Posts

Showing posts with the label ఆశ్వాపురం మర్డర్ కేసు

"మతాంతర వివాహానికి ఒప్పుకోలేదని ప్రియురాలి తండ్రిని హత్య చేయించిన ఘనుడు !

Image
                                                                            తన కుమార్తెను సాంప్రదాయాలకు వ్యతిరేకంగా పరాయి మతస్తుడికి ఇచ్చి పెండ్లి చేయటం తనకు సమ్మతం కాదని అన్న పాపానికి ఘోరంగా హత్య చేసారు ఆ కసాయి వాళ్ళు . ఈ  ఉదంతం  అమ్మాయిలే కాదు , తమ ప్రేమను కాదంటే వారి తల్లి తండ్రులను అయినా మట్టు పెట్టడానికి వెనుకాడని పైశాచిక మృగాల్ల మనస్తత్వాన్ని తెలియ చెస్తుoది. వివరాలు లోకి వెళితే  ఖమ్మం జిల్లాలోని ఆశ్వాపురం లోని హెవి వాటర్ ప్లాంట్ లో కర్ణాటక కు చెందిన కంచన్ గౌడ్ గారు టెక్నీషీయన్ గా ఉద్యోగం చేస్తున్నారు.ఆయన కుమార్తె మంజుల మంజుల మచిలీ పట్నం లో B.Tech   చదువుతున్న రోజుల్లో ఆమెకు చదువు చెప్పాల్సిన ప్రొపెసర్ అయిన వసీం బేగ్ ఆమెను ప్రేమ ముగ్గులోకి దింపాడు. అలా నాలుగేళ్ళూ ప్రెమించుకున్నారు. ఆ తర్వాత ఆ అమ్మాయి సత్తుపల్లిలో M.Tech  పూర్తి చేసి ప్రస్తుతం గుడివాడలో ప్రైవేట్ లెక్చరర్ గా పని చేస్తుంది. ఇక ఈ ప్రేమ పాఠాలు నేర్పిన ప్రొపెసర్ గారు కూడా గుడివాడలోనే టౌన్ ప్లానింగ్ అదికారిగా ఉద్యోగం వెలగపెడుతున్నాడట. ఇలా ఏడేళ్ళు ప్రేమించుకున్న ఈ వీర ప్రేమికులకు ఇక పెంద్లి చేసుకుందాం అని అనిప