Posts

Showing posts with the label బడా స్టార్

భగవంతుడు ఇచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని చేజార్చుకుంటున్న "బడా స్టార్".

                                                                        దేవుడు ప్రతి మనిషికి జీవితంలో ఒకటో,రెండో అవకాశాలు ఇస్తాడట, తమ జీవితం సార్దకం చేసుకోవడానికి. అది గ్రహించి ఆ అవకాశాన్ని వినియోగించుకున్న వాడు చరిత్ర పురుషుడు అవుతాడు. వినియోగించుకోని వాడు సామాన్యుడిగానే మిగిలి పోతాడు. కాని ఆ అవకాశాన్ని దుర్వినియోగ  పరచిన వాడు మాత్రం తప్పకుండ చరిత్ర హీనుడవుతాడు.   మన తెలుగువారిలో నాకు తెలిసినంత వరకు అట్టి అవకాశాన్ని వినియోగించుకుని సఫలీక్రుతులైన వారు గౌరవనీయులు నందమూరి తారక రామరావు గారు . ఆంద్రుల అత్మ గౌరవ నినాదం తో, తెలుగు పతాకాన్ని జాతీయ స్తాయిలో రెపరెప లాడేలా చెయ్య గలిగిన వాడు తారక రామరావు. అప్పట్టిదాక సౌత్ ఇండియా అంటే డిల్లీ వారి ద్రుష్టిలో కేవళం "మద్రాసీ" మాత్రమే అనుకునే స్తాయి నుండి ఆంద్రా అనేది ఉన్నదని ఉత్తర బారతం వారికి తెలిసేలా చేసారు. గౌరవనియులు పి.వి. నరసింహా రావుగారు, ప్రదాన మంత్రిగా, గౌరవనీయులు రాజశెఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసినా , వారు డీల్లీ పాలకుల అనుమతానుసారమే చేసారు కాబట్టి , ప్రదమ తాంబూలం రామారావు గారికే దక్కుతుంది. ఇక చంద్ర బాబు నాయుడు గారు