన్నది అట ,వెనకటికి ఒకావిడా ! అది ఆమె తప్పు కాదు ,ఆమెకు పట్టిన పిచ్చి మహత్యం . అదిగో అల్లాంటి తప్పే సదరు పిచ్చి ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అనే చలన చిత్ర దర్శకుడితో అలాంటి పనులే  చేయిస్తుంది .తన పబ్లిసిటి కోసం,  తను తీయ బోయే చిత్రాల పబ్లిసిటి కోసం,పబ్లిసిటి మానియాతో  వారిని తిట్టి ,వీరిని తిట్టి ,చివరకు దేవుళ్ళను సైతం వదిలి పెట్టని రామ్ గోపాల్ వర్మకి ,దేవుడు ఆ పిచ్సినే ఆయనకు బహుమతిగా ఇచ్చినట్లు కన పడుతుంది ,నిన్న అయన గారు చేసిన తిక్కల పని చూస్తే !. అదేమిటో క్రింది చితంలో కని పిస్తున్న సమాచారం చదివితే అర్ధం అవుతుంది .                                                                         ఒక ప్రముఖ చలన చిత్ర దర్శకుడై ఉండి ,సమాజంలో పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తీ ,చివరకు,తన చీప్ పబ్లిసిటి కోసం ఇలా తిక్కల పనులు చేస్తాడా ? ఇదంతా చూస్తుంటే ఆయనకు మైండ్ దొబ్బింది అనటంలో ఎటువంటి అనుమానం ఉండాల్సిన అవసరం లేదు .  పాపం ! రామ్ గోపాల్ వర్మకి చివరకు ఈ గతి పట్టిందా!!!?