Posts

Showing posts with the label dubbaaka police haraasment

'కప్పగంతుల' వారి మాటను తెల్లారే సరికి నిజం చేసిన "దుబ్బాక పోలిస్ A.S.I,Mr.పాషా "

                                                                  నిన్న ఇదే బ్లాగులో విజయవాడ లోని పటమట పోలిస్ వారు ఒక కేసు దర్యాప్తు విషయంలో , పిర్యాదిదారుల పట్ల వ్యవహరించిన తీరును తప్పు పడుతూ   "అవమానకర  దర్యాప్తు తో ఇల్లాలిని అవమానించి మాజీ న్యాయ మూర్తి చేతనే కంట తడి పెట్టించిన పటమట పోలీసులు "    అనే టపా పెట్టడం జరిగింది . దానికి బ్లాగ్ మిత్రులు ,పెద్దలు శ్రీ తాడిగడప శ్యామల రావు గారు , శ్రీ కప్పగంతుల శివ రామ ప్రసాద్ గారు,మరియు  శ్రీ నిష్టల సుబ్రహ్మణ్యం గారు  వారి వారి స్పందనలు తెలియ చేసారు . ముఖ్యంగా శ్రీ శివ రామ ప్రసాద్ గారు   "   మన దేశంలో పోలీసుల వైఖరి ఇప్పటికి కూడా వాళ్ళేదో పైనెక్కడో ఉన్నారని, ప్రజలను  బానిసల్లాగా చూడాలని అన్న భావన వాళ్ళ రక్తంలో పారుతోంది. రిక్రూట్మెంట్ సమయంలో జరిగే ఘోర అక్రమాలు, ఉద్యోగాలు అమ్ముకునే సంస్కృతి, ప్రమొషన్లు, పోస్టింగులు వేలంవేసుకునే సంస్కౄతి ఉన్న పోలీసు వ్యవస్థలో మామూలు  మనుష్యులు ఉంటారని ఎలా అనుకోగలం. పోలీసుల్లో మర్యాదగా మాట్లాడగల వాళ్ళు అసలు ఉంటారా? ఈ సంఘటనలో పోలీసుల తీరు ఘోరం." అని స్పందించడం జరిగింది . అలా అన్న 3 గంటల ల